Top Stories
ప్రధాన వార్తలు
![Pawan Kalyan Really Surrendered To Kiran Royal Black Mail1](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Kiran_Royal_Pawan_Videos.jpg.webp?itok=kjii29x8)
మహా కంత్రీ కిరణ్ రాయల్! ఏకంగా పవన్నే..
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్పై సంచలన ఆరోపణలు వస్తున్నా.. ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓ మహిళ అతని చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయమని, తనలాంటి వాళ్లెందరినో మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గప్చుప్గా ఉండిపోయారు. అయితే కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి.. ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది .పవన్ కల్యాణ్ అండ చూసుకునే కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడని లక్ష్మి(Laxmi) మరోసారి మీడియా ముందు ఇవాళ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో సంచల వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, అందుకే ఆయన తనను ఏమీ చేయడని.. ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడు. .. ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా.. చంద్రబాబు సహా ఎవరినీ తిట్టినా పవన్ కల్యాణ్ అసలు పట్టించుకోరని కిరణ్ రాయల్(kiran Royal) అనేవాడు. ఒకానొక టైంలో.. ‘పవనే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశా.. ఇక నువ్వు ఎంత అని కిరణ్ నాతో అన్నాడు’ అని లక్ష్మి మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆడవాళ్లను మోసం చేసి.. వాళ్ల సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తికి అండగా నిలబడడం సమంజసమేనా? అని పవన్ కల్యాణ్ను ఆమె ప్రశ్నించారు కూడా. మరి ఇంతటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అయినా.. జనసేన కిరణ్పై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
![Donald Trump Says Auto Tariffs To Come Around April 2nd2](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/trump.jpg.webp?itok=g17uNEnk)
డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన.. ఏప్రిల్ 2 నుంచి అమలు!?
జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కీలక నిర్ణయాలను తీసుకుంటూ.. మిత్ర దేశాలను, శత్రుదేశాలను భయానికి గురిచేస్తున్నారు. పన్నుల విషయంలో తగ్గేదే లే అన్నట్లు.. సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.కార్ల మీద మాత్రమేనా.. ఆటోమొబైల్ ఉత్పత్తుల మీద కూడా సుంకాలను విధిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆదాయాన్ని పెంచడానికి, వాణిజ్య అసమానతలను పరిష్కరించడానికి సుంకాలు విధించడం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికాలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 50 శాతం ఆ దేశంలోనే తయారవుతున్నాయి. దిగుమతులలో సగం మెక్సికో.. కెనడా నుంచి వస్తున్నాయి. మిగిలిన సగం జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్వీడన్ దేశాలు దిగుమతి చేస్తున్నాయి.ఉక్కు, అల్యూమినియం దిగుమతి మీద 25 శాతం సుంకం ప్రకటించినప్పుడు.. ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ విమర్శించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కార్ల ధరలను విపరీతంగా పెంచుతుందని, మా సరఫరా గొలుసులకు కూడా అంతరాయం కలిగిస్తుందని అన్నారు. ట్రంప్ పరిపాలనలోనే చర్చలు జరిపిన యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందానికి (USMCA) కూడా ప్రతికూలత కలుగుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేనో ఇడియట్లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్స్టా పోస్ట్ వైరల్మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే అన్ని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలకు సంబంధించిన ప్రణాళికలను అధ్యక్షుడు ఇటీవల నిర్ధారించారు. అయితే డెట్రాయిట్ ఆటోమేకర్లు జనరల్ మోటార్స్, ఫోర్డ్, స్టెల్లాంటిస్ వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ ఆటోమోటివ్ పాలసీ కౌన్సిల్.. మెక్సికో & కెనడాపై ప్రతిపాదిత సుంకాలను తగ్గించాలని ట్రంప్కు పిలుపునిచ్చింది.
![Child Who Shocked Chandrababu In The Kandukur Meeting3](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/chandrababu1.jpg.webp?itok=uHFDx1bn)
చంద్రబాబుకు చిన్నారి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: కందుకూరు సభలో చంద్రబాబుకు చిన్నారి షాక్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో దీప్తి అనే విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కందుకూరు సీఎం వస్తున్నారు కాబట్టే చెత్త ఎత్తేశారంటూ దీప్తి వ్యాఖ్యానించింది. రోజూ ఇలాగే కందుకూరులో వీధులు శుభ్రం చేయాలని విద్యార్థిని దీప్తి కోరింది.సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోంది. చిన్నారి మాటలు సభికులను నిర్ఘాంత పోయేలా చేశాయి. ప్రభుత్వ పనితీరును తన ముందే ఆ చిన్నారి బయటపెట్టడంతో షాక్కు గురైన చంద్రబాబు.. ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే తేరుకుని.. టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు.
![Ranveer Allahbadia Shares Details Of What Happening With Him Post Controversy4](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Ranveer-Allahbadia123.jpg.webp?itok=WXCVdbZ3)
చాలా భయంగా ఉంది.. వివాదం తర్వాత ఏం జరిగిందంటే?: యూట్యూబర్
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) ప్రస్తుతం ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ యావత్దేశం అతడిని దుమ్మెత్తిపోసింది. అది నోరా? డ్రైనేజీనా? అంటూ తిట్లదండకం అందుకుంది. ఇతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి.ఫోన్ స్విచ్ఛాఫ్?అయితే అల్హాబాదియా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడని, అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడని రూమర్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై అతడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నేను, నా టీమ్ పోలీసులకు సహకరిస్తున్నాం. వారికి నేను అందుబాటులోనే ఉన్నాను. తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను, వారిని అవమానించాను. అందుకు నన్ను క్షమించండి. ఈ విషయంలో నేను కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సింది.నా తల్లి క్లినిక్పై దాడిచాలామంది నన్ను చంపుతానని బెదిరిపిస్తున్నారు. నాతో సహా నా కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బెదిరిస్తున్నారు. కొందరైతే రోగులుగా నటిస్తూ మా అమ్మగారి క్లినిక్కు వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. పోలీసులపై, భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని రణ్వీర్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Ranveer Allahbadia (@beerbiceps) చదవండి: జీవితంలో పెళ్లే చేసుకోనన్న జాలిరెడ్డి.. ఇప్పుడేకంగా లవ్ మ్యారేజ్
![Team India arrives in UAE for ICC Champions Trophy5](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Teamindia1.jpg.webp?itok=JZ6VCht3)
ICC Champions Trophy: దుబాయ్కు చేరుకున్న భారత జట్టు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కోసం భారత క్రికెట్ జట్టు దుబాయ్లో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ గౌతం గంభీర్తో కూడిన తొలి బృందం శనివారం దుబాయ్కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.ఈ మొదటి బ్యాచ్లో రోహిత్-కోహ్లిలతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్లు ఉన్నారు. మిగతా ప్లేయర్లు ఆదివారం దుబాయ్కు చేరుకునే అవకాశముంది.ఇక దుబాయ్కు చేరుకున్న భారత ఆటగాళ్లు ఆదివారం నుంచి తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టనున్నారు. ఈ టోర్నీలో రన్నరప్గా బరిలోకి దిగుతున్న బారత జట్టు.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్గా నిలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మెగా ఈవెంట్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.బుమ్రా స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను జట్టు నుంచి తప్పించారు. జైశ్వాల్ స్ధానంలో మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నాడు. ఇటీవల కాలంలో వరుణ్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న ఇదే వేదికలో దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తెల్చుకోనుంది. కాగా భారత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. ఈ టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్?
![Maharashtra Government Committe On Religion Change Marriages6](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/devendrafadnavis.jpg.webp?itok=7OOjOsJH)
‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర కీలక నిర్ణయం
ముంబయి:‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలను అడ్డుకోవడానికి డిసైడయింది.‘లవ్ జిహాద్’పై చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తాజాగా ఓ కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. బలవంతపు మత మార్పిడులకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, లవ్ జిహాద్ ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదించనుంది.కాగా, మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా 2022లో ముక్కలు ముక్కలుగా చేసి హత్య చేశాడు.దీంతో అప్పట్లో లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వివాహం చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలొచ్చాయి.అప్పట్లో లవ్జిహాద్పై తీవ్రంగా చర్చ జరిగింది.దీంతో ఈ అంశంపై ఇటీవలే మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.అయితే, ఈ కమిటీ వేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే సూచించారు.
![Ysrcp Leader Ponnavolu Sudhakarreddy Comments On Ap Government7](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Ponnavolu-Sudhakarreddy1.jpg.webp?itok=BcTBp4cR)
‘మార్గదర్శి’ కేసులు నీరుగారుస్తున్నారు: పొన్నవోలు సుధాకర్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్చిన్నం జరుగుతోందని, ప్రభుత్వమే రాజ్య హింసకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పొన్నవోలు శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్ర ప్రదేశ్ను రావణ కాష్టంలా ప్రభుత్వం మారుస్తోంది.వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారు.ప్రజలపై దాడులు చేస్తే నో పోలీస్ అన్నట్లుగా ఉంది. మాచర్లలో దాడులు చేస్తే ఊళ్ళు కాలి చేసి పోతున్నారు .వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులే మేం ఏమీ చేయలేమంటున్నారు.మీడియా ముసుగులో మాఫియాలా తయారవుతున్నారు.ఏపీలో ఏడు నెలలుగా ప్రాథమిక హక్కులు ఎక్కడ పోయాయి. ఆంధ్ర ప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదు.. ప్రభుత్వమే దాడులు చేస్తోంది.దాడులపై కమిషన్ను అపాయింట్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని కక్ష పూరితంగా కేసులో ఇరికించారు .2023లో సత్య వర్ధన్ను విచారిస్తే కులం పరంగా నన్ను తిట్టలేదు అని కోర్టులోనే చెప్పాడు. విశాఖలో బందువుల ఇంట్లో ఉంటే సత్య వర్ధన్ తమ్ముడిని బలవంతంగా రప్పించి అతని వద్ద తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వం చట్టాలను అవహేళన చేస్తోంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను నియోజక వర్గంలో కాలు పెడితే చంపేస్తాం అని పబ్లిక్గా ఓ ఎమ్మెల్యే కామెంట్ చేస్తే చర్యలేవి.మాజీ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి’అని పొన్నవోలు ప్రశ్నించారు.మార్గదర్శి కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది..రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థికనేరానికి పాల్పడిన 'మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్' కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని పొన్నవోలు ఆరోపించారు. ఈనాడు సంస్థలకు చెందిన మీడియా మాఫియా అండ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక నేరాల నుంచి మార్గదర్శికి విముక్తి కల్పించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోందన్నారు. 2006 లోనే దాదాపు రూ.2610 కోట్ల రూపాయలను మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా డిపాజిట్ల రూపంలో సేకరించిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన కేసు నుంచి మార్గదర్శిని బయటపడేసేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.‘ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే రెండు సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఆనాడు రామోజీరావు ప్రజల నుంచి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా, చట్ట వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించారు. ఈ విషయాన్ని అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటపెట్టారు. రామోజీరావు పాల్పడిన ఈ ఆర్థిక నేరంపై ప్రజల నుంచి ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై కేసులు నమోదయ్యాయి. 2006 లెక్కల ప్రకారం రామోజీరావు తన మార్గదర్శి సంస్థల ద్వారా 2.75 లక్షల మంది నుంచి రూ.2610 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. రిజర్వ్ బ్యాంక్ 1984 చట్టం ప్రకారం బ్యాంకులు మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. ఇతర ఏ సంస్థలు సేకరించినా అది నేరం. పత్రికను నడుపుతూ ఆర్థిక నేరాల గురించి నిత్యం పత్రికల్లో కథనాలు రాయించే రామోజీరావు తాను అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న విషయం తెలిసే చట్టాలను ఉల్లంఘించారు. తన చేతిలో మీడియా ఉంది, తనను ఎవరూ ప్రశ్నించలేరు, ఎవరైనా తన అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై తన మీడియా మాఫియాను ప్రయోగిస్తాననే ధీమాతో రామోజీరావు వ్యవహరించారు. మార్గదర్శి సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై విచారణకు సీఐడీని ఆదేశిస్తూ 2006లో జీఓలు 800, 801 జారీ చేశారు. తరువాత సిఐడీ అధికారులు విచారణ జరిపి రామోజీ ఆర్థిక నేరాలపై కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. తరువాత ప్రభుత్వాలు మారడం, తిరిగి రామోజీరావు తన మీడియా మాఫియాతో పాలకులను ప్రభావితం చేసే స్థాయిలో తన ఆర్థిక నేరాల నుంచి బయటపడేందుకు పావులు కదిపారు.రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్ బ్యాంక్, ఏపీ ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా కేసును రామోజీరావు క్వాష్ చేయించుకోవడం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న ఫిర్యాదుదారు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్ట్ కు వెళ్ళి క్వాష్ పిటీషన్ ను కొట్టేయించారు. తిరిగి ఈ కేసును విచారించాలని తెలంగాణ కోర్ట్ ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. విచారణలో ఉన్న ఈ కేసులో రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ తానే హిందూ అవిభక్త కుటుంబానికి కర్తను అని ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. ఇటీవల రామోజీరావు చనిపోయాడు కాబట్టి కేసును కొట్టేయాలని రామోజీరావు తరుఫు న్యాయవాదులు తాజాగా కోర్ట్ లో కొత్త వాదనను తీసుకువచ్చారు. దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి సీఐడీ కనీసం అప్పీల్ కూడా చేయకుండా మార్గదర్శి కేసు కొట్టేసేందుకు సహకరిస్తున్నారు. అంటే గత అయిదేళ్ల పాటు వైయస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకని దుష్ర్పచారం చేయించినందుకు గానూ చంద్రబాబు ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శికి అనుకూలంగా క్విడ్ ప్రో కో కింద సహకరిస్తున్నాడు’అని పొన్నవోలు ఆరోపించారు.మార్గదర్శి సంస్థలో అనేక ఆర్థిక అక్రమాలు..‘మార్గదర్శి చిట్స్ లో జిల్లాలో సేకరించిన అమౌంట్లు హెడ్ ఆఫీస్ కు పంపడం చిట్స్ చట్టం ప్రకారం నేరం. జిల్లాల్లో సేకరించిన డబ్బులో కొందరు మధ్యలో చిట్స్ నిలిపివేస్తే, వాటిని మార్గదర్శి ఖాతాలో వేసుకుని, వారి ఆస్తులుగా చూపించారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్ లో ఆస్తులు, అప్పులను సక్రమంగా చూపలేదు. ప్రజల సొమ్మును అక్రమంగా తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెట్టారు. రూ.2610 కోట్లు డిపాజిట్లుగా చూపి, దానిలో 1300 కోట్లు నష్టాలుగా చూపించారు. ప్రజల డబ్బు చీటీల రూపంలో తమ వద్ద పెడితే, దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి సగానికి పైగా నష్టాలు వచ్చినట్లు చూపారు. ఇవ్వన్నీ సీఐడీ విచారణలో కూడా వెలుగుచూశాయి. వైయస్ఆర్ ప్రభుత్వంలో రంగాచారి కమిటీని నియమించింది. దీనిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. మార్గదర్శిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులపై వ్యక్తిగత దాడిగా ఈనాడు పత్రికలో బుదరచల్లే రాతలు రాస్తూ వారిని భయపెడుతున్నారు. సీఎం చంద్రబాబు అండతో వారికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడం, బదిలీలు చేయించడం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ కు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై పార్లమెంట్లో ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబంపై ఈనాడు పత్రిక దుర్మార్గమైన తప్పుడు రాతలతో వేధిస్తోంది. జేజే రెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభకుల్లో ఒకరైతే, ఆయనను శంకగిరి మాన్యాలు పట్టించి, వారి ఆస్తులు గుంజుకుని, దేశం నుంచి పరారయ్యేలా చేశారు. మీడియా మాఫియాగా చీకటి వ్యాపారాలకు పాల్పడుతూ, అధికార తెలుగుదేశం పార్టీతో అంటకాగుతూ, ప్రజల్లో తమకు వ్యతికులపై విషప్రచారానికి దిగుతున్నారు. ప్రభుత్వాలు తమ చెప్పుచేతల్లో ఉంటాయని, మేం తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించుతామనే అహంకారంతో ఉన్నారు’ అని పొన్నవోలు విమర్శించారు.
![Cm Revanth Gives Clarity For His Remarks On Pm Modi 8](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/revanthreddy.jpg.webp?itok=J9EcuBPP)
ప్రధానిని అలా అనలేదు: సీఎం రేవంత్ క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ:తాను ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడలేదని, పీఎం కుర్చీని అగౌరపర్చలేదని సీఎం రేవంత్రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు రేవంత్రెడ్డి ఢిల్లీలో శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. ‘పుట్టుకతోనే మోదీ బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన తేదీల్లో తేడా ఉంటే ఉండొచ్చు.మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి.రాహుల్తో నాకు ఎలాంటి గ్యాప్ లేదు.గ్యాప్ అంతా ఊహాగానాలే. రాహుల్ గైడెన్స్తోనే పనిచేస్తున్నా. రాహుల్ ఎజెండాను సీఎంగా నెరవేర్చడమే నా పని. దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగణన చేశా. మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన అవకాశమిస్తున్నాం’అని రేవంత్ తెలిపారు.కాగా,శుక్రవారం హైదరాబాద్లో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగ్లో రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రధాని కన్వర్టెడ్ బీసీ అని, పుట్టుకతో బీసీ కాదని అన్నారు.మోదీ మొదటిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది.
![Ysrcp Leader Ramesh Reddy House Demolished In Tadipatri9](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/House-Demolished5.jpg.webp?itok=RuutGGw8)
జేసీ కక్ష.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేత
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్ పరికరాలు, మోటర్ సెల్ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![Sunita Williams Will Face Gravity Problems On Earth10](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/sunitawilliams.jpg.webp?itok=lc1I14bz)
సునీత,విల్మోర్లకు ‘గ్రావిటీ’ భయం..!
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి మార్చి 19న భూమి మీదకు బయలుదేరనున్నారు. గతేడాది జూన్లో అంతర్జాతీయ స్పేస్స్టేషన్(ఐఎస్ఎస్)కు వెళ్లిన వారిద్దరు అనుకోని పరిస్థితుల్లో ఎనిమిది నెలలపాటు అక్కడే ఉండిపోయారు. అయితే వ్యోమగాములిద్దరు భూమి మీదకు వచ్చిన తర్వాత పలు రకాల సమస్యలను ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. జీరో గ్రావిటీ నుంచి భారీ గురుత్వాకర్షణ కలిగిన భూమి వాతావరణంలోకి 8 నెలల తర్వాత వారు రానుండడమే ఇందుకు కారణం. తాము భూమి మీదకు వచ్చిన తర్వాత చిన్న పెన్సిల్ను లేపినా పెద్ద బరువులు ఎత్తి వ్యాయామం చేసిన ఫీలింగే ఉంటుందని విల్మోర్ మీడియాకు తెలిపారు.‘ఇక్కడి నుంచి భూమి మీదకు వచ్చిన తర్వాత గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భూమిపై పరిస్థితులకు అలవాటుపడే దాకా ఇబ్బందిగానే ఉంటుంది.శరీరం బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది’ అని విల్మోర్ వెల్లడించారు. స్పేస్లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు..భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది.ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లాక వారి శరీరం ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది.ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది.గుండె పనితీరుపైనా అంతరిక్షం ప్రభావం చూపిస్తుంది.బోయింగ్ వ్యోమనౌకలో భాగంగా నాసా గత జూన్లో సునీత,విల్మోర్లను ఐఎస్ఎస్కు పంపించింది. వ్యోమనౌకలో లోపాలు తలెత్తడంతో వారం రోజుల కోసం వెళ్లిన ఇద్దరు ఏకంగా 8 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
చాలా భయంగా ఉంది.. వివాదం తర్వాత ఏం జరిగిందంటే?: యూట్యూబర్
చెలరేగిన నాట్ స్కివర్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ కౌంటర్
కొనాలన్నా.. ఈ రెండు కార్లు దొరకవు!
బడ్జెట్కు వెనకాడకుండా తీసిన సినిమా.. ట్రైలర్ చూశారా?
బుకింగ్స్లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
జయలలిత ఆభరణాల్లో.. అద్భుతమైనవివే..!
ICC Champions Trophy: దుబాయ్కు చేరుకున్న భారత జట్టు..
రాహుల్ పై 'గంభీర్' నమ్మకం.. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుస్తాడా?
‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర కీలక నిర్ణయం
మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్లు
,,,వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్లవి ఏం తీసుకెళ్తార్సార్
ఈ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం.. శుభకార్యాలకు హాజరవుతారు
మీరు గ్రేట్ సార్! సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ ‘ఫిక్స్’ పథకం అమలు చేస్తున్నారు!
బంగారం భారీగా తగ్గిందోచ్.. తులానికి ఏకంగా..
'తల' సినిమా రివ్యూ
'గోదారి గట్టు మీద రామచిలకవే... ' వీడియో సాంగ్ వచ్చేసింది
బుల్లి రాజుకు ఫేమ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి
నా జీతం 7కోట్లు.. ఏం చేసుకోను.. నా భార్య విడాకులు అడుగుతోంది!
నగరాన్ని తలదన్నేలా మునిపల్లి..
చాలా భయంగా ఉంది.. వివాదం తర్వాత ఏం జరిగిందంటే?: యూట్యూబర్
చెలరేగిన నాట్ స్కివర్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ కౌంటర్
కొనాలన్నా.. ఈ రెండు కార్లు దొరకవు!
బడ్జెట్కు వెనకాడకుండా తీసిన సినిమా.. ట్రైలర్ చూశారా?
బుకింగ్స్లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
జయలలిత ఆభరణాల్లో.. అద్భుతమైనవివే..!
ICC Champions Trophy: దుబాయ్కు చేరుకున్న భారత జట్టు..
రాహుల్ పై 'గంభీర్' నమ్మకం.. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుస్తాడా?
‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర కీలక నిర్ణయం
మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్లు
,,,వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్లవి ఏం తీసుకెళ్తార్సార్
ఈ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం.. శుభకార్యాలకు హాజరవుతారు
మీరు గ్రేట్ సార్! సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ ‘ఫిక్స్’ పథకం అమలు చేస్తున్నారు!
బంగారం భారీగా తగ్గిందోచ్.. తులానికి ఏకంగా..
'తల' సినిమా రివ్యూ
'గోదారి గట్టు మీద రామచిలకవే... ' వీడియో సాంగ్ వచ్చేసింది
బుల్లి రాజుకు ఫేమ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి
నా జీతం 7కోట్లు.. ఏం చేసుకోను.. నా భార్య విడాకులు అడుగుతోంది!
నగరాన్ని తలదన్నేలా మునిపల్లి..
సినిమా
![Balakrishna Surprises Thaman With Grand Porsche Car](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/thaman.jpg.webp?itok=qh6PsWoW)
తమన్కి ఖరీదైన కారుని గిఫ్ట్గా ఇచ్చిన బాలయ్య.. ధర ఎంతంటే?
మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి హీరో బాలకృష్ణ(Balakrishna) ఖరీదైన కారుని బహుమతి ఇచ్చాడు. న్యూ బ్రాండెండ్ పోర్స్చే కారుని బాలయ్య స్వయంగా కొని, రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు . దీని విలువ మార్కెట్లో కోటిన్నర వరకు ఉంటుంది. ప్రీమియంది అయితే దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందట. ఓ సంగీత దర్శకుడికి బాలయ్య ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం ఇదే మొదటి సారి. కొత్త కారుతో బాలయ్య, తమన్ దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.తమన్ రెచ్చిపోతాడుబాలయ్య సినిమాకు సంగీతం అందించే అవకాశం వస్తే చాలు తమన్(Thaman) రెచ్చిపోతాడు. ఎంతలా అంటే ఆయన ఇచ్చే బీజీఎంకి థియేటర్స్లో బాక్సులు బద్దలైపోయేలా. అఖండ సినిమా భారీ విజయం సాధించడంలో తమనే కీలక పాత్ర పోషించాడు. అదిరిపోయే పాటలతో పాటు అద్భుతమైన బీజీఎం అందించాడు. ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరీ చిత్రాలకు కూడా అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. వీరసింహారెడ్డి బీజీఎం ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరేట్. సోషల్ మీడియాలో బాలయ్య ఎలివేషన్ వీడియోలన్నింటికి ఈ మూవీ బీజీఎంనే వాడుతారు. ఇక ఇటీవల రిలీజైన డాకు మహారాజ్కు కూడా తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. అందుకే బాలయ్యకు తమన్ అంటే విపరీతమైన ప్రేమ. ముద్దుగా తమ్ముడు అని పిలుచుకుంటాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘అఖండ 2’ చిత్రం తెరకెక్కుతుంది.
![Sukesh Chandrashekhar Gifts Jacqueline Fernandez A Customised Private Jet on Valentines Day](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Sukesh-Chandrashekhar-Gifts-Jacqueline.jpg.webp?itok=FOi4YOQQ)
జైలు నుంచే హీరోయిన్కి ప్రేమ లేఖ..గిఫ్ట్గా ప్రైవేట్ జెట్!
‘బేబీ.. హ్యాపీ వాలంటైన్స్ డే. ఈ ఏడాది మనకు ఎంతో సానుకూలంగా ప్రారంభమైంది. జీవితాంతం ప్రేమికుల రోజును మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. జాకీ.. నిజంగానే నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రియురాలివి. పిచ్చివాడిలా నిన్ను ప్రేమిస్తున్నా’ అంటూ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్( Jacqueline Fernandez )కు ప్రేమ లేఖ రాశాడు ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్ర శేఖర్(Sukesh Chandrashekhar). మరో జన్మంటూ ఉంటే జాక్వెలిన్ హృదయంగా జన్మిస్తానంటూ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు జైలులో ఉన్నప్పటికీ తన ప్రియురాలికి ప్రైవేట్ జెట్ను కానుకగా ఇచ్చాడు. ‘షూటింగ్స్ కోసం వివిధ దేశాలకు ప్రయాణిస్తుంటావు. అందుకే నీకోసం ఓ ప్రైవేట్ జెట్ని బహుమతిగా అందిస్తున్నాను. నీ పేరులోని తొలి అక్షరాలు ఆ జెట్పై రాసి ఉంటాయి. అదే విధంగా నీ పుట్టిన రోజు తేదీతో రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నా. ఈ జెట్లో ఇకపై నీ ప్రయాణాలు సౌకర్యంగా జరుగుతాయి’ అని ప్రియురాలిపై తనకున్న ప్రేమనంతా లేఖ రూపంలో రాశాడు.రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్ చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2021లో ఢిల్లీ పోలీసులు సుఖేశ్ అరెస్ట్ చేశారు. అతనితో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. జాక్వెలిన్ తన ప్రియురాలు అని సుఖేశ్ అంటుంటే.. అసలు అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ చెబుతోంది. కోర్టులో కూడా ఇదే విషయం చెప్పింది. అయిన్పటికే సుఖేశ్ మాత్రం ప్రేమ లేఖలు రాస్తూనే ఉన్నాడు. బహుమతులు పంపిస్తూనే ఉన్నాడు. ఆమె బర్త్డేకి ఓ పెద్ద పడవను గిఫ్ట్గా అందించాడు. క్రిస్మస్ కానుకగా పారిస్లో ఒక వైన్ యార్డ్నే కానుకగా ఇస్తున్నట్లు లేఖ రాశాడు.
![Kannada Fans Fires On Rashmika Mandanna](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/rashmika.jpg.webp?itok=Y1M67Xc6)
నోరు జారిన రష్మిక.. ఫైర్ అవుతున్న కన్నడ ప్రజలు!
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)పై కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన ఊరిని మర్చిపోయావంటూ ఆమెపై మండిపడుతున్నారు. దీనికి కారణం ‘ఛావా’(Chhaava) ప్రమోషన్స్ ఈవెంట్లో రష్మిక చేసేన వ్యాఖ్యలే. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన హిందీ చిత్రం ‘ఛావా’. ఈ మూవీ ఈ నెల 14న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తుంది. రిలీజ్కి ముందు ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో రష్మిక పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పింది. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చకు దారీ తీశాయి. పుట్టిన ప్రాంతం(కర్ణాటక) పేరు చెప్పడానికి రష్మికకు వచ్చిన సమస్య ఏంటంటూ కన్నడ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: బాక్సాఫీస్పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్లంటే..?)కర్ణాటకలోని కొడగు జిలా విరాజ్ పేట రష్మిక జన్మస్థలం. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఛలో’తో తెలుగులోకి అడుగుపెట్టింది. గీత గోవిందం సినిమాలో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ లిస్ట్లోకి చేరిపోయింది. పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్గా మారింది.(చదవండి: తమన్కి ఖరీదైన కారుని గిఫ్ట్గా ఇచ్చిన బాలయ్య.. ధర ఎంతంటే?)అయితే ఛావా ప్రమోషనల్ ఈవెంట్లో తన సొంతూరు హైదరాబాద్ అన్నట్లుగా మాట్లాడడంతో కన్నడ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని తెలియజేస్తూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. వరుస హిట్లు వచ్చే సరికి సొంతూరును మర్చిపోవడం సరైన పద్దతి కాదంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా, గతంలోనూ రష్మికపై ఇలాంటి ట్రోలింగే జరిగింది. పుష్ప రిలీజ్ సమయంలో తన తొలి సినిమా కిరిక్ పార్టీ నిర్మాణ సంస్థ పేరును చెప్పకుండా...‘పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణసంస్థ తనకు హీరోయిన్గా అవకాశం ఇచ్చింది’ అని రష్మిక చెప్పడంతో నెటిజన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మిక నటించిన సినిమాలను బ్యాన్ చేయాలంటూ అప్పట్లో ట్వీట్స్ చేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత రష్మిక ట్రోలింగ్కి గురైంది. దీనికి ఈ నేషనల్ క్రష్ ఎలా స్పందిస్తుందో చూడాలి. '@iamRashmika, I sometimes feel pity for you for receiving unnecessary negativity/targeting from our fellow Kannadigas. But when you make statements like this I think they are right and you deserve the backlash.👍#Kannada #Chaava #RashmikaMandanna pic.twitter.com/RBY7RcpHgP— Virat👑Rocky✨️ (@Virat_Rocky18) February 14, 2025
![Rakul Preet Singh Says Comfort Zone Is Your Enemy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/rakul-preet.jpg.webp?itok=hzFAmUtP)
ఆ పనుల నుంచి బయటకు రండి: రకుల్ ప్రీత్సింగ్
ఈతరం ప్రేక్షకులను సైతం అలరిస్తున్న నటి రకుల్ప్రీత్సింగ్(Rakul Preet Singh ). ఇంతకుముందు దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా వెలిగిన ఈ బ్యూటీ తమిళంలో తడైయరతాక్క చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఎన్నమో ఎదో, ధీరన్ అధికారం ఒండ్రు, దేవ్, ఇండియన్ 2, అయలాన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అదేవిధంగా తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా పేరు పొందారు. ప్రస్తుతం హిందీ చిత్రాలపైనే పూర్తి దృష్టి పెడుతున్న ఈ భామ తాజాగా అజయ్దేవగన్, మాధవన్లతో కలిసి దే దే ప్రాయ్ దే–2 చిత్రంలో నటిస్తున్నారు.ఇక తమిళంలో కమలహాసన్తో కలిసి నటించిన ఇండియన్–3 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రకుల్ప్రీత్సింగ్ తన ఇన్స్ట్రాగామ్లో ఒక పోస్ట్ చేశారు. అందులో అలవాటైన పనుల నుంచి, ప్రాంతాల నుంచి బయటకు రండి. సౌకర్యంగా అలవాటైన ప్రాంతమే మీకు విరోధి. అలవాటైన ప్రాంతం అందంగా ఉంటుంది. అయితే అది మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎదగనీయదు అని ఎవరో చెప్పారు. ప్రజలు సోంబేరితనంగా మారడానికి కారణం వారికి అన్నీ రేపే కావాలి భావించడమే. ఎందుకంటే వారు తాము ఉన్న ప్రాంతాల్లో సౌకర్యంగా ఉండడమే. ఒక పనిచేయడం నుంచి మారాలనుకోవడం లేదు. నిత్యం చేసే పని మీకు సులభంగా ఉండవచ్చు. అయితే అది మిమ్మల్ని ఎదగనీయదు. ఎదగాలంటే మీరు అలవాటైన ప్రాంతం నుంచి బయటకు రావాలి. కఠినమైన విషయాలను చేయాలి. నా స్వభావం చాలా బలమైనది. అధికంగా నేను ప్రేమించుకుంటాను. కొత్తదనాన్ని కోరుకునే వ్యక్తిని నేను అని రకుల్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు
![Mohammed Shami will be a good bet in Dubai: Robin Singh5](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/shawmi.jpg.webp?itok=XGm9wH2Y)
'అతడొక సూపర్ స్టార్.. దుబాయ్లో దుమ్ములేపుతాడు'
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన రీఎంట్రీలో సత్తాచాటలేకపోతున్నాడు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తన రిథమ్ను తిరిగి పొందడానికి ఈ బెంగాల్ స్టార్ సీమర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లో షమీ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) రూపంలో షమీ మరో సవాలు ఎదురు కానుంది. ఈ టోర్నీకి పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో భారత ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్కు షమీనే నాయకత్వం వహించాలి.అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యాతో కూడా పేస్ త్రయాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత షమీపైనే ఉంది. అయితే షమీ తన రిథమ్ను అందుకుంటే అపడం ఎవరి తరం కాదు. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్కప్లో తనంటో ఈ స్పీడ్ స్టార్ నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో షమీపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో షమీ దుమ్ములేపుతాడని రాబిన్సింగ్ జోస్యం చెప్పాడు. కాగా రాబిన్ సింగ్ ప్రస్తుతం ఇంటర్ననేషనల్ టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో అతడికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే దుబాయ్ వికెట్ షమీకి సరిగ్గా సెట్ అవుతాందని రాబిన్ సింగ్ అంచనా వేశాడు."దుబాయ్ వికెట్పై రాత్రి పూట బౌలింగ్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి. మంచు కారణంగా బంతి బౌలర్లు చేతి నుంచి జారిపోయే అవకాశముంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మంచు విస్తృతంగా లేదు. ఈ వికెట్పై రాత్రిపూట బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పరుగులు సునాయసంగా రాబట్టవచ్చు. కానీ ఈ పరిస్థితులను మంచి సీమ్ బౌలర్ అయితే తనకు తగ్గట్టు మలుచుకుంటాడు. షమీలాంటి స్పీడ్ స్టార్కు ఈ వికెట్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే సరైన లెంగ్త్తో పాటు గుడ్ ఏరియాలలో అతడు హిట్ చేస్తాడు. షమీ పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్ కలిగి ఉన్నాడని" ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ సింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి: IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
![Bennetts 169 helps Zimbabwe beat Ireland in ODI6](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Brian-Bennett1.jpg.webp?itok=gxSuJz7C)
బెన్నెట్ విధ్వంసకర సెంచరీ.. ఐర్లాండ్ను చిత్తు చేసిన జింబాబ్వే
ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్ను జింబాబ్వే విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే 49 పరుగుల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. మొదట జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (163 బంతుల్లో 169; 20 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన బెనెట్ చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (61 బంతుల్లో 66; 3 ఫోర్లు, 4 సిక్స్లు)... బెనెట్కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు ఐర్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు.ఏకైక టెస్టులో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన జింబాబ్వే తొలి వన్డేలో దానికి బదులు తీర్చుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 46 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ స్టిర్లింగ్ (32), క్యాంపెర్ (44), టెక్టర్ (39), టకర్ (31), డాక్రెల్ (34), మెక్బ్రైన్ (32) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎన్గరవా మూడు వికెట్లు పడగొట్టారు. బెనెట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్?
![Virat Kohli Needs 37 Runs In 1st Match To Become First Player In The World7](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/viratand-sachin.jpg.webp?itok=zRatf0p0)
ఛాంపియన్స్ ట్రోఫీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను క్వీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు శనివారం దుబాయ్కు పయనమైంది.ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్, యూఏఈ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీలో రన్నరప్గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్గా తిరిగిరావాలని పట్టుదలతో ఉంది. ఈ మినీ వరల్డ్కప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 19న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది.సచిన్ రికార్డుపై విరాట్ కన్ను..కాగా ఈ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli)ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. బంగ్లాతో మ్యాచ్లో కోహ్లి మరో 37 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంతవేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్లో పాకిస్తాన్పై ఈ ఫీట్ను అందుకున్నాడు.కోహ్లి ఇప్పటివరకు 285 ఇన్నింగ్స్లలో 13963 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్ధానంలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగ్కర 378 ఇన్నింగ్స్లలో 14,000 పరుగుల మైలు రాయిని సాధించాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్లో ఈ దిగ్గజాలను కోహ్లి అధిగమించే అవకాశముంది.అంతేకాకుండా ఈ టోర్నీలో విరాట్ మరో 173 పరుగులు సాధిస్తే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు కూడా బద్దలు అయ్యే ఛాన్స్ ఉంది. దావన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 10 మ్యాచ్లు ఆడి 701 పరుగులు చేశాడు. కోహ్లి విషయానికి వస్తే.. 13 మ్యాచ్ల్లో 529 పరుగులు చేశాడు. అదేవిధంగా కోహ్లి మరో 263 పరుగులు చేయగలిగితే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించే అవకాశముంటుంది. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గిల్ 791 పరుగులతో ఈ టోర్నీలో టాప్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. కాగా ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి వన్డేలో కోహ్లి హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. అదేజోరును ఈ ఐసీసీ ఈవెంట్లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్?
![Albania Ranking Series Wrestlers Seek sports minister Intervention But8](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/sunil.jpg.webp?itok=njgv2N4N)
మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!
కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)ను కలిసేందుకు భారత రెజ్లర్లు శనివారం ఆయన నివాసం వద్దకు వెళ్లారు. అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు తమను పంపేలా ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేయాలని భావించారు. అయితే, మంత్రి ఇంట్లో లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.కాగా కేంద్ర క్రీడాశాఖ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)ల మధ్య కొరవడిన సమన్వయంతో రెజ్లర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో తొలి ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్కు దూరమైన భారత రెజ్లర్లు... మళ్లీ ఇప్పుడు రెండో ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ నిర్ణీత సమయంలోగా అవసరమైన డాక్యుమెంట్లు సమకూర్చకపోవడంతో అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు రెజ్లర్లను పంపలేక పోతున్నామని క్రీడాశాఖ ... సమాఖ్య తీరుపై విమర్శించింది.సమాఖ్య నిర్వాకం వల్లే‘డబ్ల్యూఎఫ్ఐ ప్రతిపాదిత జాబితాను గడువులోగా పంపడంలో తాత్సారం చేసింది. భారత స్పోర్ట్స్ అథారిటీ (SAI)కి చాలా ఆలస్యంగా జాబితా చేరడంతో తదుపరి ప్రక్రియను చేపట్టలేకపోయాం. ఏదైనా అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లాలంటే ఓ పద్ధతి ఉంటుంది. ముందస్తు ప్రతిపాదన, తదుపరి డాక్యుమెంట్ల పరిశీలన తదనంతరం తుది జాబితా ఆమోదించబడాలి. కానీ సమాఖ్య నిర్వాకం వల్లే జాబితా ఆలస్యమైంది. ఆమోదానికి దూరమైంది. దీంతో అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు’ అని క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయంలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం కోరుతూ.. ఆసియా చాంపియన్ సునిల్ కుమార్, అండర్-23 ఆసియా చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత మీనాక్షితో పలువురు రెజ్లర్లు న్యూఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు.మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!ఈ సందర్భంగా సునిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా తప్పు లేకపోయినా ర్యాంకింగ్ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మంత్రిగారి జోక్యంతోనైనా మాకు మేలు జరుగుతుందని ఇక్కడకు వచ్చాం. ఈ సిరీస్లో పాల్గొనడంవల్లమార్చిలో జరుగబోయే డ్రా, తొలి దశ బౌట్లలో మాకు కాస్త వెసలుబాటు కలుగుతుంది.అందుకే మా సమస్యను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నాం’’ అని తెలిపాడు. అయితే, మధ్యాహ్నం రెండు గంటల వరకు దాదాపు పది మంది రెజ్లర్లు మాండవీయ నివాసం వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో రెజ్లర్లు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. కాగా గతంలో క్రీడాశాఖ సస్పెన్షన్ వల్ల జాగ్రేబ్ ర్యాంకింగ్ సిరీస్కు భారత జట్టు దూరమైంది. ఇప్పుడు ఇరు సమాఖ్యల మధ్య సమన్వయలేమి వల్ల ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు టిరానాలో జరిగే ఈవెంట్కూ గైర్హాజరు అవుతోంది. ఇక భారత రెజ్లర్లు సీనియర్ ఆసియా చాంపియన్షిప్పైనే ఆశలు పెట్టుకున్నారు. జోర్డాన్లో మార్చి 25 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరుగుతుంది.
బిజినెస్
![Nikhil Kamath's Valentine's Day Post Goes Viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/nikhil-kamat.jpg.webp?itok=bOPpp_eW)
నేనో ఇడియట్లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్స్టా పోస్ట్ వైరల్
ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' (Nikhil Kamath) ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని చెబుతూనే.. భారతదేశం బాగుంటుందని అన్నారు. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.భారతదేశంలోని 25 ఏళ్లలోపు తెలివైన యువ వ్యాపారవేత్తలతో.. ఒకరోజు సమయం గడిపిన తరువాత నేను ఒక ఇడియట్ అని భావిస్తున్నాను. రోజంతా అనవసరమైన మీటింగులతో కాలక్షేపం చేయడం చాలా వృధా.. ఇలాంటి యువకులతో సమయం గడిపితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ తరం నా కంటే చాలా తెలివైనదని నిఖిల్ కామత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతే కాకుండా.. ఇది కొత్త భారతదేశం, ఇలాంటి యువకులతో భారతదేశం బాగుంటుందని, చెబుతూ.. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.నిఖిల్ కామత్ పోస్టుపై.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. భారతదేశం అభివృద్ధి చెందడానికి ఇంకెంతో సమయం లేదని ఒకరు.. యువతతో ఎక్కువ సమయం గడపడానికి.. వారిని ప్రోత్సహించడానికి సమయం కేటాయించాలని మరొకరు కామెంట్స్ చేశారు. ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్.. ఆలస్యమైతే డబుల్ ఛార్జ్జెరోధా వృద్ధికి నితిన్ కామత్ తోడుజెరోధా కంపెనీ వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. ఈ కంపెనీ అభివృద్ధి చెందటానికి.. నా సోదరుడు, జెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్ (Nithin Kamath) కూడా కారణం. ఎందుకంటే స్టాక్ మార్కెట్కు సంబంధించిన విషయాలను నేను చూసుకుంటే.. బ్రోకింగ్ సంబంధిత పనులన్నీ కూడా నితిన్ చూసుకుంటాడు. మా మధ్య అప్పుడప్పుడు అభిప్రాయం బేధాలు వచ్చినా.. తరువాత సామరస్యంగా ముందుకు వెళ్తామని నిఖిల్ కామత్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Nikhil Kamath (@nikhilkamathcio)
![Tech Tips Common Mistakes While Charging Your Phone That Can Cause Trouble](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/mobile01.jpg.webp?itok=tTENwbDV)
ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ పెట్టడం తెలుసా..?
స్మార్ట్ఫోన్ను సరిగ్గా ఛార్జింగ్ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్ కేబుల్తో ఛార్జ్ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్ఫోన్కు ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్కు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.ఇతర ఛార్జర్లను ఉపయోగించడంప్రతిఫోన్కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్తోనే ఛార్జ్ చేయాలి. లేదంటే ఫోన్ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్ వోల్టేజ్ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.రాత్రంతా ఛార్జింగ్చాలామందికి లేట్నైట్ వరకు ఫోన్ ఉపయోగించి ఛార్జ్ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్ అయ్యేందుకు దారితీస్తుంది.ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడడంఛార్జింగ్ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.సాఫ్ట్వేర్ అప్డేట్లను విస్మరించడంఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్వేర్లో అప్డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్డేట్ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్ సమస్యలకు సంబంధించిన అప్డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.0% నుంచి 100% వరకుఫోన్ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.చలి, వేడికి దగ్గరగా..విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.దెబ్బతిన్న కేబుల్తో ఛార్జింగ్పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!ఛార్జింగ్ పోర్ట్ను శుభ్రం చేయకపోవడంఫోన్ ఛార్జింగ్ పోర్ట్లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
![Hyderabad real estate sees surge in prices of ultra luxury homes](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/house.jpg.webp?itok=YLUNzqqj)
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త రికార్డు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిల పరిధిలో రికార్డుస్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నివేదికలోని పలు కీలకాంశాలివే..హైదరాబాద్లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా.. 2024 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కోవిడ్ అనంతరం లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు..2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో 12,400గా ఉండగా.. 2024 నాటికి 15,350కి పెరిగాయి.అందుబాటు గృహాల్లో 15 శాతం.. ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగపు ధరల వృద్ధిలో హైదరాబాద్ది రెండో స్థానం. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది. ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్య తరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ. 6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్లోనే నమోదైంది. మన నగరంలో మిడ్సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది.
![Telecos hopes on the govt for relief after the Supreme Court dismissed their AGR dues petitions](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/telco01.jpg.webp?itok=dAd60Gtq)
టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించి టెలికాం కంపెనీలు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ బకాయిలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన తుది రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. దాంతో దేశంలోని టెలికాం ఆపరేటర్లు బకాయిల ఉపశమనం కోసం ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.సుప్రీంకోర్టు చర్యలుఏజీఆర్ లెక్కల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) దిద్దుబాట్లు కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిటెల్ వంటి టెలికాం కంపెనీలు సుదీర్ఘ న్యాయపోరాటం చేశాయి. కానీ 2025 జనవరి 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో వాటి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, సంజయ్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని పునఃసమీక్షించడంలో ఎలాంటి అర్హత లేదని తేల్చింది. రివ్యూ పిటిషన్లు, దానికి మద్దతుగా ఉన్న కారణాలను క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే 2021 జులై 23న ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించడానికి ఎలాంటి కారణం లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో టెలికాం ఆపరేటర్లకు ఇకపై న్యాయపరమైన ఆధారం లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వ సాయం కోరాలని టెలికాం కంపెనీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఎజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము-భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది.ఏజీఆర్ లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యానికి తోడ్పాటువివాదం ఏమిటంటే..ఏజీఆర్లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికా కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
ఫ్యామిలీ
![Indian handlooms on the world fashion stage says Sushma Muppidi12](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Sushma-Muppidi-IMG_5161%281%29a.jpg.webp?itok=zShGxs5T)
చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!
ఇకత్ చీరతో వేడుకలో వెలిగిపోతాం. నారాయణపేట మెటీరియల్తో డిజైనర్ బ్లవుజ్ కుట్టించుకుంటాం. మన సంప్రదాయ వస్త్రధారణ మనల్ని ఫ్యాషన్ పెరేడ్లో తళుక్కుమని తారల్లా మెరిపిస్తోంది. ఇవి ఇంత అందంగా ఎలా తయారవుతాయి. ఒక డిజైన్ని విజువలైజ్ చేసి వస్త్రం మీద ఆవిష్కరించే చేనేతకారులు ఏం చదువుతారు... ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేశారు మిసెస్ ఇండియా (Mrs India) విజేత సుష్మ. ఈ వస్త్రాలను నేసే చేతులను, ఆ వేళ్ల మధ్య జాలువారుతున్న కళాత్మకతను దగ్గరగా చూడాలనిపించింది. పోచంపల్లి బాట పట్టారామె. కళాత్మకత అంతా చేనేతకారుల చేతల్లోనే తప్ప వారి జీవితాల్లో కనిపించలేదు. నూటికి రెండు–మూడు కుటుంబాలు ఆర్థికంగా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఈ కళను తమ తరంతో స్వస్తి పలకాలనుకుంటున్న వాళ్లే. మరి... ఇంత అందమైన కళ తర్వాతి తరాలకు కొనసాగకపోతే? ఒక ప్రశ్నార్థకం. దానికి సమాధానంగా ఆమె తనను తాను చేనేతలకు ప్రమోటర్గా మార్చుకున్నారు. చేనేతకారుల జీవితాలకు దర్పణంగా నిలిచే డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తాను పాల్గొనే ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ కాంటెస్ట్లలో మన చేనేతలను ప్రదర్శిస్తున్నారు. ఆ చేనేతలతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్వతహాగా ఎంటర్ప్రెన్యూర్ అయిన సుష్మా ముప్పిడి (Sushma Muppidi) మన హస్తకళలు, చేనేతలను ప్రపంచవేదిక మీదకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేశారు.వైఫల్యమూ అర్థవంతమే! చీరాలకు చెందిన సుష్మ ముప్పిడి బీటెక్, ఎంబీఏ చేశారు. కొంతకాలం గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం, పెళ్లి తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతోపాటు మరో ప్రైవేట్ కాలేజ్లో పార్ట్టైమ్ జాబ్ చేశారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం... ఈ జర్నీలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉద్యోగం కోసం తన హండ్రెడ్పర్సెంట్ ఇస్తోంది. పిల్లల కోసం గడిపే సమయం తగ్గిపోతోంది. వెనక్కి చూస్తే తనకు మిగిలిందేమిటి? సివిల్ సర్వీసెస్ ప్రయత్నం సఫలం కాలేదు. ఉనికి లేని సాధారణ ఉద్యోగంతో తనకు వచ్చే సంతృప్తి ఏమిటి? సమాజానికి పని చేయడంలో సంతృప్తి ఉంటుంది, తనకో గుర్తింపునిచ్చే పనిలో సంతోషం ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత యూత్లో సోషల్ అవేర్నెస్ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొనవడం విజేతగా నిలవడం జరిగింది. సోషల్ ఇనిషియేటివ్, వెల్ స్పోకెన్, బెస్ట్ కల్చరల్ డ్రెస్, మిసెస్ ఫ్యాషనిష్టా వంటి గుర్తింపులతోపాటు ‘యూఎమ్బీ ఎలైట్ మిసెస్ ఇండియా 2024’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మార్చి ఒకటిన ఇటలీలోని మిలన్ నగరంలో, ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగే ఫ్యాషన్ షోలలో భారత చేనేతలు అసోం సిల్క్, మల్బరీ సిల్క్లను ప్రదర్శించనున్నారు. జూన్లో యూఎస్, ఫ్లోరిడాలో జరిగే మిసెస్ యూనివర్సల్ వేదిక మీద మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు సుష్మ. ఇవన్నీ ఆత్మసంతృప్తినిచ్చే పనులు. ఇక తనకు రాబడి కోసం ఎంటర్ప్రెన్యూర్గా మారారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆఫీస్ నుంచి యూఎస్, దుబాయ్, సింగపూర్లలో డైమండ్ బిజినెస్ (Diamond Business) నిర్వహిస్తున్నారు. ‘‘జీవితంలో గెలవాలి, నా కోసం కొన్ని సంతోషాలను పూస గుచ్చుకోవాలి. నన్ను నేను ప్రశంసించుకోవడానికి సమాజానికి నా వంతు సర్వీస్ ఇవ్వాలి’’ అన్నారు సుష్మ. ‘‘వయసు దేనికీ అడ్డంకి కాదు. అంతా మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఒక ముందడుగు వేయండి. సక్సెస్ అవుతామా, విఫలమవుతామా అనే సందేహాలు వద్దు. ఏ ప్రయత్నమూ చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలమైనా కూడా అది అర్థవంతమయిన వైఫల్యమే. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు’’ అని మహిళలకు సందేశమిచ్చారు. ఇది నా చేయూత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్లలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను. మన చేనేత కుటుంబాలు కళకు దూరం కాకుండా ఉండాలన్నా, ఇతరులు ఈ కళాత్మక వృత్తిని చేపట్టాలన్నా ఇది ఉపాధికి సోపానంగా ఉండాలి. అందుకోసం చేనేతలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తాను. సమావేశాలకు ఉపయోగించే ఫైల్ ఫోల్డర్స్, ఇంట్లో ఉపయోగించే సోఫా కవర్స్, వేడుకల్లో ధరించే బ్లేజర్స్ వంటి ప్రయోగాలు చేసి మన చేనేతలను ప్రపంచవేదికలకు తీసుకెళ్లాలనేదే నా ప్రయత్నం. నేను ఎంటర్ప్రెన్యూర్గా ఎల్లలు దాటి విదేశాలకు విస్తరించాను. చదవండి: అన్నదాత మెచ్చిన రైతుబిడ్డకాబట్టి నాకున్న ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుని మన చేనేతలను ప్రమోట్ చేయగలుగుతున్నాను. కలంకారీ కళ కోసం అయితే ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించి కలంకారీ కళాకారులకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. పారిస్, యూఎస్ కార్యక్రమాల తర్వాత ఆ పని. సివిల్స్ సాధించినా కూడా ప్రత్యేకంగా ఒక అంశం మీద సమగ్రంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాత్మక సమాజానికి ఇస్తున్న సర్వీస్ నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేదిక మీద మన భారతీయ చేనేతకు ప్రాతినిధ్యం వహించాలి. మన నేతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనేది నా లక్ష్యం. – సుష్మ ముప్పిడి, మిసెస్ ఇండియా– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి
![Shehnaaz Gill Reveals Diet Plan Shed Lose 55 Kilos In 6 Months13](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/shehnaz.jpg.webp?itok=ospp_ZTA)
నటి షెహ్నాజ్ గిల్ డైట్ ప్లాన్ ఇదే..! ఆరు నెలల్లో 55 కిలోలు..
బాలీవుడ్ నటి షెహ్నాజ్ గిల్ మోడల్, గాయని కూడా. ఆమె పలు మ్యూజిక్ వీడియోస్, టెవిజన్ షోస్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. షెహ్నాజ్ కౌర్గా కూడా పిలిచే ఆమె పంజాబీ, హిందీ టెలివిజన్ చిత్రాలలో నటిస్తుంది. అంతేగాదు ఆమె సోషల్ మీడియా సెన్సెషన్ కూడా. ఇటీవల బాలీవుడ్ టీవీ షో మిర్చి ప్లస్లో శిల్పా శెట్టి కుంద్రాతో జరిగిన సంభాషణలో తన డైట్ ప్లాన్ గురించి షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.ఆమె దాదాపు 55 కిలోలు బరువు తగ్గారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ ఆమె ఫిట్నెస్ సీక్రెంటో ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు. అందరి కుతుహలానికి తెరపడేలా ఆమె తన డైట్ సీక్రెట్ ఏంటో బయటపెట్టింది. ఆమె ఏం చెప్పారంటే..డైట్ ప్లాన్..తాను సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరునెలల్లోనే ఇంతలా స్లిమ్గా మారిపోయానని చెప్పారు. తన రోజుని పసుపుతో ప్రారంభిస్తానని అంటోంది. పసుపు ఆరోగ్య నిర్వహణకు మంచిదే అయినప్పటికి సరైన మార్గంలో ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు పొందొగలమని అంటోంది. తాను హైడ్రేషన్గా ఉండేలా తగినంత నీరు తాగిన తర్వాత పెసరట్టు లేదా మెంతీ పరాఠాలతో కూడిన అల్పహారాన్ని ఎంచుకుంటానని తెలిపారు. చాలావరకు బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ పరిమాణంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. ఒక్కోసారి అల్పాహారంగా పోహా కూడా తీసుకుంటానని అంటోంది. ఇక తాను కూరగాయల రెసిపీనే ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. అలాగే వాటిలో తప్పనిసరిగా జీలకర్ర, ఆవాలు ఉండాల్సిందేనట. ఎక్కువగా మాత్రం బ్రకోలి, క్యారెట్, బెల్ పిప్పర్ వంటివి తీసుకుంటానని చెప్పింది. భోజనంలో ఎప్పుడు ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా మొలకలు, టోపు స్క్రాంబుల్, నెయ్యి, రోటీతో కూడిన పప్పు, సలాడ్లు ఉంటాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమతుల్యత ఉండేలా చూసుకుంటానని వెల్లడించింది. అలాగే పార్టీ టైంలో డైట్ ప్లాన్ బ్రేక్ చేయకుండా ఎలా ఫుడ్ తీసుకుంటున్నామనే దానిపైనే బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందని నొక్కి చెబుతుంది. ఇదేగాక డిన్నర్ టైంలో మఖానా తీసుకుంటానని అన్నారు. ఇది ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. పైగా ఇది బరువు తగ్గడం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మద్దితిస్తుందని చెబుతోంది షెహ్నాజ్. చాలావరకు తేలిక పాటి విందునే స్వీకరించడం ఉత్తమం అని అంటోంది. దీని వల్ల జీర్ణక్రియ, నిద్ర నాణ్యత తోపాటు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తందని చెప్పుకొచ్చింది. ఇలా ఆరోగ్యకరమైన రీతీలో డైట్ ప్లాన్ తోపాటు స్ట్రిట్గా పాటించే గట్స్ ఉంటే ఈజీ బరువు తగ్గగలరని చెబుతోంది.(చదవండి: తలకు మర్దనా చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..! )
![Valentines Day 2025: Hyderabad Mayor Gadwal Vijayalakshmis Love Story14](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/mayor.jpg.webp?itok=5u3qklCc)
గ్రేటర్ మేయర్ లవ్స్టోరీ అలా మొదలైంది..!
నాకు క్రికెట్ అంటే ఇష్టం.. మా ఆయన సాయిరెడ్డికి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం.. క్రీడా మైదానంలోనే తమ ప్రేమకు పునాది పడిందని హైదరబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తమ ప్రేమ కబుర్లు చెప్పుకొచ్చారు.. వాలంటైన్స్ డే సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రేమ సంగతులు పంచుకున్నారు.. నిత్యం స్పోర్ట్స్ స్టేడియంలో కలుసుకునే మేం మా చదువులు అయ్యాకే పెళ్లి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా మా డిగ్రీ, పీజీ అయ్యే వరకు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. మా నాన్నకు నేను గారాలపట్టీ కావడం వల్ల నా ఇష్టాన్ని ఆయన కాదనలేక పోయారు. మా ఆయన తల్లిదండ్రులు, వారి బంధువులు కూడా అంతా మా ప్రేమను అంగీకరించి ఆశీర్వదించారని చెప్పుకొచ్చారు. నేను క్రికెట్ బాగా ఆడేదాన్ని, బాబీ బాస్కెట్ బాల్ ఆటగాడు.. అలా క్రీడా మైదానాల్లో తరచూ కలుసుకునేవాళ్లం.. మా ప్రేమ విషయాన్ని మా ఇద్దరి ఇళ్లలో చెప్పాం. మా నాన్నకు నా మీద ఉన్న ప్రేమతో నా ప్రేమను కాదనలేకపోయారు. పెళ్లి కాగానే అమెరికా వెళ్లిపోయాం.. 18 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చాం.. నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని చెప్పగానే గో ఏ హెడ్ అంటూ ప్రోత్సహించారు. మాదేమో పొలిటికల్ ఫ్యామిలీ.. మా ఆయనదేమో బిజినెస్ ఫ్యామిలీ.. అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా బాబీ నన్ను ఇబ్బంది పెట్టకపోగా రాజకీయాల్లో వెళ్లేందుకు, నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రోత్సాహంగా నిలబడ్డాడు. ఇప్పటికీ మేం ఎంతో ప్రేమగా ఉంటామంటూ తన భర్తను తాను బాబీ అని.. తననేమో విజ్జి అని ప్రేమగా పిలుచుకుంటామంటూ తమ లవ్ జర్నీ చెప్తూ మురిసిపోయారు. (చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!)
![Valentine's Day 2025 youth opinion about Marriage and Parents15](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/marriage.jpg.webp?itok=hWDlkjlK)
పెళ్లి నిర్ణయం పెద్దలకేనా? యువత ఏమంటున్నారో తెలుసా?
కరీంనగర్ సిటీ: నేటి యువత చదువుకుంటూనే.. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ముందుకు సాగుతున్నారు. విద్య, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రేమ పెళ్లి వద్దు..పెద్దలు కుదిర్చిన పెళ్లి ముద్దు అంటున్నారు. మరికొందరు సరైన సమయంలో వివాహం జరగాలని చెబుతున్నారు. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం డిబేట్ నిర్వహించగా.. వారి అభిప్రాయాలు వెల్లడించారు.అర్థం చేసుకుంటే బెటర్ప్రేమ వివాహాలతో ఎదుటి వారి వ్యక్తిత్వం, ప్రవర్తన ముందుగానే తెలుసుకోవచ్చు. వారిపై మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వారితో వివాహబంధం ముందుకు సాగుతుందా లేదా తెలుస్తుంది. కొంతవరకూ ప్రేమపెళ్లిలు మంచివే. ఏ బంధం అయినా అర్థం చేసుకుని సర్దుకుపోతే నిలుస్తుంది.– శ్రీజ, విద్యార్థినిపెద్దలు కుదిర్చినదే..పెద్దలు అన్ని రకాలుగా మంచిగానే ఆలోచిస్తారు కాబట్టి వారి నిర్ణయం బలంగా ఉంటుందని నా నమ్మకం. వివాహ బంధంలో ఏదైనా సమస్యలు వచ్చినా పెద్దలు ముందుకు వచ్చి పరిష్కరిస్తారు. జీవితంలో మంచి సపోర్టుగా ఉంటారు. పెద్దలను విస్మరించి కొందరు ప్రేమ పేరుతో మోసపోతున్నారు.– వినోద, విద్యార్థినిప్రేమ వివాహాలపై 110మంది యువతులను వివిధ ప్రశ్నలు అడుగగా.. వెల్లడించిన అభిప్రాయాలుటీనేజీ ప్రేమపై మీ అభిప్రాయం65- ఆకర్షణ మాత్రమే45 -టీనేజ్లో ప్రేమ అవసరం లేదు85- కెరియర్ ఫస్ట్సరైన సమయంలో పెళ్లి అవసరం ప్రేమపై సోషల్ మీడియా ప్రభావం ఉందా?80-చాలా ఉందిఎలాంటి ప్రభావం లేదు-3060 - పెద్దలు కుదిర్చిందిప్రేమ వివాహం ప్రేమించి పెద్దలను ఒప్పించాలి- 30ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్లో పడితే జాగ్రత్త.. భయ్యా!ఒప్పించి.. మెప్పించాలిఒక మనిషి గురించి పూర్తిగా అర్థం చేసుకుని, వారి గురించి పెద్దలకు వివరించి ఒప్పించాలి. ప్రేమించి పెద్దల సహకారంతో వివాహం చేసుకుంటే జీవితం అనందంగా ఉంటుంది. ఉన్నత చదువులతో జీవితం ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే ఏదైనా సాధ్యం. పెద్దలు చేసిన పెళ్లిలు సైతం విడిపోతున్నాయి కదా.– భానుమతి, విద్యార్థినికుటుంబ జోక్యంతోనేపెద్దలు కుదిర్చిన, ప్రేమ పెళ్లి ఏదైనా దంపతుల మధ్య కుటుంబాల జోక్యంతో విడిపోతున్నాయి. చాలా వరకూ అమ్మాయి ఇంటి వద్ద పెరిగిన విధంగానే అత్తవారింట్లో ఉండాలని అనుకుంటారు. కాని అలా ఉండదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కావాలి. అబ్బాయిలు కూడా నమ్మి వచ్చిన వారిని మంచిగా చూసుకోవాలి. – సిరిచందన, విద్యార్థిని
ఫొటోలు
National View all
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Ranveer-Allahbadia123.jpg.webp?itok=WXCVdbZ3)
చాలా భయంగా ఉంది.. వివాదం తర్వాత ఏం జరిగిందంటే?: యూట్యూబర్
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/jayaliltha1.jpg.webp?itok=lrmUbBrQ)
జయలలిత ఆభరణాల్లో.. అద్భుతమైనవివే..!
చెన్నై:తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను బెంగళూరు కోర్టు తమ
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/devendrafadnavis.jpg.webp?itok=7OOjOsJH)
‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర కీలక నిర్ణయం
ముంబయి:‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీ
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/goamla1.jpg.webp?itok=TN3DW-Dw)
ఆటో డ్రైవర్ చెంపదెబ్బ..కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు:కర్ణాటక బెలగావిలో విషాదఘటన జరిగింది.
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Ranveer-Allahbadia1.jpg.webp?itok=vqjJgioc)
పరారీలో యూట్యూబర్ అల్హాబాదియా..!
ముంబయి:వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి ఆగ్రహాన్ని చవిచూసిన యూట్య
International View all
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/trump.jpg.webp?itok=g17uNEnk)
డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన.. ఏప్రిల్ 2 నుంచి అమలు!?
జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కీలక నిర్ణయాలను తీసుక
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/gold_Digging.jpg.webp?itok=daX4TgY9)
మీ వాటా బంగారం.. మూడు తులాలు!
పసిడి ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో అని భారంగానే నడుస్తోంది. అయితే..
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/sunitawilliams.jpg.webp?itok=lc1I14bz)
సునీత,విల్మోర్లకు ‘గ్రావిటీ’ భయం..!
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/hamas.jpg.webp?itok=5PFDLscE)
మెట్టుదిగిన హమాస్..మరో ముగ్గురు బందీల విడుదల
గాజా: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/population01.jpg.webp?itok=qTxMvpUI)
ముంచుకొస్తున్న జనాభా సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరుద్యోగం పెచ్చురిల్లుతోంది.
NRI View all
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Telugu-expats.jpg.webp?itok=IRSa2FZC)
ఇజ్రాయెల్లో తెలుగువారి ఇక్కట్లు
ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్కామ్ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్ (Israel)
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/TTA1.jpg.webp?itok=vu0K2RpY)
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దశాబ్ద వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) దశాబ్ద వేడుకలు డిసెంబర్లో జరగనున్నాయి.
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/NRI1.jpg.webp?itok=Ucp99Q7Z)
USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక
డల్లాస్: మాట (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) బోర్డు మీటిం
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Partner-Met-Indian-PM-Modi.jpg.webp?itok=IGc1aOY5)
ప్రధాని మోదీతో మస్క్-శివోన్ పిల్లల అల్లరి
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనలో
![title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/4144.jpg.webp?itok=w_1oUgpu)
సర్పంచ్గా పోటీ చేయాలని అమెరికా నుంచి వచ్చేశాడు..
చిన్నశంకరంపేట(మెదక్): అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు స
క్రైమ్
![married woman ends life in annamayya district](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/1414.jpg.webp?itok=0NxEnZAX)
అంకుల్ మా అమ్మను.. మా నాన్నే చంపాడు
కడప అర్బన్ : భర్తే కాలయముడిగా మారి భార్య తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన కడప నగరంలో సంచలనం కలిగించింది. మద్యం సేవించడానికి డబ్బులను ఇవ్వలేదనే నెపంతో జీవితాంతం తోడు నీడగా నిలిచి, పిల్లలకు మంచి తండ్రిగా చూసుకోవాల్సిన ఆ వ్యక్తి భార్యను కిరాతకంగా హత్య చేసిన సంఘటన హృదయవిదారకంగా మారింది. ఈ సంఘటన వారి ముగ్గురు పిల్లల జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టేసింది. కడప నగరంలోని టూటౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్ఐ ఎస్కెఎం హుసేన్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బెల్లమండివీధి, చిన్నమునిరావు వీధిలో గత నెల రోజులక్రిందట ఓ ఇంటిలో బాడుగకు పఠాన్ ఇమ్రాన్ఖాన్, అతని భార్య పఠాన్ జమీల (28) చేరారు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో షాహిదాఖానం(9), ఏజాజ్ఖాన్ (7), అలినాఖానం(5) ఉన్నారు. ఇమ్రాన్ఖాన్ ఎలక్ట్రిషన్ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్యతో తరచూ గొడవపడుతూ తాను మద్యం సేవించి వచ్చి మరింత తీవ్రస్థాయిలో భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం వరకు పనిచేసుకుని వచ్చిన ఇమ్రాన్ఖాన్ తన భార్యకు రూ. 1000 డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులో రూ. 500 దాచిపెట్టి, రూ.300 తన భర్తకు మద్యం సేవించేందుకు ఇచ్చింది. రూ. 200 కూరగాయలను తీసుకుని వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో తనకు మద్యం సేవించడానికి ఇంకా డబ్బులు కావాలంటూ భార్య జమీలతో భర్త వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో భార్య జమీల ఈనెల అద్దె డబ్బులను కట్టాలని, అదే కట్టకుండా డబ్బులను మద్యానికి ఇవ్వమని అంటున్నావా? అనీ అరిచింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తాను ఉపయోగించే ఎలక్రిషన్ కిట్లో ఉన్న సుత్తిని తీసుకుని ఆవేశంతో ఊగిపోతూ భార్య తలపై మూడు సార్లు దాడి చేశాడు. ఈ దెబ్బలకు రక్తపుమడుగులో అక్కడికక్కడే జమీల కుప్పకూలిపోయింది. తన తండ్రి తల్లిని సుత్తితో బాదిన విషయాన్ని గమనించిన పెద్దకుమార్తె షాహిదాఖానమ్ భయంతో తన బంధువుల ఇంటికి పరుగుతీసింది. వారికి చెప్పగానే జమీల బావ, అన్నదమ్ములు పరుగెత్తుకుంటూ వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు స్థానిక ప్రజల సాయంతో జమీలను ఆటోలో రిమ్స్కు తరలించారు. రిమ్స్ డాక్టర్లు ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కలా విచారించారు. తమ తల్లి దారుణంగా హత్యకు గురి కావడం, తన తండ్రే హత్య చేయడంతో ముగ్గురు పిల్లలు అనాథ«లుగా మారారు. వారి భవిష్యత్తు ఎలా వుంటుందోననీ స్థానికులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటనతో ఐదుగురు జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!
![married woman ends life in tamil nadu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/121.jpg.webp?itok=Ytpt3uxf)
భార్యను కాల్చి చంపిన భర్త
సేలం: తెన్కాశి సమీపంలో మదునాదపేరి కుళం ప్రాంతంలో ముళ్ల పొదలో ఓ మహిళ కాల్చి చంపిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. ఘటనా స్థలంలో అనేక మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రత్యేక బృందం పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా విచారణ జరిపారు. అందులో.. ముందు రోజు రాత్రి 9.30 గంటలకు సందేహాస్పదంగా ఒక కారు వెళ్లినట్లు తెలిసింది. ఆ కారు నెంబర్ ఆధారంగా జరిపిన విచారణలో... ఆ కారు శివకాశికి చెందిన ఒకరికి సొంతమైనది అని తెలిసింది. పోలీసుల విచారణలో శివకాశి భారతి నగర్కు చెందిన జాన్కిల్బర్ట్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను తన భార్యను కాల్చి చంపినట్టు తెలిసింది. వివరాలు.. జాన్కిల్బర్ట్ అదే ప్రాంతానికి చెందిన కమలి (30) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వేరు వేరు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రులను వ్యతిరేకించి జాన్కిల్బర్డ్ తన ప్రియురాలు కమలినినిపెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ స్థితిలో భార్య, భర్త మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈనెల 10వ తేదీ జరిగిన గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన జాన్కిల్బర్డ్ తన భార్య కమలిపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. తర్వాత తన సోదరుడి సహకారంతో ఆమె మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని శంకరన్కోవిల్, తిరువెంగడం మార్గంగా తెన్కాశికి తీసుకువచ్చి 110 కిలో మీటర్ల దూరం కారులో కమలి మృతదేహాన్నీ తీసుకువచ్చి ఇలదూర్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ముల్ల పొదల్లో కాల్చినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు జాన్కిల్బర్డ్తో పాటూ అతనికి సహకరించిన సోదరుడు తంగతిరుపతిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం రిమాండ్కు తరలించారు.
![IPS officer D Magesh Kumar suspended](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/5666.jpg.webp?itok=oTfPR2u-)
కీచక ఐపీఎస్: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు
సాక్షి, చెన్నై: చెన్నై ట్రాఫిక్ విభాగంలో ఐపీఎస్ అధికారి కీచకుడయ్యాడు. మహిళా పోలీసును లైంగికంగా వేధించడంతో ఆమె డీజీపీ శంకర్ జివ్వాల్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీఎస్ను సస్పెండ్ చేశారు. విశాఖ కమిటీ విచారణకు ఆదేశించారు. గతంలో మహిళా ఐపీఎస్కు డీజీపీ స్థాయి అధికారి ఒకరు వేధింపులు ఇవ్వడం, ఐజీ స్థాయి అధికారి తన సహచర అధికారిణికి వేధింపులు ఇవ్వడం వంటి ఘటనలు తమిళనాట పోలీసు యంత్రాంగంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక చోట కింది స్థాయి అధికారులపై వేధింపుల పిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో గురువారం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు ఒకరు డీజీపీ శంకర్ జివ్వాల్ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎదుర్కొంటున్న వేదింపు గురించి ఆయనకు వివరించారు. చెన్నై కమిషరేట్లో ఏడవ అంతస్తులో›ట్రాఫిక్ జాయింట్ కమిషననర్గా ఉన్న ఐపీఎస్ అధికారి డి. మహేశ్కుమార్ ఈ వేదింపులకు గురి చేసినట్టు ఫిర్యాదు చేయడం తక్షణం, విచారణ జరగడం జరిగింది. విచారణలో ఆయనపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో తక్షణం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఈ కేసును డీజీపీ సీమా అగర్వాల్, ఐపీఎస్ అధికారిణులతో కూడిన విశాఖ కమిటికి అప్పగించారు. ఈ కమిటీ తన విచారణపై దృష్టి పెట్టింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మహేశ్కుమార్పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.
![Afzal Gunj Robbery Gang Case Updates](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/2323.jpg.webp?itok=W6_6qoPo)
Hyderabad: ఆ ఇద్దరూ అమన్, అలోక్!
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్గంజ్లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు బీహార్లోని వైశాలీ జిల్లా, ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్గా తేలింది. వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. ఈ మేరకు లుక్ ఔట్ నోటీసులు రూపొందించి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు పంపారు. ఈ గ్యాంగ్లో మొత్తం నలుగురు ఉండే వారని, 2023లో ఉత్తరప్రదేశ్లో ఇదే తరహా నేరానికి పాల్పడినట్లు బీదర్ అధికారులు చెబుతున్నారు. మీర్జాపూర్లోనూ ఓ గార్డు హత్యఈ గ్యాంగ్ బైక్లపై తిరుగుతూ, పట్టణ శివార్లలో రెక్కీ చేసి, ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్గా చేసుకుంటోంది. అలోక్ కుమార్ నేతృత్వంలో సాగే ఈ ముఠాలో అమన్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్ని సభ్యులుగా ఉండేవారు. వీళ్లు 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో పంజా విసిరారు. రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్లి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. పట్టపగలు, నడిరోడ్డుపై సెక్యూరిటీ గార్డు జై సింగ్ను హత్య చేసి రూ.40 లక్షలు ఉన్న ట్రంకు పెట్టెతో ఉడాయించారు. ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా ఓ స్పెషల్ టాస్్కఫోర్స్ (ఎస్టీఎఫ్) ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ గ్యాంగ్లో ఒక్కొక్కరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించింది. ఎస్టీఎఫ్కు ఇద్దరు మాత్రమే చిక్కారు ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 30 మంది సిబ్బందితో ఏర్పాటైన ఈ ఎస్టీఎఫ్ దాదాపు ఏడాది పాటు దేశ వ్యాప్తంగా గాలించింది. ఎట్టకేలకు గత ఏడాదిసెపె్టంబర్లో చందన్ కుమార్ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలీలో పట్టుకుంది. అప్పట్లో అమన్, అలోక్లు వైశాలీ జిల్లాలోని మహిసౌర్ జనధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వేట ము మ్మరం చేయగా... ఇరువురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపై బీహార్లోనూ ఈ ద్వయం పలు నేరాలు చేసినట్లు తేలింది. చివరకు గత నెల 16న బీదర్లో పంజా విసిరింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగి గిరి వెంకటేష్ను చంపి, శివకుమార్ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించారు. నగరంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్లో ఉంచారు. రివార్డు ప్రకటించిన కర్ణాటక పోలీసులుఅఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్పూర్ వెళ్లేందుకు అమిత్కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అక్కడ జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్పై కాల్పులు జరపడం, పారిపోవడం జరిగిపోయాయి. ఈ హత్యాయత్నం ఘటనపై అఫ్జల్గంజ్ ఠాణాలోనూ కేసు నమోదైంది. ఈ దోపిడీ దొంగలు నగరం నుంచి కడప, నెల్లూరు మీదుగా చెన్నై వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై వీరి కదలికలు కనిపెట్టడం కష్టసాధ్యంగా మారింది. దీంతో వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. ఈ మేరకు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల్లో దుండగుల ఫొటోలను జత చేశారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు కలబురిగి డీఐజీ (9480800030) లేదా బీదర్ ఎస్పీ (9480803401) లేదా బీదర్ డీఎస్పీలకు (9480803420) సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సమాచారం ఇచి్చన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.