వైఎస్‌ జగన్‌‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన కేసీఆర్‌ | KCR invites AP CM YS Jagan for Inauguration of Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన కేసీఆర్‌

Published Mon, Jun 17 2019 3:46 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆ‍హ్వానించి, దగ్గరుండి లోనికి తీసుకు వెళ్లారు.  కేసీఆర్‌ ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జగన్‌ను ఆహ్వానించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ ఆహ్వాన పత్రిక అందచేశారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కలసి లంచ్‌ చేశారు. కేసీఆర్‌ వెంట కేటీఆర్, సంతోష్‌, వినోద్‌ కుమార్‌, పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement