నమ్ముకుంటే నట్టేట ముంచారు : రోజా | YSRCP MLA Roja Meets Chittoor Collecter | Sakshi
Sakshi News home page

నమ్ముకుంటే నట్టేట ముంచారు : రోజా

Oct 19 2018 8:09 PM | Updated on Mar 21 2024 10:47 AM

 టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం ప్రోటోకాల్‌ను పక్కదారి పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌.కే రోజా విమర్శించారు. ప్రజా ప్రతినిధిగా ముద్దుకృష్ణమ నాయుడి సతీమణి సరస్వతి ఉండగా ప్రభుత్వం కార్యక్రమాల్లో మాత్రం ఆమె కొడుకు పాల్గొంటున్నాడని రోజా ఆరోపించారు. భవిష్యత్తులో లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వస్తుందని దీనిపై స్థానిక కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాలోని వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆమె కల్టెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement