Top Stories
ప్రధాన వార్తలు

మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్గా భారత్ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్ కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్.ఇదంతా ఒకటైతే, అసలు ఆపరేషన్ సిందూర్తో పాటు పలు అంశాల్ని పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ విన్నపాన్ని మోదీ జీ త్వరగా పరిశీలిస్తారని అనుకుంటున్నానని, ఇలా చేయడం మంచిదని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండిపాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు.‘ మోదీ జీ.. మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించండి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను. కాల్పుల విరణమ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా తెలిపినట్లు మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.LoP Lok Sabha and LoP Rajya Sabha have just written to the PM requesting for a special session of Parliament to be convened immediately. Here are the letters pic.twitter.com/exL6H5aAQy— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2025

బ్రహ్మోస్ పనీతీరు ఎలా ఉంటుందో పాక్కు తెలుసు: సీఎం యోగి
లక్నో: భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) యూపీ (Uttarpradesh)లోని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ‘ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్’లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. రాజ్నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. ఈ యూనిట్కు 80 హెక్టార్ల భూమిని యూపీ సర్కార్ ఉచితంగా ఇచ్చింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు పోఖ్రాన్లో అణు పరీక్షలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. నేను లక్నో ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్ సిద్ధం చేసిన వారికి అభినందనలు. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్ యూనిట్ను పూర్తి చేశారు అని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చాం. కేవలం పాక్ సరిహద్దే కాదు, రావల్పిండిపైనా దాడి చేశాం. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి తెలియజేశాం. ఆపరేషన్ సిందూర్తో ప్రజలను ఎక్కడా టార్గెట్ చేయలేదు. ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్ సిందూర్తో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆలయాలు, గురుద్వారాలపై పాక్ సైన్యం దాడి చేస్తే.. మన సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. యూరి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత ప్రతీసారి మన శక్తిని ప్రపంచానికి చూపించాం’ అని అన్నారు. #WATCH | Defence Minister Rajnath Singh says, "At the inauguration of BrahMos Integration & Testing Facility Center today, I feel delighted to speak with you. I wanted to attend in person. But you know why I couldn't come. Looking at the situation we are facing, it was important… pic.twitter.com/rlRSOXXfQZ— ANI (@ANI) May 11, 2025అంతకుముందు.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణిని ఒకసారి చూసి ఉంటారు. పాకిస్తాన్పై బ్రహ్మోస్ను ప్రయోగించాం. బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్ను అడగండి. బ్రహ్మోస్ పనితీరును ప్రపంచమంతా చూసింది. ఉగ్రదాడి ఏదైనా యుద్ధంగానే పరిగణించాలి. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయనంత వరకు ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే, మనమందరం ప్రధాని మోదీ నాయకత్వంలో ఏకగ్రీవంగా పోరాడాలి. ఉగ్రవాదం ప్రేమ భాషను ఎప్పటికీ అంగీకరించదు. దానికి దాని స్వంత భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని అన్నారు.#WATCH | Lucknow | UP CM Yogi Adityanath says, "You must have seen a glimpse of the BrahMos missile during Operation Sindoor. If you didn't, then just ask the people of Pakistan about the power of the BrahMos missile. PM Narendra Modi has announced that any act of terrorism going… pic.twitter.com/lv2LzYNcXs— ANI (@ANI) May 11, 2025ఇక, ఇక్కడ.. ఏడాది నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్ యూనిట్ను డిజైన్ చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్, రష్యాల సంయుక్త వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్ క్షిపణి బరువు 1290 కిలోలు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణించగలదు.

సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చాలామందికి గోల్డ్ కొనుగోలు చేయడం, ఇకపై సాధ్యమేనా అనే అనుమానులు కూడా పుడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సీఈఆర్ఎన్)లోని భౌతిక శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ సాధించారు.CERN విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సీస కేంద్రకాల అధిక శక్తి.. ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాలుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. స్విట్జర్లాండ్లోని జెనీవా సమీపంలోని సీఈఆర్ఎన్ ప్రయోగశాలలో సీసాన్ని బంగారంగా మార్చారు.మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాల (సీసానికి 82, బంగారానికి 79) వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే అయినప్పటికీ.. కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాలలోని అయాన్లు అప్పుడప్పుడు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనకుండా ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుదయస్కాంత క్షేత్రం.. శక్తి పల్స్ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి మూడు ప్రోటాన్లను బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు'సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్' అని పిలువబడే మరొక సీఈఆర్ఎన్ యాక్సిలరేటర్.. 2002 నుంచి 2004 వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించిందని న్యూయార్క్లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త 'జియాంగ్యాంగ్ జియా' చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ప్రయోగాలు అధిక శక్తితో ఉన్నాయి. ఈ విధానంలో బంగారాన్ని మరింత ఎక్కువ సృష్టించవచ్చని ఆయన అన్నారు.ఈ పద్దతిలోనే మరింత గోల్డ్ ఉత్పత్తి చేస్తే.. బంగారం సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. ఇదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గిపోతాయి. అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చేస్తుంది.

ఇంగ్లండ్ టూర్కు ముందు టీమిండియాకు భారీ షాక్..!
ఐపీఎల్-2025 సీజన్ మధ్యలో నిలిచిపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్పై మళ్లింది. ఈ ఏడాది జూన్లో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ సిరీస్కు భారత జట్టును మే 23న బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.అదే రోజున భారత కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ విడ్కోలు పలకడంతో కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది. టీమిండియా టెస్టు కెప్టెన్గా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ ఎంపిక దాదాపు ఖాయమైంది. గిల్ ఇప్పటికే హెడ్ కోచ్ గౌతం గంభీర్, ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో సమావేశమయ్యాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్ సిరీస్కు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. షమీ వైట్బాల్ క్రికెట్లో ఆడుతున్నప్పటికీ, సుదీర్ఘ ఫార్మాట్లో ఆడేంత ఫిట్నెస్ ఇంకా సాధించలేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు షమీ దూరంగా ఉన్నాడు.ఆ తర్వాత ఇంగ్లండ్తో టీ20 సిరీస్తో పునరాగమనం చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో ఫర్వాలేదన్పించాడు. వికెట్లు పడగొట్టినప్పటికి అంత రిథమ్లో మాత్రం షమీ కన్పించలేదు. అదేవిధంగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న షమీ.. అక్కడ కూడా పూర్తిగా తేలిపోతున్నాడు. నెట్ ప్రాక్టీస్లో షమీ బాగా అలిసిపోతున్నాడని, తన రన్-అప్లను పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా చిన్న స్పెల్ల తర్వాత డగౌట్లకు తిరిగి వస్తున్నాడని, అందుకే ఇంగ్లండ్ టూర్కు అతడి ఎంపికయ్యేది అనుమానంగా మారిందని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. షమీ స్దానంలో ప్రసిద్ద్ కృష్ణను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది.చదవండి: IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?

ఆపరేషన్ సిందూర్పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ సంచలన ప్రకటన
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ ిసిందూర్ కొనసాగుతుందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఎయిర్ఫోర్స్ అధికారులు వివరాలను వెల్లడించనున్నారు. మాకు అప్పగించిన టార్గెట్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాం. విచక్షణ, వివేకంతో ఆపరేషన్ సిందూర్ కొనసాగించాం. ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్పై ఊహాగానాలు, ఫేక్ వార్తలు నమ్మవద్దు అని అధికారులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్-పాక్లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. #OperationSindoor | Indian Air Force tweets, "...Since the Operations are still ongoing, a detailed briefing will be conducted in due course. The IAF urges all to refrain from speculation and dissemination of unverified information." pic.twitter.com/tRSoEEZj8t— ANI (@ANI) May 11, 2025#WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025

Ind Vs Pak: ప్రధానితో ముగిసిన త్రివిధ దళాధిపతుల భేటీ
War Related Updates..3:10 PMప్రధానితో ముగిసిన త్రివిధ దళాధిపతుల భేటీసమావేశంలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్, జై శంకర్, సీడీఎస్కాల్పుల విరమణ ప్రకటన తర్వాత తాజా పరిస్థితులపై చర్చరేపు భారత్, పాక్ మధ్య కీలక చర్చలుకాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గింపుపై చర్చలు ఢిల్లీ..ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్పాకిస్తాన్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీసమావేశానికి హాజరైన ఎయిర్ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్ అమృత్సర్లో రెడ్ అలర్ట్ ఎత్తివేత.తాజా పరిణామాలపై ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశంకాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితులపై వివరణ ఢిల్లీ..భారత్, పాక్ సరిహద్దులలో సాధారణ పరిస్థితిఆగిపోయిన కాల్పులు, కనిపించని డ్రోన్లుకాల్పుల విరమణ అవగాహన అతిక్రమిస్తే పాక్దే బాధ్యత అని రాత్రే స్పష్టం చేసిన భారత్#WATCH | Rajasthan | Situation seems normal this morning in Barmer. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/lJOcUvMwY4— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Visuals this morning in Kupwara. After days of heavy shelling by Pakistan, situation seems normal today. No drones, firing or shelling was reported overnight. pic.twitter.com/3S2s8WFiVQ— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Situation seems normal this morning in Samba. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/QPOnrefFHw— ANI (@ANI) May 11, 2025అమృత్సర్లో రెడ్ అలర్ట్అమృత్సర్లో ఇంకా మోగుతున్న సైరన్లు.ప్రజలు ఎవరూ బయటకు రావద్దని డిప్యూటీ కమిషనర్ సూచన.ఇళల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ.నగరంలో విద్యుత్ సరఫరా పునరుద్దణ. 👉కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. విరమణ అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ మళ్లీ దాడులకు తెగబడింది. శనివారం రాత్రి జమ్ము కశ్మీర్తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.బ్లాకౌట్ ఎత్తివేత.. మళ్లీ విధింపు 👉కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్లో బ్లాకౌట్ను అధికారులు ఎత్తేశారు. ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానిని తిరిగి విధించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్లలో బ్లాకౌట్ను కొనసాగిస్తున్నారు. గుజరాత్లోని కచ్లోనూ డ్రోన్లు కనిపించాయి. కశ్మీర్లోని నగ్రోటా వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Srinagar(Visuals deferred by unspecified time) pic.twitter.com/XObqcbiQCe— ANI (@ANI) May 10, 2025👉కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లోని ఉధంపుర్, శ్రీనగర్లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్లో, శ్రీనగర్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.#WATCH | Punjab: A complete blackout has been enforced in Pathankot(Visuals deferred by an unspecified time) pic.twitter.com/z8ovHXi0sT— ANI (@ANI) May 10, 2025👉మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పుర్, రాజస్థాన్లోని జైసల్మేర్, బాడ్మేర్లలో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. కఠువాలో బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. పంజాబ్లోని మోగాలోనూ కరెంటు నిలిపివేశారు.గుజరాత్లోనూ డ్రోన్ దాడులు?👉గుజరాత్లోనూ డ్రోన్ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. కచ్ జిల్లాలో అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి బ్లాక్అవుట్ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని ‘ఎక్స్’ వేదికగా సూచించారు.#WATCH | Haryana: A complete blackout has been enforced in Ambala(Visuals deferred by an unspecified time) pic.twitter.com/nyGQK8Jet2— ANI (@ANI) May 10, 2025👉శ్రీనగర్లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. #WATCH | Gujarat | A complete blackout has been enforced in Bhuj in Kachchh(Visuals deferred by an unspecified time) pic.twitter.com/vBnYnoIkfm— ANI (@ANI) May 10, 2025

ఘోరం..లోయలో పడిన బస్సు.. 21 మంది ప్రయాణికులు దుర్మరణం
కొలంబో: శ్రీలంకలో (Sri Lanka) పెను విషాదం చోటు చేసుకుంది. కోట్మాలేలోని కరండీ ఎల్లా ప్రాంతం నుంచి 78 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారు. Over 20 people have been killed after a bus fell down a precipice in Kotmale in the Gerandi Ella area on Sunday.Deputy Minister of Transport Dr. Prasanna Gunasena said that at least 77 people were in the bus at the time of the accident.#Srilanka #lka #accident pic.twitter.com/8V6jEBKByD— Easwaran Christian Rutnam (@easwaranrutnam) May 11, 2025ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.మరోవైపు,పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించ వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడం, కోట్మాలే ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు సమాచారం. దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.

TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు.. ఒక్క క్లిక్తో చెక్ చేస్కోండిలా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు నేరుగా విద్యార్థుల మొబైల్కే వచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు.ఇంజనీరింగ్లో ఏపీకి చెందిన భరత్చంద్ర ఫస్ట్ ర్యాంక్, రామ్చరణ్రెడ్డి(రంగారెడ్డికి) సెకండ్ ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో మేడ్చల్కు చెందిన సాకేత్ ఫస్ట్ ర్యాంక్, లలిత్ వరేణ్య(కరీంనగర్) రెండో ర్యాంక్ సాధించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగిన ఎప్సెట్ అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది.. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది హాజరయ్యారు.విద్యార్థులు తమ ఎప్సెట్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో పొందవచ్చు. 👇👉TG EAPCET 2025 Results Direct Links👉TG EAPCET Engineering Resultshttps://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Engineering-Results-2025.html👉TG EAPCET Agriculture and Pharmacy Resultshttps://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Agriculture-pharmacy-Results-2025.html

భారత్, పాక్పై ట్రంప్ ఆసక్తికర కామెంట్స్.. ఈసారి కశ్మీర్ అంటూ..
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అమెరికా మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. అయితే, భారత్-పాక్ అంశంపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. ఈసారి కశ్మీర్ అంశం ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ట్రుత్తో స్పందిస్తూ..‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్తో కలిసి పనిచేస్తాం. కశ్మీర్పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెయ్యి సంవత్సరాల కశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అలాగే, భారత్, పాకిస్తాన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని రెండు దేశాలు కలిగి ఉన్నాయి. అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం రెండు దేశాలకు ఉందని కితాబిచ్చారు.యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది!. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉంది. ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - May 10, 2025, 11:48 PM ET )I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan for having the strength, wisdom, and fortitude to fully know and understand that it was time to stop… pic.twitter.com/RKDtlex2Yz— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) May 11, 2025ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్తాన్.. భారత్పై సైనిక చర్యకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్తో దాడికి తెగబడింది. భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది.

‘వేద’ మా అమ్మ పేరు.. ‘వేదాంత’ నా కంపెనీ పేరు..
వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ తన తల్లి స్ఫూర్తితో సాధారణ వ్యక్తి నుంచి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. బీహార్లోని పాట్నాలో జన్మించిన అగర్వాల్, కెరీర్ ఆరంభంలో విఫలమైనప్పుడు నిరాశకు గురయ్యారు. అప్పుడు అమ్మే అండగా నిలిచింది. గుండెల్లో ధైర్యం నింపింది. మాతృ దినోత్సవం సందర్భంగా ఈ తల్లీకొడుకుల అనుబంధం గురించి తెలిపేదే ఈ కథనం..విజయవంతమైన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభ రోజులు పరీక్షగానే ఉంటాయి. ఎవరు అవమానించినా, హేళన చేసినా ఈ పరీక్షలో వారికి తోడుగా నిలిచేది తల్లి మాత్రమే. అలాగే అనిల్ అగర్వాల్కూ అమ్మ అండగా నిలిచింది. విజయం వైపు నడిపించింది. “అనిల్.. ముందుకు సాగు.. తలుపులు తెరుచుకుంటాయి” అని తన తల్లి చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటారాయన.ఈ మాటలు ఆయనలో సంకల్పాన్ని నింపాయి. వేదాంతను స్థాపించి భారత జీడీపీలో 1.4% వాటా సాధించే సంస్థగా నిలిపారు.ప్రస్తుతం వేదాంత ఒక పెద్ద మార్పును చేస్తోంది. 83% ఆమోదంతో డీమెర్జర్కి క్రెడిటర్స్ ఆమోదం లభించింది. దీనివల్ల సంస్థ ఐదు స్వతంత్ర విభాగాలుగా విడిపోతుంది. సెప్టెంబర్ 2025 నాటికి ఎన్సీఎల్టీ ఆమోదంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అగర్వాల్ ఆశిస్తున్నారు. ఈ డీమెర్జర్ షేర్హోల్డర్ల విలువను పెంచి, రుణ భారాన్ని తగ్గిస్తుంది. గత ఐదేళ్లలో వేదాంతలో పెట్టుబడులు 4.7 రెట్ల రాబడిని ఇచ్చాయి.వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతపై కూడా అగర్వాల్ దృష్టి ఉంది. అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ ద్వారా నడిచే నంద్ఘర్ కార్యక్రమం బాల్య విద్యను ప్రోత్సహిస్తుంది. మదర్స్ డే సందర్భంగా, తల్లుల పాత్రను గౌరవిస్తూ తన తల్లి స్ఫూర్తిని తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నారు అనిల్ అగర్వాల్. ఈమేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు.‘మొదటిసారి, ‘మదర్స్ డే’ రోజున అమ్మ లేదు!అమ్మ అంటే కేవలం శరీరం మాత్రమే కాదు… ఆమె మీ ఉనికే. ఆమె శరీర రూపంలో మనతో లేకపోయినా, ఆమె ఆత్మ శ్వాస మనతోనే ఉంటుంది.కాలం, దేవుడి కృపగా మారి కన్నీళ్లను ఆరబెడుతుంది. అంతులేని బాధను సానుకూల శక్తిగా మార్చి మనకు బతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది.విచారం, కాలంతో పాటు శక్తిగా మారుతుంది, ఎందుకంటే మీ ప్రేమ నిజమైనది.ఉదయం లేచినప్పుడు ఏదో భక్తి గీతం, ఆలోచించకుండానే నోటిలోకి వచ్చినట్లు, అలాగే అమ్మ జ్ఞాపకం మనసులో వెలుగును నింపుతూ ఉంటుంది.ఖాదీ బట్టల వాసన లేదా అగరబత్తి సుగంధంలో తరచూ అమ్మ ఉనికిని అనుభవిస్తాను.మా అమ్మకు ఇంగ్లీష్ రాదు, కానీ లండన్లో ఉంటూ ఆమె ఇంగ్లీష్ వాళ్లతో చక్కగా సంభాషించేది. భావనల భాషకు పదాల అవసరం ఎప్పుడూ ఉండదు.పెద్ద నిర్ణయం తీసుకునే ప్రతిసారీ ఒక క్షణం ఆగిపోతాను. అమ్మ ఆశీర్వాదం కావాలన్నట్లు అనిపిస్తుంది.‘వేద’ నా అమ్మ పేరు.“వేదాంత” అక్కడి నుండే పుట్టింది.నా విజయం నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రసాదమే.అమ్మ జ్ఞాపకానికి ఒక నిర్దిష్టమైన రోజు అవసరం లేకపోయినా, ఇలాంటి ఒక రోజును నిర్ణయించడం నాకు చాలా సానుకూల ఆలోచనగా అనిపిస్తుంది. ప్రపంచమంతా ఒక మాటగా కలిసి ఈ రోజును అమ్మకు అంకితం చేస్తోంది. ఇది చాలా మంచి విషయం.‘మదర్స్ డే’ సందర్భంగా ప్రతి అమ్మకు నా నమస్కారం!’
ఇంటినే సాగరతీరంలా మార్చేద్దాం ఇలా..!
విజయ్ సేతుపతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్!
నోరూరించే టేస్టీ.. టేస్టీ.. స్వీట్స్ చేయండిలా..!
రోహిత్ శర్మ స్థానంలో యువ సంచలనం..? ఇక భారత్కు తిరుగులేదు?
లవ్ ఎంటర్టైనర్గా టాలీవుడ్ మూవీ.. టైటిల్ ఫిక్స్!
మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ
వేసవిలో మారే మనసు..!
సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?
వరస సినిమాలతో అలరిస్తున్న రాగ్ మయూర్
ఇంగ్లండ్ టూర్కు ముందు టీమిండియాకు భారీ షాక్..!
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
ఆపరేషన్ సిందూర్
తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
జమ్మూకశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
మృణాల్ ఠాకూర్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
ఇంటినే సాగరతీరంలా మార్చేద్దాం ఇలా..!
విజయ్ సేతుపతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్!
నోరూరించే టేస్టీ.. టేస్టీ.. స్వీట్స్ చేయండిలా..!
రోహిత్ శర్మ స్థానంలో యువ సంచలనం..? ఇక భారత్కు తిరుగులేదు?
లవ్ ఎంటర్టైనర్గా టాలీవుడ్ మూవీ.. టైటిల్ ఫిక్స్!
మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ
వేసవిలో మారే మనసు..!
సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?
వరస సినిమాలతో అలరిస్తున్న రాగ్ మయూర్
ఇంగ్లండ్ టూర్కు ముందు టీమిండియాకు భారీ షాక్..!
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
ఆపరేషన్ సిందూర్
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
జమ్మూకశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
ఐపీఎల్ వాయిదా?
మృణాల్ ఠాకూర్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
సినిమా

దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ
సినిమాలు ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ కొన్ని చూసినప్పుడు మాత్రం దానిలో ఎమోషన్ మనసుల్ని తాకుతుంది. మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాంటి చిత్రమే 'సత్యం సుందరం'. కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది రిలీజైంది. దీనికి '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకుడు.(ఇదీ చదవండి: సూర్యకు గిఫ్ట్ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్..)గతేడాది సినిమా వచ్చింది. కమర్షియల్ గా హిట్ కాలేదు గానీ చాలామంది ప్రేక్షకులకు మాత్రం సినిమా నచ్చింది. సరే ఇప్పుడు ఈ విషయం ఎందుకా అంటారా? దర్శకుడు ప్రేమ్ కుమార్ కి ఇప్పుడు సూర్య-కార్తీ మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. ఎందుకంటే ప్రేమ్ చాన్నాళ్ల నుంచి ఈ కారు కొనుక్కుందామని అనుకుంటుండగా.. ఇప్పుడు సూర్య-కార్తీ ఇతడి కల నెరవేర్చారు. ప్రేమ్ కుమార్ ఇన్ స్టా పోస్ట్ చూస్తే ఇది అర్థమైపోయింది.'మహీంద్ర థార్ నా డ్రీమ్ కారు. కొన్ని కారణాల వల్ల 5 డోర్స్ వెర్షన్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్రత్యేకంగా డిజైన్ చేసిన థార్ ఆర్ఓఎక్స్ఎక్స్ ఏఎక్స్ 5ఎల్ 4x4 మోడల్ లో వైట్ కలర్ కారు కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులున్నా సరే కారు రావడానికి చాలారోజులు పట్టేస్తుంది. దీంతో రాజా సర్ సాయం అడిగా''ఒకానొక సందర్భంలో కారు కొనడం కంటే అవసరాలు ఎక్కువైపోయాయి. దీంతో కారు కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చుయిపోయాయి. కల చెదిరిపోయింది. ఇదంతా రాజా సార్ కి చెప్తే సైలెంట్ గా ఉండిపోయారు. కానీ నిన్న సూర్య అన్న నుంచి కారు ఫొటో మెసేజ్ వచ్చింది. నేను ఫస్ట్ షాకయ్యాను. వెంటనే రాజా సర్ కి ఫోన్ చేసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెబితే.. ఆయన నవ్వి, ప్రేమ్ ఇది నీకు సూర్య సర్ ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. దీంతో నాకు మాట రాలేదు. సూర్య సర్ ఇంటికి వెళ్లి కార్తీ అన్న చేతుల మీదుగా కారు అందుకున్నాను''ఇదంతా ఇంకా కలలానే అనిపిస్తుంది. నేను దీన్ని బహుమతిలా చూడటం లేదు. నేను దీన్ని అన్నయ్యలు తమ్ముడికి నెరవేర్చిన కలలా భావిస్తున్నాను. థ్యాంక్స్ సూర్య అన్న, థ్యాంక్స్ కార్తీ బ్రదర్, థ్యాంక్స్ రాజా సర్' అని ప్రేమ్ కుమార్ రాసుకొచ్చాడు. మార్కెట్ లో ప్రస్తుతం ఈ కారు ధర రూ.25 లక్షల వరకు ఉంది. ఇకపోతే ప్రేమ్ కుమార్ ఇప్పుడు '96' సీక్వెల్ స్క్రిప్ట్ రాస్తూ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య) View this post on Instagram A post shared by Premkumar Chandran (@prem_storytelling)

'మాతృదేవోభవ'తో కన్నీళ్లు పెట్టించిన మాధవి ఏం చేస్తుందో తెలుసా..?
‘మాతృదేవోభవ’ 1993లో వచ్చిన మేటి చిత్రాల్లో బ్లాక్బస్టర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ మాధవి నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఆ పాత్రకు ఆమె కనెక్ట్ అయ్యారు. ఆమె భర్తగా నాజర్ చాలా కీలకమైన భూమిక పోషించారు. అయితే నేడు ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్తో తెరకెక్కిన కొన్ని సినిమాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నటి మాధవి ప్రస్తుతం ఎలా ఉందొ చూడండి అంటూ కొన్ని ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.80,90లో తన అందం, అభిమనయంతో ఆకట్టుకున్న నటి మాధవి చాలా ఏళ్ల క్రితమే వెండతెరకు దూరమయ్యారు. అందంలో జయసుధ, జయప్రద వంటి హీరోయిన్స్కి పోటినిచ్చిన ఆమె ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫొటోలు చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. తన తెనె కళ్లతో మాయ చేసిన ఆమె ఇంతలా మారిపోయారేంటంటూ సర్ప్రైజ్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మెప్పించిన మాధవి దాదాపు 300 సినిమాల వరకు చేశారు. చిరంజీవి ‘ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైది వంటి సినిమాల్లో ఆమె చిరంజీవికి జోడికట్టారు.చెప్పాలంటే అప్పట్లో చిరు-మాధవి పెయిర్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. ఇక మాధవి గ్లామర్, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యం తన కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అందులో లేడి ఫ్యాన్స్ కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. ఇక ఆమె కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ‘మాతృదేవోభవ’. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్ ఇప్పటికి ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది.ముఖ్యం ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అలా నటిగా కెరీర్ పీక్లో ఉండగానే మాధవి సడెన్గా వెండితెరకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన బిజినెస్ మెన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిలైపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలు ఎదగడంతో భర్తకు సాయంగా బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటున్న మాధవి తరచూ ఇన్స్టాగ్రామ్లో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లెటెస్ట్ ఫొటోలు చూసి నెట్టింట వైరల్గా మారాయి.'మాతృదేవోభవ'ను వదులుకున్న జీవితమాతృదేవోభవ సినిమాలో నటించాలని మొదట సీనియర్ నటి జీవితా రాజశేఖర్కు చిత్రయూనిట్ సంప్రదించింది. అయితే, ఆమెకు అప్పటికే పెళ్లి కావడంతో గృహిణిగా ఉండాలని నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆమె సున్నితంగా కాదని చెప్పారు. దీంతో ఆ పాత్ర మాధవి చేసింది. తర్వాత సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆమె బాధపడలేదు. భర్త, పిల్లలే తన ప్రపంచం అంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 1990లో 'మగాడు'లో ఆమె చివరిసారిగా నటించారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత ఇటీవల ‘లాల్ సలాం’లో కనిపించారు.

'అమ్మ' ప్రేమను ప్రతిబింబించే ఈ సినిమాలను చూశారా..?
నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా.. విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై లుక్కేద్దాం.మాతృదేవోభవ(1993)- యూట్యూబ్అమ్మ ప్రేమను చక్కగా చూపిన సినిమాల్లో మాతృదేవోభవ ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. 1993లో వచ్చిన ఈ మూవీలో నాజర్, మాధవి ప్రధాన పాత్రల్లో కె. అజయ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టకుండా ఎవరూ బయటకు రాలేదు. అంతలా ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరైంది. భర్తను కోల్పోయి, క్యాన్సర్ బారిన పడిన మహిళ తన పిల్లల భవిష్యత్తు కోసం పడిన ఆరాటమే ఈ సినిమా కథ.అమ్మ రాజీనామా (1991) - యూట్యూబ్దాసరి నారాయణరావు తెరకెక్కించిన 'అమ్మ రాజీనామా' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తల్లిగా శారద నటనను చూసిన ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. ఈ సినిమాను దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించారు. కుటుంబం కోసం తల్లి చేసే త్యాగాన్ని చూపే ఈ చిత్రానికి ప్రత్యేకస్థానం ఉంది. 2001లో ఈ సినిమా కన్నడలో 'అమ్మ' పేరుతో పునర్నిర్మించారు. ఇందులో లక్ష్మి ప్రధాన పాత్ర పోషించింది.ఒకే ఒక జీవితం(2022)- సోనీలివ్శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్కి మదర్ సెంటిమెంట్ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్ని ఆసక్తికరంగా చూపించాడు.'బిచ్చగాడు'(2016)- సన్ నెక్స్ట్తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)- ఆహా, అమెజాన్2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.నిజం(2003 )- జీ5కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్లో అందుబాటులో ఉంది. వీటితో పాటుఅమ్మ చెప్పింది (2006)- నెట్ఫ్లిక్స్2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.ప్రభాస్ 'ఛత్రపతి'(2005)- జియోహాట్స్టార్, అమెజాన్రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)- సన్ నెక్స్ట్2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ని ఎమోషనల్గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.సింహరాశి- యూట్యూబ్2001లో విడుదలైన 'సింహరాశి' అమ్మ ప్రేమకోసం తపించే కుమారుడి పాత్రలో రాజశేఖర్ నటించారు. ఆయన కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా కోసం మొదట బాలకృష్ణను సంప్రదించారు. కానీ ఆయన దానిని తిరస్కరించడంతో రాజశేఖర్తో దర్శకులు వి. సముద్ర తెరకెక్కించారు. ఆర్బి చౌదరి నిర్మించారు. ఇది తమిళ చిత్రం మాయికి రీమేక్ అని తెలిసిందే.అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్, చిరుత, అమ్మ రాజీనామా, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్ సెంటిమెంట్తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి.

రెండోరోజు భారీగా పెరిగిన 'సింగిల్' కలెక్షన్స్
ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే చిత్రంగా బాక్సాఫీస్ వద్ద ‘సింగిల్’ సినిమా దుమ్మురేపుతుంది. శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రెండోరోజు కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ఇందులో శ్రీవిష్ణు (Sree Vishnu)తో కేతిక శర్మ, ఇవానా నటించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు వన్లైన్ పంచ్లతో పాటు వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. మొదటిరోజు మంచి టాక్ రావడంతో రెండోరోజు భారీగా కలెక్షన్స్ పెరిగాయి. డే1 రూ. 4.15 కోట్లు రాగా, రెండోరోజు రూ. 7.05 కోట్లు వచ్చాయి. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో మరో భారీ హిట్గా ఈ చిత్రం నిలిచింది. సింగిల్ సినిమా కథ, స్క్రీన్ప్లే ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుందని నెటిజన్లు కామెంట్ల రూపంలో చెబుతున్నారు.సామజవరగమన, ఓం భీమ్ బుష్ వరుస హిట్లు అందుకున్న శ్రీవిష్ణు శ్వాగ్ (Swag) సినిమాతో కాస్త నిరుత్సాహపరిచాడు. అయితే, ఇప్పుడు సింగిల్ సినిమాతో దుమ్మురేపాడని చెప్పొచ్చు. మూడు జనరేషన్ల మైండ్సెట్లను వినోదాత్మకంగా తెరపై చూపించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సినిమాలు ఏవీ లేవు. ఇది సింగిల్ సినిమాకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. దీంతో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతభాగం భారత సైనికులకు విరాళంగా ఇస్తామని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
న్యూస్ పాడ్కాస్ట్

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం
క్రీడలు

IND vs ENG: టీమిండియా కెప్టెన్గా గిల్.. వైస్ కెప్టెన్గా అతడే!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమిండియా కొత్త కెప్టెన్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నిష్క్రమణ నేపథ్యంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. అతడికి డిప్యూటీగా మరో యువ ఆటగాడినే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈసారి కనీసం ఫైనల్ చేరకుండానేగతేడాది టెస్టుల్లో పరాభవాల పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2025 ఫైనల్కు దూరమైన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్కు అడుగుదూరంలో నిలిచిపోయిన భారత్.. ఈసారి ఆలోటు తీర్చుకుంటుందనుకుంటే ఇలా మొత్తానికే మోసం వచ్చింది.స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టుల్లో 3-0తో వైట్వాష్ కావడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)-2025లో 3-1తో ఓడటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమైన రోహిత్ శర్మ బుధవారమే సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు.విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే!ఈ క్రమంలో మరో సీనియర్ బ్యాటర్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే నడుస్తాడనే వార్తలు వినిపించాయి. కోహ్లి ఇంగ్లండ్తో సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నా.. బోర్డు అందుకు సమ్మతించలేదని.. అందుకే అతడు ఈ మేర తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి.వైస్ కెప్టెన్గా పంత్డబ్ల్యూటీసీ 2025-27 కొత్త సీజన్లో యువ రక్తంతో నిండిన జట్టును ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనే యోచనలో ఉన్న బోర్డు.. కోహ్లికి నో చెప్పిందన్నది వాటి సారాంశం. తాజా సమాచారం ప్రకారం.. శుబ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే ఆఖరి వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గిల్ కంటే పంత్ సీనియర్. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై సమర్థవంతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది.అయితే, ఇటీవల ఆసీస్ పర్యటనలో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. షాట్ల ఎంపిక విషయంలో పదే పదే తప్పులు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ఇలాంటి తరుణంలో గిల్ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం.. అతడి చుట్టూ భవిష్యత్ జట్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించే పంత్పై అదనపు భారం మోపకుండా.. బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి పెట్టేలా బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుంది. చదవండి: SRH: బ్యాటర్ల వైఫల్యం... బౌలర్ల నిస్సహాయత

కుక్క తోక వంకరే!.. నీచ బుద్ధిని మరోసారి చాటుకుంది..
పాకిస్తాన్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటరుల వీరేందర్ సెహ్వాగ్, శిఖర్ ధావన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం కుదిరిన కాసేపటికే దాయాది మరోసారి తమ నీచ బుద్ధిని బయటపెట్టుకుందని మండిపడ్డారు. కుక్క తోక వంకర అనే సామెత వీరికి సరిగ్గా సరిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆపరేషర్ సిందూర్కాగా పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్లో ముష్కరులు మరోసారి కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశాంతమైన బైసరన్ లోయలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. పురుషులే లక్ష్యంగా కాల్పులకు తెగబడి ఆడబిడ్డల నుదిటి సిందూరం చెరిగిపోయేలా పాశవిక దాడికి పాల్పడ్డారు.ఇందుకు ఆపరేషర్ సిందూర్ పేరిట భారత్ గట్టి బదులిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన దాడులను సహించలేకపోయిన పాకిస్తాన్ సైన్యం.. రంగంలోకి దిగింది.సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడటంతో పాటు సామాన్యులు, భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయగా.. భారత సైన్యం ఇందుకు దీటుగా బదులిచ్చింది. పాక్ పప్పులు ఉడకనీయకుండా గాల్లోనే డ్రోన్లు, క్షిపణులను పేల్చివేసింది. అంతేకాదు కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ల నుంచి తమను టార్గెట్ చేసిన వారికి బుద్ధి వచ్చేలా విజయవంతంగా ఎదురుదాడులు చేసింది.కాళ్ల బేరానికి వచ్చి.. ఆపై మరోసారిఈ నేపథ్యంలో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ భారత్ను కోరింది. అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించి.. భారత్ను ఒప్పించింది. ఈ క్రమంలో శాంతి సాధన లక్ష్యంగా భారత్ ఇందుకు అంగీకరించింది. అయితే, విరమణ ఒప్పందం జరిగిన కాసేపటికే పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది.కుక్క తోక ఎప్పటికీ వంకరేసరిహద్దుల వెంట దాడులకు దిగింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్ వంటి తదితర చోట్ల డ్రోన్లతో దాడికి దిగగా.. భారత్ వాటిని తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరును ఉద్దేశించి.. ‘‘కుక్క తోక ఎప్పటికీ వంకరే’’ అన్నట్లు బుద్ధులు ఎక్కడకు పోతాయి అన్న అర్థంలో వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుందిఅయితే, ఇందుకు పాక్ నెటిజన్లు వీరూ భాయ్ను అసభ్యకరరీతిలో ట్రోల్ చేస్తుండగా.. భారతీయ నెటిజన్లు వారికి చురకలు అంటిస్తున్నారు. మరోవైపు.. శిఖర్ ధావన్ స్పందిస్తూ.. ‘‘తుచ్చమైన బుద్ధి గల దేశం.. తన తుచ్చమైన చేష్టలను మరోసారి ప్రపంచానికి చూపిస్తోంది’’ అంటూ పాక్ తన నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుంది అన్న అర్థంలో ఘాటుగా వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పరిస్థితులు అనుకూలిస్తే షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆదివారం జరిగే సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఐపీఎల్ హర్యాన్వీ కామెంటేటర్గా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. స్వింగ్ కింగ్కు పిలుపు? భారత జట్టు ఇదే?

BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (VIrat Kohli) రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లిని మరికొన్నాళ్లు టెస్టుల్లో కొనసాగేలా ఒప్పించేందుకు.. భారత క్రికెట్లో అత్యంత అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తిని రంగంలోకి దించినట్లు సమాచారం.ప్రకటన చేయకపోయినా...కాగా టీమిండియా కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు గుడ్బై చెప్పిన మూడు రోజుల్లోపే భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే మరో వార్త శనివారం వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాడు, జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లి కూడా టెస్టులనుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్లు దాని సారాంశం. ఈ ‘రన్మెషీన్’ అధికారికంగా తన రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయకపోయినా... తాను టెస్టులనుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు బోర్డుకు అతడు సమాచారం అందించాడు.కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!ఇంగ్లండ్తో కీలకమైన సిరీస్ కోసం త్వరలోనే జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో.. దానికంటే ముందే తన మనసులో మాటను కోహ్లి బీసీసీఐకి తన నిర్ణయం గురించి తెలియజేశాడు. అయితే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటన చేయకుండా బీసీసీఐ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రోహిత్ రిటైర్ కాగా, శుబ్మన్ గిల్ జట్టు కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లాంటి పటిష్ట జట్టుతో సమరంలో జట్టులో అనుభవలేమి సమస్య కావచ్చు. అందుకే కనీసం ఈ సిరీస్ వరకైనా కోహ్లి జట్టులో కొనసాగాలని బోర్డు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్లో అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి ఒకరితో కోహ్లిని ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది.అతడితో మాట్లాడిన తర్వాతే కోహ్లి తన టెస్టు రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన చేయవచ్చు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మతో పాటు కోహ్లి కూడా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకొన్నాడు. అయితే, వన్డేల్లో మాత్రం రోహిత్తో పాటే అతడు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.టెస్టు క్రికెట్లోనూ ప్రత్యేక స్థానంకాగా విరాట్ కోహ్లి వన్డే రికార్డులు చాలా గొప్పగా, ఘనంగా ఉన్నాయి. అందరి దృష్టిలో అతడు గొప్ప వన్డే ఆటగాడే అయినప్పటికీ.. టెస్టు క్రికెట్లో తనకంటూ కోహ్లి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలతో కాకుండా ఈతరం క్రికెటర్లలో టెస్టులను బతికించేందుకు సిద్ధపడిన ఏకైక బ్యాటర్గా గుర్తింపు పొందాడు.సంప్రదాయ ఫార్మాట్కు ఒక ‘దిక్సూచి’లా నిలబడి పునరుత్తేజం నింపేందుకు కోహ్లి ప్రయత్నించాడు. టెస్టుల్లో గతంలో కనిపించని దూకుడు, వ్యూహాలతో అత్యుత్తమ కెప్టెన్గా జట్టును నడిపించాడు. అయితే టెస్టుల్లో అతడి బ్యాటింగ్ ప్రదర్శన ఇటీవల అంత గొప్పగా లేదు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆస్ట్రేలియాపై పెర్త్లో కోహ్లి సెంచరీ చేశాడు. అయితే సిరీస్లోని మిగతా టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు.గత రెండేళ్లలో కోహ్లి సగటు 32.56 మాత్రమే. ఇదే ఫామ్తో ఇంగ్లండ్కు వెళితే కోహ్లి ఎంత బాగా ఆడతాడనేది సందేహమే. పైగా రోహిత్ కూడా లేకపోవడంతో అందరి దృష్టీ తనపైనే ఉండటంతో తీవ్ర ఒత్తిడి ఖాయం. జట్టు సంధి దశలో తానూ తప్పుకుంటే మెరుగని కోహ్లి ఆలోచిస్తుండవచ్చు.ఇక కెరీర్లో 123 టెస్టులు ఆడిన కోహ్లి 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరో 770 పరుగులు చేస్తే అతను 10 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. చదవండి: Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!

SRH: బ్యాటర్ల వైఫల్యం... బౌలర్ల నిస్సహాయత
ఐపీఎల్లో గత ఏడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్... ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్పై సునామీలా విరుచుకుపడింది. 20 ఓవర్లలో 286 పరుగులతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతూ... గత సీజన్ జోరును కొనసాగించింది. ఇప్పటికే హిట్టర్లతో బలంగా ఉన్న రైజర్స్కు ప్యాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తోడవడంతో... ఆ దూకుడు మరింత పెరిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ అనికేత్ వర్మ ఇలా ఒకటి నుంచి ఏడో స్థానం వరకు అందరూ దంచే వాళ్లే ఉండటంతో... ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ కప్పు కొట్టడం ఖాయమనే అంచనాలు పెరిగిపోయాయి!అయితే వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైన సన్రైజర్స్ అంతకంతకూ నాసిరకమైన ఆటతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడటం ప్రారంభించింది. తొలి పోరు అనంతరం ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం ఒక్కదాంట్లోనే గెలిచి... ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది. భారీ ఆశలు పెట్టుకున్న హిట్టర్లు ఘోరంగా విఫలమవగా... కెప్టెన్ కమిన్స్ సహా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గని జట్లు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తుంటే... మాజీ చాంపియన్ రైజర్స్ మాత్రం తిరోగమనం బాటపట్టింది. ఈ సీజన్లో రైజర్స్ వైఫల్యానికి కారణాలు పరిశీలిస్తే...–సాక్షి, క్రీడావిభాగం‘మా ఆటగాళ్లు మంచి టచ్లో ఉన్నారు. వాళ్లకు బౌలింగ్ చేయాలంటే నాకే భయంగా ఉంది. బంతి మీద ఏమాత్రం దయ లేకుండా విరుచుకుపడుతున్నారు. నెట్స్లో వాళ్లకు బంతులేయడం కూడా కష్టమే’... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ తొలి మ్యాచ్ ఆడిన అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెపె్టన్ కమిన్స్ అన్న మాటలివి. అప్పటికే ‘300 లోడింగ్’ అనే మాట విస్తృత ప్రచారం కాగా... రైజర్స్ జోరు చూస్తే అదేమంత కష్టం కాదనిపించింది. క్రీజులోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు ధనాధన్ బాదుడే లక్ష్యంగా దూసుకెళ్తుంటే ఆరెంజ్ ఆర్మీ చరిత్ర సృష్టించడం ఖాయమనిపించింది. మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఆడిన తొలి మ్యాచ్లో రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ముంబై నుంచి రైజర్స్ గూటికి చేరిన ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 106; 11 ఫోర్లు, 6 సిక్స్లు) తొలి పోరులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. హెడ్ హాఫ్ సెంచరీ బాదగా... టాప్–5 ఆటగాళ్లంతా 200 పైచిలుకు స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టారు. ఛేదనలో రాయల్స్ పోరాడినా రైజర్స్ సునాయాసంగా గెలుపొందింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ హాట్ ఫేవరెట్గా మారిపోయింది. నిలకడ కొనసాగించలేక... ఉప్పల్ వేదికగానే జరిగిన రెండో మ్యాచ్లో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్పై రికార్డు విజయం సాధించిన రైజర్స్... ఈ సారి 190 పరుగులు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. అయినా ఒక్క ఓటమే కదా అని అభిమానులు పెద్దగా ఆలోచించలేదు. విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మూడో పోరులో మనవాళ్ల డొల్లతనం బయట పడింది. హిట్టర్లంతా విఫలమవడంతో ఒక దశలో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కొత్త కుర్రాడు అనికేత్ సిక్సర్లతో రెచ్చిపోవడంతో కాస్త పరువు నిలబెట్టుకున్నా... మ్యాచ్లో మాత్రం పరాజయం తప్పలేదు. ఇక కోల్కతాతో పోరులో అయితే 201 పరుగుల లక్ష్యఛేదనలో 16.4 ఓవర్లలో 120 పరుగులకే జట్టు ఆలౌటైంది. ఒక్కరంటే ఒక్కరూ కాస్త పోరాడే ప్రయత్నం చేయలేదు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ గుజరాత్ చేతిలోనూ చెత్తగా ఓడింది. దీంతో పెంచుకున్న ఆశలన్నీ పేకమేడలా కూలిపోగా... వాస్తవ పరిస్థితి అభిమానులకు సైతం అర్థం అయింది. అభిషేక్ సెంచరీతో ఊపు... జట్టంతా నిరాశలో కూరుకుపోయిన దశలో అభిషేక్ శర్మ తిరిగి ఆరెంజ్ ఆర్మీలో జవసత్వాలు నింపాడు. ఇక ముందంజ వేయడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఉప్పల్ వేదికగా పంజాబ్తో జరిగిన పోరులో అభి ‘షేక్’ ఆడించాడు. మొదట పంజాబ్ 245 పరుగులు చేయగా... భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్ అదరక బెదరక ఎదురు నిలిచింది. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 55 బంతుల్లోనే 141 పరుగులతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. సెంచరీ అనంతరం అతడు జేబులో నుంచి ఓ కాగితం తీసి చూపడం హైలైట్గా నిలిచింది. ‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’ అనే ఆ అక్షరాలతో ఒక్కసారిగా జట్టులో నూతనోత్తేజం కనిపించింది. అభిషేక్తో పాటు హెడ్ కూడా ధడధడ లాడించడంతో సన్రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే కొండంత లక్ష్యాన్ని ఛేదించింది. సమస్యలన్నీ తీరినట్లే... తిరిగి విజయాల బాటపడతాం అని కెపె్టన్ విశ్వాసం వ్యక్తం చేయగా... ఇదే దూకుడు కొనసాగించాలని అభిమానులు ఆశించారు. మళ్లీ అదే తీరు... పంజాబ్పై గెలుపుతో వచ్చిన ఉత్సాహాన్ని రైజర్స్ కొనసాగించలేకపోయింది. తదుపరి ముంబైతో వరుసగా జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ రైజర్స్ పరాజయం పాలైంది. వాంఖడేలో ఓ మాదిరి పోరాటం అయినా కనబర్చిన కమిన్స్ సేన... ఉప్పల్లో అయితే అప్పనంగా మ్యాచ్ను ప్రత్యర్థి చేతుల్లో పెట్టింది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శన చేస్తున్న చెన్నైపై గెలిచిన హైదరాబాద్... గుజరాత్ చేతిలో రెండో సారి కూడా ఓడింది. ఉప్పల్లో ఢిల్లీతో మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు కావడంతో రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు కాగా... ఇక మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. గతేడాది భారీ హిట్టింగ్తో అదరి దృష్టి ఆకర్శించిన రైజర్స్... వేలంలోనే అనేక తప్పులు చేసింది. సుదీర్ఘకాలంగా ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్ కుమార్ వంటి తెలివైన బౌలర్తో పాటు... యార్కర్ కింగ్ నటరాజన్ను వదిలేసుకున్న హైదరాబాద్ జట్టు... భారీ ధరపెట్టి టీమిండియా పేసర్లు మొహమ్మద్ షమీ, హర్శల్ పటేల్ను కొనుగోలు చేసుకుంది. వీరిద్దరూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం జట్టుకు భారం కాగా... కమిన్స్, హెడ్, క్లాసెన్ కాకుండా... నాణ్యమైన నాలుగో విదేశీ ప్లేయర్ కూడా అందుబాటులో లేకపోవడం ఫలితాలపై పడింది. పదే పదే అవే తప్పులు...భారీ షాట్లు ఆడటమే తమ లక్ష్యం అన్నట్లు ఆడుతున్న సన్రైజర్స్ ప్లేయర్లు ప్రాథమిక సూత్రాలను సైతం మరుస్తున్నారు అనేది సుస్పష్టం. జట్టు పరిస్థితి స్కోరుబోర్డుపై గణాంకాలు చూసి షాట్ల ఎంపిక అనేది ఆటలో ప్రాథమిక నియమం. కానీ ఈ సీజన్లో రైజర్స్ ఓడిన మ్యాచ్లను పరిశీలిస్తే... వారు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్థం అవుతోంది. ఢిల్లీతో మ్యాచ్లో 20 పరుగులకే 2 ప్రధాన వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి రెండో బంతికే ఓ పేలవ షాట్ ఆడి వెనుదిరిగాడు.ఏమాత్రం ఆసక్తి లేనట్టు నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి బంతిని అందించి పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు... చాలా సార్లు ఇదే తరహా ఆటతీరు కనిపించింది. కోల్కతాతో పోరులో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో కాస్త సంయమనం చూపిన మిడిలార్డర్... దాన్ని ఎక్కువసేపు కొనసాగించలేక పోయింది. ఈ కోవలో ఒకటా రెండో ఎన్నో ఉదాహరణలు. ప్రయతి్నంచి విఫలం కావడం ఒక తీరు అయితే... ప్రతీసారి ఒకే విధంగా విఫలం కావడం మరో తీరు. ఈ సీజన్లో రైజర్స్ రెండో దాన్నే కొనసాగించింది. పదే పదే చెత్త షాట్ సెలెక్షన్తో మూల్యం చెల్లించుకుంది. రైజర్స్ తరఫున అరంగేట్ర మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోగా... గత సీజన్లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి... ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ఈ యువ ఆల్రౌండర్... ధాటిగా ఆడాలనే తపనలో బంతిని నేల మీద నుంచి కొట్టడమే మరిచినట్లు పదే పదే గాల్లోకి షాట్లు ఆడి ఔటయ్యాడు. దీంతో అతడికి తుది జట్టులో స్థానం కూడా గగనం కాగా... అభిషేక్ అప్పుడప్పుడు తప్ప నిలకడ లేని ఆటగాడు అనే ముద్ర వేసుకున్నాడు. హెడ్, క్లాసెన్ రాణించినా... వారు కూడా ప్రతీ మ్యాచ్లోనూ సత్తాచాటకపోవడంతో రైజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక బౌలింగ్ వైఫల్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ సీజన్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన వారిలో రైజర్స్ బౌలర్లు ముందు వరుసలో నిలుస్తారు. షమీ, కమిన్స్, హర్షల్ పటేల్, ఉనాద్కట్, సిమర్జీత్ సింగ్ ఇలా ఒకరిని మించి ఒకరు పరుగులు ఇచ్చుకోవడంలో పోటీ పడ్డారు. దీంతో వికెట్లు పడగొట్టడం పక్కన పెడితే... కనీసం ప్రత్యర్థులపై ఒత్తిడి కూడా పెంచలేకపోయారు. కెప్టెన్ కమిన్స్ సైతం భారీగా పరుగులు ఇచ్చుకుంటుండగా... మిగిలిన జట్ల మాదిరిగా ఓ ప్రధాన స్పిన్నర్ లేకపోవడం రైజర్స్ను దెబ్బకొట్టింది. మరి ఇక ఈ సీజన్లో మిగిలిన మూడు మ్యాచ్ల్లో అయినా రైజర్స్ ఈ తప్పిదాలను సరిదిద్దుకొని సమష్టిగా కదంతొక్కితే కాస్త పరువైనా నిలుస్తుంది. లేదంటే గత ఏడాది పట్టికలో పై నుంచి రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్... ఈసారి కింది నుంచి రెండో స్థానంలో నిలవాల్సి ఉంటుంది.
బిజినెస్

1,600 డీల్స్.. వీసీ పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: రెండేళ్ల పాటు నెమ్మదించిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ–వీసీ) పెట్టుబడులు గతేడాది మళ్లీ జోరందుకున్నాయి. 9 శాతం పెరిగి 43 బిలియన్ డాలర్లకు చేరాయి. సుమారు 1,600 డీల్స్ నమోదయ్యాయి. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ), బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన ’ఇండియా ప్రైవేట్ ఈక్విటీ రిపోర్ట్ 2025’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.ఆసియా–పసిఫిక్లోకి వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో దాదాపు ఇరవై శాతం భారత్లోకి ప్రవహించాయని రిపోర్ట్ వివరించింది. తద్వారా ఈ ప్రాంతంలో పీఈ–వీసీ ఇన్వెస్ట్మెంట్లకు రెండో అతి పెద్ద గమ్యస్థానంగా భారత్ స్థానం మరింత పటిష్టమైందని తెలిపింది. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వంపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ఇన్వెస్టర్లు పెట్టుబడుల ద్వారా స్వల్ప వాటాలతో సరిపెట్టుకోకుండా సంస్థలను పూర్తిగా కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. 2022లో నమోదైన పీఈ డీల్స్ విలువలో సంస్థల కొనుగోళ్ల ఒప్పందాల వాటా 37 శాతంగా ఉండగా 2024లో 51 శాతానికి పెరిగింది. వివిధ రంగాలవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన అసెట్స్లో నియంత్రణాధికారాలను చేజిక్కించుకోవడంపై ఇన్వెస్టర్లు మరింతగా దృష్టి పెడుతుండటాన్ని ఇది సూచిస్తోంది. గతేడాది వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు 16 శాతం వాటా దక్కించుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే డీల్ విలువ 70 శాతం పెరిగింది. ఆర్థిక సేవల విభాగం 25 శాతం వృద్ధి చెందింది. 14 డీల్స్ నమోదయ్యాయి. వీటిలో 100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే డీల్స్ ఏడు ఉన్నాయి. హెల్త్కేర్ విభాగంలోకి కూడా గణనీయంగా నిధులు వచ్చాయి. హెల్తియం వంటి భారీ మెడ్టెక్ లావాదేవీల దన్నుతో ఒప్పందాల పరిమాణం 80 శాతం పెరిగింది. ఫార్మా సీడీఎంవోల్లోకి పెట్టుబడులు పెరిగాయి. పెర్ఫీషియంట్ (3 బిలియన్ డాలర్లు), ఆల్టిమెట్రిక్ (900 మిలియన్ డాలర్లు), జీఈబీబీఎస్ (865 మిలియన్ డాలర్లు) లాంటి భారీ డీల్స్ ఊతంతో ఐటీ ఆధారిత సర్వీసులు, ఐటీ రంగం 300 శాతం మేర అసాధారణ వృద్ధి కనపర్చింది. ఇన్వెస్టర్లు పలు సంస్థల నుంచి నిష్క్రమించడంలోనూ ఆసియా–పసిఫిక్లోని ఇతర మార్కెట్లను భారత్ అధిగమించింది. ఇలాంటి డీల్స్ విలువ 33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మెరుగ్గా ఉన్న ఈక్విటీ మార్కెట్లలో తమ వాటాలను విక్రయించడం ద్వారా వైదొలగడం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దేశీయంగా నిధుల సమీకరణ 2024లో కొత్త గరిష్టాలకు చేరింది. కేదార క్యాపిటల్ 1.7 బిలియన్ డాలర్ల నిధులు, క్రిస్క్యాపిటల్ 2.1 బిలియన్ డాలర్లు సమీకరించాయి. పటిష్టమైన జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ప్రైవేట్ వినియోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడటం, పాలసీలపరంగా సానుకూల చర్యలు మొదలైన అంశాల తోడ్పాటుతో 2025పై అప్రమత్తతతో కూడుకున్న ఆశావహ అంచనాలు నెలకొన్నాయి.

ఐటీలో ‘చిన్న’ హిట్టు.. ‘పెద్ద’ యావరేజు..
గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని పలు స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణించాయి. పెద్ద సంస్థలను మించిన పనితీరును కనపర్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసుల సంస్థలు అటు క్యూ4లోను ఇటు పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ అదరగొట్టాయి. కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెక్సావేర్ టెక్నాలజీస్, ఎంఫసిస్ వంటి సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 32 శాతం వరకు ఆదాయ వృద్ధి సాధించాయి.మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి మాత్రం సుమారు 4 శాతానికే పరిమితమైంది. పైపెచ్చు విప్రో ఆదాయం రెండు శాతం క్షీణించింది. జనవరి–మార్చి త్రైమాసికంలోను ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. సీక్వెన్షియల్గా కోఫోర్జ్ ఆదాయం 4.7 శాతం పెరిగి రూ. 3,410 కోట్లకు, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఆదాయం 12.4 శాతం వృద్ధితో రూ. 2,982 కోట్లకు చేరాయి. భారీ డీల్స్ను దక్కించుకున్నప్పటికీ పెద్ద కంపెనీలు మిశ్రమ ఫలితాలు కనపర్చాయి. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.కొత్త టెక్నాలజీలు, నాయకత్వం దన్ను.. చిన్న కంపెనీలు మెరుగ్గా రాణించడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. జెన్ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను వేగవంతంగా అందిపుచ్చుకోవడం, ప్రాజెక్టులను సత్వరం ఎగ్జిక్యూట్ చేయగలగడం, స్థిరమైన నాయకత్వం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. జెన్ఏఐలాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీలనేవి, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా తమను తాము మల్చుకోగలిగే చిన్న సంస్థలకు అవకాశంగా, ప్రస్తుతమున్న భారీ సంస్థలకు కొంత సవాలుగా మారొచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (కేఐఈ) ఒక నివేదికలో తెలిపింది.వ్యయాలను తగ్గించే కొత్త టెక్నాలజీలను వెనువెంటనే అందించేలా తమ సర్వీస్ పోర్ట్ఫోలియోలను పునర్వ్యవస్థీకరించుకోవడమనేది పెద్ద సంస్థలకు కాస్త సవాలుగా ఉంటుందని పేర్కొంది. వాటి భారీ పరిమాణమే ఇందుకు కారణమని వివరించింది. అదే మధ్య స్థాయి కంపెనీలు, దీర్ఘకాలికంగా వ్యూహాత్మక ప్రయోజనాలు పొందేందుకు స్వల్పకాలికంగా ఆదాయాన్ని పణంగా పెట్టేందుకు సాహసం చేయడానికి వీలుంటుందని వివరించింది. స్థిరమైన నాయకత్వం కూడా కంపెనీల పనితీరులో కీలక పాత్ర పోషిస్తోంది.చాలా మటుకు మధ్య స్థాయి కంపెనీల సీఈవోలు అయిదేళ్లకు పైగా కొనసాగుతుండటం వల్ల విజన్, ఎగ్జిక్యూషన్ నిలకడగా ఉంటోంది. పెద్ద కంపెనీల లీడర్షిప్లలో మాత్రం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023 జూన్లో టీసీఎస్ సీఈవోగా కె. కృతివాసన్ నియమితులు కాగా, 2023 డిసెంబర్లో టెక్ మహీంద్రాకు మోహిత్ జోషి, 2024 ఏప్రిల్లో విప్రోకు కొత్త సీఈవోగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు.ఈసారీ జోరు .. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య స్థాయి సంస్థల జోరు కొనసాగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కోఫోర్జ్లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి 16.4 శాతం స్థాయి నుంచి 20.8 శాతానికి పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్డర్లు పెద్ద సంఖ్యలో లభిస్తుండటం, అలాగే డీల్స్ పరిమాణం కూడా భారీ స్థాయిలో ఉండటం ఇందుకు దోహదపడొచ్చని పేర్కొన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.56 బిలియన్ డాలర్ల మెగా డీల్ కుదుర్చుకున్న ఏకైక దేశీ కంపెనీగా కోఫోర్జ్ నిల్చిందని వివరించాయి.అమెరికాకు చెందిన సేబర్కు 13 ఏళ్ల పాటు సర్వీసులు అందించేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడనుంది. మరోవైపు, పెద్ద కంపెనీలే కాస్త అనిశ్చితి ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీల్స్ బాగానే ఉంటున్నా, అమెరికాలో టారిఫ్లపరమైన అనిశ్చితులు, డిస్క్రిషనరీ వ్యయాల విషయంలో క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం వంటి అంశాలతో స్థూలఆర్థిక పరిస్థితులపై ఆందోళన నెలకొనడం ఇందుకు కారణం.ఎఫ్ఎంసీజీలోనూ అదే తీరు.. నీల్సన్ఐక్యూ నివేదిక ప్రకారం వినియోగదారుల బడ్జెట్కి అనుగుణమైన ఉత్పత్తులను అందించడంలో పెద్ద బ్రాండ్లకు చిన్న బ్రాండ్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 17.8 శాతం మేర వృద్ధి సాధించాయి. మిడ్ సైజ్ సంస్థలు 14.6 శాతం మేర పెరిగాయి. దాదాపు రూ. 5 లక్షల కోట్ల దేశీ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో చిన్న, మధ్య స్థాయి సంస్థల వాటా సుమారు 35 శాతం ఉంటుంది. లో బేస్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త మెరుగుపడటం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం తదితర అంశాలు వీటికి సానుకూలంగా నిల్చాయి.మరోవైపు, రూ. 5,000 కోట్లకు పైగా రెవెన్యూ ఉండే దిగ్గజాలు క్యూ4లో 6.4 శాతం మాత్రమే వృద్ధి కనపర్చాయి. బడా కంపెనీల ఉత్పత్తుల ధరలు 4.7 శాతం పెరగ్గా, అమ్మకాల పరిమాణం 1.7 శాతంగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ధరలు 0.3 శాతం తగ్గగా అమ్మకాల పరిమాణం ఏకంగా 8.1 శాతంగా నమోదైంది. నివేదిక ప్రకారం.. చిన్న ప్యాక్లు, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దన్నుతో జనవరి–మార్చి త్రైమాసికంలో ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగం 11 శాతం వృద్ధి చెందింది.

కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
ముంబై: ప్రభుత్వరంగ కెనరా బ్యాంక్ రుణ రేట్లను తగ్గించింది. ఏడాది కాలపరిమితికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9% చేసినట్లు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. దీనితో వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు భారం తగ్గనుంది.ఇక, ఒకరోజు ఎంసీఎల్ఆర్ 8.20%, ఒక నెల, మూడు, ఆరు నెలల కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ 8.25% – 8.80 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కొత్త రేట్లు మే 12 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. ఆర్బీఐ గత నెల రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరుశాతానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఎస్బీఐ జనరల్ కొత్త ఇన్సూరెన్స్ పాలసీ
ముంబై: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కొత్తగా ఎస్బీఐ జనరల్ ఫ్లెక్సీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను తీసుకొచ్చింది. సొంతిల్లు లేదా అద్దె ఇంటికి సంబంధించి సమగ్రమైన బీమా రక్షణను ఈ ప్లాన్ అందిస్తుందని ఎస్బీఐ జనరల్ తెలిపింది. కస్టమర్లు తమ అవసరాలకు అనుకూలంగా దీన్ని తీసుకోవచ్చని పేర్కొంది.ఇంట్లోని విలువైన వస్తువులతోపాటు.. ప్రత్యామ్నాయ వసతి కోసం అయ్యే వ్యయాలు, ఇంట్లో చోరీల నుంచి రక్షణ ఇలా అన్ని రకాల రక్షణలు ఈ ప్లాన్లో అందుబాటులో ఉంటాయి. ఫైర్ కవర్ ఒక్కటి తప్పనిసరిగా ఉంటుంది. మిగిలినవి పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రీమియంతో 20 ఏళ్లకు రక్షణ పొందొచ్చని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది.
ఫ్యామిలీ

Mother's Day: అమ్మ వల్లే డాక్టర్నయ్యా!
తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన ఆర్థోపెడిక్ నిపుణుల్లో డాక్టర్ తేతలి దశరథరామారెడ్డి ఒకరు. తండ్రి నారాయణ రెడ్డి పేరు మీద సొంతూర్లో ఒక ట్రస్ట్ పెట్టి.. అవసరంలో ఉన్న వాళ్లకు వైద్యసహాయం అందిస్తున్నారు. అమ్మ సంకల్పబలం వల్లే తాను డాక్టర్నయ్యానని చెప్పే ఆయన ఇంటర్వ్యూ మదర్స్ డే సందర్భంగా..! ‘‘మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి. మా నాన్న నారాయణ రెడ్డి. ఆ రోజుల్లో బీఏ హానర్స్ చేశారు. అమ్మ అచ్చాయమ్మ.. పెద్దగా చదువుకోలేదు. నాకు రెండున్నరేళ్లున్నప్పుడు మా నాన్న రోడ్ యాక్సిడెంట్ పాలయ్యారు. మేం మొత్తం ఆరుగురం. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య, ఒక చెల్లి. అమ్మ మోటివేషన్.. నేను చిన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్ని. బాగా అల్లరిచేసే వాడిని కూడా! నేను డాక్టర్ అవడానికి స్ఫూర్తి మా చిన్నాన్న (కంటి డాక్టర్ సత్యనారాయణ రెడ్డి) అయితే మోటివేషన్ మాత్రం అమ్మదే! అమ్మ చాలా డిసిప్లిన్డ్.. కష్టపడే తత్వం.. చాలా ఫోకస్డ్.. డెడికేటెడ్. కమాండింగ్ నేచర్! మమ్మల్ని పొద్దున నాలుగింటికి లేపి చదువుకు కూర్చోబెట్టేది. మాతోపొటే తనూ కూర్చుని.. మేం చదువుకుంటుంటే ఆమె రామకోటి రాసేది. అమ్మ ఆశయమల్లా మాలో ఎవరినైనా డాక్టర్ చేయాలన్న నాన్న కోరికను నెరవేర్చడమే! ఏమాత్రం చదువును నిర్లక్ష్యం చేసినా.. మా చిన్నాన్నను ఉదాహరణగా చూపిస్తూ చక్కగా చదువుకుంటే అలా గౌరవం పొందుతారని చెప్పేది! మా బద్ధకాన్ని ఏమాత్రం సహించేది కాదు. తండ్రిలేని పిల్లలు కదా.. తనేమాత్రం అశ్రద్ధ చేసినా పాడైపోతారనే భయం అమ్మకు. అందుకే మమ్మల్ని పెంచడంలో ఎక్కడా రాజీ పడలేదు ఆవిడ. గారాబం గారాబమే. స్ట్రిక్ట్నెస్ స్ట్రిక్ట్నెసే! బద్ధకం అనేది ఆమె డిక్షనరీలో లేదు. ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలి అనేవారు. మా అందరినీ సమర్థులైన ఇండివిడ్యువల్స్గా తయారు చేశారు. ఇటు మరుదులు.. అటు తమ్ముళ్లు అందరూ ఆమె మాటను గౌరవించేవారు. నిజానికి మా ఇంట్లో నానమ్మ తర్వాత మా మేనత్త మాణిక్యం. ఆ తర్వాత అమ్మే! నాన్న లేకపోయినా ఆ ఉమ్మడి కుటుంబాన్ని చెదరనివ్వలేదు అమ్మ. అందుకే చిన్నాన్నలకు అమ్మంటే చాలా గౌరవం. అలా అమ్మ మోటివేషన్, నాన్న కోరిక, చిన్నాన్న స్ఫూర్తితో నేను డాక్టర్ను అయ్యాను. మా మేనమామలకైతే ఆవిడ వాళ్లమ్మతో సమానం. మేమెప్పుడైనా అమ్మను చిన్నగా విసుక్కున్నా మా మేనమామలు మమ్మల్ని కేకలేసేవారు. ఆమె ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా.. ఇంట్లోకి రావడం రావడమే తిరుగు ప్రయాణానికి టికెట్ ఎప్పుడు రిజర్వ్ చేస్తావని అడిగేది. ఆ రావడం కూడా ఒంట్లో బాలేక΄ోతేనే వచ్చేది. ఆసుపత్రిలో చూపించుకుని వెంటనే వెళ్లిపోయేవారు. ఎంత అడిగినా ఉండేవారు కారు. ఎక్కువగా తన తమ్ముళ్లతో ఉండటానికి ఇష్టపడేవారు. మా అమ్మ విషయంలో నాకున్న ఒకే ఒక అసంతృప్తి.. మా ఇంట్లో ఇప్పుడు దాదాపు 17 మంది దాకా డాక్టర్లున్నారు. అమ్మ మా సక్సెస్ చూశారు కానీ.. మా పిల్లల సక్సెస్ చూడకుండానే పోయారు. 2016లో చనిపోయారావిడ.మహాగొప్ప మేనమామలు..మా నాన్నగారు పోయాక అమ్మ మానసికంగా కుంగిపోతే.. అమ్మమ్మ వాళ్లు తీసుకెళ్లి కొన్నాళ్లు అక్కడే పెట్టుకున్నారు. అప్పుడు అమ్మను కంటికి రెప్పలా కాచుకుంది మా మేనమామలే! ఆ కష్టకాలంలో మా ఫ్యామిలీ నిలబడ్డానికి ప్రధాన కారణం మా అమ్మమ్మ గారి కుటుంబమే! మా అమ్మాయి డాక్టర్. అమెరికాలో మాస్టర్స్ చేస్తోంది. అబ్బాయేమో ఆస్ట్రేలియాలో సప్లయ్ అండ్ చైన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేస్తున్నారు. నా భార్య సింధు. హోమ్ మేకర్. ఆమె కూడా అమ్మలాగే మంచి డిసిప్లిన్డ్. ఈ విషయంలో ఆమె మీద అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. గ్రేట్ మదర్. మా పెద్ద కుటుంబంలో చక్కగా ఇమిడిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే సింధు.. స్వీట్ హార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ.’’– సరస్వతి రమ (చదవండి: అమ్మ మనసు తెలుసా?)

Istanbul Airport: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!
చేతిలో ఐఫోన్, ముంజేతికి రోలెక్స్ వాచ్ ఉన్న వాడు కాదు రిచ్కిడ్ అంటే, ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో బర్గర్ తిన్నవాడే నిజమైన రిచ్కిడ్. ఎందుకంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాశ్రయాల్లో ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడి తినుబండారాల ధరలు ఏకంగా అంతరిక్షాన్నే దాటేస్తున్నాయి. ఒక లాసాగ్నే (ఇటాలియన్ వంటకం) రూ. 2,180. అదిపెద్ద డిన్నరేం కాదు, ఈ వంటకంలోని చిన్న ముక్క మాత్రమే సర్వ్ చేస్తారంతే! ఇక చిన్న బర్గర్ ధర అయితే రూ. 2,245, నాలుగు చికెన్ వింగ్ ఫ్రైస్ రూ.1,560. బయట దొరికే బీరు బాటిల్ రూ.రెండువందలైతే, ఇక్కడ బీరు ధర రూ. 1,915. అది కూడా పూర్తిగా బాటిల్ ఇవ్వరు, కేవలం వంద మిల్లీలీటర్లే! వీటి ధరలన్నీ తెలిసి తలనొప్పి వస్తుందని ఒక కప్పు కాఫీ అడిగారో మరో రూ. 700 ఖర్చు చేయాలి. అదీ తెలిసి, బీపీ పెరిగిందని కనీసం అరటిపండు కొనాలనుకుంటే రూ.535 ఖర్చు చేయాలి. చివరికి మంచినీళ్లు అయినా తాగి గొంతు తడుపుకుందాం అనుకుంటే లీటరు వాటర్ బాటిల్ రూ. 300. ఏదేమైతేనేం, బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని అయినా, అంత ఖర్చు చేసి, బాగా తిని రిలాక్స్ అయ్యారనుకోండి, మీ బ్యాగ్ జాగ్రత్త! ఎందుకంటే, ప్రపంచంలోనే చోర భయం ఎక్కువగా ఉండే ఎయిర్పోర్టుల్లో ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు నంబర్ వన్ అని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ కంటే ముందే బ్యాగు, పర్సు రెండూ టేకాఫ్ అయిపోతున్నాయని ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు బాధితులు సోషల్ మీడియాలో లబోదిబో మంటున్నారు.(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..)

Hyderabad: సిటీలో.. మదర్స్డే.. సందడి..
సాక్షి, హైదరాబాద్: మదర్స్ డే సందర్భంగా నగరంలో ఆదివారం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, జరగనున్నాయి. వీటిలో భోజన విందులు, గిఫ్ట్ ఆఫర్లు మరెన్నో ఉన్నాయి. నగరంలోని మారియట్ హోటల్లో ఉన్న బక్రా రెస్టారెంట్లో ప్రత్యేక బ్రంచ్ మెనూ అందిస్తున్నారు. గచ్చిబౌలిలోని షెరటన్ హోటల్ లోని ఫీస్ట్ రెస్టారెంట్లో విత్ లవ్ మమ్స్ కిచెన్ థీమ్తో ప్రత్యేక బ్రంచ్. ఫొటో బూత్, గేమ్స్, బహుమతులతో మదర్స్డే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హైటెక్ సిటీలోని ది వెస్టిన్ హోటల్లో సీజనల్ టేస్ట్స్ రెస్టారెంట్లో కాంటినెంటల్, నార్త్ ఇండియన్, ఇటాలియన్ వంటకాలతో ప్రత్యేక డైనింగ్ తగ్గింపు ధరలో అందిస్తున్నారు. ఇలాంటి మెనూ మార్పులే కాకుండా పలు ఆఫర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని వండర్ లా అమ్యూజ్మెంట్ పార్క్లో మదర్స్ డేని పురస్కరించుకుని మూడు ఎంట్రీలు కొంటే ఒక ఎంట్రీ ఉచితంతో పాటు మదర్స్ డే థీమ్తో పలు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ మదర్స్ డే సందర్భంగా అమ్మకు బహుమతులు అందించండి అంటూ ప్రత్యేక ఆల్మండ్స్ గిఫ్ట్ ప్యాక్స్ను నగర మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అమ్మకు అందించాల్సిన పోషకాహారంపై ఆన్లైన్ వేదికలపై పలు న్యూట్రిషనిస్ట్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పలు వర్క్షాప్స్ నిర్వహిస్తూ బాదం వంటి పోషకాలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు.

Miss World 2025: అదిగో.. అందాల లోకం!
హైదరాబాద్: దివిలో తారకలు భువిపైకి దిగి వచ్చాయా? సౌందర్య లోకం అవనిపైకి నడిచి వచ్చిందా? అనే తీరుగా ప్రపంచ సుందరీమణులు తళుక్కున మెరిశారు. తమ అందచందాలతో, చందన మందగమనంతో మురిశారు. భాగ్యనగర ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆలాపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు వివిధ దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో అట్టహాసంగా ఆవిష్కృతమయ్యాయి. సంస్కృతి, సౌందర్యం మేళవింపుగా ప్రపంచ సుందరి– 2025 ప్రారంభ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే, మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా, సీఎస్ రామకృష్ణారావు, నగర మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫొటోలు


తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)


మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)


డాక్టర్ బాబు నిరుపమ్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)


మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్ ఎట్రాక్షన్గా నందిని గుప్తా (ఫొటోలు)


Miss World 2025 : ఘనంగా హైదరాబాద్లో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)


సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)


లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)


పాకిస్తాన్తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్ (ఫొటోలు)
అంతర్జాతీయం

కాల్పుల విరమణ పాటిద్దాం
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో యూరప్ ప్రధాన దేశాల నేతలు రంగంలోకి దిగారు. ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్, యూకే దేశాల నేతలు శనివారం కీవ్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. రష్యా ప్రకటించిన మూడు రోజుల కాల్పుల విరమణ శనివారంతో ముగియనుండటం గమనార్హం. ఈ సందర్భంగా నేతలు కీవ్లోని ప్రధాన ఇండిపెండెన్స్ స్క్వేర్లో జరిగిన 80వ విక్టరీ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు, నేలకొరిగిన సైనికులకు నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా వారు 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా ముందుంచారు. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా చర్చలకు ముందుకు రావాలని అధ్యక్షుడు పుతిన్కు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చిన శాంతి ఒప్పందానికి మద్దతు ప్రకటించారు. సోమవారం మొదలుకొని నెల రోజులపాటు అమలయ్యే పూర్తిస్థాయి, బేషరతు కాల్పుల విరమణకు అంగీకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ ఫ్రెడరిక్ మెర్జ్, పోలెండ్ ప్రధాని టస్క్, యూకే ప్రధాని కెయిర్ స్టార్మర్ పాల్గొన్నారు. కాగా, నాలుగు దేశాల నేతలు కలిసి ఉక్రెయిన్ రావడం ఇదే మొదటిసారి. వీరిలో జర్మనీ ఛాన్స్లర్ మెర్జ్కు ఇదే మొట్టమొదటి ఉక్రెయిన్ పర్యటన. ఈ సందర్భంగా జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో చర్చలు జరిపినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండీ సిబిహా వెల్లడించారు. ఇలా ఉండగా, సుమారు 1,600 కిలోమీటర్ల పొడవైన ఫ్రంట్లైన్లో రష్యా ఆర్మీ శనివారం కూడా పలు చోట్ల దాడులు కొనసాగించింది. ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంపై శుక్రవారం జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు మరణించగా నలుగురు గాయపడ్డారు.

పాకిస్తాన్కు మా మద్దతు కొనసాగుతుంది
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు.

కాల్పుల విరమణ అమల్లోకి: విక్రమ్ మిస్రీ
భారత్ - పాక్ల యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని భారత్, పాకిస్తాన్ అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విరమణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.➤ Foreign Secretary Vikram Misri confirms the implementation of ceasefire during the Press Briefing on #OperationSindoor Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours, earlier this afternoon. It… pic.twitter.com/vECdAsBUYo— PIB India (@PIB_India) May 10, 2025 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించినట్లు, కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు. రెండు దేశాలకు నా అభినందనలు అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇక రెండు దేశాలు కాల్పుల విరమణపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action.India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so.— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 10, 2025

భారత్ - పాక్ యుద్దానికి బ్రేక్!.. ట్రంప్ సంచలన ప్రకటన
భారత్ - పాక్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించినంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనిలో భాగంగా భారత్- పాక్లతో రాత్రంతా చర్చలు జరిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించాము. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలకు నా అభినందనలు’ అంటూ పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని భారత్ సైతం ధృవీకరించింది. భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు.pic.twitter.com/lRPhZpugBV— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025Pakistan and India have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region, without compromising on its sovereignty and territorial integrity!— Ishaq Dar (@MIshaqDar50) May 10, 2025
జాతీయం

సరిహద్దుల్లో కాల్పుల మోత
న్యూఢిల్లీ/జమ్మూ/శ్రీనగర్: సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కాల్పులు శనివారం వరుసగా పదహారో రోజు కూడా కొనసాగాయి. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ (పడగొట్టలేని దృఢమైన గోడ) పేరిట శుక్రవారం అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా సైన్యం భారీ కాల్పులకు పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటు సాధారణ జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్, ఫిరోజ్పూర్, తార్న్తరన్, హరియాణాలోని సిర్సాలో కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. పాక్ కాల్పులను సైన్యం దీటుగా తిప్పికొట్టింది. మన ప్రతిదాడుల భయంతో శనివారం తెల్లవారుజాము 3.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. ప్రభుత్వాధికారి సహా ఆరుగురి మృతి పాక్ కాల్పుల్లో జమ్మూలో ఆరుగురు మరణించారు. 8 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. మృతుల్లో రాజౌరీ జిల్లా అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ రాజ్కుమార్ థాపా, ఓ సైనికాధికారితో పాటు రెండేళ్ల బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాక్ సైన్యం సామాన్యులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటమే గాక డ్రోన్లు ప్రయోగించిందని పేర్కొన్నారు. జమ్మూ సహా పలు పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. సైరన్లు నిరంతరాయంగా మోగుతుండడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం ఉదయం 5 గంటలకు భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజ్కుమార్ థాపా అధికారిక నివాసంపై కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. థాపా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దాంతో స్థానికంగా విషాదం అలుముకుంది. థాపా శుక్రవారం సైతం విధుల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రితో కలిసి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. పాక్ దాడుల్లో రాజౌరీ టౌన్లో ఐషా నూర్ (2), మొహమ్మద్ షోహిబ్(35) మృతిచెందారు. పూంఛ్ జిల్లాలో రషీదా బీ(55) ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు. జమ్మూ జిల్లా ఆర్.ఎస్.పురా సెక్టార్లో అశోక్ కుమార్ అనే పౌరుడు విగతజీవిగా మారాడు. పూంఛ్లోని కృష్ణఘాటీ సెక్టార్లో బాంబు పేలుడులో హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమరుడయ్యాడు. జమ్మూ శివార్లలోని ఖేరీ కేరాన్ గ్రామంలో జకీర్ హుస్సేన్ (45) మరణించాడు. శ్రీనగర్లో భారీ పేలుళ్లు శ్రీనగర్ శనివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదయం 11.45 గంటల వేళ ఎయిర్పోర్టు సమీపంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతకుముందు నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్లోని ఓల్డ్ ఎయిర్ఫీల్డ్ వైపు దూసుకొచి్చన ఓ డ్రోన్ను సైన్యం కూల్చివేసింది. సీఎం ఒమర్ సంతాపం రాజ్కుమార్ థాపా మరణం పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు. అంకితభావం కలిగిన సీనియర్ అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. జమ్మూలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒమర్ పర్యటించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రజలకు స్థైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.హిమాచల్లో డ్రోన్, క్షిపణుల శకలాలు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం ఉనా జిల్లాలోని బెహాద్ గ్రామంలో శనివారం క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. కాంగ్రా జిల్లా నూర్పూర్లో రెండుచోట్ల డ్రోన్, మిస్సైల్ విడిభాగాలను గుర్తించారు. అవి సైన్యం కూల్చివేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలని అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అక్కడ భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సైనిక పోస్టులు, ఉగ్ర లాంచ్ప్యాడ్లు ధ్వంసం జమ్మూ సమీపంలో పాకిస్తాన్ భూభాగంలో సైనిక పోస్టులతో ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ‘‘భారత్పై డ్రోన్ దాడులకు ఈ లాంచ్ప్యాడ్లనే వాడారు. ఇవి పాక్లోని సియాల్కోట్ జిల్లా లూనీలో ఉన్నాయి’’ అని బీఎస్ఎఫ్ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ భూభాగం నుంచి జరిగిన కాల్పులకు గట్టిగా బదులిచ్చామని వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బీఎస్ఎఫ్ పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులకు దిగింది. దాంతో పాక్ రేంజర్ల క్యాంపులపై బీఎస్ఎఫ్ విరుచుకుపడింది.మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలుకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ: పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సరిహద్దు ప్రాంతాల్లోని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, జమ్మూ సెక్టార్లపై నాలుగు రోజుల పాటు జరిగిన కాల్పుల్లో జిల్లా అదనపు అభివృద్ధి కమిషనర్ సహా 19 మంది చనిపోయారు. ‘పాక్ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదన కలిగించింది. మా ప్రజలకు కలిగిన నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం. ఆప్తులను కోల్పోయిన వారి వేదనను తగ్గించలేకపోవచ్చు గానీ ఆ కుటుంబాలకు మా వంతు మద్దతుగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తాం’అని సీఎం ఒమర్ పేర్కొన్నారు.

మెటా గ్లాస్.. మొబైల్కి లాస్?
ఒక్క మాట చెబితే ఫొటో క్లిక్మనిపిస్తుంది.. వాయిస్ కమాండ్ వినగానే వీడియో రికార్డ్ అయిపోతుంది. ఏ భాషలోని అక్షరాలైనా క్షణాల్లో మన భాషలోకి మారిపోయి కనిపిస్తాయి. చేతిలో ఫోన్ లేకుండానే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేయొచ్చు.. త్వరలో అందుబాటులోకి రానున్న స్మార్ట్ కళ్లజోళ్లు చేసే పనులివన్నీ. స్టైలిష్ కళ్లజోళ్లకు పేరు గాంచిన రే–బాన్ కంపెనీ.. మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా సంయుక్తంగా అత్యాధునిక స్మార్ట్ గ్లాసె స్ను విడుదల చేశాయి. ఇవి త్వరలోనే భారత్లోనూ విడుదల కానున్నాయి. అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు చేసే పనులన్నీ ఈ స్మార్ట్ కళ్లద్దాలు చేసిపెడతాయి. కంటెంట్ క్రియేటర్లు, వ్యాపారవేత్తలు, వేగవంతమైన కమ్యూనికేషన్పై ఆధారపడే వారికి ఈ గ్లాసెస్ గేమ్–ఛేంజర్గా నిలుస్తాయని టెక్ నిపుణులు అంటున్నారు. 2024 నాటికి ప్రపంచ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్ విలువ 18.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. 2033 నాటికి అది 53.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఐఎమ్ఏఆర్సీ గ్రూప్ అంచనా వేస్తోంది. మెటా, ఆపిల్, గూగుల్, షావోమీ, సోనీ, అమెజాన్, లెన్స్కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ గ్లాసెస్ ప్రత్యేకత?వాయిస్ అసిస్టెంట్: మెటా ఏఐతో సంభాషించి రియల్ టైమ్ సమాధానాలు పొందవచ్చు. ఫొటో, వీడియో క్యాప్చర్: వాయిస్ కమాండ్తో ఫొటోలు తీయవచ్చు. వీడియోలు కూడా రికార్డ్ చేయవచ్చు.లైవ్ స్ట్రీమింగ్: ఏదైనా కార్యక్రమానికి ఇన్స్ట్రాగామ్ లేదా ఫేస్బుక్లో నేరుగా ప్రసారం చేయవచ్చు.సంగీతం, పాడ్కాస్ట్లు: ఇయర్బడ్స్ లేకుండానే సంగీతం లేదా పాడ్కాస్ట్లు వినవచ్చు. ఫోన్ కాల్స్: బిల్ట్–ఇన్ మైక్రోఫోన్లు, స్పీకర్లు ఈ అద్దాల్లో ఉంటాయి కాబట్టి ఫోన్ కాల్స్ చేయవచ్చు. కాల్స్ స్వీకరించవచ్చు. లైవ్ ట్రాన్స్లేషన్: విదేశీ భాషల సైన్బోర్డ్లను తక్షణం మనకు తెలిసిన భాషలోకి అనువదించగలవు.ఆబ్జెక్ట్ రికగ్నిషన్: మనం చూసే వస్తువులను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని అ అద్దాలు అందిస్తాయి. ఈ కళ్లజోళ్లకు రోజువారీ ఫోన్ ఉపయోగాన్ని పూర్తిగా భర్తీ చేసే ఫీచర్లను జోడించే దిశగా మెటా పనిచేస్తోంది. వీటి ద్వారా యాప్లు, సేవలను నోటి మాటతో నియంత్రించవచ్చు. స్క్రీన్ లేని అనుభవం: ఫోన్, ఇతర ఏ రకమైన డిజిటల్ తెర అవసరం లేకుండానే సమాచారం మన దృష్టి క్షేత్రంలో నేరుగా కనిపిస్తుంది.స్మార్ట్ గ్లాసెస్ ప్రయోజనాలు..సహజ కదలిక: స్క్రీన్ వైపు చూడాల్సిన అవసరం లేదు. మల్టీ టాస్కింగ్: నడుస్తూ, వంట చేస్తూ లేదా ప్రయాణిస్తూనే స్మార్ట్ఫోన్ ద్వారా చేసే అన్ని పనులు వీటితో చేసుకోవచ్చు. తక్కువ స్క్రీన్ టైమ్: నిరంతర ఫోన్ను చూస్తూ స్క్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు.ఎదురయ్యే సవాళ్లు..బ్యాటరీ లైఫ్: రోజంతా గ్లాసెస్ను చార్జ్లో ఉంచడం కష్టం. వ్యక్తిగత గోప్యత: ఎదుటివారికి తెలియకుండానే మనం వారి ఫొటోలు, వీడియోలను ఈ స్మార్ట్ గ్లాసెస్తో తీయొచ్చు. దీంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ధర: ఈ హై–టెక్ కళ్లద్దాల ధర సామాన్య ఫోన్ల కంటే చాలా ఎక్కువ.అయితే, ఇవి ఇప్పటికిప్పుడు స్మార్ట్ఫోన్లకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ వాచ్ల మాదిరిగా మొదట ఫోన్లకు సహాయక పరికరాలుగా ఉపయోగపడతాయి. పూర్తి స్థాయిలో ఫోన్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో 10–20 ఏళ్లు పట్టే అవకాశముందని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ కంటే బెటర్.. త్వరలోనే ఈ గ్లాసెస్ స్మార్ట్ఫోన్లను భర్తీ చేయగలవు. కళ్ల ముందే డేటా కనిపించడం, వాయిస్ ఆధారంగా నడిచే విధానం వల్ల ఫోన్ అవసరం తగ్గుతుందనేది నా అంచనా. స్మార్ట్ఫోన్లతో మనం చేసే అన్ని పనులు ఇవి చేయగలవు. ఫోన్ను పట్టుకోవడం కంటే ముఖంపై గ్లాసెస్ ధరించడం సహజంగా అనిపిస్తుంది. టచ్, స్క్రోల్కు బదులుగా వాయిస్ కమాండ్స్, విజువల్స్తో టెక్నాలజీని ఉపయోగించే రోజు దగ్గరలోనే ఉంది.’ – మార్క్ జుకర్బర్గ్, మెటా సీఈఓ

బిక్కుబిక్కుమంటూ గడిపాం..
సాక్షి, న్యూఢిల్లీ/సంగారెడ్డి క్రైం: ‘భీకరమైన శబ్దాలు, మెరుపుల్లా డ్రోన్లు, ఆకాశం వైపు చూస్తే చాలు.. గుండె ఆగేంత భయం. భారత్–పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాము’అని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల నుంచి తాము సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 51 మంది, తెలంగాణకు చెందిన 17 మంది విద్యార్థులు సురక్షితంగా ఢిల్లీలోని ఉమ్మడి భవన్కు చేరుకున్నారు. ఇక్కడ రెండు రాష్ట్రాల అధికారులు విద్యార్థులకు వేర్వేరుగా బస, భోజన ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా విద్యార్థులను విమానాలు, రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపారు. వీరిలో కొందరు విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు. ఓ పక్క భయం..ఇంకో పక్క రైల్వే దోపిడీ రెండు రాత్రులు డ్రోన్లు, కాల్పుల శబ్దాలతో గజగజలాడాము. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకోవడానికి పంజాబ్లోని పగ్వరా రైల్వే స్టేషన్కు వచ్చాం. అక్కడ ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కాము. అయితే ఖాళీ లేకపోవడంతో వాష్రూమ్ బయట నిలబడ్డాం. టీసీ మమ్మల్ని తర్వాతి స్టేషన్ లుధియానాలో దించేశారు.రిజర్వేషన్ ఉన్నా ఏసీ కోచ్లో ఉన్నాం అనే కారణంతో ఐదుగురు నుంచి టీసీ రూ.4,500 వసూలు చేశారు. తర్వాత వచ్చి న ఇంటర్ సిటీ ఎక్కితే దానిలో రిజర్వేషన్ లేదు.. అని వాళ్లు మరో రూ.200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. ఓ పక్క యుద్ధ ప్రాంతం నుంచి బయటపడ్డామనుకుంటే, ఇంకో పక్క రైల్వే దోపిడీతో మోసపోయాం. –ఎస్.మధువర్షిత, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ హాస్టల్ చుట్టూ.. డ్రోన్లు పదుల సంఖ్యలో పాకిస్తాన్ డ్రోన్లు మా యూనివర్సిటీలోని హాస్టల్ చుట్టూ తిరిగాయి. ఆ శబ్దాలకు చెవులు గింగురుమనడమే కాదు, ఏం జరుగుతుందోనని భయపడిపోయా. ఉదయం రైల్వేస్టేషన్కు వచ్చేందుకు బస్సు దగ్గరకు వెళుతుండగా అప్పుడు కూడా మాపై నుంచి డ్రోన్లు వెళ్లాయి. –సీహెచ్ భానుకిరణ్, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్డ్రోన్ల శబ్దాలకు భయం వేసింది 8వ తేదీ రాత్రి చదువుకుంటున్నాం. ఒక్కసారిగా పైనుంచి భారీ శబ్దాలు.. అవి ఏమిటో మొదట మాకు అర్థం కాలేదు. హాస్టల్ యాజమాన్యం మా అందరినీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ రూమ్లో కూర్చోబెట్టింది. అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ డ్రోన్ల శబ్దాలు ఆగిపోవడంతో పడుకోవడానికి రూమ్లలోకి వెళ్లాము. పడుకున్న రెండు గంటల్లోనే మళ్లీ భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా హాస్టల్ రూమ్లలో గడిపాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. –ఎస్.జీవన జ్యోతి, ఐఐటీ జగతి (జమ్మూ)ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మేము చదువుకునే యూనివర్సిటీ సమీపంలో శుక్రవారం రాత్రంతా బాంబుల శబ్దం రావడంతో ఏమి జరుగుతుందోనని భయం భయంగా గడిపాం. గత రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. యుద్ధం గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాం. పంజాబ్ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు బయలుదేరాం. – రంజిత్రెడ్డి, (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ ఒక్కసారిగా భయంకర శబ్దాలు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వర్సిటీ సమీపంలో ఒక్కసారిగా భయంకర శబ్దాలు రావడంతో భయం వేసింది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో యుద్ధం జరుగుతోందని అర్థమైంది. సోషల్ మీడియా మాకు అందుబాటులో లేదు. –కూచ వెంకట బాలాజీ (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్

తల్లీబిడ్డ మరింత భద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రసూతి, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష ప్రసవాలకు గతంలో 130 ఉండగా, తాజాగా 93కు తగ్గినట్లు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) నివేదికలో వెల్లడించింది. శిశు మరణాల రేటు కూడా భారీగా తగ్గింది. 2014లో వెయ్యి జననాలకు 39 మరణాలు ఉండగా, 2021 నాటికి 27కు తగ్గినట్లు ఎస్ఆర్ఎస్ పేర్కొంది. నవజాత శిశు మరణాల రేటు 2014లో వెయ్యికి 26 ఉండగా, 2021 నాటికి 19కి తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 2014లో వెయ్యికి 45 ఉండగా, 2021 నాటికి 31కి తగ్గిందని వివరించింది. 2021లో నమోదైన 2.0 శాతం సంతానోత్పత్తి రేటు స్థిరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 7న రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) విడుదల చేసిన ఎస్ఆర్ఎస్–2021 ప్రకారం తల్లి, శిశు ఆరోగ్య సూచికలలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని తెలిపింది. తెలంగాణ, ఏపీలో ఇలా.. » ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం 2030 నాటికి 8 రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)ను సాధిస్తాయని తెలిపింది. » ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్షకు సగటున 70 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు దేశంలో 8 ఉన్నాయి. అందులో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. » తెలంగాణలో ప్రసూతి మరణాలు ప్రతి లక్షకు 45 నమోదు కాగా, ఏపీలో 46గా నమోదయ్యాయి. ప్రసూతి మరణాలు అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఐదేళ్ల లోపు శిశు మరణాల సంఖ్య సగటున 25 కన్నా తక్కువ ఉన్న 12 రాష్ట్రాల్లో సైతం ఏపీ, తెలంగాణ చోటు దక్కించుకున్నాయి. ఇది తెలంగాణలో 22 ఉండగా, ఏపీలో 24గా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. ప్రసూతి మరణాలు 2014–16లో 130, 2015–17లో 122, 2016–18లో 113, 2017–19లో 103, 2018–20లో 97, 2019–21లో 93గా నమోదయ్యాయి.
ఎన్ఆర్ఐ

వైట్హౌస్లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

అమ్మా.. నాన్న క్షమించండి
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. అక్క క్షమించు.. అమ్మ నాన్న క్షమించు’ అంటూ ఒక లేఖ రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి ఈడిగ వంశీక్రిష్ణ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని రామచంద్రనగర్లో నివాసం ఉంటున్న ఈడిగ వంశీక్రిష్ణ ఎంఎస్సీ వరకు చదువుకున్నాడు. తండ్రి శ్రీనివాసగౌడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి. శ్రీనివాసగౌడ్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు రాకేష్ గౌడ్ పెళ్లి అయిన 20 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు వంశీక్రిష్ణ పెళ్లి కాకుండానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశమైంది. రైలు పట్టాలపై మృతదేహంలా.. వివాహ వేడుకకు ఈనెల 7వ తేదీన వేరే ఊరికి శ్రీనివాసగౌడ్, శ్రీదేవి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చారు. కుమారుడు వంశీక్రిష్ణ ఇంట్లో లేకపోవడంతో కర్నూలు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎండోమెంట్ కాలనీ సమీపంలో అబ్బాస్ నగర్ రైల్వే పట్టాల పక్కన శనివారం వంశీక్రిష్ణ మృతదేహమై కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రైల్వే ఎఎస్ఐ కేవీఎం ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్న మృతిని తట్టుకోలేక.. ఈడిగ వంశీక్రిష్ణ అన్న రాకేష్ గౌడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేవారు. పెళ్లి అయిన 20 రోజులకే నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి వంశీక్రిష్ణ మానసిక కుంగుబాటుతో బాధపడేవాడు. అన్న మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

‘వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తా ’
హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని ఒత్తిడి చేయడమే కాకుండా..ఆమె వివాహ నిశ్చితార్థాన్ని చెడగొట్టి.. వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా బాల్కొండ ప్రాంతానికి చెందిన యువతి (21) నగరంలోని ఓ హాస్టల్లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. కామారెడ్డిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసే శేషుకుమార్ (28) గత తొమ్మిది నెలల క్రితం సదరు యువతిని బస్సులో కలిశాడు. నెల తర్వాత శేషు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించి స్నేహితులుగా ఉందామని చెప్పింది. ఈ క్రమంలో ఇరువురూ కలిసి ఫొటోలు దిగారు. ఇదిలా ఉండగా తన వివాహ నిశ్చితార్థం ఖరారు అయ్యిందని యువతి స్నేహితులకు చెప్పగా వారి ద్వారా శేషు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో ఈ నెల 6న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లైఓవర్ వద్ద ఆమెను కలుసుకుని ఘర్షణకు దిగాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెతో వివాహ నిశ్చితార్థం జరుపుకునే యువకుడి ఫోన్ నెంబర్ తీసుకుని వారిద్దరూ దిగిన ఫోటోలను అతనికి పంపించడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేశాడు. దీంతో ఆ నిశితార్థం ఆగిపోయింది. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి పెంచాడు. తనను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తల్లీబిడ్డను కాటేసిన కరెంట్
నిజాంసాగర్ (జుక్కల్): ఇంట్లోని ఇనుప కూలర్కు కరెంట్ సరఫరా కావడంతో తల్లీకూతురు మరణించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద గుల్లా తండాకు చెందిన చవాన్ ప్రహ్లాద్, శంకబాయి (36) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ప్రహ్లాద్ డ్రైవర్గా, శంకబాయి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి శంకబాయి, చిన్న కూతురు శ్రీవాణి (12), కుమారుడు ఇంట్లో నిద్రించారు. తల్లి, కూతురు ఒకేచోట ఇనుప కూలర్ ముందర నిద్రించగా, కుమారుడు ప్రతీక్ కొద్ది దూరంలో పడుకున్నాడు. రాత్రి వేళ కూలర్ అడుగు భాగంలోని నీటిలో శ్రీవాణి కాలుపడటంతో కరెంట్ షాక్ సరఫరా జరిగి శ్రీవాణితో పాటు పక్కనే పడుకున్న తల్లి శంకబాయి మృతి చెందింది. ఉదయం నిద్ర లేచిన ప్రతీక్ తల్లి, సోదరి మృతి చెందడాన్ని గమనించి తండా ప్రజలకు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న బిచ్కుంద సీఐ నరేశ్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, ట్రాన్స్కో ఏఈ బాలాజీ తండాకు చేరుకున్నారు. ఇనుప కూలర్కు కరెంట్ సరఫరా కావడంతోనే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనగనగా ఓ కేసు!
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిన్ డినైడ్’ అనేది న్యాయశాస్త్ర ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ కొన్ని కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మానవ వనరుల లేమి, మౌలిక వసతుల కొరత సహా అనేక కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో ఉన్న కుషాయిగూడ పోలీసుస్టేషన్లో 2001 ఫిబ్రవరిలో నమోదైన ‘భారీ దొంగతనం’ కేసు విచారణ కోర్టులో 24 ఏళ్లు సాగింది. చివరకు 2025 ఏప్రిల్ 2న వీగిపోయింది. ఈ కేసులో పదిమంది నిందితులు ఉండగా, కోర్టు తీర్పు వెలువడే నాటికి ఐదుగురు చనిపోయారు. అది కుషాయిగూడలోని కమలనగర్ ప్రాంతం. అక్కడి శ్రీ సాయి అపార్ట్మెంట్లో ఎ.కృష్ణమూర్తి అనే వ్యాపారి ‘రూప క్లాత్ ఎంపోరియం’ పేరుతో వస్త్ర దుకాణం ఏర్పాటు చేశారు. విక్రయాల కోసం పనివాళ్లను ఏర్పాటు చేసుకోకుండా, స్వయంగా నిర్వహణ బాధ్యతలు చూసుకునే వారు. నాటి వ్యాపార వేళలు నేటికి భిన్నంగా ఉండేవి. సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటలకే వస్త్ర దుకాణాలు తెరుచుకునేవి. ఎప్పటిలాగే 2001 ఫిబ్రవరి 16 ఉదయం ఆయన తన షాపు తెరిచారు. ఆ వెంటనే తన దైనందిన కార్యకలాపాల్లో ముగినిపోయారు. ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు ఉదయం 11 గంటలకే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు రావడం ప్రారంభమైంది. దీంతో ఆ రోజు తన పంట పండిందని భావిస్తూ కస్టమర్లకు స్వాగతం పలికారు. అలా వచ్చిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఎవరికి వారు తమకు కావాల్సిన వస్త్రాలను చూపించాలని కోరడంతో దుకాణం మొత్తం హడావుడి నెలకొంది. అయితే చివరకు కృష్ణమూర్తి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు.కస్టమర్లు వెళ్లిపోయాక వారికి చూపించడానికి బయటకు తీసిన వస్త్రాలన్నింటినీ కృష్ణమూర్తి సర్దుకోవడం మొదలెట్టారు. అప్పుడు స్టాకులో తేడా రావడాన్ని గమనించి, దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. షాపు తెరిచిన వెంటనే కొనుగోలుదారులుగా వచ్చిన వాళ్లల్లో ఎవరో తస్కరించినట్లు అనుమానించారు. దుకాణం మూసి బయటకు వెళ్లిన కృష్ణమూర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన నేరుగా కుషాయిగూడ పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడంటే ఏదైనా ఓ నేరం జరిగిందని ఫిర్యాదు వచ్చిన వెంటనే సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్, నిందితులు వినియోగించిన సెల్ నెంబర్, ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నెంబర్ల పైనే పోలీసుల దృష్టి పడుతోంది. సీసీ కెమెరాలు లేని, సెల్ఫోన్లు అంతగా వినియోగంలోకి రాని రోజులు కావడంతో సంప్రదాయ దర్యాప్తు విధానాలతోనే ముందుకు వెళ్లారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నగరంలోని పాత నేరగాళ్ల వివరాల ఆరా తీశారు. ఇలాంటి నేరాలు గతంలో చేసిన వాళ్లు ఎవరెవరు? ప్రస్తుతం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తదితర అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు వేగులకూ పని చెప్పారు. నేరం జరిగిన తీరును బట్టి వ్యవస్థీకృత నేరగాళ్ల పనిగా భావించారు. ఇలాంటి వాళ్లు పదేపదే నేరాలు చేసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలోని అన్ని వస్త్రదుకాణాల యజమానులను అప్రమత్తం చేశారు. కుషాయిగూడ పోలీసులు తీసుకున్న ఈ చర్య ఫలితాన్ని ఇచ్చింది. రూప క్లాత్ ఎంపోరియంలో చోరీ జరిగిన వారం రోజులకు మరో వస్త్ర దుకాణాన్ని టార్గెట్ చేసిన ముఠాలోని కొందరు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ షాపులో బేరసారాలు చేయడం మొదలెట్టారు. వీరి వ్యవహారశైలి, వస్త్రధారణ, నేరం చేసే తీరు తదితర అంశాలపై పోలీసులు ప్రచారం చేసి ఉండటంతో ఆ దుకాణం యజమాని గుర్తించాడు. వెంటనే స్థానికుల సహాయంతో పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, పోలీసుస్టేషన్కు తరలించారు. ఆ నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. రూప క్లాత్ ఎంపోరియంలోకి తమతో పాటు వచ్చి, నేరంలో పాలుపంచుకున్న అనుచరుల వివరాలను బయటపెట్టారు. దీంతో కుషాయిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మొత్తం పది మందిని అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని లంబాడికుంట తండాకు చెందిన ఈ పదిమంది వ్యాపారి కృష్ణమూర్తి దృష్టి మరల్చి చోరీ చేసినట్లు తేల్చారు. ఆధారాలు సేకరించిన కుషాయిగూడ పోలీసులు న్యాయస్థానంలో అదే నెల 28న అభియోగపత్రాలు దాఖలు చేశారు. కాలక్రమంలో బెయిల్ పొందిన నిందితులు జైలు నుంచి బయటకు రాగా, కొన్నాళ్లకు కేసు విచారణ ప్రారంభమైంది. అనివార్య కారణాల వల్ల 2025 ఏప్రిల్ 2 వరకు దీని విచారణ కొనసాగింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో సబ్ ఇన్స్పెక్టర్గా (ఎస్సై) ఉన్న అధికారి పదోన్నతుల తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) హోదాలో కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 2001లో నిందితుల కోసం గాలించిన పోలీసులు కొన్నాళ్లకు ఫిర్యాదుదారుడైన కృష్ణమూర్తి, ఇతర సాక్షుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. న్యాయస్థానంలో వీరు చెప్పే సాక్ష్యాలు అత్యంత కీలకం. అయితే కేసు విచారణ కీలక దశకు చేరుకునే సరికి కృష్ణమూర్తి తన వ్యాపారం మానేశారు. శ్రీసాయి అపార్ట్మెంట్స్తో పాటు అప్పట్లో ఆయన నివసించిన ఇంటి వద్దకూ వెళ్లిన పోలీసులు కృష్ణమూర్తి వివరాల కోసం ఆరా తీశారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, కృష్ణమూర్తితో పాటు ఇతర సాక్షుల ఆచూకీ లభించలేదు. ఈ కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడితో (ఏ–1) పాటు మూడు, నాలుగు, ఐదు, పదో నిందితులు చనిపోయారు. మిగిలిన ఐదుగురిపై తుది వరకు విచారణ సాగినా, చివరకు కేసు వీగిపోయింది. ఇన్ని మలుపులు తిరిగిన ఈ కేసులో కృష్ణమూర్తి దుకాణం నుంచి చోరీ అయినవి ఏంటో తెలుసా? ఐదు తానుల కాటన్ వస్త్రం, మూడు లంగాలు, ఒక రవిక ముక్క. కుషాయిగూడ పోలీసు రికార్డుల ప్రకారం అప్పట్లో వీటి విలువ రూ.8 వేలు.
వీడియోలు


శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం


పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో


ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు


ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం


బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి


Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!


పాక్ ను వణికించిన BRAHMOS


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన


Jana Tantram: కాల్పుల విరమణ వ్యవహారంలో ట్రంప్ పాత్రపై ఆసక్తికరం


పాక్ వైమానిక కీలక స్థావరాలను లక్ష్యంగా విరుచుకుపడ్డ బ్రహ్మోస్