Holi celebrations
-
Holi 2025, బోసిపోయిన రహదారులు.. కిటకిటలాడిన వైన్ షాపులు
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరిగింది. చిన్నపెద్ద వయసుతో తేడా లేకుండా అందరూ ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ జరుపుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గతేడాది కంటే ఈసారి హడావుడి కొంత తగ్గినప్పటికీ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా అనేక మంది రాజకీయ నాయకులు తమతమ ప్రాంతాల్లో జరిగిన హోలీ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముంబై, నవీముంబై, థానే పుణే, సోలాపూర్లో వీధివీధినా సంబరాలు అంబరాన్ని తాకాయి. కొన్ని ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు, బ్యాండు మేళాలతో నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకున్నారు. పలుచోట్ల గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, పూరన్ పోలీ (పూర్ణంతో తయారుచేసిన తీపి రొట్టెలు, బూరెలు) నైవేద్యంగా సమరి్పంచి, కాముని దహనం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగుపంచమి (రంగులు చల్లుకునే) ఉత్సవాలను జరుపుకున్నారు. ముఖ్యంగా కోళీ ప్రజలు తమ సాంప్రదాయ పద్దతిలో హోళీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా శుక్రవారం కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో గురువారం సాయంత్రం నుంచే యువతీ యువకులు, పిల్లలు, అందరు వేడుకలను ప్రారంభించారు. కొందరు ఫోన్లలో, మరికొందరు ప్రత్యక్షంగా కలుసుకుని ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు..... హోలీ ఉత్సవాల్లో ఎటువంటి అనుచిత సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించింది. బహిరంగ ప్రదేశాల్లో , బాటసారులపై రంగులు చల్లి ఇబ్బందులు పెట్టకుండా నగర రహదారులపై గస్తీ నిర్వహించారు. పండగ నేపథ్యంలో అనేక మంది పోలీసుల వారంతపు సెలవులు రద్దు చేశారు. హోలీ రోజున మద్యం సేవించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ప్రధాన కూడళ్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినవారిపై చర్యలు తీసుకున్నారు. కిటకిటలాడిన బీచ్లు.. హోలీ పండుగ సందర్భంగా ముంబైలోని బీచ్లన్నీ కిటకిటలాడాయి. పండుగ అనంతరం సముద్ర స్నానాలు చేసేందుకు యువతీ, యువకులు పెద్దసంఖ్య లో బీచ్లకు చేరుకున్నారు. ముఖ్యంగా చరి్నరోడ్, లో టస్, వర్లీ సీ ఫేస్, శివాజీపార్క్, మాహిం, బాంద్రా, అక్సాబీచ్ తదితర బీచ్లు సందర్శకులతో నిండిపోయాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జలాశయాలు, చెరువుల పరిసరాల్లో కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మద్యం సేవించి ఇతరుల ను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నారు. బోసిపోయిన రహదారులు.. నిత్యం వాహనాలతో రాకపోకలతో రద్దీగా కనిపించే ముంబై రహదారులన్నీ శుక్రవారం బోసిపోయి కనిపించాయి. శుక్ర, శని, ఆదివారం...ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధిక శాతం ప్రజలు గురువారం రాత్రి నుంచే పర్యాటక ప్రాంతాలకు, రిసార్టులకు, పిక్నిక్ పాయింట్లకు తరలిపోయారు. దీంతో హోలీ పండుగనాడు ప్రధాన రహదారులు సైతం బోసిపోయి కనిపించాయి. అయితే విహారప్రాంతాలకు వెళ్లే రోడ్లపై ముఖ్యంగా పుణే ఎక్స్ప్రెస్ హైవే, గోవా మార్గంతోపాటు పలు మార్గాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ కొంత పెరిగింది. శుక్రవారం ‘బెస్ట్’బస్సులు కూడా పూర్తిస్థాయిలో రోడ్లపైకి రాలేదు. అదే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిక్కిరిసి తిరిగే లోకల్ రైళ్లు కూడా ఖాళీగానే కనిపించాయి. నగరంలో ట్యాక్సీలు, తూర్పు, పశి్చమ ఉపనగరాలలో ఆటోలు కూడా అనుకున్నంత మేర తిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. వైన్ షాపుల వద్ద రద్దీ.. హోళి పండుగ నేపథ్యంలో శుక్రవారం ముంబైతోపాటు థాణే జిల్లాలోని వైన్ షాపుల వద్ద మద్యం కొనుగోలు కోసం మందుబాబులు పెద్దఎత్తున బారులు తీరారు. చేసేందుకు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు. మటన్, చికెన్ కొనుగోళ్లకు కూడా జనం పోటెత్తారు. గురువారంతోపాటు శుక్రవారం మధ్యాహ్నం దాకా ఈ రద్దీ కొనసాగింది. -
బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్ వీడియోలు
దేశంలో హోలీ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సంబరాల్లో ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఆనందించారు. కొందరైతే ‘ఏమీ అనుకోకండి’ అంటూ ఎదుటివారిని ఆటపట్టిస్తూ వారిని రంగుల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో హోలీకి సంబంధించిన లెక్కలేనన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని తెగనవ్వు తెప్పిస్తున్నాయి. 💀💀pic.twitter.com/Q3xav0qzeu— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025రంగు జల్లాడని ఫోను విసిరికొట్టి..సోషల్ మీడియాలో ప్ర్యత్యక్షమైన ఒక వీడియోలో ఒక యువకుడు మంచి దుస్తులు ధరించి నడుచుకుని వస్తుండగా, మరొక యువకుడు అతనిపై రంగులు కుమ్మరిస్తాడు. దీంతో ఆగ్రహంచిన ఆ వ్యక్తి తన సెల్ ఫోనును అతని మీదకు విసరడాన్ని చూడవచ్చు.Phone tod dia uncle ji ne😭 pic.twitter.com/l9FXBsGJZt— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025రంగుపడిందని..మరో హొలీ వీడియోలో ఒక యువతి కుర్చీలో కూర్చున్న అంకుల్పై వెనుక నుంచి రంగు పోస్తుంది. వెంటనే అంకుల్ ఆగ్రహంతో ఫోనును పగులగొడతాడు.Ladai pi kr bhang na kare….Happy Holi!!!#HappyHoli pic.twitter.com/B9PKRhW4C7— RV (@Dominus_vaibhav) March 14, 2025ఇరువర్గాల వివాదం @Dominus_vaibhav అనే యూజన్ ఎక్స్లో షేర్ చేసిన వీడియోలో మద్యం మత్తులో హోలీ ఆడవద్దు అనే వ్యాఖ్యానంతో పాటు, రెండు గ్రూపులు గొడవ పడుతున్న ఒక సీన్ కనిపిస్తుంది.Holi is incomplete without KALESH pic.twitter.com/tNlR0iRKrW— JEET (@saadharan_ladka) March 14, 2025ఏదో జరిగిందిమరో వీడియోలో రెండు గ్రూపులు ఎందుకో గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను చూస్తే ఏదో జరిగింది అని అనిపించడం ఖాయం.Kalesh b/w Two Group of Men During holi celebration and a Kaleshi guy recording itpic.twitter.com/q6hsS8r3S0— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025హోలీలో కొట్టుకుంటున్నారుఇంకొక వీడియోలో దానిని రికార్డు చేస్తున్న వ్యక్తి హోలీలో కొట్టుకుంటున్నారని పెద్దగా అరుస్తూ చెప్పడాన్ని గమనించవచ్చు.😭😭 (Use-Headphones 🎧) pic.twitter.com/8VHeWSF12h— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025తాతకు కోపం వస్తే..ఈ వీడియోలో ఒక తాత దుకాణం ముందు కూర్చుని కనిపిస్తున్నాడు. ఇంతలో హోలీ ఆడుతున్న కొందరు యువకులు అతనిపై రంగులు చిలకరిస్తారు. దీంతో ఆయన ఆగ్రహిస్తూ, కర్రతో వారిని తరిమికొడతాడు.ఇది కూడా చదవండి: Bihar: హోలీ వివాదంలో జోక్యం.. పోలీసు అధికారి హత్య -
తమన్నా బ్రేకప్.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా!
ప్రేమలో ఉన్న మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah Bhatia), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma ) విడిపోయినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు తమన్నా, ఇటు విజయ్ స్పందించకపోవడంతో నిజంగానే విడిపోయారని అంతా భావించారు. ఇలాంటి సమయంలో తమన్నా, విజయ్ తీవ్రమైన బాధలో ఉంటారని అభిమానులు ఊహించారు. కానీ ఇద్దరిలోనూ బ్రేకప్ అయిన బాధే కనిపించడంలేదు. నిన్న జరిగిన హోలీ వేడుకల్లో ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాలకు తమన్నా,విజయ్ హాజరయ్యారు. ప్రేమలో ఉన్నప్పుటు కలిసి వచ్చిన ఈ జంట.. నిన్న మాత్రం విడి విడిగా వచ్చి సెలెబ్రేషన్స్లో పాల్గొన్నారు. అయితే ఇద్దరు ముఖాల్లోనూ బాధలేదు. నవ్వుతూ ఎంట్రీ ఇచ్చారు.ఫోటోగ్రాఫర్లకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్లిపోయారు. ఇలా ఇద్దరు వేరు వేరు ఈవెంట్కి వచ్చి వెళ్లడంతో మరోసారి తమన్నా, విజయ్ల బ్రేకప్ టాపిక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.‘లస్ట్ స్టోరీస్ 2’(2023) వెబ్ సిరీస్లో తమన్న, విజయ్ వర్మ కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఇంతలోనే వీరిద్దరు విడిపోయారు. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుందామని తమన్నా అడిగితే..విజయ్ మాత్ర అందుకు నో చెప్పాడట. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఇంకొంత కాలం కెరీర్పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ అన్నాడట. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి..చివరకు విడిపోయారని బాలీవుడ్ టాక్.అయితే బ్రేకప్పై మాత్రం వీరిద్దరూ ఎక్కడా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Bihar: హోలీ వివాదంలో జోక్యం.. పోలీసు అధికారి హత్య
ముంగేర్: బీహార్(Bihar)లోని ముంగేర్లో దారుణం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో మద్యం మత్తులో మునిగిన కొందరు యువకులు ఒక పోలీసు అధికారి తల పగులగొట్టారు. వెంటనే స్థానికులు ఆ పోలీసు అధికారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.ఈ ఘటనలో రోహ్తక్(Rohtak)కు చెందిన ఏఎస్ఐ సంతోష్ కుమార్ మృతిచెందారు. మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ముఫస్సిల్ పోలీస్ స్టేషన్కు డయల్ 112కు ఫోను వచ్చింది. నందలాల్పూర్లో మద్యం మత్తులో ఇరు వర్గాలు ఘర్ణణ పడుతున్నాయని ఆ ఫోను ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఏఎస్ఐ సంతోష్కుమార్ తన బృందంతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గొడవ పడుతున్న ఇరు గ్రూపులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయితే పోలీసులు ప్రయత్నం ఫలించలేదు. ఇంతలో వారిలో ఒకరు మారణాయుధంతో ఏఎస్ఐ సంతోష్ కుమార్ తల పగులగొట్టారు. వెంటనే అతను స్పృహ తప్పి కింద పడిపోయారు. అతని తల నుంచి విపరీతంగా రక్తం కారసాగింది. దీంతో స్థానికులు, పోలీసులు అతనిని వెంటనే ముంగేర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం సంతోష్ కుమార్ను ముంగేర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పట్నా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సంతోష్ కుమార్ మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు -
హైదరాబాద్ : ఫుల్ జోష్లో హోలీ సంబరాలు (ఫొటోలు)
-
హోలీ రోజు వైట్ శారీలో అదిరిపోయిన అనసూయ (ఫొటోలు)
-
ప్రశాంతంగా ముగిసిన హోలీ, రంజాన్ ప్రార్థనలు
న్యూఢిల్లీ: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జనం రంగుల్లో మునిగితేలారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. హోలీ రంగులతో ఇళ్లు, వీధులు కొత్తరూపు సంతరించుకున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాలతో గడిపారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు రెండో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకేరోజు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల డ్రోన్లు సైతం మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో మసీదు కమిటీల పిలుపు మేరకు హోలీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ పట్టణంలో మొఘల్ పాలకుల కాలంనాటి షాహీ జామా మసీదులో గత ఏడాది నవంబర్లో సర్వే ప్రారంభించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రంజాన్ ప్రార్థనలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదు. సంభాల్లో సంప్రదాయ ‘చౌపాయ్ కా జులూస్’ శాంతియుతంగా జరిగింది. పోలీసుల చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు, రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
డీజే సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్లో హోలీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హైదరాబాద్: హోలీ వేడుకల ముసుగులో గంజాయి
సాక్షి, హైదరాబాద్: నగరంలో హోలీ ముసుగులో గంజాయి వినియోగం కలకలం సృష్టించింది. ఎస్టీఎఫ్ దాడులతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్లతో పాటు గంజాయి బాల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోలీ అంటేనే రంగుల పండుగ. తెలంగాణ మహా రాజధాని హైదరాబాద్లో విభిన్న రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు విభిన్న రీతుల్లో హోలీ సంబరాలు జరుపుకుంటారు.కానీ.. నగరంలో కొందరు హోలీకి భిన్నంగా లోయర్ ధూల్పేట్లోని మల్చిపురాలో కుల్ఫీ ఐస్ క్రీమ్లో గంజాయి, బర్ఫీ స్వీట్లో గంజాయి, సిల్వర్ కోటెడ్ బాల్స్లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారనే సమాచారం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ పోలీసులకు అందింది.ఎస్టీఎఫ్ టీం అంజిరెడ్డి గ్రూపులోని ఎక్సైజ్ పోలీసులు గంజాయి ముసుగులో జరుగుతున్న హోలీ వేడుకల్లో దాడులు నిర్వహించి గంజాయితో తయారైన 100 కుల్ఫీ ఐస్ క్రీమ్ను, 72 బర్ఫీ స్వీట్లను, సిల్వర్ కోటెడ్ బాల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అమ్మకాలు నిర్వహించే సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు
-
అంబరాన్నంటిన హోలీ సంబరాలు
-
Holi 2025 : భూమికి పచ్చాని రంగేసినట్టు, రంగులద్దిన ఫ్యాషన్ క్వీన్స్
హోలీ (Holi2025) పండుగ అంటే ఉల్లాసం, ఉత్సాహం. పిల్లాపెద్దా అంతా అందంగా ముస్తాబవుతారు. ఇంద్రధనుస్సు లాంటి రంగులతో ఆటలాడుకుని తమ జీవితాలు మరింత రంగులమయం శోభిల్లాలని కోరుకుంటారు. రంగు రంగుల రంగులు, గులాల్ చల్లుకొని హోలీ ఆడతారు. ఇక సెలబ్రిటీలయితే అందంగా ముస్తాబై తమ అభిమానులను అలరిస్తారు. రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వయసుతో పని ఏముంది అని నిరూపించారు బాలీవుడ్ హీరోయిన్లు. వారెవరో చూసేద్దామా.2025 హోలీ కోసం సాంప్రదాయ చీరలో మాధురి దీక్షిత్ ( Madhuri Dixit ) ప్రశాంతకు చిహ్నమైన పచ్చని రంగులో అందంగాముస్తాబైనారు. తొమ్మిది గజాల అద్భుతంలో ఆకుపచ్చ రంగులో మాధురి యంగ్ అండ్ ఎనర్జటిక్గా కనిపించారు. 57 ఏళ్ల ఈ బాలీవుడ్ స్టార్ పండుగ కళతో ఉట్టిపడుతూ దేవతలామెరిపించింది.చీర అంటే గుర్తొచ్చే సెలబ్రిటీలలో మాధురి ఒకరు అనడంలో ఎలాంటి సందేహంలేదు. డిజైనర్ జయంతి రెడ్డి రూపొందించిన చీరకు వెండి జర్డోజీ ఎంబ్రాయిడరీ స్వీట్హార్ట్ నెక్లైన్, జుట్టుగా చక్కగా ముడి వేసుకకొని తన సిగ్నేచర్ లుక్కు మరింత వైభవాన్ని జోడించారు. చదవండి: Holi 2025 Celebrations: యంగ్ హీరోయిన్ల ఫ్యావరేట్ కలర్స్ ఇవే! సెలబ్రిటీ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ మాధురి ఎథెరియల్ లుక్ను వజ్రాలు, పచ్చలు నిండిన మహారాణి నెక్లెస్, చెవిపోగులు, ఇతర ఆభరణలతో ఎథ్నిక్ లుక్కు మెరుపు వచ్చేసింది. గ్లామర్ విత్ ట్రెడిషన్ మాధురి షేర్ చేసిన ఫోటోలను ఇన్స్టాలో ఫ్యాన్స్ను ఫిదా చేస్తున్నాయి.చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా! తగ్గేదెలే అంటున్న రవీనా నాకేం తక్కువ అంటూ ఈ హోలీకి వచ్చేశారు మరో సీనియర్ నటి, 52 ఏళ్ల రవీనా టాండన్ (Raveena Tandon). 90ల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ అందమైన దివా , ఈ హోలీకి బ్యూటీ ట్రీట్ను అందించింది. తన అందమైన కళ్ళతో హోలీకి రంగుల కళను తీసుకొచ్చింది. ఇద్దరు బిడ్డలతల్లి, రవీనా దేశీ స్టైల్ గ్లామ్లో మహారాణిలా కనిపించింది. గోధుమరంగు డ్రెస్కు, పింక్ కలర్ దుప్పట్టాను జోడించింది. సొగసైన ఝుంకాలు ఆమె లుక్నుమరింత ఎలివేట్ చేశాయి. హోళికా దహన్ శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. -
అక్కడ పది రోజులపాటు హోలీ వేడుకలు
నవసారి: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు(Holi celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నాపెద్దా అంతా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకరోజు జరుగుతాయి. కానీ ఆ ప్రాంతంలో ఏకంగా 10 రోజుల పాటు హోలీ వేడుకలు కొనసాగుతాయి. గుజరాత్లోని ఆదివాసీ జనబాహుళ్యం కలిగిన డాంగ్ జిల్లాలో హోలీ ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.డాంగ్ జిల్లాలో జరిగే హోలీని రాజుల హోలీ(Holi of the Kings)గా చెబుతారు. డాంగ్ జిల్లాలో నేటికీ ఐదుగురు రాజవంశస్థులు ఉన్నారు. ఏడాదిలో ఒకసారి ఈ రాజులను బహిరంగంగా గౌరవపూర్వకంగా సన్మానిస్తారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనిని డాండ్ దర్బార్ మేళా అని అంటారు. ఈ ఉత్సవాల్లో ఆ రాజులను రథాలలో కూర్చోబెట్టి వేదిక దగ్గరకు తీసుకువచ్చి, ఘనంగా సన్మానిస్తారు. వీరికి ప్రభుత్వం ఫించను అందజేస్తుంది. పది రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో ప్రతీరోజూ ఇక్కడి ఆదివాసీ మహిళలు సాయంత్రం వేళల్లో జానపద గీతాలు ఆలపిస్తారు. అలాగే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతలోని చిన్నారులు తమ మేనమామలకు హోలీ స్నానం చేయిస్తారు. చిన్నారులను స్థానికులు భక్త ప్రహాదుని రూపాలుగా భావించి పూజలు చేస్తారు.ఇది కూడా చదవండి: ‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన -
హైదరాబాద్ లో అంబరాన్నంటిన హోలీ వేడుకలు.. (ఫొటోలు)
-
Holi 2025: పసందైన సినీ హోలీ పాటలు
హోలీ పండుగ అంటేనే సంబరాలు పండుగ. హోలీకి సంబంధించిన అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాగే సరదా సంబరాల పండుగలో పాటలు లేకుండా సరదా ఏముంటుంది. సినీ పరిశ్రమలో ఎన్నో పాటలు రంగుల వసంతాలను వెదజల్లాయి. తెలుగు సినిమా పాటల్లో హోలీ సంబరం కనిపిస్తుంది. మచ్చుకు కొన్ని పాటలు... 71 సంవత్సరాల హోలీ సాంగ్... మణిరత్నం–కమల్హాసన్ ‘నాయకుడు’ సినిమాలోని హోలీ పాట ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ ప్రతి హోలీ సందర్భంగా ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘రాఖీ’లో ‘రంగ్ బర్సే’ హోలీ పాట బాగా పాపులర్.నాగార్జున ‘మాస్’ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ హోలీ పండగ రోజున చెవిన పడాల్సిందే వెంకటేష్ ‘జెమిని’లో ‘దిల్ దివానా.. మై హసీనా’ హోలీ నేపథ్యంలో వినిపిస్తుందిప్రణయ విలాసములే. శివాజీ గణేషన్ సినిమా ‘మనోహర’ సినిమాలోనిది ఈ పాట. వీటితోపాటు గోపాల గోపాల, విజయ్ దేవర కొండ, మెహ్రీన్.. ‘హోలీ’ స్పెషల్ సాంగ్ , సీతారామరాజు సీనిమాలోని నాగార్జున, హరికృష్ణ, సాక్షి శివానంద్, ఆట ఆరంభం: అజీత్ కుమార్, రాణా, నయన తార నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాల్లోని పాటలు ఉన్నాయి. హోలీ -పురాణగాథలుచెడు అంతానికి సంకేతంవద్దని చెప్పినా శ్రీమహావిష్ణువునే స్మరిస్తున్న ప్రహ్లాదుడిని చంపాని తన సోదరి హోలికను ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని హోలిక మంటల్లో దూకుతుంది. విష్ణునామ స్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి చీమ కుట్టినట్లు కూడా కాదు. హోలిక మాత్రం కాలి బూడిద అవుతుంది, ఆ బూడిదే చెడు అంతానికి సంకేతం.చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!కాముని పున్నం శివుని భార్య సతీదేవి దక్ష ప్రజాప్రతి యజ్ఞంలో దేహాన్ని విసర్జింపగా శివుడు విరాగిౖయె హిమవత్ పర్వతంపై తపస్సు చేయసాగాడు. రాక్షసుల బాధలు పడలేని దేవతలు తపస్సులో ఉన్న శివుడి దీక్షను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. పార్వతిగ పుట్టిన సతీదేవిపై శివుడికి ప్రేమ కలిగించవలసిందిగా దేవతలు మన్మథుణ్ణి కోరారు. మన్మథుడు తన భార్య రతీదేవి మిత్రుడు వసంతుడితో కలిసి హిమవంతం చేరాడు. పార్వతీదేవి సపర్యలు చేస్తున్న సమయంలోశివుడిపై మన్మథుడు పుష్ప బాణాలు ప్రయోగించాడు. తన దివ్యదృష్టితో కాముని చర్యలు గ్రహించిన శివుడు కోపంతో ముక్కంటితో దహించాడు. కాముడి రూపంలో ఉన్న మన్మథుడిని దహించి వేయడాన్ని ‘కాముని దహనం’ ‘కాముని పున్నం’గా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రజలు పండుగ చేసుకుంటారు.కాముని పున్నంకృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు రాజు ఉండేవాడు. పసిపిల్లలను ‘హోలిక’ అనే రాక్షసి హింసిస్తోందని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు. అదే సభలో ఉన్న నారద మహాముని ‘ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికను పూజించిన పసిపిల్లలకు బాధలు ఉండవు’ అని చెప్పాడు. ఆనాటి నుంచి ఈ హోలీ ఉత్సవం జరుగుతోందని ప్రతీతి.‘రంగుల’ రాట్నం పురాతన కాలంలో గ్రీస్లో ‘నీలం’ రంగుకు నేరుగా సరిపోయే పదం లేదు. దగ్గరి వర్ణనలు మాత్రమే ఉండేవి ఆఫ్రికా ఎడారి తెగ ప్రజలు ‘ఎరుపు’ వర్ణాన్ని ఆరు పేర్లతో పిలుస్తారు. పురాతన కాలంలో ఈజిప్షియన్లు, మాయన్లు వేడుకలలో తమ ముఖానికి ఎరుపు రంగు పూసుకోవడం తప్పనిసరిగా ఉండేది. రోమన్ సైన్యాధిపతులు తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి శరీరానికి ఎరుపురంగు వేసుకునేవారు. కలర్ అసోసియేషన్ల ద్వారా వ్యక్తిత్వ లోపాలను నిర్ధారించేవాడు... డాక్టర్ మాక్స్ లుషర్. ∙వన్స్ అపాన్ ఏ టైమ్ రోమన్ల కాలంలో క్యారెట్లు ఉదా, తెలుపు రంగులలో ఉండేవి. మధ్య యుగాలలో నలుపు, ఆకుపచ్చ రంగులలో కూడా ఉండేవి.కలర్ మ్యాజిక్ వర్డ్స్: సెలాడాన్–లేత ఆకుపచ్చ రంగు, ల్యూటీయన్–డీప్ ఆరెంజ్, కెర్మెస్–ప్రకాశవంతమైన ఎరుపు, సినోపర్–ముదురు ఎరుపు–గోధుమ రంగు, స్మాల్డ్–డీప్ బ్లూ. చదవండి : Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! -యంబ నర్సింహులు, సాక్షి, ప్రతినిధి, యాదాద్రి భువనగిరి -
‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన
దేశంలో హోలీ వేడుకలు(Holi celebrations) అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. వాడవాడలా జనం ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటూ ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే హోలీ వేళ భద్రతా విధులు చేపడుతున్న పోలీసులు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సివస్తోంది. దీంతో వారు కొంతమేరకు అసంతృప్తికి లోనవుతున్నారు.ఒక పోలీసు తాను కుటుంబ సభ్యులతో హోలీ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నానంటూ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్గా మారింది. సాధారణంగా పండుగలకు ఎవరికైనా సెలవు ఉంటుంది. అలా లేని పక్షంలో ఆఫీసులో సెలవు పెట్టుకుని, పండుగపూట ఇంటిలోని వారితో ఆనందిస్తుంటారు. అయితే తనకు గత 27 ఏళ్లుగా ఎప్పుడూ ఇంటిలోనివారతో హోలీ ఆడేందుకు అవకాశం రాలేదని కానిస్టేబుల్(Constable) సంజీవ్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. यूपी पुलिस के संजीव कुमार सिंह जी का वीडियो देखकर मन बड़ा चिंतित हुआ जिन्होंने लगातार 27 साल सेवा दी हैलेकिन संजीव कुमार जी की माता जी का भी देहांत पिछले साल हुआ है और उनकी इस बार पहली होली है गांव में उनकी उपस्थिति अनिवार्य है लेकिन छुट्टी नहीं मिल पाई है और लगातार कुंभ में भी… pic.twitter.com/MGZgbtGtPm— Adv Deepak Babu (@dbabuadvocate) March 13, 2025ఈ వీడియోలో సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ‘ఫ్రెండ్స్, ఈ రోజు నేనెంతో ఆవేదన చెందుతున్నాను. నేను గత 27 ఏళ్లుగా పోలీసు డ్యూటీ నిర్వహిస్తున్నాను. ఈ 27 ఏళ్లలో ఎన్నడూ ఇంటిలోని వారితో హోలీ చేసుకోలేదు. మహాకుంభ్ డ్యూటీ ముగిశాక సెలవు దొరుకుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మేముండే హర్దోయీ(యూపీ)కి వెళ్లలేను. జనమంతా స్వస్థలాలకు వెళ్లి, హోలీ వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసు విధుల కారణంగా నేను ఇంటికి రాలేనని ఇంటిలోని వారికి చెప్పాను’ అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఇదేం హోలీరా బాబూ.. వీడియో వైరల్ -
Holi 2025 యంగ్ హీరోయిన్ల ఫ్యావరేట్ కలర్స్ ఇవే!
భువిపై విరిసే ఇంధ్రధనుస్సుఇంధ్ర ధనుస్సు నేలకు దిగి వచ్చిందా... అనిపించే రోజు హోలీ. సప్తవర్ణాలలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది.ఆ ఇష్టాన్ని తమ డ్రెస్సుల ద్వారా చూపుతుంటారు. సినిమా తెరపైన రంగు రంగుల దుస్తుల్లో కనిపించే తారలు తమకు ప్రత్యేకించి ఇష్టమైన రంగు గురించి ఈ హోలీ సందర్భంగా మనతో పంచుకుంటున్నారు. బ్లూ అండ్ పింక్ నాకు నచ్చిన రంగు పింక్. పెరుగుతున్న కొద్దీ అన్ని రంగులు నచ్చుతుంటాయి. కానీ, ఎక్కువ భాగం అయితే పింక్, బ్లూ కలర్స్ నా డ్రెస్సింగ్లోనూ చోటు చేసుకుంటుంటాయి. – శివాత్మిక రాజశేఖర్మల్టీ కలర్స్ నా జీవితంలో ఇంధ్రధనస్సు రంగులన్నీ ఉండాలనుకుంటాను. ఎందుకంటే, మనలోని భావోద్వేగాలను తెలియజేప్పేవే రంగులు. సప్తవర్ణాలన్నీ నాకు ఇష్టమైనవే. అందుకే నా డ్రెస్సులలో మల్లీ కలర్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. ఒక ప్లెయిన్ కలర్ శారీ లేదా డ్రెస్ వేసుకుంటే దాని మీదకు మల్టీకలర్ బ్లౌజ్, దుపట్టా ఉండేలా చూసుకుంటాను. – సంయుక్త మీనన్చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!అన్ని రంగులను స్వాగతించే తెలుపు నాకు తెలుపు రంగు చాలా ఇష్టం. శాంతి, కొత్త ప్రారంభాలు, అంతులేని అవకాశాలకు చిహ్నం తెలుపు. రంగులతో నింపుకోవడానికి వేచి ఉండే ఖాళీ కాన్వాస్ లాంటిది తెలుపు. ఇది అన్నింటినీ స్వాగతించే రంగు. అందుకే ఈ రంగు నాకు స్ఫూర్తిమంతమైనది కూడా. ప్రేమ, దయ, ఆనందాన్ని వ్యాప్తి చేసే ఈ వేడుక సందర్భంగా తెల్లని మన హృదయాలపైన అందమైన రంగులను చిలకరించుకుందాం. – వైష్ణవి చైతన్యచదవండి: Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! గ్రీన్ అండ్ పర్పుల్నాకు చాలా ఇష్టమైనది ఎల్లో. దీనిలోనే మరింత బ్రైట్గా ఉండే డ్రెస్సులను ఎంచుకుంటాను. దీంతో పాటు పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్స్ ఇష్టపడతాను. ఈ రంగులోనే పీచ్ కలర్ డ్రెస్సులు ధరించినప్పుడు ఉల్లాసంగా అనిపిస్తుంది. అవి నన్ను ప్రత్యేకంగా చూపుతాయి అనే భావన ఉంటుంది – రెజినా కసండ్రాప్రతి ఒక్కరికి కొన్ని రంగులు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అయితే, దుస్తుల విషయంలో మాత్రం కొన్ని రంగులు మాత్రమే వారి శరీరానికి నప్పేవిధంగా ఉంటాయి. ఏ రంగు డ్రెస్ ఎవరికి నప్పుతుందంటే... సాధారణంగా చీరలు ఎంపిక చేసుకుంటున్నప్పుడు వాటిని మన మీద వేసుకొని, కలర్ బాగుంటుందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకుంటుంటాం. కొంత మంది చర్మం ఫెయిర్గా ఉంటుంది. కానీ, డార్క్ కలర్స్ సెట్ అవవు. అలాంటప్పుడు లైట్ షేడ్స్ లేదా మల్టీకలర్స్ని ఎంపిక చేసుకోవచ్చు. వీరు సేమ్ స్కిన్ టోన్ కలర్ డ్రెస్సులు ఈవెనింగ్ పార్టీలకు ధరిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు డార్క్ స్కిన్ ఉన్నవారికి లేత రంగులు బాగుంటాయి అనుకుంటారు. కానీ, వీరికి డార్క్ కలర్స్ బాగుంటాటాయి.తమకు నప్పే కలర్ డ్రెస్ ఎంపికకు డిజైనర్ సలహాలు తీసుకుంటారు. అలాంటి వారికి కలర్ కాన్సెప్ట్ గురించి వివరిస్తాం. వారి శరీర రంగు, సందర్భం, పార్టీ .. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని డిజైన్ చేస్తాం. రీ యూజ్... రంగులు చల్లుకున్నాక వేసుకున్న డ్రెస్ మల్టీకలర్తో నిండిపోతుంది. ఆ డ్రెస్ పైన ఏ కలర్ భాగం ఎక్కువుందో చూసుకొని, ఆ రంగుతో డైయింగ్ చేయించి, తిరిగి వాడుకోవచ్చు. -నవ్యశ్రీ మండవ, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
Holi 2025 వర్చువల్ హోలి,నలభై రోజుల హోలీ!
హోలి అంటే యువతరం పండగ. ఆనందం ఆకాశాన్ని అంటే పండగ. దీన్ని దృష్టిలో పెట్టుకొని వర్చువల్ హోలిని ముందుకు తెచ్చాయి శాంసంగ్,స్నాప్చాట్. సాంకేతికతకు, సంప్రదాయాన్ని జోడిస్తూ హోలి వేడుకలకు కొత్త రంగు జోడించాయి శాంసంగ్, స్నాప్చాట్ సంస్థలు. ఏఐ ఆధారిత ఏఆర్ లెన్స్తో హోలీ వేడుకలకు డిజిటల్ రంగును జోడించాయి. ఇంటరాక్టివ్ ఫేస్–పెయింటింగ్ ఎఫెక్ట్ ద్వారా హోలీ రంగులు వచ్చువల్గా అనుభవంలోకి వస్తాయి. పైనల్ స్క్రీన్ డిస్ప్లేలో ‘హోలి మెసేజ్’ కనువిందు చేస్తుంది. ‘77 శాతం మంది హోలి వేడుకలను సృజనాత్మకంగా, కొత్తగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఏఆర్ లెన్స్లనుఇష్టపడుతున్నారు’ అంటుంది స్నాప్ ఇంక్ ఇండియా అడ్వర్టైజింగ్ హెడ్ నేహా జోలి. వర్చువల్ హోలి ‘ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్తో కలిపి హోలి బాగా ఆడేవాడిని. వారు విదేశాల్లో ఉండడం వల్ల ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను’ అని ఇక ముందు బాధ పడనక్కర్లేదు. ఫ్రెండ్స్ ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు ఉన్నా సరే, వర్చువల్ హోలి పుణ్యమా అని పండగ సంతోషాన్ని సొంతం చేసుకోవచ్చు. వర్చువల్ హోలి పార్టీలు ఇప్పుడు ట్రెండ్గా మారాయి!చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా! నలభై రోజుల హోలీ! ఉత్తరాఖండ్లో హోలీని ‘కుమావోనీ’ హోలీగా జరుపుకుంటారు. ఇది బసంత్ పంచమితో ప్రారంభమయ్యే నెలరోజుల ఉత్సవం. దీన్ని బైతక్ హోలీ, నిర్వైన్ హోలీ అని కూడా పిలుస్తారు శివుడు కొలువు తీరిన వారణాసిలో శ్మశానంలో దొరికే బూడిదతో హోలీ వేడుకలు జరుపుకుంటారు. ఈ హోలిని ‘మసన్ హోలీ’ అని పిలుస్తారు.రాజస్థాన్లోని జోథ్పూర్లో చారిత్రాత్మకమైన ‘ఘన్శ్యామ్ జీ మందిర్’ ప్రాంతంలో హోలీ ఉత్సవాన్ని 40 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ హోలీ ఉత్సవాలను చూడడానికి స్థానికులే కాదు విదేశీయులు కూడా వస్తారు. ఈ ఆలయాన్ని 1718లో నిర్మించారు పండగకి రెండు రోజుల ముందే ఉత్తర్ప్రదేశ్లోని బృందావన్లో వితంతువులు హోలీ వేడుకలు మొదలుపెడతారు.ఉత్తర్ప్రదేశ్లో ‘లాత్మార్ హోలీ’ వేడుకలు జరుగుతాయి. పురుషులను కర్రలతో తరుముతూ, వారిని రెచ్చగొట్టేలా మహిళలు పాటలు పాడతారు ∙హోలీని మన దేశంలోనే కాదు నేపాల్, శ్రీలంకలాంటి దేశాల్లోనూ జరుపుకుంటారు. నేపాల్లో ‘భోటే ఉత్సవ్’ అని, శ్రీలంకలో ‘పులంగి’ అనీ పిలుస్తారు.హోలీ... అరవై వేల కోట్ల వ్యాపారం! గత ఏడాదితో పోల్చితే 20 శాతం వృద్ధితో ఈ సంవత్సరం హోలీ పండగకు సంబంధించి రూ.60,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. మూలికరంగులు, పండగ వస్తువులు, స్వీట్లు, వాటర్ గన్స్, బెలూన్లు, వైట్ టీ–షర్ట్లు, కుర్తా–పైజామాలు, హ్యాపీ హోలి స్లోగన్లతో ఉన్న టీ–షర్ట్లు... మొదలైన వాటికి పెరిగిన డిమాండ్ దేశవ్యాప్తంగా హోలీ పండగ వాణిజ్యాన్ని పెంచింది. ఈ డిమాండ్ రిటైలర్లు, చిన్న వ్యాపారులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఎఐటి) తెలియజేసింది చదవండి: Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! -
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు షురూ..(ఫొటోలు)
-
వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా నేడు ప్రజలంతా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.హోలీ పండుగ సందర్బంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ హోలీ మీ అందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు.#happyholi2025— YS Jagan Mohan Reddy (@ysjagan) March 14, 2025 -
హైదరాబాద్లో ఫుల్ జోష్లో హోలీ సంబరాలు (ఫొటోలు)
-
హోలీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
ఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా ప్రజలంతా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు .ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఐకమత్యం, స్పూర్తిని హోలీ ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మరోవైపు.. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా..‘మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఆనందంతో నిండిన ఈ పండుగ ప్రతీ ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపుతుంది. హోలీ పండుగ దేశ ప్రజల ఐక్యతను మరింతగా పెంచుతుంది అంటూ కామెంట్స్ చేశారు.आप सभी को होली की ढेरों शुभकामनाएं। हर्ष और उल्लास से भरा यह पावन-पर्व हर किसी के जीवन में नई उमंग और ऊर्जा का संचार करने के साथ ही देशवासियों की एकता के रंग को और प्रगाढ़ करे, यही कामना है।— Narendra Modi (@narendramodi) March 13, 2025 -
అమ్మ శ్రమలో ఎన్ని రంగులో!
ఉదయాన్నే అమ్మ వేసే ముగ్గు రంగు తెలుపు. చల్లే కళ్లాపి ఆకుపచ్చ. గడపకు రాయాల్సింది పసుపు. నాన్నకు పెట్టాలి గోధుమ రంగు టీ. బాబు షూస్ పాలిష్ చేయాలి కదా నల్లగా. పాపాయికి కట్టాలి ఎర్ర రిబ్బన్. బట్టల సబ్బు రంగు నీలం. వంట గది నిండా మెటాలిక్ కలర్ పాత్రలే. కాటుక, తిలకం కంటే ముందు అమ్మకు అంటేది శ్రమ తాలూకు రంగులే. లోకానికి ఒకటే హోలి. అమ్మకు నిత్యం హోలి. నేడు అమ్మకే చెప్పాలి రంగు రంగుల కృతజ్ఞత.ప్రతి ఒక్కరి జీవితంలో రంగు రంగుల కలలు ఉంటాయి. అయితే స్త్రీలు ఆ రంగుల కలలను అందుకోవడంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. పరిమితులు ఎదురవుతాయి. వారు ఈ రంగులకు మాత్రమే అర్హులు అనే కనిపించని నియమాలు ఉంటాయి. పరిస్థితి చాలా మారినా స్త్రీ ఏదో ఒకదశలో రాజీ పడాలి. అయితే భారతీయ స్త్రీ ఆ రాజీని ఇష్టంగానే స్వీకరిస్తుంది. ముఖ్యంగా వివాహం అయ్యాక, తల్లిగా మారాక తాను కన్న రంగుల కలలన్నీ తన సంతానానికి ఇచ్చేస్తుంది. భర్త, పిల్లల సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. వారి కేరింగ్ కోసం రోజూ అంతులేని శ్రమ చేస్తుంది. ఆ పనుల్లోనే ఆమెకు రంగుల ప్రపంచం తెలియకుండానే ఎదురవుతుంటుంది. అమ్మకు రంగులు తోడవుతాయి. అవి ఆమెను అంతో ఇంతో ఉత్సాహ పరచడానికి ప్రయత్నిస్తాయి. కావాలంటే గమనించండి.అమ్మ శ్రమలో తెలుపు రంగు అడుగడుగునా ఉంది. ఆమె నిద్ర లేవడమే పాలు పోయించుకోవాలి. ముగ్గు వేయాలి. పిల్లలకు స్కూలుకు సిద్ధం చేసి తెల్లటి పౌడర్ రాయాలి. వెన్న కంటే తెల్లనైన ఇడ్లీల కోసం రాత్రే పిండి గ్రైండర్లో వేసుకోవాలి. తెల్ల యూనిఫామ్ ఉతికి సిద్ధం చేయాలి. తెల్లటి ఉప్పు, పంచదార తాకకుండా ఆమెకు జీవితం గడవదు. మునివేళ్ళకు ఆ తెల్లరంగు పదార్థాలు తాకుతూనే ఉంటాయి. ఎండలో వడియాలూ? టెంకాయ తెచ్చి పగులగొట్టి కొబ్బరి తీయడం ఆమెకు గాక ఇంటిలో ఎవరికీ రాదు. రాత్రిళ్లు అత్తామామలకు పుల్కాల కోసం ఆశీర్వాద్ ఆటాతో చేతులు తెల్లగా చేసుకోవాలి. ఆమే అన్నపూర్ణ. తెల్లటి అన్నం ఆమె చేతి పుణ్యం. ఆ వెంటనే ఆమెకు ఆకుపచ్చ ఎక్కువగా కనపడుతుంటుంది. కూరగాయలన్నీ ఆ రంగువే. ఇంట్లో మొక్కలకు ఆమే నీరు పోయాలి. ఆకుపచ్చ డిష్ వాషర్ను అరగదీసి గిన్నెలు కడిగి కడిగి చేతులు అరగదీసుకోవాలి. హెల్త్ కాన్షియస్నెస్ ఉన్న భర్త రోజూ ఆకుకూరలు ఉండాల్సిందే అంటాడుగాని పొన్నగంటి కూరో, కొయ్య తోటకూరో ఆకులు తుంచి కవర్లో వేయమంటే వేయడు. చేస్తే తప్ప ఆ పని ఎంత పనో తెలియదు.ఎరుపు రంగు అమ్మ పనిలో భాగం. ఇంటికి ఆమె ఎర్రటి జాజుపూతను అలుకుతూ ఉంటే వాకిలి నిండా మోదుగుపూలు రాలినట్లు అనిపిస్తుంది. అమ్మ ఉదయాన్నే స్నానం చేసి, దేవుడి పటాల ముందు నిలిచి అరుణ కిరణం లాంటి ఎర్రటి కుంకుమను వేలికొసతో అందుకొని, నుదుటి మీద దిద్దుకొని, దీపం వెలిగించాకే దేవుడు ఆవులిస్తూ నిద్రలేచేది. అమ్మ మునివేళ్ల మహిమకు సూర్యుడు కూడా ఆమె పాపిట్లో సిందూరమై ఒదిగిపోతాడు. ఎర్రటి ఆవకాయలు, పచ్చళ్లు చేతులను మంట పుట్టించినా అమ్మ చిర్నవ్వు నవ్వుతూనే ఉంటుంది. ఆమె చేయి కోసిన టొమాటోలు ఎన్ని వేలో కదా.అయితే అమ్మకు తనకంటూ కొన్ని రంగులు ఇష్టం. గోరింట పండితే వచ్చే ఎరుపు ఇష్టం.. మల్లెల తెలుపు ఇష్టం... తన ఒంటిపై మెరిసే నగల బంగారు వర్ణం ఇష్టం, మట్టి గాజుల రంగులు ఇష్టం, పట్టీల వెండి వర్ణం ఇష్టం, గోర్ల రంగులు ఇష్టం, కురుల నల్ల రంగు ఇష్టం, తాంబూలపు ఎరుపు ఇష్టం, కొద్దిగా మొహమాట పడినా లిప్స్టిక్ రంగులూ ఇష్టమే. పసుపు ఇంటికీ, అమ్మకూ శుభకరం. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా పసుపు డబ్బా తీసుకుని అమ్మ పరిగెడుతుంది. తీరిక ఉన్నప్పుడు గడపలకు రాస్తుంది. తను తాగినా తాగకపోయినా పిల్లలకు పాలలో కలిపి ఇస్తుంది. ఇక బ్లూ కలర్ అమ్మకే అంకితం. గ్యాస్ స్టవ్ మీద నీలం రంగు మంట ఆమెను ఎప్పటికీ వదలదు. ఇక జీవితాంతం బట్టల సబ్బు, సర్ఫ్ను వాడుతూ బట్టలు శుభ్రం చేయడమో చేయించడమో చేస్తూనే ఉండాలి. కనీసం హార్పిక్ వేసి టాయిలెట్లు కడగరు ఇంటి సభ్యులు. అదీ అమ్మ చాకిరే. నీలి మందు వేసి తెల్లవి తళతళలాడించడం, ఇస్త్రీ చేయించడం ఆమెకు తప్పదు. బట్టల హోమ్వర్క్లు చేయిస్తే బాల్పాయింట్ పెన్నుల నీలి గుర్తులు ఆమె చేతుల మీద కనిపిస్తాయి. ఇక నలుపు ఆమెకు ఏం తక్కువ. బూజు నుంచి అంట్ల మసి వరకు ఆమెకు ఎదురుపడుతూనే ఉంటుంది.ఇవాళ హోలి. కనీసం ఇవాళ అయినా అమ్మకు విశ్రాంతినిచ్చి ఆమెకు ఇష్టమైన రంగుల్లో ఇష్టమైన బహుమతులు ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి. -
Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!
హోలీ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. సరదాలు, రంగులు కలగలిసిన చక్కటి రంగుల పండుగ హోలీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఒకరిపై ఒకరు సంతోషంగా రంగులు జల్లుకుంటూ సంబరంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ హోలీ వెనుక అనే పురాణగాథలున్నాయి. అంతేకాదు పండుగ వేడుకల్లో ఆరోగ్యకరమైన ఆయుర్వేదకర ప్రయోజనాలున్నాయి. వణికించే చలి పులి పారిపోతుంది. వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ గాలి మార్పు కారణంగా జ్వరాలు, జలుబూ మేమున్నాం అంటూ వచ్చేస్తాయి. వీటిని అడ్డుకునేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడులను నీళ్లలో కలిపి చల్లుకునేందుకు ఈ వేడుక పుట్టిందని పెద్దలు చెబుతారు. కానీ కాలక్రమంలో సహజమైన రంగుల స్థానంలో రసాయనాలుమిళితమైన ప్రమాదక రంగులు వచ్చి చేరాయి. పైగా నాచులర్ కలర్స్తో పోలిస్తే చవగ్గా దొరుకుతాయి. అందుకే ఇంట్లోనే తక్కువగా ఖర్చుతో ఆర్గానిక్గా తయారు చేసుకునే కలర్స్ గురించి తెలుసుకుందాం. తద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు ప్రకృతిని కాపాడుకున్నవారమవుతాం.పండుగ వేడుక అంటే సంతోషాన్ని మిగిల్చాలి. ఆనందంగా గడిపిన క్షణాలు మనకు లేనిపోని సమస్యల్ని, రోగాలను తీసుకు రావడం కూడదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మందారం, బంతి, చేమంతిలా పూలతోపాటు, గోరింటాకుతో పచ్చని రంగు, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగులు తయారు చేసుకోవచ్చు. మోదుగుపూల రసాన్ని మర్చిపోతే ఎలా? మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హోలీ పండుగ పూట చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరి చేరవని అంటారు.పసుపు: బంతి పువ్వులు, నారింజ తొక్కల పొడి, చేమగడ్డ పొడి, పసుపు వంద సమపాళ్లలో తీసుకొని కలుపుకోవాలి.దీనికి కొద్దిగా నిమ్మ రసం వేసి ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే చక్కటి పసుపు రంగు తయారవుతుంది. దీన్ని నీళ్లలో కలుపుకుంటే లిక్విడ్ కలర్గా మారిపోతుంది.ఎరుపు: మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. వీటిని మెత్తని పొడిగా నూరుకుంటే ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఇది ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే దీనికి కొంచెం బియ్యప్పిండి యాడ్ చేసుకుంటే చాలు.మందారంతోపాటు ఎర్ర చందనం పౌడర్(కొంచెం ఖరీదైనదే)కలిపితే రెడ్ కలర్ తయారవుతుంది. ఎర్ర చందనం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తడి, పొడి రూపంలో వాడుకోవచ్చుగోధుమరంగుగోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్ర మాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్య ప్పిండిని కలిపితే చాలు.నీలం: జకరండ లేదా బ్లూ, ఊదా గుల్మొహార్ ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. అలాగే నీలం రంగు శంఖు పుష్పాలను నీళ్లలో నానబెడితే చక్కటి నీలం రంగు తయారవుతుంది. ఆకుపచ్చ: గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్య కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా సిద్దం చేసుకోవచ్చు.కాషాయం: మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెడితే పసుపు కాషాయం రంగుల మిశ్రమంతో చక్కటి రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. గోరింటాకును నూరి నీటిలో కలిపి, కొద్దిసేపు ఉంచి వడబోసుకుంటే ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును (ఇది కూడా చాలా ఖరీదైనది) రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికి కాషాయం రంగు తయారవుతుంది.గులాబీ: హోలీ ఆటలో చాలా ప్రధానమైన గులాల్ గులాబీ రంగులో ఉంటుంది. బీట్ రూట్ (నీటిలో మరగబెట్టి) రసం ద్వారా దీన్ని తయారు చేయొచ్చు. బీట్ రూట్ను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దీనికి శెనగ, పిండి, బియ్యం, గోధుమ పిండిని కలుపుకోవచ్చు. -
హోలీ..జోష్ హైలీ
హోలీ సంబరాలకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, నానక్రామ్గూడ, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో విశాలమైన వేదికలను ఏర్పాటు చేశారు. కొన్ని ఈవెంట్లలో చర్మానికి హాని చేయకుండా ఉండే రసాయనాలు లేని ఆర్గానిక్ రంగులను మాత్రమే అనుమతిస్తుండటం విశేషం. ఈ హోలీని మరింత సంబురంగా మార్చడానికి ముంబై,బెంగళూరు, ఢిల్లీ వంటి వివిధ నగరాల నుంచి ప్రముఖ డీజేలు నగరానికి చేరుకున్నారు. మరి కొందరు నిర్వాహకులు.. ఈ వేడుకల్లో వినూత్నంగా సాంస్కృతిక సంబరాలను నిర్వహించనున్నారు. దీని కోసం బ్యాండ్ బాజా, డోల్ దరువు, జానపద హొయలు పలికే డప్పులను నగరానికి ఆహా్వనించారు. \వందకు పైగా ఈవెంట్స్కు ఏర్పాట్లు రిస్టార్టులు, క్లబ్స్, పబ్లిక్ గ్రౌండ్స్లో భారీస్థాయిలో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ భారీ వేదికల్లో 5 వేల నుంచి 15 వేల మందికి సరిపడా సౌకర్యాలు, విశాల ప్రాంగణాలు సిద్ధం చేశారు. ఇలాంటి భారీ హోలీ ఫెస్టివల్స్ సుమారు 30 నుంచి 40 వరకు నిర్వహిస్తుండగా.. మొత్తం నగరంలో వందకు పైగా హోలీ పబ్లిక్ ఈవెంట్స్కు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనడానికి ఎంట్రీ పాస్ కోసం రూ.500 నుంచి రూ.5,000 వేలకు పైగా వసూలు చేసే ఈవెంట్స్ ఉన్నాయి. కొందరు నిర్వాహకులు రంగులను ఉచితంగా అందిస్తుంటే మరికొందరు రంగులతో పాటు ఫుడ్ – డ్రింక్స్ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్లు హోలీ లవర్స్ను ఆకర్షించడానికి పలువురు సినీతారలను, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, స్పోర్ట్స్ సెలబ్రెటీలను ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తున్నారు.60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్గ్రౌండ్ స్టేజ్తో..లాత్మర్ హోలీ మీట్స్ టాలీవుడ్ పేరుతో నగరంలో అతిపెద్ద హోలీ సంబరాలను హైటెక్ ఎరీనాలో నిర్వహించనున్నారు. 60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్గ్రౌండ్ స్టేజ్తో నగరంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు. ఇందులో రంగుల సోయగాలతో పాటు సంగీతం, సెలబ్రెటీలతో అలరించనున్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లోని అంథమ్ వేదికగా నియాన్ హోలీ పార్టీ 2025కి ఘనంగా ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్ బీట్స్తో లైవ్ మ్యాజిక్ ఉంటుంది. సుచిర్ ఇండియా ఆధ్వర్యంలో నగర శివార్లలోని హానీ బర్గ్ రిసార్ట్స్ వేదికగా హోలీ ఉత్సవ్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పదేళ్లుగా రంగ్ బర్సే..పదేళ్లుగా నగరంలో హోలీ సంబరాలను వినూత్నంగా నిర్వహిస్తున్నాం. ఈ సారి సిటీలోని యోలో ఎరీనాలో రంగ్ బర్సే 9.0 పేరుతో భారీ స్థాయిలో హోలీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఇందులో మ్యూజిక్తో పాటు రెయిన్ డ్యాన్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. హోలీ థీం టీ షర్ట్తో పాటు స్పెషల్ డ్రింక్స్, మీల్ బాక్స్ అందిస్తున్నాం. మా ఫెస్టివల్లో కార్పొరేట్ ఉద్యోగులు, యూత్తో పాటు కుటుంబ సమేతంగా పాల్గొనే వారు ఎక్కువగా ఉన్నారు. సిటీలో హోలీ అంటే ట్రెండీ కల్చర్గా మారింది. దీనికి అనుగుణంగానే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. 4 వేల మంది వరకు మా వేడుకల్లో పాల్గొంటారని అంచనా. – శరత్, రంగ్ బర్సే 9.0 నిర్వాహకులు మ్యూజిక్, డ్యాన్సింగ్తో పాటు బ్రుక్ ది పాట్ వంటి విభిన్న కార్యక్రమాలతో ఈ సంబరాలను ఏర్పాటు చేస్తున్నారు. సిటీలోని శ్రీపలాని కన్వెన్షన్ వేదికగా హోలీ మహోత్సవ్ 2.0 పేరుతో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్ జరుపుతున్నారు. ఇందులో డీజే, లైవ్ డోల్, ఓపెన్ స్కై ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వేడుకల్లో బిగ్ బాస్ ఫేం అశ్వినీశ్రీ, శుభశ్రీ కలర్ఫుల్ గెస్టులుగా సందడి చేయనున్నారు.గచ్చిబౌలిలోని సంధ్య పార్కింగ్ గ్రౌండ్ వేదికగా టోస్ట్ టానిక్ ఆధ్వర్యంలో హోలీ కారి్నవాల్ 2.0ను ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల్లో అర్జున్ విజయ్, డీజే ఆకాశ్, డీజే మణి, డీజే రిష్, బీజే రుమీ వంటి వారు లైవ్ డీజేతో ఉర్రూతలూగించనున్నారు. బేగంపేట్ హాకీ స్టేడియం వేదికగా రంగ్ బసంత్ 2025 సంబరాలను, ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ గచ్చిబౌలిలో హోలీ కలర్ ల్యాండ్ ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్తో పాటు నగరంలోని వివిధ వేదికల్లో హోలీ సంబరాలను నిర్వహిస్తున్నారు. -
రికార్డింగ్ డ్యాన్సర్కు ముద్దు.. బూతు పాటతో ఎమ్మెల్యే రచ్చ
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు. అలాంటిది ఒక ప్రజాప్రతినిధే బహిరంగంగా అశ్లీల నృత్యాలను ప్రొత్సహించడం.. అందునా ఆయనే అసభ్యంగా ప్రవర్తించడం.. పైగా వేదిక మీదే బూతు పాట పాడడంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని పలువురు నెట్టింట ప్రశ్నలు గుప్పిస్తున్నారు.బీహార్ జనతా దల్(యునైటెడ్) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భగల్పూర్ జిల్లా నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.వేదిక మీద ఉన్న నృత్యకారిణి దగ్గరకు వెళ్లి.. ఆమె పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కరెన్సీ నోటును ఆమె చెంపకు అతికించాడు. అక్కడితో ఆగకుండా.. నేను డ్యాన్స్ మాత్రమే చేయలేదు.. ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నా అంటూ మైకులో ప్రకటించారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. రాత్రి సయమంలో జరిగిన వేడుకల్లోనూ ఆయన పాల్గొన్నారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో చిందులేశారు. ఆపై మైక్ అందుకుని బూతు పాటలు పాడి అక్కడున్నవాళ్లను హుషారెత్తించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆర్జేడీ భగ్గుమంది. ఇలాంటి వాళ్లపై కేసులు నమోదు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులపై కూడా న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేయాలని పలువురు కోరుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.होली मिलन समारोह में जदयू विधायक गोपाल मंडल ने महिला डांसर के गाल पर नोट चिपकाया और साथ में मंच पर लगाए ठुमके।#Gopalmandal #Bihar #BiharNews #Bhagalpur #Holi2025 pic.twitter.com/ZBNs32uQz1— FirstBiharJharkhand (@firstbiharnews) March 10, 2025JDU विधायक गोपाल मंडल#gopalmandal @Jduonline @RJDforIndia #BiharNews #bhagalpur pic.twitter.com/1nikGeTmWV— Shri Dhiraj Sharma (Journalist) (@ShriDhiraj) March 11, 2025గోపాల్ మండల్ వార్తల్లోకి ఎక్కడం తొలిసారేం కాదు. గతంలో ఆయన అండర్వేర్పై రైలులో తిరిగి వైరల్ అయ్యారు. కొందరు ప్రయాణికులు ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ టైంలోనూ ఆయనపై విమర్శలు రాగా.. కంపార్ట్మెంట్లో మహిళలు లేరని, బాత్రూం వెళ్లాల్సి రావడంతో అలా వెళ్లానని అప్పుడు తన చర్యను సమర్థించుకున్నారాయన. -
వారణాసి : చితా భస్మంతో హోలీ వేడుకలు (చిత్రాలు)
-
మాదాపూర్ వేదికగా హోలినేషన్ 2025 వేడుకలో కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
విషాదం నింపిన కోడిగుడ్డు వివాదం
జగిత్యాలరూరల్: కోడిగుట్టు వివాదం విషాదం నింపింది. ఈ గొడవలో కొడవలి వేటుకు గురైన మహిళ తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన మేడిపల్లి సురేశ్–రమ(40)దంపతులకు కొడుకు రిషివర్దన్, కుమార్తె వాణి ఉన్నారు. సురేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. వీరి కుమార్తె వాణిని ఇదే గ్రామానికి చెందిన బోగ ప్రకాశ్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సురేశ్, రమ దంపతులు నిరాకరించారు. కక్ష పెంచుకున్న ప్రకాశ్ సోమవారం జరిగిన హోలీ వేడుకల్లో రమ ఇంట్లోకి కోడిగుడ్డు విసిరాడు. దీంతో రిషివర్దన్ తమ ఇంట్లోకి కోడిగుడ్డు ఎందుకు విసిరావని ప్రకాశ్ను నిలదీయగా రిషివర్దన్పై దాడిచేశాడు. స్థానికంగా ఉన్న వారు రిషివర్దన్ తల్లి రమకు సమాచారం అందించడంతో అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రకాశ్ కొడవలితో రమ మెడపై దాడిచేశాడు. గొంతుకు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కొడుకు రిషివర్దన్ ఫిర్యాదు మేరకు ప్రకాశ్పై హత్య కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐఆరీఫ్ అలీఖాన్, రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. గ్రామంలో విషాదం తిప్పన్నపేట గ్రామంలో మేడిశెట్టి రమ హోలీ సంబరాల్లో కోడిగుడ్డు వివాదంలో హత్యకు గురికాగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అందరు మహిళలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న రమ హత్యకు గురికావడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. దుబాయ్లో ఉన్న ఆమెభర్త సురేశ్ మంగళవారం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. -
ప్రముఖ బాలీవుడ్ సినీతారల హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
హోలీ పండుగ మిగిల్చిన విషాదం!
ఆదిలాబాద్: పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హోలీ ఆడుకుని స్నేహితులతో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాక ఇంటర్మీడియెట్ విద్యార్థి నీటమునిగి చనిపోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దండేపల్లి ఎస్సై స్వరూప్రాజ్ కథనం ప్రకారం.. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఇంటర్మీడియెట్ విద్యార్థి, పెద్ద కుమారుడు కార్తీక్(18) గత ఐదు రోజుల క్రితం తల్లి అశ్వినితో కలిసి దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. అనంతరం వారితో కలిసి తానిమడుగు వద్ద గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద కడెం ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. దీంతో అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేదరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. అమ్మమ్మ ఇంటికి వచ్చి.. ఇంటర్ పరీక్షలు ముగియడంతో, కాలేజీకి సెలవులు వచ్చాయి. కార్తీక్ తన తల్లి అశ్వినితో కలిసి ఐదు రోజుల క్రితం పాతమామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా స్నేహితులతో గడుపుతున్నాడు. ఇంతలో సోమవారం హోలీ పండుగ రావడంతో, స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నాడు. స్నానం కోసం కాలువ వద్దకు వెల్లిన అతను స్నానం చేసేందుకు నీటిలో దిగాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకుపై పెట్టుకున్న ఆశలు అతని అకాల మృతితో ఆవిరయ్యాయి. ఆదిలాబాద్లో మరో విద్యార్థి.. పండుగ పూట స్నానానికి వెళ్లి వాగులో గల్లంతై విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. ఆదిలాబాద్రూరల్ మండలం భీంసరి శివారులో గల వాగులో స్నానానికి వెళ్లి గుమ్ముల సాత్విక్ (14) అనే విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై ముజాహిద్, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్నగర్ కాలనీకి చెందిన గుమ్ముల స్వర్ణలతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారికి కొన్నేళ్ల క్రితం విడాకులయ్యాయి. ఇద్దరి పిల్లలను తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పోషిస్తోంది. చిన్నారులిద్దరూ పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సాత్విక్ సోమవారం హోలీ సంబరాలు చేసుకొని అనంతరం స్నానానికి మిత్రులతో కలిసి వాగుకు వెళ్లాడు. స్నేహితులంతా వాగు ఒడ్డున నిలబడి ఉండగా.. స్నానం చేస్తానని సాత్విక్ అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు బయటకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
హోలీ ఆడి.. దావత్ కోసమని వెళ్లి..
కరీంనగర్: హోలీ పండగపూట రాయికల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో స్నేహితులతో గడిపిన పట్టణానికి చెందిన నర్ర నగేశ్(21) వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నగేశ్ తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్ కోసమని పట్టణ శివారులోని ఓ మామిడితోటకు వెళ్లారు. నగేశ్ బహిర్భూమికోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో స్నేహితులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి గాలించగా.. బావిలో శవమై కనిపించాడు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
కర్నూలు జిల్లా: స్త్రీ వేషధారణలతో రథి మన్మథులకు పురుషుల పూజలు (ఫోటోలు)
-
విజయవాడలో హోలీ సందడి (ఫోటోలు)
-
అయోధ్య బాల రామ్ ప్రత్యేక ఆకర్షణ బోర్డర్ లో హోలీ సంబరాలు
-
హోలీ సంబురాల్లో మునిగి తేలిన ఐపీఎల్ హీరోలు.. కోహ్లి మాత్రం అలా..!
హోలీ పర్వదినాన ఐపీఎల్ క్రికెటర్లు రంగుల సంబురాల్లో మునిగి తేలారు. ఇవాళ ఉదయం నుంచి చాలా మంది క్రికెటర్లు ఉత్సాహంగా హోలీ సంబురాలు చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగుల పూసుకుని నీటితో సంబురాలు చేసుకోగా, మరో ముంబై ఇండియన్ సూర్యకుమార్ యాదవ్ తన శ్రీమతితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. Rohit Sharma celebrating Holi with his family & MI team mates. ⭐https://t.co/Kc645b7DOV— Johns. (@CricCrazyJohns) March 25, 2024 The Hitman Rohit Sharma celebrating Holi. pic.twitter.com/kHaTPPQANf — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 Gautam Gambhir and Shreyas Iyer celebrating Holi. pic.twitter.com/dWnjdSiOaz — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ముఖానికి రంగులు పూసుకుని ఫోటోలకు పోజులివ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా ముఖం నిండా రంగులు పూసుకుని తన ఐపీఎల్ సహచరులతో కలిసి సెల్ఫీ దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో నగరంలో జరిగిన హోలీ సంబురాల్లో పాల్గొని తన ఆటపాటలతో అభిమానులను అలరించాడు. Captain Shreyas Iyer and KKR players celebrating Holi.pic.twitter.com/L5WldKccF3 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024 Delhi Capitals' players celebrating Holi. pic.twitter.com/lqRn9RvLAe — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 VIRAT KOHLI RETURNS AT CHINNASWAMY TODAY. - The GOAT is Ready to Roar..!!!! 🐐 pic.twitter.com/xpHsedcuzD — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 ఐపీఎల్ కామెంటేటర్లు స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్ భారత సంప్రదాయ దుస్తులు ధరించి హోలీ సంబురాలు చేసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో తరహాలో హోలీ సంబురాలు చేసుకోగా.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మాత్రం ప్రాక్టీస్లో మునిగి తేలాడు. Suryakumar Yadav with his wife celebrating Holi. pic.twitter.com/46ltjxTnBG — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 Dwayne Bravo at the Holi Celebrations in Chennai. ❤️pic.twitter.com/27PWVB0rwj — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 ఆర్సీబీకి ఇవాళ మ్యాచ్ ఉండటంతో కోహ్లి హోలీ సంబురాలు చేసుకున్నట్లు లేడు. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఢిల్లీను ఓడించి బోణీ విజయం సొంతం చేసుకోగా.. తొలి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడిన ఆర్సీబీ ఖాతా తెరవాల్సి ఉంది. -
హోలీ 2024: సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
విశాఖలో హోలీ రెయిన్ డ్యాన్స్
-
Vizag : విశాఖలో ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పాలమూరు జిల్లాలో హోలీ సంబరాలు
-
విజయవాడలో హోలీ జోష్..
-
హైదరాబాద్ లో హోలీ సంబరాలు..
-
Holi 2024: మన దేశంలో ఇక్కడ హోలీ సంబరాలుండవు, ఎందుకో తెలుసా?
రంగుల పండుగ హోలీ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. చిన్నా పెద్దా అంతే రంగుల్లో మునిగి తేలతారు. కానీ దేశంలో హోలీ జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హోలీ ఎందుకు ఆడరో..ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం.. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలీ, కుర్జాన్, జౌడ్లా మూడు గ్రామాలలో కూడా హోలీ పండుగను జరుపుకోరు. తమ ఇష్టమైన దేవత త్రిపుర సుందరి దేవి. ఒకటిన్నర శతాబ్దం క్రితం, ప్రజలు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించింది. ఇక అప్పటినుంచి ఇక్కడి ప్రజలు హోలీ జరుపుకోవడానికి ఇష్టపడరు.ఇక్కడి త్రిపుర సుందరి దేవతకి శబ్దాలు నచ్చవని స్థానికులు చెబుతారు.హోలీ తమకు అచ్చి రాదని భావిస్తారట. అందుకే 150 ఏళ్లుగా హోలీ సంబరాలు చేసుకోరట. జార్ఖండ్: జార్ఖండ్లోని బొకారోలోని కస్మార్ బ్లాక్ సమీపంలోని దుర్గాపూర్ గ్రామంలో సుమారు 100 ఏళ్లకు పైగా ఇక్కడ హోలీ జరుపుకోవడం లేదు. ఒక శతాబ్దం క్రితం హోలీ రోజున ఇక్కడ ఒక రాజు కుమారుడు మరణించాడు. ఆ తర్వాత ఊరిలో హోలీ సంబరాలు చేసుకుంటే అరిష్టమని భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం పొరుగూరికి హోలీ పండుగ చేసుకుంటారు. గుజరాత్: గుజరాత్లోని బనస్కాంత జిల్లా రంసాన్ గ్రామంలో కూడా ప్రజలు హోలీని జరుపుకోరు. కొంతమంది సాధువులచే శాపగ్రస్తమైందట ఈ గ్రామం. అందుకే అప్పటి నుండి హోలీ జరుపుకోవడానికి భయపడతారు ప్రజలు . మధ్యప్రదేశ్: 125 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని బైతుల్ జిల్లా ముల్తాయ్ తహసీల్లోని దహువా గ్రామంలో, బావిలో బాలుడు నీటిలో మునిగి చనిపోయాడట. ఈ విషాద ఘటనతో హోలీ ఆడటం తమకు చెడు శకునంగా భావించారు. దీంతో ఇక్కడ ఎవరూ హోలీ ఆడరని చెబుతారు. తమిళనాడు: దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడు చాలా దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ భక్తి కూడా ఎక్కువ అని చెబుతారు. కానీ ఉత్తర భారతంతో జరుపు కున్నంతగా హోలీని ఇక్కడ జరుపుకోరు. హోలీ పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి, తమిళులు మాసి మాగంగా జరుపుకుంటారు. పవిత్ర నదులు, చెరువులు, సరస్సులలో స్నానం చేయడానికి ,పూర్వీకులు భూమిపైకి వచ్చే పవిత్రమైన రోజు అని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఆ రోజు హోలీ ఆడరు. అయితే పుదుచ్చేరి లాంటి టూరిస్ట్ ప్రదేశాలలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. -
అంబటి రాంబాబు హోలీ డాన్స్
-
Hyderabad Holi Photos 2024: హైదరాబాద్లో హోలీ వేడుకలు..(ఫొటోలు)
-
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హోలీ వేడుకలు
-
దుబాయ్ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పలువురికి స్వీట్లు పంచి, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. #यूएई ♦दुबई के कृष्ण मंदिर में श्रद्धालुओं ने मनाई होली#Holi #Dubai #KrishnaTemple pic.twitter.com/8YojdmjkFL — Knews (@Knewsindia) March 25, 2024 -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన జీవితాల్లో సంతోషాన్ని వికసించే వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ.. రంగుల హోలీ అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో పేర్కొన్నారాయన. అదే సమయంలో.. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ ఖాతాలోనూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2024 -
Amritsar Holi Photos: రంగుల్లో మునిగి తేలిన అమృత్సర్.. విశేషం ఏంటంటే? (ఫోటోలు)
-
ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం
మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుని గర్భగుడిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితో సహా 13 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను తిలకించేందుకు వచ్చారు. హారతి సమర్పిస్తున్న పూజారి సంజీవ్ వెనుక నుంచి ఎవరో గులాల్ వెదజల్లడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. बहुत दुखद खबर उज्जैन के महाकाल मंदिर में भस्म आरती के दौरान लगी आग, कई लोग झुलसे ! ईश्वर से सभी के सकुशल होने की कामना करते है !🙄😥🙏#होलिकोत्सव#Ujjain #MahakaleshwarTemple pic.twitter.com/YuuEvpLYHm — Rajni (@RajniRajni2210) March 25, 2024 వెంటనే అక్కడున్న కొందరు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గర్భగుడిలో హారతి సమర్పిస్తున్న సంజీవ్ పూజారి, వికాస్, మనోజ్, సేవాధారి ఆనంద్ కమల్ జోషితో సహా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భస్మ హారతి జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయని ఆలయ పూజారి ఆశిష్ గురు తెలిపారు. -
Holi Celebrations Photos: హుడా ప్లే గ్రౌండ్లో హోలీ వేడుకలు (ఫోటోలు)
-
Holi 2024: జాలీగా, హ్యాపీగా...ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!
పిల్లా పెద్దా అంతా సరదగా గడిపే రంగుల పండుగ హోలీ సమీపిస్తోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహం గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం, నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణం కంటి గాయాలకు గురవుతున్న అనేక సంఘటనలు జరుగుతాయి.అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం. మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలను గమనించాలి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు , ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం , ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి.ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకుదారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం. సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగదు. పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి. లోషన్ లేదా నూనె : హోలీ ఆడటానికి వెళ్లే కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు. దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని. రంగులనుఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలిన కోరుతూ హ్యాపీ హోలీ. -
హోలీ 2024: రంగుల్లో మునిగి తేలిన కుర్రకారు (ఫోటోలు)
-
Holi 2024 Celebrations Photos: ఉత్తరాదిలో రంగుల హోలీ పండుగ సంబురాలు (ఫొటోలు)
-
హోలీ..హోలీరే : నేచురల్ కలర్స్, గులాల్ తయారు చేసుకోండిలా!
#Holi 2024:హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్దా అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాల వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలుముంగిళ్లు, వాకిళ్లు రంగులతో తడిసి మురిసే సంబరం. ఇంట్లోనే సహజంగా హోలీ రంగులు వసంతం ఆగమనానికి సూచిక హోలీ. ఒకప్పుడు ప్రకృతి ప్రసాదించిన పువ్వులు, ఆకులతో తయారుచేసుకున్న రంగులతో పండుగ జరుపుకునే వారు. కాలక్రమంలో హోలీ ప్రజాదరణ పెరిగింది. సహజ రంగుల స్థానాన్ని రసాయన ఆధారిత సింథటిక్ రంగులు ఆక్రమించేశాయి. సహజ రంగులతో పోలిస్తే చౌకగా ఉంటాయి, కానీ ఆరోగ్యానికి , పర్యావరణానికి హానికరమైనవి, చర్మానికి, ఆరోగ్యానికి మంచిదని కాదని తెలిసినా జాగ్రత్త పడటం లేదు. దీనికి తోడు సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. రానున్న హోలీ సందర్భంగా మార్కెట్లో లభించే అసహజ రంగులకు బదులుగా ఇంట్లోనే సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే పింక్ గులాల్ ఇలా పింక్ గులాల్ కోసం 1-2 మీడియం బీట్రూట్లను తీసుకోవాలి. వాటిని చక్కగాతురుముకోవాలి, దీన్ని ఒక కప్పు నీళ్లుపోసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. దీనికి మొక్కజొన్న పిండి లేదా టాల్కమ్ పౌడర్ని కలుపుకోవచ్చు. పొడిగా కావాలనుకుంటే మైక్రోవేవ్లో వేడి చేయండి. దీన్ని బాగా కలపినా లేదా మళ్లీ గ్రైండ్ చేసినా పింక్ గులాల్ రడీ. రెడ్ కలర్ గులాల్ గులాల్ ను ఇంట్లో తయారు చేసుకోవాలంటే గులాబీ రేకులను తీసుకుని నీటిలో గంటసేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పొడిగా కావాలంటే ఎండబెట్టండి లేదా మీరు మైక్రోవేవ్లోపుంచి డ్రైగా చేసుకోవచ్చు. ఎండబెట్టిన కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోండి. వాటిని మెత్తగా పొడి చేయండి. దీనికి కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఎర్ర చందనం కలిపిన నీళ్లు ఎర్ర రంగులోకి మారి భలే ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్ వాడుకోవచ్చు.( కానీ ఈ నీళ్ళ మరకలు ఒక పట్టాన పోవు) పసుపు పసుపు పొడి ఇంట్లోనే పసుపు రంగును తయారు చేసకోవచ్చు. పసుపు రంగులో ఉండే శనగపిండి, పసుపు మిశ్రమంతో ఒక కలర్ సింపుల్గా రడీ అయిపోతుంది. దీని వల్ల ఎలాంటి నష్టం రాదు. పైగా పసుపు, శనగ పిండి సున్ని పిండిలాగా కూడా ఉపయోగపడుతుంది. వీటినే నీటిలో కలిపే తడి రంగును తయారు చేసుకోవచ్చు. అంతేకాదు పసుపు బంతి పువ్వులను తీసుకొని నీటిలో మరగించినా చక్కటి కలర్ వస్తుంది. గ్రీన్ కలర్: ఇంట్లో చాలా సులభంగా లభించే గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. అప్పుటి కప్పుడు కడిగేసుకుంటాం కాబట్టి పెద్దగా పండదు. అలాగే ఎండ బెట్టిన గోరింట పొడిని నీటిలో కలపి ఈ వాటర్ను వాడుకోవచ్చు. ఇంకా పుదీనీ, బచ్చలికూర లాంటి ఆకుకూరలు వేప, తులసి లాంటి ఆకులను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు. మెరూన్ మెరూన్, లేదా లేత పర్పుల్ రంగును సులభంగా తయారు చేయడానికి బీట్రూట్ రసాన్ని మించింది లేదు. బీట్రూట్ను మెత్తగా దంచుకొని, లేదా మిక్సీలో వేసి ఆ ముద్దను నీటిని రాత్రంతా నానబెట్టండి. దీన్ని చక్కగా వడకట్టుకొని వాడుకోవచ్చు. బ్లూ కలర్: అపరాజిత నీలి రంగు మందారం రేకుల నుండి ఇంట్లోనే చాలా సులభంగా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు. అంతేకాదు నీలి రంగు అపరాజిత లేధా శంఖం పువ్వులు కూడా బ్లూ కలర్కి బాగా ఉపయోగపడతాయి. పూల రేకులను ఎండబెట్టి, దాని నుండి పొడిని తయారు చేయండి. పొడిలో కాస్త బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఈ పూలను నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లను కూడా వాడుకోవచ్చు. ఆరెంజ్: ఎండిన నారింజ తొక్కలను ఉపయోగించి నిమిషాల్లో ఆరెంజ్రంగును తయారు చేయవచ్చు. తొక్కల్ని ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న పిండి, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. నోట్: వీటితోపాటు, మీకు తెలిసిన, మీ అమ్మమ్మ, బామ్మలను అడిగి తెలుసుకుని మరీ అనేక సహజ రంగులకు తయారు చేసుకోవచ్చు. సహజ రంగులనే వాడదాం. మన ఆరోగ్యాన్ని , ప్రకృతిని కాపాడుకుందాం!! -
500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు
భగవాన్ రామ్లల్లా నూతన రామాలయంలో కొలువైన దరిమిలా రామనగరిలో ప్రతి క్షణం ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత రామాలయం రూపుదిద్దుకుంది. దీంతో బాలరాముడు తన జన్మ స్థలంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇకపై ప్రతి పండుగను అయోధ్యలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలో అయోధ్యలో 500 ఏళ్ల తరువాత హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈనెల 25న జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతోంది. రామ భక్తులు ఆరోజు బాలరామునితో హోలీ వేడుకలు చేసుకోనున్నారు. హోలీ నాడు 56 వంటకాలను బాలరామునికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అలాగే ఆరోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు. రామమందిరం ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఇకపై హోలీ వేడుకలు రాముని ఆస్థానంలో జరగనున్నాయని, ఈ నేపధ్యంలో అయోధ్య అంతటా ఆనందం నెలకొన్నదన్నారు. ఇందుకోసం రామమందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తున్నదన్నారు. హోలీ వేడుకల సందర్భంగా అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
ఇషా అంబానీ పార్టీలో స్టార్స్ హంగామా (ఫోటోలు)
-
హోలీ రోజు వేధింపులు.. దేశం విడిచి వెళ్లిన జపాన్ యువతి
హోలీ వేడుకల సందర్భంగా బుధవారం ఢిల్లీలో జపాన్కు చెందిన ఓ యువతిపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అదే ప్రాంతానికి చెందిన యువకులు యువతిని చుట్టుముట్టి ఆమెను వేధింపులకు గురిచేశారు. తనను గట్టిగా పట్టుకుని బలవంతంగా రంగులు పూశారు. తలపై గుడ్డు కొట్టారు. వారిని వదిలించుకొని వెళ్తున్న యువతికి మరో యువకుడు అడ్డు వచ్చాడు. దీంతో ఆమె అతని చెంపచెళ్లుమనిపించింది. అనంతరం అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. యువకుల చర్యపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు..ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జపాన్ యువతి ఢిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానిక యువకులు హోలీ పేరుతో యువతిని వేధించిననట్లు తెలిపారు. బలవంతంగా యువతిపై రంగులు చల్లి, తలపై గుడ్టు పగులకొట్టిన్నట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అంతేగాక యువతి దేశం విడిచి శుక్రవారమే బంగ్లాదేశ్ వెళ్లిన్నట్లు పేర్కొన్నారు. For those who were against the #BHARATMATRIMONY Holi campaign. A Japanese tourist in India. Imagine your sister, mother or wife being treated like this in another county? Maybe you will understand then. pic.twitter.com/VribIpXBab — Ram Subramanian (@iramsubramanian) March 10, 2023 తాను బంగ్లాదేశ్ చేరుకున్నట్లు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు యువతే స్వయంగా ట్వీట్ చేసిందని చెప్పారు. అంతేగాక యువతికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం జపాన్ రాయబార కార్యలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ దారుణ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. వీడియోను పరిశీలించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. Very distrubing videos getting viral on social media showing sexual harassment with foreign nationals on Holi! I am issuing notice to Delhi Police to examine these videos and arrest the perpetrators! Completely shameful behaviour! — Swati Maliwal (@SwatiJaiHind) March 10, 2023 -
హోలీ రోజు జపాన్ యువతిని వేధించిన ఆకతాయిలు.. వీడియో వైరల్..
న్యూఢిల్లీ: హోలీ పండుగ రోజు ఢిల్లీలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. విదేశీయురాలు అని కూడా చూడకుండా జపాన్ యువతిని వేధించారు. బలవంతంగా ఆమెకు రంగులు పూసి, కోడిగుడ్డును తలపై పగలగొట్టారు. ఆమె వద్దని చెబుతున్నా పట్టించుకోకుండా ఇబ్బందిపెట్టారు. వీరి తీరుతో ఆగ్రహించిన సదరు యువతి గ్యాంగ్లో ఒకడి చెంపచెళ్లుమనిపించింది. అనంతరం అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులు సిగ్గపడే విధంగా ఈ ఆకతాయిలు ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపి కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. For those who were against the #BHARATMATRIMONY Holi campaign. A Japanese tourist in India. Imagine your sister, mother or wife being treated like this in another county? Maybe you will understand then. pic.twitter.com/VribIpXBab — Ram Subramanian (@iramsubramanian) March 10, 2023 అయితే ఈ వీడియోను బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వెంటనే డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కొందరు నెటిజన్లేమో ఇది పాత వీడియో అయి ఉండొచ్చని, మళ్లీ చక్కర్లు కొడుతోందని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదు. ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను చూసిన అనంతరం జపాన్ యువతి వివరాల కోసం ఎంబసీకి లేఖ రాశారు. అలాగే వీడియోలో అమ్మాయిని వేధించిన యువకుల వివరాలను సేకరించారు. చదవండి: సీజనల్ ఇన్ఫ్లూయెంజాపై కేంద్రం కీలక ప్రకటన.. -
విషాదం నింపిన హోలీ.. బాత్రూమ్లోకి వెళ్లి భార్యభర్తలు మృతి!
ఉత్తర ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లోని బాత్రూమ్లో ఓ జంట అనుమానాస్పదంగా మృత్యువాతపడింది. హోలీ అనంతరం స్నానం కోసం వెళ్లిన దంపతులు బాత్రూమ్లో శవమై కనిపించారు. ఈ దురదృష్ట ఘటన ఘజియాబాద్ జిల్లా మురాద్నగర్ పట్టణంలోని అగ్రసేన్ మార్కెట్ సమీపంలో వెలుగు చూసింది. మృతిచెందిన దంపతులను దీప్కా గోయల్ (40), అతని భార్య శిల్పి (36)గా గుర్తించారు. వివరాలు.. తమ కుటుంబ సభ్యులతో గోయల్, శిల్పి గురువారం ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రంగులు కడుక్కొని, స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన జంట తిరిగి బయటకు రాలేదు. అనుమానించిన కుటుంబ సభ్యులు బలవంతంగా బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా.. ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే దంపతులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం దంపతుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అయితే బాత్రూమ్లో సరైన వెంటిలేషన్ లేకపోవడం, గీజర్ నుంచి వెలువడే విష వాయువుల వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇళ్లంతా తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించలేదని తెలిపారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే వారి మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో మోదీనగర్లో హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 30 ఏళ్ల వినీత్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద గుండెపోటుతో మరణించాడు. లక్ష్మీ నగర్ నివాసికి చెందిన వినీత్ హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్న సమయంలో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుండెపోటుతో మృతిచెందినట్లు పేర్కొన్నారు. -
వామ్మో ఇదేం ఆచారం రా బాబు! అక్కడ అల్లుడిని గాడిదపై కూర్చొబెట్టి..
భారత్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే పలు రాష్ట్రల్లో ఈ పండగను విభిన్న రీతిలో వారి సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటుంటారు. కానీ కొన్ని చోట్ల సంప్రదాయాలు చాలా విడ్డూరంగా ఉంటాయి. వామ్మో ఇదేం ఆచారం అనిపించేలా ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు. అచ్చం అలాంటి విచిత్రమైన సంప్రదాయమే మహారాష్ట్రాలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలలో 82 ఏళ్లుగా ఒక విచిత్రమైన సంప్రదాయ కొనసాగుతోంది. హోలీ తర్వాత రోజు గ్రామంలో కొత్త అల్లుడిని బ్యాండ్ బాజాలతో గాడిదపై కూర్చొబెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఇదేంటి ఆచారమా!అవమానిస్తున్నారా అన్నట్లుంటుంది ఈ ఆచారం. బీడ్ గ్రామంలోని ప్రజలు మాత్రం గాడిదపై కూర్చొబెట్టడం అనేది సత్కారంగా కింద చూస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదేమిటంటే..గ్రామంలో నివశిస్తున్న ఠాకూర్ ఆనంద్ దేశ్ముఖ్ కుటుంబానికి చెందిన అల్లుడు హోలీకి రంగులు వేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే అతన్ని గాడిదపై కూర్చొబెట్టి, చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పుతూ ఉండగా..అతను హోలీ రంగులు వేస్తుండాలి. అందువల్ల అతను రంగులు వేసేందుకు ససేమిరా అన్నాడు. దీంతో అతడి మామగారు అతన్ని ఏదోలా ఒప్పించి గాడిదను చక్కగా అలంకరించి దానిపి కూర్చోబెట్టి ఊరంతా తిప్పి.. ఆ తర్వాత గుడికి తీసుకువచ్చి హరతి ఇచ్చి స్వాగతం పలికారు ఆ అల్లుడికి. ఆ తర్వాత మామగారు కొత్త బట్టలు, బంగారు ఉంగరం బహుకరిచడంతో ముభావంగా ఉన్న అల్లుడు ముఖం కాస్త సంతోషంతో చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ ఆచారాన్నే కొనసాగిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. (చదవండి: ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప బిగ్గరగా ఏడవడంతో..) -
కోహ్లి సహా ఏ ఒక్కరిని వదిలిపెట్టని రోహిత్ శర్మ..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఆటగాళ్ల నుంచి సిబ్బంది వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. అందరిని ఒక రౌండ్ వేసుకున్నాడు. కొంపదీసి రోహిత్ టీమిండియా ఆటగాళ్లను ఏమైనా తిట్టాడా ఏంటి అనుకుంటున్నారా. అదేం కాదులెండి.. పైన చెప్పుకున్నదంతా హోలీ సెలబ్రేషన్స్ గురించి. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా మంగళవారం అహ్మదాబాద్కు చేరుకుంది. మంగళవారం కోహ్లి, రోహిత్ సహా పలువురు క్రికెటర్లు రన్నింగ్ బస్లోనే హోలీ వేడుకలు జరుపుకున్నారు. తాజాగా బుధవారం అహ్మదాబాద్లో రోహిత్ ఒక్కడే హోలీ సెలబ్రేట్ చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు సహా స్టాఫ్ సిబ్బందికి రంగులు పూసి సెలబ్రేట్ చేశాడు. ఈ సందర్భంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టని రోహిత్ సూర్యకుమార్, ఇషాన్ కిషన్లకు రంగులు కాస్త ఎక్కువగానే పూశాడు. తొలుత కోహ్లి ఎక్కడా కనిపించలేదు.. అరె కోహ్లి తప్పించుకున్నాడుగా అని మనం అనుకునేలోపే బస్సెక్కిన రోహిత్ కంట పడ్డాడు కోహ్లి. అంతే పరుగున కోహ్లి వద్దకు వెళ్లిన రోహిత్ ముఖానికి రంగులు పూశాడు. ఆ తర్వాత అంతా కలిసి మరోసారి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి(గురువారం) జరగనున్న నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. Colours, smiles & more! 🥳 ☺️ Do not miss #TeamIndia’s Holi celebration in Ahmedabad 🎨 pic.twitter.com/jOAKsxayBA — BCCI (@BCCI) March 8, 2023 చదవండి: Pele: ఆస్తుల పంపకం.. 30 శాతం మూడో భార్యకు; 70 శాతం పిల్లలకు -
Anchor Anasuya Photos: భర్త పిల్లలతో అనసూయ హోలీ సంబరాలు (ఫొటోలు)
-
మాస్టర్మైండ్.. తెలివిగా తప్పించుకున్న ధోని
టీమిండియా మాజీ ఆటగాడు.. ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ ఆడేందుకు చెన్నై చేరుకున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ఆరంభించిన ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతోంది. జట్టులోకి కొత్తగా వచ్చిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు ధోని కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం పక్కనబెడితే హోలీ పండుగ పురస్కరించుకొని సీఎస్కే ఆటగాళ్లు వేడుకల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోగా.. ధోనిపై మాత్రం ఒక్క రంగు మరక కూడా కనిపించలేదు. ధోని ఇక్కడ కూడా తన మాస్టర్ మైండ్ ఉపయోగించి రంగుల బారీ నుంచి ఎలా తప్పించుకున్నాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే తన ట్విటర్లో షేర్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఇక మార్చి 31న ఐపీఎల్ 16వ సీజన్కు తెరలేవనుంది. తొలి మ్యాచ్లో సీఎస్కేతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఇక గతేడాది ఐపీఎల్లో సీఎస్కే అంతగా ఆకట్టుకోలేకపోయింది. 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచి పదింటిలో ఓడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. Celebrating Holi the "Thala" Way 😁 Anbuden Diaries Full 🎥👉 https://t.co/8NqSJ8t4QJ#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/vKI5F3T8G7 — Chennai Super Kings (@ChennaiIPL) March 8, 2023 -
మరోసారి వైరల్ అవుతున్న రఘువీరారెడ్డి
సాక్షి, బెంగళూరు: నీలకంఠపురం రఘువీరారెడ్డి.. పీసీసీ మాజీ చీఫ్, మడకశిర మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈయన.. వయసు మీదపడుతున్న ఛాయలతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తుంటారు. తాజాగా.. బెంగళూరులో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సరదాగా చిందులు వేస్తూ అల్లరి చేసిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. -
హోలీ రంగుల్లో మునిగితేలుతున్న సినీ తారలు
-
రంగు పడింది.. ఘనంగా హోలీ వేడుకలు (ఫొటోలు)
-
హోలీ వేడుకల్లో మునిగి తేలిన టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
రన్నింగ్ బస్లో హోలీ వేడుకలు; డ్యాన్స్తో దుమ్మురేపిన క్రికెటర్లు
టీమిండియా క్రికెటర్లు రన్నింగ్ బస్లో హోలీ పండుగ వేడుకలు జరుపుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రంగులు పూసుకోవడంతో పాటు కోహ్లి సహా ఇతర క్రికెటర్లు బేబీ కామ్డౌన్(Baby Calm Down) పాటకు చిందులేశారు. వేడుకల్లో కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్లు హైలైట్ అయ్యారు. మిగతా క్రికెటర్లు కూడా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కోహ్లి డ్యాన్స్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి రోహిత్ గులాల్ను చల్లడం ఆసక్తి కలిగించింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్లో హోలీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు జరగనున్న సంగతి తెలిసిందే. స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి హోటల్ రూం నుంచి బస్సులో బయలుదేరిన సందర్భంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. Indian players celebrating Holi. pic.twitter.com/GSGsQqTDkZ — Johns. (@CricCrazyJohns) March 7, 2023 #TeamIndia wishes you all a very Happy Holi 🙌🙌#HappyHoli pic.twitter.com/RdcVrNpfoB — BCCI (@BCCI) March 7, 2023 View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) చదవండి: Danny Morrison: అప్పుడు ఇండియా యువతి.. ఇప్పుడు ఆసీస్ యువతి క్రికెట్లో కొత్త పంథా.. ఐపీఎల్ 2023 నుంచే మొదలు -
Holy 2023: రంగులు త్వరగా పోవాలంటే..
హోలీ ఆడడం ఒక ఎత్తు అయితే.. ఆ మరకలను వదిలించుకునేందుకు పడే శ్రమ మరో ఎత్తు. పైగా హోలీ ఆడేప్పుడు రంగులే కాదు.. అడ్డమైనవన్నీ పూసేసుకుంటారు కొందరు. మరకలు త్వరగా పోవాలంటే వెంటనే వాటిని కడిగేయాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే శరీరానికి అంతలా అంటుకుపోతాయి. అయితే.. హోలీ ఆడిన తర్వాత త్వరగా రంగుల్ని పోగొట్టుకునేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. ► హోలీ రంగులు చల్లుకోవడానికి ముందుగా ఒంటికి కాస్త కొబ్బరి నూనె కాని గ్లిజరిన్ ఆయిల్ కాని రాసుకుంటే మంచిది. ► ఫ్లూయల్ ఆయిల్స్ లేదా కిరోసిన్ రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. కానీ, అది శరీరానికి అంత మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ► శరీరానికి అంటిన మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయి. (మరీ వేడి నీళ్లు అస్సలు మంచిది కాదు) ► శెనగపిండిలో కొంచెం పాలు, పెరుగు, రోజ్ వాటర్కి బాదం నూనె కలిపి పేస్ట్లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి. ► ఒక పాత్రలో గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. అందులో అరోమా ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని రుద్దితే రంగులు పోతాయి. ► రంగుల వల్ల దురద అనిపిస్తే గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ► ముఖానికి ముల్తాన్ మట్టి ప్యాక్ వేసుకుంటే దురద నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ► రంగులు వదిలించుకున్న వెంటనే శరీరానికి మాయిశ్చరైజ్ క్రీమ్స్ రాయడం మరిచిపోవద్దు. ► తలకు అంటిన రంగులు వదలాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ► ఒకవేళ హెయిర్ని షాంపూతో క్లీన్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ‘మైల్డ్ షాంపూ’నే ఉపయోగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్లా వేసుకుంటే మంచిది. మరకలు పొగొట్టుకోండిలా.. హోలీలో చాలా మందికి ఎదురయ్యే సమస్య దుస్తులకు మరకలు అంటడం. ప్రీ ప్లాన్డ్గా పాత బట్టలేసుకుని ఆడేవాళ్లు కొందరైతే.. మరికొందరు స్పెషల్గా పండుగ కోసమే దుస్తులు కొనుక్కుంటారు. ఇంకొందరు మాత్రం రంగులంటిన దుస్తుల మరకలు వదిలించేందుకు కష్టపడుతుంటారు. ► డ్రెస్సులపై రంగు మరకలు పోవాలంటే నిమ్మరసం రుద్ది, వేడినీళ్ళలో నానబెట్టి ఉతకాలి. ► అరకప్పు వెనిగర్లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చల్లటి నీటి లో వేసి రంగు అంటిన బట్టలను నానబెట్టాలి. గంట తరువాత ఉతికితే రంగులు తేలికగా పోతాయి. ► తెలుపు రంగు దుస్తులకు రంగు మరకలు అంటితే క్లోరిన్లో వాటిని నానబెట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే మరకలు పోతాయి. ► నిమ్మకాయ, హైడ్రోజన్ పెరాక్సైడ్లు దుస్తులపై రంగు మరకలను తొలగించేందుకు బెస్ట్ చాయిస్. మూడు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్కి కొంచెం టూత్ పేస్ట్(జెల్ కాకుండా) కలిపి రంగు బట్టలను ఉతికితే ప్రయోజనం ఉంటుంది. ► వెనిగర్లో ముంచిన గుడ్డతో గోడకు అంటిన రంగు మరకల్ని తుడిస్తే పోతాయి. ఫ్లోర్ మరకల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఉపయోగించాలి. చెప్పులు, షూస్, కార్పెట్ల విషయంలోనూ వీలైనంత త్వరగా రంగుల్ని కడిగేయాలి. ఫోన్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంచడం ఆడుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
Choti Holi 2023: రంగుల కేళీ హోలీ సంబురాలు (ఫోటోలు)
-
బేగంబజార్ లో హోలీ సంబరాలు (ఫోటోలు)
-
Holi 2023: రంగు వెనక రహస్యం
హోలీ పండుగ పూట రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ రంగు వెనకాల ఒక్కో రహస్యం దాగి ఉంది. ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. హోలీలో వాడే ప్రధాన రంగుల గురించి పురాణాల్లో, తత్వ, మానసిక శాస్త్రాల్లో ఆ రంగుల గురించి ప్రస్తావన ఉంది. ఎరుపు: ప్రమాదానికి సంకేతంగా భావించే ఎరుపు రంగుకి ‘హోలీ’ ప్రత్యేక గుర్తింపును అందించింది. అనంతమైన ప్రేమకి ఇది చిహ్నం. సున్నితత్వం, కోరిక, సంతోషాలకు ప్రతీకగా చెప్తారు. పైగా ఎరుపు ఏకాగ్రతను ఆకర్షిస్తుంది. ఈ రంగు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గులాబీ: ప్రేమను తెలియజేసే రంగు ఇది. లేత గులాబి రంగుతో ఆనందం వెల్లివిరిస్తుంది. మనిషికి మధురమైన భావనలను కలిగిస్తుంది. గులాబీ, నలుపు రంగును మేళవిస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. హోలీలో గులాబీ రంగుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తుంటారు. పసుపు: ఆధ్యాత్మిక ధోరణిలో పసుపు పవిత్రతకు సూచిక. శక్తికి, వెలుగుకు ప్రతీక. తెలివిని సూచించేదని పెద్దలు చెప్తుంటారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఈ రంగు వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తుంది. అందుకే హోలీలో ఈ రంగును ఎక్కువగా ఉపయోగించాలని సూచిస్తుంటారు. కాషాయం: ఎరుపు, పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. మనం ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేలా చేస్తుంది. అయితే సరదాని పంచే ఈ రంగుకి హోలీలో ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది. నీలం: దైవత్వంతో ముడిపడి ఉన్న రంగు. ప్రశాంతత, నెమ్మదితనాలను సూచిస్తుంది. మనలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ రంగు ఉపయోగపడుతుందని.. తద్వారా జీవితాన్ని ఉత్సాహంగా గడపవచ్చని పెద్దలు చెప్తారు. ఆకుపచ్చ: ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు. దుష్ట గ్రహాలకు, శక్తులకు వ్యతిరేకంగా పచ్చదనం పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు. శాంతి, పవిత్రతలకు సూచిక. అలిసిపోయిన శరీరాలకు విశ్రాంతిని అందిస్తుంది. ఊదా: పసుపు, ఎరుపు రంగుల మిశ్రమం. నాణ్యత, సంపదలకు సంకేతం. రంగుల్లో రాజసమైనది. మనిషిలో ఉద్వేగాలను, ఉద్రేకాలను రేకెత్తించడంలో ఉపయోగపడుతుంది. నలుపు: రహస్యానికి గుర్తుగా నలుపు రంగును అభివర్ణిస్తుంటారు. అదేవిధంగా శక్తి, భయాలకు గుర్తుగా చెప్తుంటారు. అధికారాన్ని సూచించే రంగు నలుపే. ఈ రంగు మనిషి విలాసానికి ప్రతీకగా భావిస్తారు. -
హోలీ వేళ విషాదం.. మద్యం మత్తు ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేస్తుండగా..
భోపాల్: శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రజలందరూ ఎంతో ఆనందంతో వేడుకలను జరుపుకున్నారు. కాగా హోలీ వేడుకల్లో అపశృతి జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తనను తానే కత్తితో పొడుచుకుని మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇండోర్లో గోపాల్ సోలంకీ(38) అనే వ్యక్తి హోలీ వేళ తన స్నేహితులతో కలిసి ఫుల్గా మద్యం సేవించాడు. మద్యం మత్తులో సోలంకీ ఓ కత్తిని చేతిలో పట్టుకుని డ్యాన్స్ ఫ్రెండ్స్తో డ్యాన్స్ స్టెప్పులేశాడు. ఈ క్రమంలో చేతిలో కత్తి ఉన్న విషయాన్ని మరిచిపోయి తన ఛాతిని నాలుగు సార్లు పొడుచుకుంటూ డ్యాన్స్ చేశాడు. తాగిన మైకంలో కత్తి ఘాటును ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఇంతలో రక్తం విపరీతంగా కారుతుండటం పక్కనే ఉన్న ఓ మహిళ గమనించి ఆందోళనకు గురైంది. దీంతో సోలంకీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుండె భాగం నుంచి రక్తం ఎక్కువగా కారిపోవడంతో అతను అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పండుగ వేళ గోపాల్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
బిగ్బాస్ నాన్స్టాప్: ప్రముఖ యాంకర్ ఓంకార్ వచ్చేశాడు!
Omakar Into Bigg Boss House: ఆనందాలను పంచే రంగుల హోలీ అంటే చిన్నవాళ్ల దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమే. రంగులు పూసుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ అనుంబంధాలను మరింత ధృడంగా మార్చుకుంటారందరూ. ఇలాంటి హోలీ పండగను జరుపుకునే అవకాశం కంటెస్టెంట్లకు కల్పించాడు బిగ్బాస్. దీంతో నేటి ఎపిసోడ్ కలర్ఫుల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ హోలీ వేడుకల్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా అనిల్ బిందుమాధవి మీద పొగడ్తల వర్షం కురిపించగా అనిల్ అషూ చేయి పట్టుకుని స్టెప్పులేశాడు. ఇక హౌస్మేట్స్కు రెట్టింపు వినోదాన్ని పంచేందుకు ప్రముఖ యాంకర్ ఓంకార్ రావడం విశేషం. మరి వీరు ఏ రేంజ్లో వినోదాన్ని పంచనున్నారో తెలియాలంటే హాట్స్టార్లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: కోట్లు సంపాదించిన మిత్ర శర్మ ఇల్లు చూశారా? -
హోరెత్తిన హోలీ సంబరాలు.. ఫోటో గ్యాలరీ
-
Holi 2022 Special : రాగాల హొలీ
-
ఇదేం హోలీ సెలబ్రేషన్స్ రా నాయనా!.. నవ్వులు పూయిస్తున్న వీడియో
హోలీ ఎలా ఆడుతారు? అదేం ప్రశ్న అంటారా? రకరకాల రంగులు, గుడ్లు, టొమాటోలు, పూలు, మన్ను బురద నీళ్లు.. ఓ ఇలా చెప్తూ పోతే బోలెడు. మన దేశంలో ఒక్కోచోట ఒక్కో పేరుతో మాత్రమే కాదు.. రకరకాల పద్ధతుల్లోనూ చేసుకుంటారు జనాలు. కానీ, ఇప్పుడు చెప్పబోయే తరహా హోలీ సెలబ్రేషన్స్ మాత్రం ఇంతకు ముందు చూసి ఉండరు. హోలీకి ఓ రోజు ముందుగానే.. అంటే మార్చి 17వ తేదీన చోట్టి హోలీ పేరుతో ఓ వీడియో ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యింది. గులాల్తో నిండిపోయిన ఓ వాటర్ పూల్లో.. రంగులకు బదులు చెప్పులు విసురుతూ కనిపించారు కొందరు. Chappal Maar Holi చాలా సందడిగా జరగ్గా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని తెలుస్తోంది. #WATCH पटना : वाटर पार्क में होली के जश्न के दौरान लोग एक-दूसरे पर चप्पल फेंकते दिखे। pic.twitter.com/eFAY65wsU7 — ANI_HindiNews (@AHindinews) March 17, 2022 బిహార్ రాజధాని పాట్నాలోని ఓ వాటర్ పార్క్లో ఈ సరదా వేడుకలు జరిగాయి. ఇంటర్నెట్లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. కామెంట్లు అంతే హిలేరియస్గా వస్తున్నాయి. కరోనా వల్ల రెండేళ్ల తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా గ్రాండ్గా హోలీ వేడుకలకు ఛాన్స్ దొరికింది. ఈ నేపథ్యంలో ఇలా కొందరు యువకులు.. చెప్పుల హోలీతో సరదా వాతావరణం క్రియేట్ చేశారు. స్పెయిన్కేమో టొమాటోలు.. మనకేమో ఇలా చెప్పులన్నమాట!. -
హోలీ వేడుకల్లో బీర్ బాటిళ్లతో హల్చల్.. వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, మహబూబాబాద్: వరంగల్ ఉమ్మడి జిల్లాలో హోలీ సంబరాలు ఫుల్ జోష్ మధ్య జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా, రంగు రంగుల కలర్స్, డాజే పాటలతో హోళీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది కరోనా ఆంక్షలు లేకపోవడం తో యువత పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. హోలీ వేడుకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మందు బాటిళ్లతో హల్చల్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో హోళీ వేడుకల్లో భాగంగా బీర్ల వర్షం కురిపించారు. మందు బాటిల్తో స్టెప్పులు వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తలకు స్వయంగా మందు బాటిల్ నోట్లో పెట్టి ఎమ్మెల్యే మందు పోసి హంగామా సృష్టించారు. కార్యకర్తలు కూడా మద్యం కొట్టి ఎమ్మెల్యేతో సందడిగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ వేడుకలతో ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు మద్యంతో హల్చల్ చేయడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. చదవండి: హోలీ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ డీజే స్టెప్పులు -
కరీంనగర్ జిల్లాలో అంబరాన్ని అంటిన సంబరాలు
-
బండిమెట్లో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి తలసాని
-
హోలీ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న యూత్
-
హోలీ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ డీజే స్టెప్పులు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో హోళీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా ఉన్న హోలీ వేడుకలకు దూరంగా ఉన్న జనం ఈసారి చాలా ఉత్సాహంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాలనీల్లో, ఇళ్లల్లో ఎక్కడా చూసినా రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. కరీంనగర్ గీతా భవన్ చైరస్తాలో టీఆర్ఎస్ నాయకులు హోళీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. హోళీ సంబరాలలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ అందరితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. డీజే పాటలకు స్టెప్పులు వేశారు. చదవండి: అంబరాన్నంటిన హోలీ సంబరాలు: వైరల్ వీడియోలు -
హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
-
సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
-
ఇందిరా పార్క్లో హోలీ సంబరాలు
-
విశాఖ ఆర్కే బీచ్లో హోలీ సంబరాలు
-
Holy 2022: హోలీ మరకలు త్వరగా పోవాలంటే..
ఎంత జోష్గా హోలీ ఆడతామో.. శరీరానికి, దుస్తులకు అంటిన రంగుల్ని వదిలించుకునేందుకు అంతే తంటాలు పడుతుంటాం. ఆర్గానిక్, కెమికల్ రంగులతో పాటు గుడ్లు, బురద, ఆయిల్.. ఇలా హోలీకేళీకి ఏదీ అతీతం కాదు. త్వరగా పోవాలంటే వెంటనే వాటిని కడిగేయాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే శరీరానికి అంతలా అంటుకుపోతాయి. హోలీ ఆడిన తర్వాత రంగుల్ని పోగొట్టుకునేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. ► హోలీ రంగులు చల్లుకోవడానికి ముందుగా ఒంటికి కాస్త కొబ్బరి నూనె కాని గ్లిజరిన్ ఆయిల్ కాని రాసుకుంటే మంచిది. ► ఫ్లూయల్ ఆయిల్స్ లేదా కిరోసిన్ రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. కానీ, అది శరీరానికి అంత మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ► శరీరానికి అంటిన మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయి. (మరీ వేడి నీళ్లు అస్సలు మంచిది కాదు) ► శెనగపిండిలో కొంచెం పాలు, పెరుగు, రోజ్ వాటర్కి బాదం నూనె కలిపి పేస్ట్లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి. ► ఒక పాత్రలో గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. అందులో అరోమా ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని రుద్దితే రంగులు పోతాయి. ► రంగుల వల్ల దురద అనిపిస్తే గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ముఖానికి ముల్తాన్ మట్టి ప్యాక్ వేసుకుంటే దురద నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ► రంగులు వదిలించుకున్న వెంటనే శరీరానికి మాయిశ్చరైజ్ క్రీమ్స్ రాయడం మరిచిపోవద్దు. ► తలకు అంటిన రంగులు వదలాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ► ఒకవేళ హెయిర్ని షాంపూతో క్లీన్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ‘మైల్డ్ షాంపూ’నే ఉపయోగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్లా వేసుకుంటే మంచిది. మరకలు పొగొట్టుకోండిలా... హోలీలో చాలా మందికి ఎదురయ్యే సమస్య దుస్తులకు మరకలు అంటడం. ప్రీ ప్లాన్డ్గా పాత బట్టలేసుకుని ఆడేవాళ్లు కొందరైతే.. మరికొందరు స్పెషల్గా పండుగ కోసమే దుస్తులు కొనుక్కుంటారు. ఇంకొందరు మాత్రం రంగులంటిన దుస్తుల మరకలు వదిలించేందుకు కష్టపడుతుంటారు. ► డ్రెస్సులపై రంగు మరకలు పోవాలంటే నిమ్మరసం రుద్ది, వేడినీళ్ళలో నానబెట్టి ఉతకాలి. ► అరకప్పు వెనిగర్లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చల్లటి నీటి లో వేసి రంగు అంటిన బట్టలను నానబెట్టాలి. గంట తరువాత ఉతికితే రంగులు తేలికగా పోతాయి. ► తెలుపు రంగు దుస్తులకు రంగు మరకలు అంటితే క్లోరిన్లో వాటిని నానబెట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే మరకలు పోతాయి. ► నిమ్మకాయ, హైడ్రోజన్ పెరాక్సైడ్లు దుస్తులపై రంగు మరకలను తొలగించేందుకు బెస్ట్ చాయిస్. మూడు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్కి కొంచెం టూత్ పేస్ట్(జెల్ కాకుండా) కలిపి రంగు బట్టలను ఉతికితే ప్రయోజనం ఉంటుంది. ► వెనిగర్లో ముంచిన గుడ్డతో గోడకు అంటిన రంగు మరకల్ని తుడిస్తే పోతాయి. ఫ్లోర్ మరకల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఉపయోగించాలి. చెప్పులు, షూస్, కార్పెట్ల విషయంలోనూ వీలైనంత త్వరగా రంగుల్ని కడిగేయాలి. ఫోన్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంచడం ఆడుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆడపిల్లల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. హోలీలో ఆర్గానిక్ రంగుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే కెమికల్స్ ఉన్న రంగులు వాడతామో అప్పుడే ఈ ఇబ్బంది. కాబట్టి.. వీలైనంత వరకూ సహజసిద్ధమైన రంగులతో హోలీని సెలబ్రేట్ చేస్కోండి. హ్యాపీ హోలీ.. -
హైదరాబాద్: హోలీ రంగుల్లో ఎంజాయ్ చేస్తున్న నగర వాసులు
-
హోళీ రంగోలీ! రంగు పడాల్సిందే! (ఫొటోలు)
-
హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్ లేదా.. నో ప్రాబ్లమ్!
సాక్షి,ఖమ్మం: పెద్ద నోట్ల రద్దు, ఆపై కరోనాతో నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. షాపింగ్ మాళ్లు మొదలు తోపుడు బండ్ల వ్యాపారులకు వరకు అందరూ ఫోన్ పే, గూగుల్ పేలతో నగదు స్వీకరిస్తున్నారు. తాజాగా హోలీ పండుగ సందర్భంగా గ్రామాల్లో పిల్లలు మామూళ్ల కోసం వెళ్తూ ఫోన్ పే స్కానర్ వెంట తీసుకెళ్లడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది. సూది తెచ్చుకుంటేనే టీకా! సత్తుపల్లి టౌన్ : ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని ప్రచారం చేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మిగతా విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పు అయిన శిశువులకు 24 గంటల్లోపు బీసీజీ టీకాలు వేయించాల్సి ఉంటుంది. ఈ టీకా చిన్నారుల్లో క్షయవ్యాధి రాకుండా కాపాడుతుంది. అయితే, 0.01 ఎంఎల్ సిరంజీతో మాత్రమే శిశువులకు వ్యాక్సిన్ వేయించాల్సి ఉండగా.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెండు వారాలుగా అరకొరగా సరఫరా అవుతున్నాయి. దీంతో సిరంజీలు లేవని సిబ్బంది చెబుతుండగా. తల్లిదండ్రులు మళ్లీ ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్లిల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజు ఏరియా ఆస్పత్రుల్లో జరిగే వ్యాక్సినేషన్కు వచ్చే వారు ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయమై జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం.రాజేష్ను విరణ కోరగా సిరంజీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా!
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండేకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన ప్రస్తుత బాయ్ఫ్రెండ్ విక్కీ జైన్తో కలిసి హోలీ పండగ వేడుకను సెలబ్రెట్ చేసుకున్న వీడియోను అంకిత సోమవారం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అది చూసి సుశాంత్ అభిమానులు, నెటిజన్లు ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాయ్ఫ్రెండ్తో ఆనందంగా చిందులేస్తూ హోలీ పండగను జరుపుకోవడమే కాక ఆ వీడియోను షేర్ చేస్తావా అంటూ నెటిజన్లు మండిపడుతూ తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో అంకిత ఆమె బాయ్ఫ్రెండ్ విక్కిలు సంతోషంతో ఊగిపోతూ ఒకరికొకరు రంగులు అద్దుకుంటూ.. డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీనిని అంకిత ‘అందరికి హోలీ శుభాకాంక్షలు’ అంటూ షేర్ చేసింది. ఇక దీనిపై సుశాంత్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘ఛీఛీ సిగ్గుచేటు సుశాంత్ చనిపోయి ఏడాది కూడా కాలేదు హోలీ ఎలా సెలబ్రెట్ చేసుకుంటున్నావ్ అంకిత’, ‘సుశాంత్ అభిమానులుగా మేమే హోలీ పండగ సెలబ్రేట్ చేసుకోలేకపోయాం.. కానీ నువ్వు ఆయన ప్రియురాలివి..ఒక్క ఏడాది కూడా అగలేకపోయావా అంకిత’, ‘సుశాంత్ విషయంలో అంకిత చెప్పినవన్ని అబద్ధాలే.. ఫేం కోసం సుశాంత్ ప్రియురాలినని చెప్పుకుంది. పెద్ద మహానటి’, ‘హేట్ యూ అంకిత’ అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కాగా అంకిత సుశాంత్ మరణాంతరం తనిన ప్రేమించానని, ఏడాది వారకు తామిద్దరం డేటింగ్లో ఉన్నామంటు అవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక సుశాంత్ను పెళ్లి చేసుకోవడం కోసం తనకు వచ్చి మూవీ ఆఫర్స్ను తిరస్కరించానని, షారుక్ ఖాన్తో ‘హ్యాపీ న్యూయర్’, ‘రామ్-లీలా’ వంటి సూపర్ హిట్ మూవీస్ కూడా వదులుకున్నట్లు ఆమె ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) చదవండి: చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి ‘మేం విడిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?’ -
అంబరాన్నంటిన హోలీ సంబరాలు
-
హోలీ వేడుకల్లో అదరగొట్టిన అందాల భామలు
-
హోలీ: సెంటరాఫ్ అట్రాక్షన్గా తారలు
-
ఈ ఫోటోలో ఉన్న స్టార్ కిడ్స్ని గుర్తుపట్టారా?
ముంబై : రంగుల హోలీ వస్తుందంటే.. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా హోలీ పండుగును జరుపుకుంటారు. కరోనా కారణంగా ఆంక్షల మధ్య ఈసారి హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. పలువురు సినీ స్టార్స్ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంతో ఉల్లాసంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్టార్ హీరోయిన్ తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసుకుంది. కింగ్ ఖాన్ షారుక్ కూతురు సుహానా ఖాన్, కపూర్ ఫ్యామిలీకి చెందిన షనయా కపూర్తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్న చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే. తన బెస్ట్ ఫ్రెండ్స్తో అనన్య దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో మధ్యలో ఉన్నదినటి అనన్య పాండే కాగా, ఆమె కుడివైపు షనయా కపూర్ ఉండగా, ఎడమ వైపు ఉన్నది సుహానా ఖాన్. వీరిద్దరితో బెస్ట్ హోలీ మొమరీస్ ఉన్నాయని గుర్తు చేసుకుంది అనన్య. ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా హోలీ జరుపుకోవాలని కోరింది. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) చదవండి : హోలీ సెలబ్రేషన్స్లో మన స్టార్స్.. ఫోటోలు వైరల్ సోషల్ హల్చల్: మేనుకు రంగులద్దుకున్న భామలు -
హోలీ సెలబ్రేషన్స్లో మన స్టార్స్.. ఫోటోలు వైరల్
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈసారి కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి పండుగ జరుపుకుంటున్నారు. సినీ స్టార్స్ సైతం కుటుంబసభ్యులు, స్నేహితులతో హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ , భర్త గౌతమ్ కిచ్లుతో హోలీని సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి హోలీ కావడంతో భర్తతో కలర్ఫుల్ వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోలు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో హోలీ ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హోలీ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాడు. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ హోలీ సందర్భంగా త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేశారు. భార్య జయా బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్తో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రంగ్ బర్సే.. అంటూ హిందీ పాటను జతచేస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతోంది. హిందీ బిగ్బాస్-14 విజేత రాహుల్ వైద్య తన ప్రేయసి, కాబోయే భార్య దిశా పార్మర్తో కలిసి హోలీ జరుపుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్, అతని తల్లిదండ్రులతో కలిసి లండన్లో గ్రాండ్గా హోలీని సెలబ్రేట్ చేసుకుంది. నటుడు సంజయ్దత్ కుటుంబంతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. రిషి కపూర్- నీతూ కపూర్ల కుమార్తె రిద్ధిమా..సోదరుడు రణ్బీర్ కపూర్, తల్లి నీతూతో కలిసి హోలీ పండుగను జరుపుకుంటున్న చిన్ననాటి ఫోటో షేర్ చేసింది. వీరితో పాటు అక్షయ్ కపూర్, షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్, కంగానా పలువురు సెలబ్రిటీలు అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. -
మగవాళ్లు ఆడవాళ్లుగా.. హోలీ సంబరాల్లో వింత ఆచారం
ఆదోని: అక్కడ మగవాళ్లు ఆడవాళ్లుగా మారిపోతారు. కట్టు, బొట్టు, మాట తీరు అచ్చం సంప్రదాయ మహిళలను తలపిస్తుంది. నెత్తిపై నైవేద్యంతో నింపిన కుంభాన్ని పెట్టుకుని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల అనంతరం మళ్లీ తిరిగి ఇంటికి వస్తారు. దారిలో తమకు తెలిసిన, ఇష్టమున్న వ్యక్తులను దూషిస్తారు. ఆ వ్యక్తులు గతంలో చేసిన బండారం అంతా తిట్ల పురాణంలో వెలుగులోకి తెస్తారు. ఇష్టమున్న వ్యక్తులను ఆలింగనం చేసుకుంటారు. దూషణలు, ఆలింగనాలను రతి, మన్మథుల ఆశీస్సులుగా భావిస్తారు. దీని వల్ల తమ కుటుంబానికి అంతా మంచి జరుగుతోందని విశ్వసిస్తారు. నిష్టతో తమ ఇలవేల్పు రతి, మన్మథులకు మొక్కుబడి తీర్చుకునే క్రమంలోనే వింత ఆచారం కొనసాగుతోంది. కొత్తగా వింత ఆచారం చూసిన వాళ్లకు మాత్రం తరువాత పెద్ద గొడవలే జరుగుతాయోమోనన్న ఆందోళన కలిగిస్తోంది. వందేళ్లకు పైగా ఈ వింత ఆచారం ప్రశాంతంగానే కొనసాగుతోందని రతి, మన్మథుల ఆలయం పూజారి బసవరాజు స్వామి తెలిపారు. సృష్టి కి మూల పురుషులు అయిన రతి, మన్మథులను ఊరంతా ఇలాగే కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటారని ఆయన అన్నారు. నేటి నుంచే వేడుకలు పాల్గుణ మాసం శుద్ద దశిమిని పురస్కరించుకుని నిర్వహించే వేడుకలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు కొనసాగుతాయి. రెండు రోజుల క్రితం శుక్రవారం నిర్వాహకలు భాజీ భజంత్రీలతో ఇంటింటికి వెళ్లి రంగులు చల్లి వేడుకలకు భక్తులను ఆహా్వనించారు. ఆది, సోమ వారాల్లో గ్రామం నడి బొడ్డున ఉన్న ఆలయంలో కొలువు దీరిన రతి,మన్మథుల విగ్రహాలను పలు రంగుల పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం 6 గంటలకు కామ దహనం, సాయంత్రం శస్త్ర ధారణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్బంగా రెండు దవుడలో దబ్బణం గుచ్చిన రంధ్రంలో నుంచి 101 అడుగుల పొడువైన తాడును లాగుతారు. ఆది సోమవారాల్లో సాయంత్రం ఎంతో అందంగా తీర్చి దిద్దిన చిన్ప పిల్లలను విమానం పోలిన వాహనంలో కూర్చోబెట్టి మేళ,తాళాల మధ్య ఊరేగింపు నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి ‘వీరభిమాన్య కాళగ’ నాటక ప్రదర్శన కూడ ఏర్పాటు చేసుకున్నారు. వేడుకలను తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. నేను వేషధారణ చేస్తాను నేను కూడా ఆడవారి వేషం వేస్తాను. ఇది మా ఇంటి ఆచారం. ఎవరైనా ప్రోత్సాహించినా, మనుసులో తిట్టాలని పించినా తిడుతాను. అయితే ఎవరిని, ఏమి తిట్టామో తరువాత గుర్తుండదు. తిట్టించుకున్న వారు కూడ ఎప్పుడూ అడగరు. రతి, మన్మథుల మహిమ ఇది. – రవి, సంతెకూడ్లూరు చదవండి: రాజమహేంద్రవరంలో ‘టక్ జగదీష్’ సుబ్బారావు గ్రేట్.. నారింజ రసం సూపర్ -
తెలంగాణ లో హోలీ వేడుక పై కరోనా ప్రభావం
-
కోవిద్ ఆంక్షల నేపథ్యంలో ఇంట్లోనే హోలీ జరుపుకుంటున్న ప్రజలు
-
హోలీ వేడుకలకు రాజ్ భవన్ దూరం
సాక్షి, అమరావతి: కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఈ ఏడాది విజయవాడలోని ఏపీ రాజ్ భవన్లో హోలీ వేడుకలు నిర్వహించరాదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించినట్లు గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఇంట్లో ఉండి హోలీ పండుగను జరుపుకోవాలని గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరాన్ని కొనసాగించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్, సబ్బుతో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితంగా ఉన్నందున అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలన్నారు. ఇది వైరస్ సంక్రమణ గొలుసును విచి్ఛన్నం చేయడానికి సహాయపడుతుందన్నారు. -
Holi 2021: కలర్ఫుల్ కలర్స్
ఒక్కరు ఆడరు. మనుషులు గుంపులు. రంగులు బోలెడు. మీసం రంగు మారుతుంది. గాజులు వేరే రంగుకొస్తాయి. ఆట ఒక రంగు. పాట ఒక రంగు. వయసులో ఉన్న కుర్రదీ కుర్రాడూ ఒక రంగు. హోలీ వెలిసిన క్షణాలను దూరంగా విసిరేస్తుంది. ఉత్సాహ కణాలను దేహంలో నింపుతుంది. ఈ పండుగను పెద్ద తెర పండుగ చేసుకుంది. హిందీ సినిమాల్లో హోలీది మహాకేళీ. అందరికీ రంగుల చెమేలీ పూలు. హోలీలో ఎన్ని రంగులు ఉంటాయి? అన్నీ. హిందీ సినిమాల్లో హోలీని అడ్డు పెట్టుకుని ఎన్ని సీన్లు ఉంటాయి? అన్నే. వెండితెర అంటేనే కలర్ఫుల్గా ఉంటుందని కదా... మరి ఆ కలర్ఫుల్ తెరకే రంగులు అద్దితే ఎలా ఉంటుంది? చూద్దాం.. ‘మదర్ ఇండియా’ను మొదట చెప్పుకోవాలి. కలర్లో పాత్రలు హోలీ ఆడింది ఆ సినిమాలోనే. ఆడించినవాడు దర్శకుడు మెహబూబ్ ఖాన్. ‘హోలీ ఆయిరే కన్హాయి హోలీ ఆయిరే’ పాట అందులోదే. వితుంతువైన తల్లి నర్గిస్ తన ఇద్దరు కొడుకులు సునీల్ దత్, రాజేంద్ర కుమార్ గ్రామస్తులతో కలిసి పాడుతూ ఉంటే పులకించి భర్త రాజ్కుమార్తో తాను హోలి ఆడిన రోజులను గుర్తు చేసుకుంటుంది. కొడుకుల జీవితం, భవిష్యత్తు రంగులమయం కావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కాని వారిలో ఒక కొడుకు చెడ్డ రంగును, ద్రోహపు రంగును, ఊరికి చేయదగ్గ అపకారపు రంగును పులుముకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ రంగును కడిగి మురిక్కాలువలో పారేస్తుంది. ‘మదర్ ఇండియా’లో నర్గిస్ అదే చేస్తుంది. బందిపోటుగా మారిన కొడుకు సునీల్దత్ను ఊరి అమ్మాయిని ఎత్తుకుని పోతూ ఉంటే కాల్చి పడేస్తుంది. దేశం గురించి సంఘం గురించి ఆలోచించేవారు ఆ పనే చేస్తారు. సొంత కొడుక్కి తల్లి కావడం ఎవరైనా చేస్తారు. దేశానికి తల్లి కాగలగాలి. మదర్ ఇండియా చెప్పేది అదే. ‘కటీ పతంగ్’ రాజేష్ ఖన్నా 1969–71ల మధ్య ఇచ్చిన వరుస 17 హిట్స్లో ఒకటి. ఆ కథ ఒక ‘వితంతువు’ ఆశా పరేఖ్కు కొత్త జీవితం ప్రసాదించడం గురించి. నిజానికి ఆశాపరేఖ్ వితంతువు కాదు. మరణించిన స్నేహితురాలి కోసం వితంతువుగా మారింది. ఆమెను రాజేష్ ఖన్నా ప్రేమిస్తాడు. వైధవ్యం పాపం, శాపం కాదని అంటాడు. హోలి వస్తుంది. ‘ఆజ్ న ఛోడేంగే బస్ హమ్ జోలి’అని రాజేష్ ఖన్నా పాట అందుకుంటాడు. కాని తెల్లబట్టల్లో ఉన్న ఆశా పరేఖ్ దూరంగా ఉంటుంది. ఎందుకంటే వితంతువులు హోలి ఆడకూడదు. వారికి ఇక శాశ్వతంగా మిగిలేది తెల్లరంగే. కాని రాజేష్ ఖన్నా ఇందుకు అంగీకరించడు. పాట చివరలో రంగుల్లోకి లాక్కువస్తాడు. క్లయిమాక్స్లో ఆమెకు రంగుల జీవితం ఇస్తాడు. భర్త చనిపోవడంతో జీవితపు రంగులు ఆగిపోవడం ఒక వాస్తవం కావచ్చు. కాని జీవితం ముందు ఉంది. కొత్త రంగును తొడుక్కుంటే అది తప్పక మన్నిస్తుంది. ‘షోలే’లో గబ్బర్ సింగ్ మనుషుల్ని ఠాకూర్ సంజీవ్ కుమార్ ఆదేశం మేరకు అమితాబ్, ధర్మేంద్రలు తన్ని తగలేస్తారు. మరి గబ్బర్ సింగ్ ఊరుకుంటాడా? రామ్గఢ్పై దాడి చేయాలనుకుంటాడు. ‘కబ్ హై హోలి.. హోలి కబ్ హై’ అని అడుగుతాడు. ఈ సంగతి తెలియని రామ్గఢ్ వాసులు హోలీ వేడుకల్లో మునిగి ‘హోలికె దిన్ రంగ్ మిల్ జాయేంగే’ అని పాడుకుంటూ ఉంటారు. హటాత్తుగా గబ్బర్ ఊడిపడతాడు. ఊరంతా అల్లకల్లోలం. అగ్నిగుండం. అమితాబ్ దొరికిపోతాడు. ధర్మేంద్ర కూడా దొరక్క తప్పదు. ‘నా కాళ్ల మీద పడి క్షమాపణ కోరితే వదిలేస్తాను’ అంటాడు గబ్బర్ వాళ్లతో. అమితాబ్ బయలుదేరుతాడు. ఏం జరుగుతుందా అని అందరిలోనూ ఉత్కంఠ. గబ్బర్ కాళ్ల దగ్గరకు నమస్కారం పెట్టడానికన్నట్టు వొంగిన అమితాబ్ అక్కడ కింద ఉన్న రంగులు తీసి తటాలున గబ్బర్ కళ్లల్లో కొడతాడు. చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఈ సీన్ హోలి సీన్లన్నింటిలో తలమానికం. గబ్బర్ భరతం పట్టిన సీన్ అది. ‘సిల్సిలా’లో అమితాబ్ రేఖా ప్రేమించుకుంటారు. కాని అమితాబ్ జయా బచ్చన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రేఖ సంజీవ్ కుమార్ను. రెండు జంటలూ తమ జీవితాలు గడుపుతూ ఉండగా అమితాబ్, రేఖ తిరిగి తారసపడతారు. తమలో ఇంకా ప్రేమ ఉందనుకుంటారు. తమ పెళ్లిళ్లు అర్థం లేనివని భావిస్తారు. తమ తమ భాగస్వాముల మధ్య ఆ సంగతి సూచనగా చెప్పడానికి హోలిని ఎంచుకుంటారు. ‘రంగ్ బర్సే’ పాటను అమితాబ్ పాడుతూ పరాయివ్యక్తి భార్య అని కూడా తలవకుండా రేఖ వొడిలో తల పెట్టుకుని కేరింతలు కొడతాడు. కాని పెళ్లయ్యాక ఈ దేశంలో గతన్నంతా బావిలో పారేయాల్సి ఉంటుంది. పెళ్లికే విలువ. దాని పట్లే స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. చివరిలో ఆ సంగతి అర్థమయ్యి అమితాబ్, రేఖ తమ తమ పెళ్లిళ్లకు నిబద్ధులవుతారు. కాని ఈలోపు వారి వివాహేతర ప్రేమను చూపే పద్ధతిలో ట్రీట్మెంట్ దెబ్బ తిని సినిమా కుదేలైంది. ఇదో చేదురంగు. ‘దామిని’లో హోలీ క్రూర రంగులను చూపిస్తుంది. అందులో మీనాక్షి శేషాద్రి పెద్దింటి కోడలు. కాని మరిది ఆ ఇంట్లో హోలీ రోజున ఆ గోలలో పని మనిషిపై అత్యాచారం చేస్తాడు. మీనాక్షి శేషాద్రి ఆ దుర్మార్గాన్ని చూస్తుంది. దారుణంగా బాధను అనుభవించిన పని మనిషికి న్యాయం చేయడానికి మీనాక్షి శేషాద్రి తన వైవాహిక బంధాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే అని నిలబడుతుంది. ఆమె మీద ఎన్నో దాడులు. కాని దాడులు నిండినదే లోకం అయితే లోకం ఉంటుందా? ఎవరో ఒకరు తోడు నిలుస్తారు. మీనాక్షి శేషాద్రికి తోడుగా సన్ని డియోల్ నిలుస్తాడు. పోరాడతాడు. న్యాయం జరిగేలా చూస్తాడు. న్యాయం గెలిచినప్పుడు ఆ రంగులకు వచ్చే తేజం గొప్పది. ‘డర్’ సినిమా దౌర్జన్యప్రేమను చూపిస్తుంది. అసలు ‘నో’ అనే హక్కు, స్వేచ్ఛ స్త్రీలకు ఉందని కూడా కొందరు మూర్ఖప్రేమికులకు తెలియదు. ఉన్మత్తంగా ప్రేమించినంత మాత్రాన ఆ ప్రేమ గొప్పది అయిపోదు. ‘డర్’లో జూహీ చావ్లాను ప్రేమించిన షారూక్ ఖాన్ ఆమె వివాహం అయ్యాక కూడా వెంటపడతాడు. ఆమె ఇంట్లో హోలీ చేసుకుంటూ ఉంటే ముఖాన రంగులు పూసుకుని ప్రత్యక్షమవుతాడు. భయభ్రాంతం చేస్తాడు. ఎంత హింస అది. రంగు ముఖానికి పూసుకుంటే బాగుంటుంది. కళ్లల్లో పడితే బాగుంటుందా? కళ్లల్లో పడే రంగును ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. చివరకు ఆ రంగు సముద్రంలో కలిసిపోతుంది. రంగులు అన్నీ మంచివే. కాని కొన్ని రంగులు కొందరికి నచ్చవు. అలాగే కొన్ని జీవన సందర్భాలు కూడా నచ్చవు. కాని నచ్చని రంగులు ఉన్నప్పుడే నచ్చే రంగులకు విలువ. నచ్చని జీవన సందర్భాలు ఉన్నప్పుడే నచ్చే జీవన సందర్భాలకు విలువ. పాడు రంగులనూ పాత గాయాలనూ వదిలి కొత్త రంగుల్లోకి కొత్త ఉత్సాహాల్లోకి ఈ హోలి అందరినీ తీసుకెళ్లాలని కోరుకుందాం. హ్యాపీ హోలీ. – సాక్షి ఫ్యామిలీ -
జాజిరి.. జాజిరి.. జాజిరేయ్!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్) : హోలీ పర్వదినంలో భాగంగా మొదటి రోజు పులారా కార్యక్రమాన్ని ముగించిన ఆదివాసీలు రెండో రోజు మంగళవారం రంగోత్సవం అత్యంత ఘనంగా జరుపుకున్నారు. సోమవారం కాముని దహనం చేసిన చోటే రాత్రంతా జాగరణ చేశారు. ఆటలు ఆడారు, పాటలు పాడారు. ఆచారాలు, సంస్కృతిని కాపాడుతున్న ఆదివాసీలు మిగతా వారికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. బూడిదను దొంగలిస్తారని... ‘మాతారి మాతరల్’, కాముని దహనం చేసిన బూడిదను ఇతరులు దొంగలించకుండా ఉండడానికి ప్రత్యేకంగా జాగరణ చేశారు. ఇతర గ్రామస్తులు ఈ బూడిదను దొంగలించే ప్రయత్నం చేస్తారు. ఇది వారి ఆచారంలో భాగం. అందుకే వేరేవారు ఎవ్వరూ కాముని దహనం చేసిన బూడిదను దొంగలించకూడదనే ఉద్దేశంతో గ్రామంలోని పురుషులందరూ బూడిదకు రక్షణగా రాత్రంతా జాగరణ చేశారు. అంతకు ముందు కాముడి చుట్టూ సంప్రదాయ ప్రదర్శన చేశారు. సుమారు గంట సేపు డోలు వాయిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. లకాముని దహన స్థలంలో ఆదివాసీల భోజనాలు గుడాలే నైవేద్యంగా పులారా అనంతరం దురాడి రోజు మంగళవారం ఆయా ఆదివాసీ గ్రామాల్లోని పురుషులు ఉదయాన్నే మేల్కొని ఇంట్లో వంట చేసిన గుడాలతో గొడ్డలి, గడ్డపారలతో పొలిమేర వద్దకు వెళ్లి పొదలు కొట్టారు. నైవేద్యపు నీళ్లు చల్లి, పూజలు చేశారు. ఇప్పటి నుంచి పొలం పనులు ప్రారంభిస్తామని గ్రామ పటేళ్లు చెప్పారు. దురాడి తెల్లారి పొదలు కొట్టడం లాంటి కార్యక్రమంలో పొలం పనులు ప్రారంభిస్తే పంటల్లో దిగుబడి బాగా వస్తుందని వారు చెబుతున్నారు. అనంతరం మళ్లీ కాముడి దహనం వద్దకు వెళ్లి గుడాలను నైవేద్యంగా సమర్పించారు. అక్కడే వాటిని ఆరగించాక కాముడి బూడిదను తీసుకెళ్లి తమతమ ఇళ్ల ముఖద్వారం ఎదుట చల్లారు. ఇలా చల్లడం వల్ల బయట శక్తులు ఇళ్లలోకి ప్రవేశించవని వారి నమ్మకం. ఇంటింటికి ‘బోజర’ రెండు రోజుల కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాక చివరిగా డోలు వాయిస్తూ ‘జాజిరి.. జాజిరి.. జాజిరేయ్’ అంటూ ప్రతి ఇంటికీ తిరుగుతూ బోజర(ధర్మం) అడిగారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి బోజర అడుక్కున్నారు. దీంతో పల్లెలు డోలు వాయిద్యాలతో మారుమ్రోగాయి. మధ్యాహ్నం తర్వాత సమీప వాగుల్లో స్నా నాలు చేసి తమతమ ఇళ్లకు బయలుదేరారు. ప్రదక్షిణలు చేస్తున్న ఆదివాసీలు -
దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు..
-
‘ హోలీ’ సంబరాలు..సెలబ్రిటీలు
-
హోలీ వేడుకల్లో వింత ఆచారం
-
హోలీ వేడుకల్లో వింత ఆచారం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో బోధన్ మండలంలోని ఓ గ్రామంలో హోలీ వేడుకల్లో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన హున్సాలో హోలీ సందర్భంగా గ్రామస్తులు పిడిగుద్దులాట ఆడారు. ఈ ఆటలో పాల్గొన్న గ్రామస్తులు ఒకరినొకరు కొట్టుకున్నారు. హోలీ రోజు ఈ విధంగా కొద్దిసేపు పిడిగుద్దులాట ఆడటం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత గ్రామస్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని.. హోలీ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఒక చోటుకు చేరి కొట్టుకునే ఆటను నిర్వహిస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రేయసితో హోలీ జరుపుకున్న హర్దిక్
దేశవ్యాప్తంగా హోలీ పండగను మంగళవారం ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావంతో ఎక్కువగా సహజ సిద్ధమైన రంగులనే ఉపయోగిస్తున్నారు. ఇక ఈ వైరస్ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సారి హోలీ జరుపుకోవడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా టీం ఇండియా క్రికెటర్లు సైతం హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ ఆనందంగా, సురక్షితంగా హోలీని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ హోలీ మీ జీవితాల్లో ఎన్నో రంగులు నింపాలని కోరుకుంటున్నాను’ అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా తన ప్రేయసి నటాషా, సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి హోలీ వేడుక చేసుకున్నారు. ‘ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు. వీరితో పాటు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. Happy holidays from the Pandyas ❤️ #Holi hai pic.twitter.com/0IpJ5Ippjf — hardik pandya (@hardikpandya7) March 10, 2020 Wishing everyone a joyful and a safe Holi. May the festivities bring a lot of colors to your life. 😇 #HappyHoli — Virat Kohli (@imVkohli) March 10, 2020 सभी देशवासियों को होली की शुभकामनाएं। मैं कामना करता हूँ यह होली आपके जीवन में खुशियों के रंग, शांति और नई उमंगे लेकर आए। #Holi #होलीहै pic.twitter.com/McH8ETu8cH — Sachin Tendulkar (@sachin_rt) March 10, 2020 -
‘వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’
సినిమా షూటింగ్లతో నిరంతరం బిజీగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడనే విషయం తెలిసిందే. షూటింగ్ ప్రదేశాలకు కూడా తారక్ అప్పుడప్పుడు పిల్లలను తీసుకొస్తుంటాడు. తాజాగా తన కుటుంబంతో కలిసి హోలీ జరుపుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ భార్య ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్లతో కలిసి ముఖానికి రంగులు చల్లుకున్న ఫోటోతో ట్వీట్ చేశాడు. (ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇదే..) ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండంతో ఈ ఫోటోను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అలాగే ఎన్టీఆర్కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. ఎన్టీఆర్ చిన్న కొడుకును ఉద్ధేశించి ‘చిన్నవాడు కెమెరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతుంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు’. అంటూ రీట్వీట్ చేశాడు. (ఆర్ఆర్ఆర్తో కేజీఎఫ్ 2 ఢీ : యష్ వివరణ) ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ అయిపోయిన వెంటనే తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయనున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తారక్కు ఇది 30వ సినిమా కావడం విశేషం. (యంగ్ టైగర్ అభిమానులకు గుడ్ న్యూస్!) The way younger one is looking at camera says something …… odilithe ippude dookeselaa unnadu…………… 👌👌👌 https://t.co/k6TDsPbd5X — Harish Shankar .S (@harish2you) March 10, 2020 Little Tigerrrrrrr❤️❤️❤️❤️❤️ on the wayyy!!!!! — Harish Shankar .S (@harish2you) March 10, 2020 -
హైదరాబాద్ లో హోలీ సంబరాలు
-
రంగుల కేళి.. కరోనాతో జాగ్రత్త మరి
సాక్షి సిటీబ్యూరో: హోలీ.. రంగుల పండుగ. ప్రేమానురాగాలకు ప్రతీక. అలాంటి పండుగతో ఇష్టానుసారం రంగులు వాడి అనారోగ్యం కొనితెచ్చుకోవద్దంటున్నారు నిపుణులు. సహజసిద్ధ రంగులను వినియోగించి హోలీని ఆనందాల పండుగగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. కరోనా ప్రభావం ప్రతి ఏటా హోలి పండుగ అనగానే అందరూ రంగులు చల్లుకునే వారు. అయితే ఈ ఏడాది హోలీ సందడి తగ్గిందనే చెప్పవచ్చు. కారణం కరోనా ప్రభావం. మార్కెట్లో రంగులు పెద్దగా కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇక నగరంలో హోలీ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్లకు కూడా పెద్దగా ఆదరణ లేదు. ప్రేమను పెంచుకోండి... హోలీ అంటేనే రంగులు, మిఠాయిలు. హోలీతో అనుబంధాలు పెంచుకోవాలి తప్ప రోగాలను తెచ్చుకోవొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. సహజసిద్ధమైన రంగుల వల్ల శరీరంతో పాటు ప్రకృతికి కూడా మేలు చేసిన వారమవుతామన్నారు. హోలీ సందర్భంగా వినియోగించే ఒక్కో రంగు ఒక్కో భావానికి ప్రతీకగా నిలిచినట్లే ఆయా రంగుల్లోని ఒక్కో రసాయనం ఒక్కో జబ్బుకు కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండాలి హోలీ వేడుకల్లోఅప్రమత్తంగా ఉండకపోతే సమస్యలు కొనితెస్తుంది అంటున్నారు నగరానికి చెందిన అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ వైద్యురాలు డా.ఆర్.రాజ్యలక్ష్మి. ఆమె అందిస్తున్న సూచనలివి... ♦ రంగులలో వెజిటబుల్స్, ఫ్లవర్ డైలు ఉపయోగిస్తున్న సహజ రంగులు తగిన పరిమాణంలో లభ్యం కావడం లేదు. దీంతో సింథటిక్ కెమికల్ కలర్స్ విస్త్రుతంగా వినియోగిస్తున్నారు. తద్వారా రకరకాల ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కంటి చూపుపై ఈ తరహా రంగులు చెడు ప్రభావం చూపుతాయి. కాబట్టి హోలీ ఆడే సమయంలో... ♦ కంటి చుట్టూ ఉండే చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది. కొబ్బరినూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తగినంత కంటి చుట్టూ అప్లయి చేయడం మంచిది. అలాగే నాణ్యమైస సన్గ్లాసెస్ కూడా వినియోగించడం అవసరం. రంగులు కంటిలో, నోటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా అనుకోకుండా కళ్లలో రంగులు ప్రవేశిస్తే వాటిని నలపడం వంటివి చేయకూడదు. శుభ్రం చేసుకున్న చేతులలో నీళ్లు పోసుకుని అరచేతుల్లో కళ్లు ఆర్పుతూ మూస్తూ క్లీన్ చేసుకోవాలి. అంతే తప్ప కంటిపై నీళ్లను గట్టిగా చల్లకూడదు. వాటర్ బెలూన్స్ వినియోగం వద్దు. ఇవి కంటికి చాలా ప్రమాదకరం. కళ్లజోడు ఫ్రేమ్స్ లో ఉండిపోయే రంగులు తర్వాత తర్వాత ఇబ్బందులు సృష్టించవచ్చు. రిమ్లెస్ కళ్లజోళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. కాంటాక్ట్ లెన్స్లు వాడే అలవాటు ఉంటే వాటికి రంగుల పండుగ రోజు దూరంగా ఉండాలి. -
ఇషా హోలీ పార్టీ: ‘నా మొదటి హోలీ ఇదే’
ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ ఇంట్లో శుక్రవారం రాత్రి హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ.. తన భర్త ఆనంద్ పిరమల్తో కలిసి ముంబైలో హోలీ పార్టీ ఏర్పాటు చేశారు ఈ వేడుకకు అంబానీ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక వర్గానికి చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు హాజరైయ్యారు. భర్త నిక్ జోనాస్తో కలిసి ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాలి బింద్రే, హ్యూమా ఖురేషి తదితరులు పార్టీలో పాల్గొన్నారు. కాగా కత్రినా ప్రస్తుతం విక్కీ కౌశల్తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో ప్రియాంక దంపతులు, కత్రినా ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. (ప్రియాంక , నిక్ డ్యాన్స్ వీడియో వైరల్) రంగు నీళ్లలో తడుస్తూ.. ఒంటి నిండా రంగులు చల్లకుంటూ తారలంతా పార్టీలో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా తన జీవితంలో మొదటిసారి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నట్లు నిక్ జోనాస్ తెలిపారు. ముఖం నిండా రంగులతో నిండిన ఇద్దరి ఫోటోను షేర్ చేస్తూ.. ‘నా మొదటి హోలీ (అయిదు రోజుల ముందు.) ఇండియాలో నా రెండవ ముఖ్యమైన ఇంటిలో అత్యంత దగ్గర వ్యక్తులతో జరుపుకోవడం సరదాగా ఉంది.’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నాడు. View this post on Instagram My first Holi! (Five days early)So much fun celebrating with such incredible people here in my second home in India. #holi @_iiishmagish @anandpiramal @priyankachopra A post shared by Nick Jonas (@nickjonas) on Mar 6, 2020 at 10:12am PST View this post on Instagram She makes me smile a lot. #holi A post shared by Nick Jonas (@nickjonas) on Mar 6, 2020 at 10:15am PST View this post on Instagram @katrinakaif @vickykaushal09 ❤ __________________________________________ #katrinakaif #sidharthmalhotra #hrithikroshan #ranbirkapoor #salmankhan #salkat #rankat #india #bollywood #aliabhatt #deepikapadukone #ranveersingh #shraddhakapoor #kareenakapoor #vickykaushal #sonamkapoor #akshaykumar #srk #катринакаиф #индийскиефильмы #салманкхан #шахрукхкхан #ранбиркапур #анушкашарма #ритикрошан A post shared by FAN ACCOUNT (@katrinamykaif) on Mar 6, 2020 at 12:19pm PST -
కరోనా ఎఫెక్ట్ : హోలీకి వారు దూరం
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) భారత్లోనూ ఆందోళనలు రెకెత్తిస్తోంది. ఇప్పటివరకు 28 మందికి కరోనా వైరస్ సోకినట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది హోలీ వేడుకలకు దూరంగా ఉండనున్నట్టు బుధవారం ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. నిపుణులు సూచనల ప్రకారం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రధాని మోదీ బాటలోనే నడవనున్నట్టు ప్రకటించారు. కరోనా ఆందోళనల నేపథ్యంలో తాము కూడా హోలీ వేడుకలు జరుపుకోవడం లేదని అమిత్ షా, నడ్డాలు తెలిపారు.(చదవండి : ‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో ఎలాంటి మార్పు లేదు: సీపీ) అమిత్ షా స్పందిస్తూ.. బహిరంగ సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మన భారతీయులకు హోలీ అతి ముఖ్యమైన పండగ. కానీ కరోనా ఆందోళనల నేపథ్యంలో నేను హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రతి ఒక్కరు అప్రమత్తతో ఉండాలి. మీ గురించి, మీ కుటుంబం గురించి జాగ్రత్తలు తీసుకోండి’ అని షా ట్వీట్ చేశారు. హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నడ్డా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ప్రపంచ దేశాలు కరోనా వైరస్తో పోరాడతున్నాయి. వివిధ దేశాలు, వైద్యులు సంయుక్తంగా కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా నేను ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదు. అలాగే హోలీ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. అందరు సురక్షితంగా ఉండండి’ అని నడ్డా ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి : దేశంలో 28 కరోనా కేసులు: కేంద్ర మంత్రి) అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా.. మరోవైపు కరోనా ఆందోళనల నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. మార్చి 15న హైదరాబాద్లో అమిత్ షా పర్యటించాల్సి ఉండగా.. దానిని వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణాసాగర్ రావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా బహిరంగ సభలు నిర్వహించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. -
‘బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తిని నేనే’
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. విశేషం ఏంటంటే ఈ ఫోటోలో అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడో గుర్తుపట్టలేకపోయారు నెటజన్లు. చివరకూ కేజ్రీవాలే ఫోటోలో తను ఎక్కడ ఉందో చెప్పారు. వివరాలు.. కేజ్రీవాల్ ఐఐటీలో చదువుతున్న రోజుల్లో హోలీ సందర్భంగా తీసిన ఫోటోనొకదాన్ని ఆయన స్నేహితుడు రాజీవ్ సరఫ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. 1986 నాటి కాలం నాటి ఈ ఫోటోలో కేజ్రీవాల్ను గుర్తుపట్టలేకపోయారు నెటిజన్లు. చివరకు ఓ రిపోర్టర్ ‘ఫోటో చాలా బాగుంది. కానీ ఇందులో మీరెక్కడ క్రేజీవాల్’ అంటూ ట్వీట్ చేశారు. అందుకు కేజ్రీవాల్ రిప్లై ఇస్తూ.. బ్రౌన్కలర్ ప్యాంట్ వేసుకుని ముందు నడుస్తున్నది నేనే అంటూ రీట్వీట్ చేశారు. The one in the front wid brown trousers... https://t.co/KVsd6M5Cff — Arvind Kejriwal (@ArvindKejriwal) March 21, 2019 1989లో ఐఐటీ ఖరగ్పూర్లో కేజ్రీవాల్ బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1993లో ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఢిల్లీకి ఏడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 2015 నుంచి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు న్యూఢిల్లీలో ఇన్కమ్ టాక్స్ జాయింట్ కమిషనర్గా పని చేసేవారు. -
హోలీ వేడుకల్లో విషాదం : ఎమ్మెల్యేపై కాల్పులు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన హోలీ వేడుకల్లో లఖీంపూర్ ఖేరీ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై కాల్పులు కలకలం రేపాయి. వర్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి గట్టెక్కారని సమాచారం. లఖీంపూర్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై హోలీ వేడుకల్లో దుండగుడు కాల్పులు జరిపాడని, కాల్పుల్లో ఆయన కాలికి బుల్లెట్ గాయాలయ్యాయని జిల్లా ఎస్పీ పూనం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వర్మ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్పీ పూనం వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో కొంతమందితో ఎమ్మెల్యే ముచ్చటిస్తున్న క్రమంలో వాగ్వాదం చేసుకోవడంతో ఆయనపై కాల్పులు జరిపారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని లఖీంపూర్ జిల్లా మేజిస్ర్టేట్ ఎస్ సింగ్ చెప్పారు. ఎమ్మెల్యేపై కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేస్తారని సింగ్ పేర్కొన్నారు. -
హుషారుగా హోలీ వేడుకలు
-
విశాఖ బీచ్లో హోలీ సంబరాలు
-
విజయవాడలో హోలీ సంబరాలు
-
హోలీ వేడుక.. తరలొస్తున్న నక్కల పిట్టలోళ్లు
పహాడీషరీఫ్: హోలీ వేడుకలకు జల్పల్లి పిట్టలగూడెం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, నగరంలోని పార్థివాడలకు చెందిన నక్కల పిట్టలోళ్లు ఇక్కడే హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వారు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మూడు నాలుగు రోజులు గడుపుతారు. వేలాదిగా తరలివచ్చే వీరితో ఈ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. ఇప్పటికే ఇక్కడికి తరలొస్తున్న పార్థీలు తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని, తమ పూర్వీకుల సమాధులకు రంగులద్దుతున్నారు. తమ కుల యువతి అమీర్బాయి, పూర్వీకుల సమాధులకు పూజలు నిర్వహించడం, వంశ పూజలు చేయడం ఈ హోలీ వేడుకల్లో ప్రత్యేక ఘట్టంగా చెప్పుకోవచ్చు. హోలీకి ముందు రోజు రాత్రి కామనదహనం చేసి, పండగ రోజు రంగులద్దుకొని స్థానిక జల్పల్లి పెద్ద చెరువులో స్నానాలు చేస్తారు. నక్కల పిట్టలోళ్ల కులంలో శక్తి, చౌకట్, నౌకడ్, కాలివాలా, ఇస్లీవాలా తదితరులు ఎక్కువగా ఉంటారు. వీరంతా ఇక్కడే వంశపూజ నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా ఒక్కో కుటుంబం 5–10 పొట్టేళ్లను బలిచ్చి వేడుకలు జరుపుకుంటారు. మొత్తం మీద దాదాపు వెయ్యి వరకు పొట్టేళ్లను ఈ వేడుకల సందర్భంగా బలిస్తారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పహాడీషరీఫ్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జల్పల్లి మున్సిపాలిటీ తరఫున నీరు, విద్యుత్, పారిశుధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ మహ్మద్ సాబెర్ అలీ తెలిపారు. నిజాం మనసు దోచిన అమీర్బాయి... నిజాం నవాబుల హయాంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన నక్కల పిట్టలోళ్లు జల్పల్లి అటవీ ప్రాంతంలో జంతువుల వేట సాగిస్తూ జీవించేవారు. అప్పట్లో అడవికి వేటకు వచ్చిన నిజాం నవాబుకు ఈ తెగకు చెందిన అమీర్బాయి అనే యువతి తీయని ఫలాలు అందజేసింది. వాటిని ఆస్వాదించిన నిజాం నవాబు ఆమె ప్రేమను సైతం కోరాడు. దీనికి ఆమె కూడా అంగీకరించడంతో... అప్పటి నుంచి నిజాం నవాబుకు నక్కల పిట్టలోళ్లు పండ్లు ఇచ్చేవారు. అమీర్బాయి కోసం నిజాం కొలను తవ్వించి భూగర్భంలోనే రాతి కట్టడంతో స్నానాల గదులు నిర్మించాడు. అమీర్బాయి 40ఏళ్లలోపే మృతి చెందగా కొలను సమీపంలోనే ఆమెను సమాధి చేశారు. ఇక్కడే నక్కల పిట్టలోళ్లు నివాసం ఉండేందుకు అప్పట్లో నిజాం నవాబు వందల ఎకరాల భూమిని ఇనామ్గా ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇక్కడ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ భూములు కాలక్రమేణా అన్యాక్రాంతమవుతున్నాయి. హోలీ తర్వాత రోజు పార్థీలు అమీర్బాయి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడే అంత్యక్రియలు... అప్పట్లో జల్పల్లి పిట్టలగూడెం ప్రజలతో కళకళలాడేది. ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని స్థానికంగా తోటల్లో పండ్లు పండిస్తూ జీవించేవారు. కాలక్రమేణా వీరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్థీవాడలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లినవారు ప్రస్తుతం పురానాపూల్, రాజన్నబావి, శక్కర్గంజ్, ఛత్రినాక, హమాంబౌలి, డబీర్పురా, సరూర్నగర్, కాచిగూడ, అమీర్పేట, అబిడ్స్, బేగంబజార్, బోయిగూడ, చిక్కడపల్లి, లాల్దర్వాజా, ఎల్బీనగర్, మొజంజాహి మార్కెట్, గన్ఫౌండ్రీ సహా వరంగల్, నిజామాబాద్, మెదక్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇప్పటికీ ఆయా కుటుంబాల్లో ఎవరూ మరణించినా జల్పల్లి పిట్టలగూడెంకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆనవాయితీ... ప్రతిఏటా పిట్టలగూడెంలో హోలీ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని మా పూర్వీకులకు పూజలు చేస్తాం. మా తాతల కాలం నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. మా కులస్తులకు ఇక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తే బాగుంటుంది. – రాజు, బషీర్బాగ్ ఐక్యతకు చిహ్నం అమీర్బాయి పేరు మీదుగానే హోలీ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హోలీ తర్వాత రోజు ఆమె సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. వంశ పూజ పెద్ద ఎత్తున జరుపుకుంటాం. ఈ వేడుకలకు ప్రభుత్వం తరఫున మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. విద్యుత్, నీటి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నాం. నిజాం నవాబు ఇచ్చిన భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. మాలోని ఐక్యతకు ఈ వేడుక చిహ్నంగా నిలుస్తుంది. – ఎన్.రవి, లాల్దర్వాజా -
హోలీ.. వికృత కేళి!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో హోలీ పండుగ వికృత చేష్టలకు తెరతీసింది. దీంతో కొంత మంది గాయాలపాలయ్యారు. కొందరు ఆకతాయిలు వెళ్తున్న రైళ్లపై రంగు నింపిన వాటర్ బెలూన్లును విసురుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. ములుండ్ సమీపంలోని లోకల్ రైలు మొదటి తరగతి మహిళల కోచ్ వద్ద పోలీసులు భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వారిపై వాటర్ బెలూన్లను విసిరారు. ట్రాక్ పక్కన నివసిస్తున్న కొందరు గ్రూప్లుగా ఏర్పడి ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు కుర్లా, సియోన్, బాంద్రాల్లోనూ చోటుచేసుకున్నాయని తెలిపారు. సాధారణ దుస్తులు ధరించి మఫ్టిలో తాము డ్యూటీ చేశామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు. ములుండ్ ప్రాంతాన్నే కొందరు టార్గెట్గా చేసుకొని ఈ పనికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితులను తాము గుర్తించామని, త్వరలో వారిని పట్టుకుంటామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పలువురికి గాయాలు.. హోలీ ఆడుతున్న ఆనందంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. కుర్లా ప్రాంతంలో నివసిస్తున్న రామ్ దుబే (28) హోలీ ఆడుతూ గేట్ మధ్యలో వేలు ఇర్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సియోన్ ఆస్పత్రికి తరలించారు. వడాలకు చెందిన మరో వ్యక్తి వాటర్, రంగులు నింపిన బెలూన్లను కుక్కపై విసరడంతో అది అతనిపై దాడి చేసి గాయపరిచింది. వెంటనే అతన్ని కేఈఎం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటివి 17 కేసులు నమోదయ్యాయని ఆ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 17 కేసుల్లో 12 కంటికి సంబంధించినవని తెలిపారు. మరోవైపు సియోన్ ఆస్పత్రిలో కూడా 20, నాయర్ ఆస్పత్రిలో 2 కేసులు నమోదైయ్యాయని పేర్కొన్నారు. హోలీ నింపిన విషాదం పుణే: హోలీ పండుగ ఓ కుటుంబంలో విషాదం నింపింది. హోలీ ఆడుతూ బస్సు నుంచి కింద పడి సతీశ్ కాంబ్లె (14) అనే విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం, కాంబ్లె కుటుంబం పుణేలోని లక్ష్మీ నారాయణ ప్రాంతంలో నివసిస్తున్నారు. మోజే హై స్కూల్లో సతీశ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్ అయిపోయాక బస్సులో ఇంటికి వస్తున్నాడు. ఆ క్రమంలో బస్సులో స్నేహితులతోపాటు సతీశ్ హోలీ ఆడుతున్నాడు. అందులో కొంత మంది సతీశ్పై వాటర్ బెలూన్లు విసిరారు. వాటిని తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు నుంచి కింద పడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
హోలీ వేడుకల్లో అపశ్రుతి.. ముగ్గురు గల్లంతు
సాక్షి, బరంపురం: హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గోపాల్పూర్ సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం ఒడ్డుకు చేరుకోగా మిగిలిన ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. బినాయక్ ఆచార్య కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శి డి.హితీష్, ప్రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన సిద్ధాంత్ పాత్రో, ఎ.లోకేష్లతో సహా వివిధ కళాశాలలకు చెందిన 19 మంది విద్యార్థులు శుక్రవారం హోలీ పండగ చేసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం గోపాల్పూర్ సముద్ర తీరానికి స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో అలల ఉద్ధృతికి నలుగురు విద్యార్థులు కొట్టుకుపోగా ఒకరిని స్థానికులు రక్షించారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సిద్ధంత్ పాత్రో మృతదేహం హరిపురం తీరంలో ఒడ్డుకు చేరింది. హితీష్, ఎ.లోకేష్ల జాడ దొరకలేదు. వీరిద్దరి కోసం మెరైన్, గోపాల్పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. -
హోలీ వేడుకల్లో టీనేజర్ హత్య.. కలకలం!
సాక్షి, జైపూర్: హోలీ వేడుకలు ఓ దళిత కుటుంబంలో పెను విషాదం నింపాయి. హోలీ అడుతుండగా ఆయుధాలతో దాడిచేయడంతో దళిత టీనేజర్ మృతిచెందడం కలకలం రేపింది. ఈ ఘటన రాజస్థాన్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నీరజ్ జాటవ్(16) అనే టీనేజర్ అల్వార్ జిల్లా భివాడి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో హోలీ సందర్భంగా బయటకు వెళ్లాడు నీరజ్. అయితే ఇతర సామాజిక వర్గానికి చెందిన మిత్రులు, స్థానికులతో హోలీ రంగులు రుద్దుకుంటూ హోలీ ఆడుతున్నాడు. అంతలోనే గొడవ మొదలైంది. దళిత బాలుడు నీరజ్పై కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న దళిత టీనేజర్ కుటుంబసభ్యులు నీరజ్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయాలతో రక్తస్రావమైన నీరజ్ ఆస్పత్రికి తీసుకెళ్లగానే మృతిచెందాడని ఏఎస్పీ పుష్పేంద్ర సోలంకి తెలిపారు. హోలీ ఆడుతున్న నీరజ్ను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్యచేశారని, ఆ టీనేజర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం గమనార్హం. -
హోలీ వేడుకల్లో గొడవ.. యువకుడికి 50 కత్తి పోట్లు
-
హోలీ వేడుకల్లో గొడవ.. యువకుడికి 50 కత్తి పోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. బైక్లపై వచ్చిన పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువకుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. కత్తులతో, రాడ్లతో అతనిపై విరుచుకుపడటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయ్యింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఖాన్పూర్కు చెందిన అశిశ్ అనే యువకుడు గురువారం సాయంత్రం జిమ్ నుంచి బయటకు వచ్చాడు. అంతలో సుమారు 10 బైక్లు అక్కడికి దూసుకొచ్చాయి. వాటిపై వచ్చిన 20 మంది యువకులు అశిశ్పై కత్తులతో, రాడ్లతో దాడి చేశారు. అంత మంది ఒకేసారి అతనిపై దాడి చేసే సరికి ప్రతిఘటించలేకపోయాడు. స్థానికులు కూడా ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు. దాడి అనంతరం అంతే వేగంగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆపై స్థానికులు అశిశ్ను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడికి 50 కత్తిపోట్లు తగిలాయని.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ దాడితో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. పిల్లాడిని కాపాడినందుకే... అంతకు ముందు ఉదయం హోలీ వేడుకల్లో స్థానికంగా ఓ చిన్న ఘర్షణ నెలకొంది. ఓ బాలుడు రంగుల బెలూన్లను ఇద్దరు వ్యక్తులపై పొరపాటున విసిరాడు. దీంతో వారు ఆ బాలుడిని చితకబాదగా.. అశిశ్ జోక్యం చేసుకుని బాలుడిని రక్షించాడు. వెళ్లేముందు అంతు చూస్తామని వారు అశిశ్ను బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు. బహుశా ఇది వారిపనే అయి ఉంటుందని భావిస్తున్నారు. -
హోలీ వేడుకల్లో వైఎస్ జగన్
-
హోలీ సంబరాల్లో వైఎస్ జగన్
సాక్షి, ఒంగోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో జననేత చేపట్టిన పాదయాత్రలో భాగంగా సంతనూతల పాడు నియోజక వర్గంలోని చీమకుర్తిలో ఈ ఉదయం పలువురు విద్యార్థినులు వైఎస్ జగన్ను కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. కాగా జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ చీమకుర్తి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దారిపొడవునా రాజన్న తనయుడికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోస్తా ఇస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. Wishing everyone a safe and fun-filled Holi. #HappyHoli pic.twitter.com/kTFYNVbLHF — YS Jagan Mohan Reddy (@ysjagan) March 2, 2018 -
హోలీ సంబరాల్లో జవాన్లు
-
హోలీ సంబరాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు
సాక్షి, జమ్మూ : దేశ భద్రతను కాంక్షిస్తూ నిత్యం సరిహద్దుల్లో పహారా కాసే సరిహద్దు భద్రతా దళ జవాన్లు గురువారం హోలీ సంబరాల్లో మునిగితేలారు. దేశాన్నికాపాడేందుకు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ దీటుగా సేవలందించే జవాన్లు కొద్దిసేపు సేదతీరారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ జవాన్లు ఆటపాటలతో హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సరిహద్దులో సందడి చేశారు. మిఠాయిలు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా ఆనందంగా రంగుల పండుగను జరుపుకున్నారు. -
హోలీ పండుగలో విషాదం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని పుల్కల్ మండలం కొర్పోల్ గ్రామంలో నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. గ్రామంలోని యువకులు హోలీ వేడకలు జరుపుకున్నారు. వేడుకల అనంతరం స్థానిక మంజీర నదిలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలో దిగిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. చనిపోయిన ఇద్దరు చిన్నారులు సాయికుమార్, సాయి కిరణ్లుగా గుర్తించారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా హోలీ ఆడిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
-
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వేడుకల పేరుతో విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటనలు దేశ రాజధానిలో చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులపై కొందరు ఆగంతకులు వీర్యంతో నింపిన బెలూన్లను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కథనం ప్రకారం... ఫిబ్రవరి 24వ తేదీన ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ యువతి అమర్ కాలేనీ మార్కెట్లోని ఓ కేఫ్కు వెళ్లింది. బైకులపై వచ్చిన ఐదుగురు యువకులు ఆమెపై బెలూన్లను విసిరారు. ఆపై హోలీ శుభాకాంక్షలు చెబుతూ అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. హస్టల్కు వచ్చిన యువతి దుస్తులను పరిశీలించిన యువతికి అవి రంగులు కావని అర్థమైంది. ఈ వికృత చేష్టలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇక ఢిల్లీ యూనివర్సిటీకే చెందిన మరో యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. హస్టల్ బయట నడుచుకుంటూ వెళ్తున్న తనపై కొందరు వ్యక్తులు బెలూన్లు విసిరారని... ఆపై రంగులు పూస్తూ అసభ్యంగా తాకినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యూనివర్సిటీ వద్ద పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. మరోవైపు హోలి వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని కాలేజీలు, హాస్టళ్ల వద్ద సెక్యూరిటీని అప్రమత్తంగా ఉండాలంటూ యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. -
హోలీ వేడుకల్లో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. హోలీ పేరుతో కొందరు దుండగులు తమపై వీర్యం నింపిన బెలూన్లను విసిరివేస్తూ వేధిస్తున్నారని లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థినులు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ద్రవపదార్థం నిండిన బెలూన్ను తనపై కొందరు విసిరివేశారని, అది తన దుస్తులపై పడిందని ఓ విద్యార్థిని తన ఫ్రెండ్తో చెప్పగా, అయితే అవి రంగు నీళ్లు కాదని, వీర్యమని గుర్తించిన వారు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కాగా ఇలాంటి ఘటనలు పలువురు విద్యార్థినులకు ఎదురయ్యాయని కాలేజ్ ఉమెన్ డెవలప్మెంట్ సెల్ విచారణలో వెల్లడైంది. తమపై కొందరు ఇలాంటి బెలూన్లు విసిరారని ముగ్గురు విద్యార్థినులు చెప్పారని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై కళాశాల విద్యార్థి సంఘం, కళాశాల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపు ఘటనలపై తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు పోలీసు అధికారులు ఓ మొబైల్ నెంబర్ను అందుబాటులో ఉంచారు. మరోవైపు విద్యార్థినులపై వేధింపులు నివారించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (విమెన్)ను కలిసి ఫిర్యాదు చేశామని లేడీ శ్రీరాం కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పారు. -
శ్రీదేవి మృతి; మేం హోలీ పండుగ జరుపుకోము!
సాక్షి, ముంబై : ప్రఖ్యాత నటి, బాలీవుడ్ తొలి ఫీమేల్ సూపర్స్టార్ శ్రీదేవి ఆకస్మిక మరణం పట్ల సర్వత్రా సంతాపం వ్యక్తమవుతోంది. ముంబైకి చేరుకున్న ఆమె పార్థీవ దేహానికి ప్రస్తుతం బాలీవుడ్తోపాటు, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విలేపార్లే హిందూ స్మశానవాటికలో ఆమె భౌతికకాయనికి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీదేవి మృతితో బాలీవుడ్, టాలీవుడ్లో విషాదం నెలకొంది. ముంబైలోనూ విషాదఛాయలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి మృతికి సంతాపంగా ఈసారి హోలీ పండుగ జరుపుకోవద్దని ఆమె నివసిస్తున్న హౌసింగ్ సొసైటీ వాసులు నిర్ణయించారు. ముంబైలోని గ్రీన్ ఎకర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో శ్రీదేవి కుటుంబం నివాసముంటున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి ఆకస్మికంగా కన్నుమూసిన విషాద పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల (మార్చి) 2న తలపెట్టిన హోలీ వేడుకలను రద్దు చేసుకున్నామని.. ఆ రోజున సంగీతవిభావరులు, రెయిన్ డ్యాన్స్, రంగులు చల్లుకోవడం, కమ్యూనిటీ భోజన కార్యక్రమాలుగానీ ఉండవని సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. -
యువీ చిందేశాడు.. క్రికెటర్ల సంబరాలు
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు, మాజీలు హోలీ పండుగ సందర్భంగా సందడి చేశారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. హోలీ రోజున జంతువులపై రంగులు పూయవద్దని అభిమానులను కోరాడు. వెటరన్ హర్భజన్ సింగ్.. తన భార్య గీతా బస్రాతో కలసి హోలీ చేసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇక యువరాజ్ సింగ్ హోలీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను అప్లోడ్ చేశాడు. హోలీ రంగులు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, సంపద, శాంతి కలిగించాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్షించాడు. అజింక్యా రహానె ఇతర ఆటగాళ్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. -
కోల్కతాలో జిలేబి రికార్డ్
-
అహ్మదాబాద్లో ఘనంగా హోలీ వేడుకలు
-
పున్నమి వసంతం..రంగుల ప్రపం
నగరం సప్తవర్ణ శోభితమైంది. రంగుల లోకంలో మునిగితేలింది. సిటీలో హోలీ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. యువ జోష్.. కలర్ఫుల్ కిక్తో పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్ ఉర్రూతలూగాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని సందడి చేశారు. -
రంగుల కేళి
-
హోలీ ఆడేందుకు పోలీసులు ఏకంగా...
మొరాదాబాద్: దేశవ్యాప్తంగా గురువారం రంగులపండువ హోలీని సంబంరంగా జరుపుకున్నారు. పార్టీల అధినేతలు, సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు, సామాన్య ప్రజానికం అనే లేకుండా అందరూ రంగుల్లో మునిగితేలారు. ఉత్తరప్రదేశ్ లో మాత్రం అగ్నిమాపక సిబ్బంది కాస్త భిన్నంగా హోలీని జరుపుకుంది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెళ్లి సహాయక చర్యలను చేపట్టాల్సిన ఆ సిబ్బంది, తాము విధినిర్వహణలో వాడే ఫైరింజన్ నే హోలీ సంబరంలో భాగం చేశారు. యూపీలోని మొరాదాబాద్ లో పోలీసు సిబ్బంది ఫైరింజన్ వాహనంపై రోడ్లపై చక్కర్లు కొడుతూ హల్ చల్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ వాహనంపై మొరాదాబాద్ లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ హోలీ జరుపుకున్నారు. ఆ పోలీసులు జరుపుకున్న హోలీ సంబరాలను, వాహనంపై వారు తిరగడం, ఫైరింజన్ వాహనం నుంచి నీళ్లను హోలీ కోసం వాడుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. హోలీ జరుపుకునేందుకు ప్రభుత్వ వాహనాన్ని, అందులో విధినిర్వహణకు అత్యవసరంగా అందుబాటులో ఉండాల్సిన వాహనాన్ని అగ్నిమాపక సిబ్బంది పండుగకు వాడటాన్ని చాలా మంది వ్యతిరేకిస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పదే పదే షేర్ చేస్తున్నారు. -
హోలీరే హోలి..!
-
సుంకేశులలో విద్యార్థుల మృతదేహాలు
కర్నూలు : హోలీ సంబరాలు చేసుకునేందుకు సుంకేశుల జలాశయం వద్దకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు గురువారం బయటపడ్డాయి. కర్నూలు నగరంలోని సెంట్ జోసెఫ్ కళాశాలకు చెందిన 14 మంది డిగ్రీ విద్యార్థులు బుధవారం హోలీ వేడుకలు జరుపుకున్నారు. సాయంత్రం వారంతా సమీపంలోని సుంకేశుల జలాశయం వద్ద సంబరాల తర్వాత తిరిగి వచ్చే క్రమంలో భార్గవ్, చైతన్య అనే ఇద్దరు విద్యార్థులు తప్పిపోయారు. వారు రాత్రయినా తిరిగి రాకపోయేసరికి గురువారం ఉదయం కుటుంబసభ్యులు వెతికారు. అయితే ఈ రోజు ఉదయం జలాశయం గేట్ వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రంగుల హోలీ
రంగుల పండుగ హోలీని అనంతపురం జిల్లాలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్న, పెద్ద, పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఆనందంగా రంగులు చల్లుకుంటూ రోడ్లపై సందడి చేశారు. జైన ఆలయాల్లో మార్వాడీలు ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సాహాన్ని ఎద నిండా నింపుకుని, ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ‘అనంత’ జిల్లా వాసులు శుక్రవారం ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నారు. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఆనందంగా గడిపారు. వివిధ రకాల రంగుల్లో మునిగితేలారు. ప్రధానంగా ఉత్తరాది వారు స్థిరపడిన ప్రాంతాలలో హోలీ సంబరాలు మిన్నంటాయి. సెలవుదినం కావడంతో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు రోడ్లపై సందడి చేశారు. డప్పులకు అనుగుణంగా మహిళలు చేసిన స్టెప్పులు అదరగొట్టాయి. నగరంలోని నాయక్నగర్లోవైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరిగాయి. కర్నూల్ డిప్యూటీ కలెక్టర్ బాలనాయక్, ఇతర అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడిపారు. కమలానగర్ ప్రాంతంలోని జైన్ దేవాలయంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. తాడిపత్రి పట్టణం గానుగవీధిలోని దుర్గామాత, కాళికమాత ఆలయాల్లో మార్వాడీలతో కలిసి ప్రత్యేక పూజలు జరిపారు. -
సిటీకి రంగు పడింది
-
హోలీ ఆడుతుండగా.. లారీ ఢీ; ఇద్దరికి గాయాలు
రంగారెడ్డి: హోలీ వేడుకల్లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని రాంపల్లిలో హోలీ ఆడుతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
రంగుల్లో మునిగి తేలిన అధికారులు,పోలీసులు
-
రంగుల్లో అల్లువారి బాబు.. మంచు బేబి
సినీ ప్రముఖులు అల్లువారి కుటుంబంలో.. ఇటు మంచువారింట్లో ఈసారి హోలీ వేడుకలు మరింత రంగులమయమయ్యాయి. వారిళ్లలో ఇప్పుడిప్పుడే బుల్లిబుల్లిగా అడుగులేసేందుకు ప్రయత్నిస్తున్న చిన్నారులు హోలీ సంబరాల్లో మునిగిపోయారు. మంచులక్ష్మి ముద్దుల కుట్టి విద్యా నిర్వాణ, అల్లు అర్జున్ గారాల పుత్రుడు ఆయాన్ రకరకాల రంగుల్లో మెరిసిపోయారు. తమకు రంగులు పూస్తున్న తల్లిదండ్రులను చూస్తూ పాలబుగ్గల బోసినవ్వులతో కేరింతలు కొట్టారు. ఇక వీరి సంబురాలను చూసి మురిసిపోయిన మంచు లక్ష్మి, అల్లు అర్జున్ చేతిలో కెమెరాలతో వారి ప్రతి కదలికను ఫొటో తీస్తూ ముచ్చటపడ్డారు. మరింత కలర్ఫుల్గా ఉండాలని అల్లు అర్జున్ తన కుమారుడి ముందు ఏడు రంగుల్ని వరుసగా పోసి వాటి మధ్య తన అయాన్ను ఉంచి బోసిగా నవ్వుతూ చప్పట్లు కొడుతుండగా తన కెమెరాలో క్లిక్మనిపించాడు. ఆ వెంటనే, ఇదిగో నా అల్లరి ఆయాన్ రంగుల్లో ఉన్నాడు చూడండంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసి అభిమానులతో సంతోషం పంచుకున్నాడు. మంచు లక్ష్మి కూడా చిన్న గౌను వేసుకున్న తన కూతురు విద్యాను రంగుల్లో ముంచి ఫొటో తీసి ట్విట్టర్లో అభిమానులతో ఆనందం పంచుకున్నారు. -
హైదరావాద్లో ఘనంగా హోలీ డే
-
ఉత్సాహంగా రంగుల పండుగ సంబరాలు
-
విమానంలో హోలీ; స్పైట్ జెట్కు నోటీసులు
న్యూఢిల్లీ: మలేసియా విమానం గగనతలం నుంచి కనిపించకుండాపోయి మిస్టరీగా మారితే.. మరోపక్క భారత విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడింది. హోలీ రోజున జరిగిన ఈ బాగోతం ఆలస్యంగా వెలుగు చూడడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పైస్ జెట్కు షోకాజ్ నోటీసు జారీచేసింది. గోవా నుంచి బెంగళూరు వెళుతున్న విమానంలో స్పైస్ జెట్ సిబ్బంది రంగుల పండుగ జరుపుకున్నారు. భద్రతను గాలికి వదిలేసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ ప్రయాణికులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియాలు ఇంటర్నెట్లో కనిపించడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. లైసెన్స్ రద్దు చేయకూడదో చెప్పాలని స్పైస్ జెట్కు షోకాజ్ జారీ చేసింది. కేవలం ఆ విమానంలోనే కాకుండా, మిగతా స్పైస్ జెట్ విమానాల్లోనూ హోలీ డాన్సుల హంగామా సాగిందని విచారణలో తేలింది. దీంతో డీజీసీఏ స్పైస్ జెట్పై కారాలు మిరియాలు నూరుతోంది. మరోవైపు ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.