Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Operation Sindoor: India Pakistan War Updates1
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు

India-Pakistan War Updates:సాంబా సెక్టార్‌లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్భారత్ - పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతజమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులుసాంబా సెక్టార్‌లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్ఎల్‌వోసీలో మళ్లీ పాక్‌ సైన్యం కాల్పులు యూరీ సెక్టార్‌ హెవీ షెల్లింగ్‌పాక్‌ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.నేవీ చీఫ్, జాతీయ భద్రతా సహదారు తాజా పరిణామాలను వెల్లడించారు.సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.విశాఖ:విశాఖలో అప్రమత్తమైన బలగాలుకేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత పెంపుప్రతి ఒక్క ప్రయనికుడుని పూర్తిగా తనిఖీ చేస్తున్న CISF సిబ్బందివిమానాశ్రయం ఎంట్రీ లోనే చెకింగ్ చేస్తున్న CISF బలగాలుఆపరేషన్‌ సిందూర్‌పై విదేశాంగ శాఖ మీడియా సమావేశంగత రాత్రి పాక్‌.. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్‌ చేసింది300 నుంచి 400 వరకూ డ్రోన్లను ప్రయోగించిందిఎల్‌ఓసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించిందిజమ్మూ, పంజాబ్‌, రాజస్తాన్‌, గుజరాత్‌ లక్ష్యంగా పాక్‌ దాడులు చేసిందిజమ్మూలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు34 చోట్ల పాక్‌ దాడులకు పాల్పడిందిపాక్‌ దాడులను తిప్పికొట్టాంపౌర విమానాలను టార్గెట్‌ గా పాక్‌ దాడులు చేసిందిఆ డ్రోన్లు టర్కీకి చెందినవి తెలుస్తోందిలేహ్‌ నుంచి సర్‌ క్రీక్‌ వరకూ పాక్‌ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్‌, యూరీలో పాక్‌ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌పై దాడికి యత్నించారులేహ్‌ నుంచి సర్‌ క్రీక్‌ వరకూ పాక్‌ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్‌, యూరీలో పాక్‌ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌పై దాడికి యత్నించారుపాక్‌ ఉపయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవిపాక్‌ సైన్యం కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు.పాక్‌ దాడులను భారత వాయుసేన సమర్థవంతంగా అడ్డుకుందికర్తర్‌పూర్‌ కారిడార్‌ ను తాత్కాలికంగా మూసివేశాం అమృత్‌సర్‌లో పాక్‌ బాంబును నిర్వీర్యం చేసిన ఇండియన్‌ ఆర్మీమక్నా దిండి విలేజ్‌ను టార్గెట్‌ చేసిన పాకిస్తాన్‌బాంబును నిర్వీర్యం చేసిన భారత సైనికులుసరిహద్దుల్లో పాక్‌ దాడిని తిప్పికొడుతున్న భారత సైన్యంతిరుమలభారత్‌- పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రత బలగాలు మాక్ డ్రిల్..తిరుమల ప్రవేశ మార్గంలో ఆక్టోపస్, పోలీస్, విజిలెన్స్, ఇతర బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహణఢిల్లీ:అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ లేఖసివిల్ డిఫెన్స్ రూల్స్ కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశంఅత్యవసర సమయంలో కావలసిన అన్ని వస్తువులను సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్న 1968 సివిల్ డిఫెన్స్ రూల్స్ఢిల్లీ ;ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ఐటీఓ వద్ద టెస్ట్ సైరెన్ చేసిన అధికారులువైమానిక దాడి సైరన్‌లను పరిశీలించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ8 కి.మీ వరకు వినిపించేలా సైరన్ ఏర్పాటుఅమరావతి:ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఏపీ సచివాలయ ఉద్యోగులుఅమరుడైన మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలుపాక్‌స్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్‌జమ్మూకశ్మీర్‌, రాజస్తాన్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ జారీఢిల్లీ, హరియాణా, హిమాచల్‌లోనూ భద్రత కట్టుదిట్టంపోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసిన సరిహద్దు రాష్ట్రాలుగుజరాత్‌ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలుఅవసరమైతే టరిటోరియల్‌ ఆర్మీని పిలిపించుకునేందుకు అనుమతిఆర్మీ చీఫ్‌ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌టెరిటోరియల్‌ ఆర్మీలో ధోనీ, మోహన్‌లాల్‌, సచిన్‌ పైలట్‌, అనురాగ్‌ ఠాకూర్‌ దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపుభద్రతను రెండోస్థాయికి పెంచుతూ కేంద్రం​ ఆదేశాలు పోర్టులు, టర్మినళ్లు, నౌకలకు భద్రత పెంచిన కేంద్రంఇస్రో కేంద్రాల దగ్గర హైఅలర్ట్‌ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్‌ఎఫ్‌ భద్రత పెంపుశ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్‌పాక్‌ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి75 నిమిషాల ముందే చెక్‌ ఇన్‌ క్లోజ్‌ అవుతుంది జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతల విరాళంనెల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచననెల వేతనం విరాళంగా ప్రకటించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌అప్రమత్తమైన అధికారులుఎయిర్‌ పోర్ట్‌ లో తనిఖీలు సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ సీఎంలతో మాట్లాడిన మోదీసరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచనప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీఢిల్లీ:అమిత్‌ షా నివాసంలో హైలెవల్‌మీటింగ్‌హాజరైన ధోవల్‌, ఐబీ చీఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డీజీలుసరిహద్దుల్లో పరిస్థితులపై అమిత్‌ షా రివ్యూ ఢిల్లీ:ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ భేటీపాక్‌ పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతపై నిర్మలా సీతారామన్‌ రివ్యూసైబర్‌ భద్రత సన్నద్ధతపై సమీక్షించనున్న నిర్మాలా సీతారామన్‌ పాక్‌ పార్లమెంట్‌ లో రక్షణ మంత్రి అసిఫ్‌ కీలక వ్యాఖ్యలుమన ఎయిర్‌ డిఫన్స్‌ వ్యవస్థ విఫలంపాక్‌ రక్షణ వ్యవస్థను భారత్‌ తునాతునకలు చేసిందిమన రక్షణ విభాగం పూర్తి విఫలమైందిపాక్‌ ప్రభుత్వంపై ఎంపీలు విమర్శలుచేతగాని ప్రభుత్వం అంటూ మండిపాటు👉కాసేపట్లో ప్రధాని మోదీతో రాజ్‌నాథ్‌ భేటీపాక్‌పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చఉదయం త్రివిధ దళాధిపతులతో రెండున్నర గంటల పాటు భేటీఅమిత్‌షా అత్యున్నతస్థాయి సమావేశంహాజరైన ధోవల్‌, ఐబీ చీఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డీజీలుసరిహద్దు పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష 👉పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్‌ బెంబేలుమరో పక్క బీఎల్‌ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరితెహ్రిక్‌ఇ-తాలిబన్‌ దాడుల్లో 20 మంది పాక్‌ సైనికులు హతం👉జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్‌ వీర మరణంభారత్-పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ మృతిజవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండా గ్రామం 👉ఐపీఎల్‌ 2025 నిరవధిక వాయిదాఐపీఎల్‌ నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐభారత్‌- పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం👉జమ్మూ కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యే రైళ్లుపాకిస్థాన్‌ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్‌ఇండియా గేట్‌, వార్‌ మెమోరియల్‌ వద్ద భద్రత కట్టుదిట్టంసరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనబోర్డర్‌ వెళ్లిన 10 మంది పంజాబ్‌ మంత్రులుదేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు👉జమ్మూలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్‌సాంబా సెక్టార్‌లో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల హతంచైనా తయారీ పీఎల్‌-15 మిస్సైల్‌ను కూల్చేసిన భద్రతా బలగాలుపంజాబ్‌ పంట పొలాల్లో కూలిన పీఎల్‌-15 మిస్సైల్‌భారత్‌ భీకర దాడులతో పాక్‌ కకావికలంకంటోన్మెంట్లను ఖాళీ చేస్తున్న పాక్‌ ఆర్మీ కుటుంబాలు👉చండీగఢ్‌లో మోగిన సైరన్లుప్రజలు ఇళ్లలోనే ఉండాలిదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఎయిర్‌ ఫోర్స్‌👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్‌.. ఇండియా గేట్‌ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్‌, రాజస్థాన్‌ వెళ్లే వాహనాలు బంద్‌👉కాసేపట్లో సీడీఎస్‌, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీపాకిస్థాన్‌ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్‌ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్‌ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ భేటీ 👉ఆపరేషన్ సిందూర్‌.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్‌ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్‌ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్‌ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్‌👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్‌ దాడులు, భారత్‌ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్‌ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్‌ ఎటాక్‌ దిగిన భారత్‌లాహోర్‌, సియాల్‌కోట్‌, కరాచీపై భారత్‌ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్‌ చేసిన ఇండియన్‌ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్‌ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్‌ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్‌ ఫైటర్‌ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్‌ మొదలుకుని జమ్మూ కశ్మీర్‌ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్‌ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్‌ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్‌ఎస్‌ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్‌’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పాక్‌ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్‌ యుద్ధ విమానాన్ని ఎస్‌–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్‌–17, ఒక ఎఫ్‌–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్‌ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్‌ తదితర నగరాల్లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్‌ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్‌ వారి్నంగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్‌)ను తుత్తునియలు చేసింది. పాక్‌ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్‌ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) చీఫ్‌తో అమిత్‌ షా చర్చించారు. ఇండో–పాక్‌ సరిహద్దుసహా బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంట భద్రతను బీఎస్‌ఎఫ్‌ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్‌లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.

Air India Flights Cancelled Upto 15th May 20252
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు

భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. ఆ తరువాత విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది.ఈ సమయంలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే.. రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం.. ఎయిర్ ఇండియా కాంటాక్ట్ సెంటర్‌లకు కాల్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.#TravelAdvisoryFollowing a notification from aviation authorities on continued closure of multiple airports in India, Air India flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Chandigarh, Bhuj, Jamnagar and Rajkot – are being cancelled till…— Air India (@airindia) May 9, 2025

Ministry of Foreign Affairs on Pakistan Attacks3
ఆ డ్రోన్లు టర్కీవే.. పాకిస్తాన్ కుట్రలను బయటపెట్టిన విదేశాంగ శాఖ

పాకిస్తాన్‌ దుశ్చర్యలను భారత విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. గత రాత్రి(గురువారం) పాకిస్తాన్‌ చేపట్టిన దుస్సాహసాన్ని భారత్‌ ఎండగట్టింది. భారత సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసి 300 నుంచి 400 డ్రోన్లను పాక్ ప్రయోగించిందని స్పష్టం చేసింది. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన ఈ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిందని పేర్కొంది.. జమ్మూలో సుమారు 34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందని.. పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీకి చెందినవిగా బహిర్గతం చేసింది.‘నాలుగు ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసుకుని.. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే భారత్ చేసిన దాడితో పాకిస్తాన్ తీవ్ర నష్టాన్ని చూసింది. పౌర విమానాలను సైతం పాక్ టార్గెట్ చేసి దాడులు చేసింది., వాటన్నింటిని పేల్చేశాం.లేహ్ నుంచి సర్‌క్రీక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. పాక్ డ్రోన్లన్నింటిని భారత్ ధ్వంసం చేసింది. డ్రోన్ శిధిలాలను పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి.. ఈ ఘర్షణలకు మత రంగు పులిమెందుకు పాక్ ప్రయత్నం చేస్తోంది. గత రాత్రి పాకిస్తాన్ భారత నగరాలపై.. పౌరులపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపింది. కానీ భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చింది.పాక్ దాడులకు సంబంధించి ప్రభుత్వ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. పూంఛ్‌లో గుడ్వారాపై జరిపిన దాడిలో స్థానిక సిక్కులతో పాటు.. ధార్మిక గాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ పాక్ ఈ దాడిని ఒప్పుకోకుండా నాటకాలు ఆడుతోంది. నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసినట్టు పాక్ అబద్ద ప్రచారం చేస్తోంది. పాక్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ, నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసిందని అబద్ద ఆరోపణలు చేస్తూ.. భారత్‌ను అంతర్జాతీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "... IMF meeting is going on today, we will present our side in the meeting. Our perspective on these things will be shared with the fellow members. It is on the board to decide further... India has responsibly and adequately… pic.twitter.com/dyEevy8wfa— ANI (@ANI) May 9, 2025

Delhi Cricket Body Receives Bomb Threat4
ఢిల్లీ క్యాపిట‌ల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపులు

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్ర‌తీకారంగా పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాలు చేప‌ట్టిన ఆపరేషన్ సిందూర్ కొన‌సాగుతోంది. భార‌త్ త‌మ సైనిక చ‌ర్య‌ల‌తో దాయాది దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇండియ‌న్ ఆర్మీ.. డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడి చేస్తూ పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది.పాక్ కూడా స‌రిహ‌ద్దు వెంబ‌డి తీవ్ర స్ధాయిలో కాల్పులకు తెగ‌బ‌డుతూ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది. అంతేకాకుండా స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న ముఖ్య న‌గరాల్లో డ్రోన్ దాడికి య‌త్నించి పాక్ విఫ‌ల‌మైంది. ప్ర‌స్తుతం ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్ర‌మంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అరుణ్ జైట్లీ స్టేడియంను పేల్చివేస్తామని పేర్కొంటూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కు శుక్రవారం బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ విష‌యాన్ని డీడీసీఎ అధికారి ఒక‌రు ధ్ర‌వీక‌రించారు."మీ స్టేడియంలో బాంబు పేలుడు జ‌రుగుతుంది. భార‌త్‌లో పాకిస్తాన్ స్లీప‌ర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ బ్లాస్ట్‌తో ఆపరేషన్ సిందూర్‌కు ప్ర‌తీకారం తీర్చు కుంటామ‌ని" మెయిల్‌లో రాసి ఉన్న‌ట్లు స‌ద‌రు అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్‌-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిట‌ల్స్ హోం గ్రౌండ్‌గా ఉంది. ఈ అరుణ్ జైట్లీ స్టేడియం మే 11న గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌కు ఆతిథ్య‌మివ్వాల్సి ఉంది. కానీ ఐపీఎల్‌-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా నిలిపివేసింది.

Ministry of Home Affairs Write To All States and Union Territories5
రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచనలు

భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పరిపాలనాధికారులకు లేఖ రాసింది. సివిల్ డిఫెన్స్ రూల్స్‌కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించింది.ప్రజలు, ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి.. శత్రు దాడి సమయంలో కీలకమైన సేవల నిరంతరాయ పనితీరును నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని హోం మంత్రిత్వ శాఖ తమ లేఖలో గుర్తు చేసింది.1968 నాటి పౌర రక్షణ నియమాలలోని సెక్షన్ 11, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను, ఆస్తులను హాని లేదా నష్టం నుండి రక్షించడానికి త్వరిత చర్యలు తీసుకునే అధికారం ఇస్తుంది. అటువంటి సంక్షోభాల సమయంలో విద్యుత్, నీటి సరఫరా, రవాణాతో సహా ముఖ్యమైన సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని కూడా ఇది నిర్ధారిస్తుంది.As per the communique, Section 11 of the Civil Defence Rules, 1968, can be invoked and necessary Emergency Procurement Powers to the Director Civil Defence of state/UT, may be granted so that efficient implementation of the necessary precautionary measures can be implemented.— ANI (@ANI) May 9, 2025

Did Not intercept Indian Drones Says Khawaja Asif6
మన రక్షణ వ్యవస్థను భారత్‌ తునాతునకలు చేసింది: పాక్‌ రక్షణమంత్రి

లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్‌లను పాకిస్తాన్‌ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్‌లను పాక్‌ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. ‘మన ఎయిర్‌ డిఫన్స్‌ వ్యవస్థ విఫలమైంది. పాక్‌ రక్షణ వ్యవస్థను భారత్‌ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్‌ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్‌ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్‌ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్‌ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్‌ దాడుల్లో 20 మంది పాక్‌ సైనికులు హతమయ్యారు.పాక్‌ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్‌ చేశారు. పాక్‌ పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్‌ పిరికిపంద అంటూ పాక్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్‌ మేజర్, సీనియర్‌ ఎంపీ అయిన తాహిర్‌ ఇక్బాల్‌ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్‌.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.“We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025

Producer Allu Aravind Support Indian Soldiers7
మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే

ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. మన సైనికులకు అండగా ఉంటానని మాటిచ్చారు. తన లేటెస్ట్ మూవీ వసూళ్ల నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగం మన సైనికులకు విరాళంగా ఇస్తానని మాటిచ్చారు.(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అ‍ల్లు అరవింద్.. గతంతో పోలిస్తే సినిమాలు తీయడం బాగా తగ్గించేశారు. కొన్ని చిన్న చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలా తీసిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. శ్రీ విష్ణు, కేతిక, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది.సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సందర్భంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాను భారత ఆర్మీకి అండగా ఉంటానని, సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతమేర ఆర్థిక సాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈయనలానే మిగతా దర్శక నిర్మాతలు హీరోహీరోయిన్లు కూడా సాయం చేసి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుకుందాం.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu Govt8
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్‌

సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన‌ మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

ABVP Student Protest Against CM Chandrababu9
సీఎం చంద్రబాబుకు నిరసన సెగ

అనంతపురం: సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా పర్యటనలో నిరసన సెగ గట్టిగానే తగిలింది. ఈరోజు(శుక్రవారం) ఉరవకొండ నియోజకవర్గం చాయపురంలో చంద్రబాబు పర్యటించిన క్రమంలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది.. జీవో 77ను రద్దు చేయాలంటూ ఏబీవీపీ కార్యకర్తంలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గో బ్యాక్ సీఎం అంటూ ఫ్లకార్డు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలపకుండా అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేశారు. వీరిని అరెస్ట్ చేసిన తర్వాత చిన్నహోతూరు ప్రభుత్వ పాఠశాలలో పోలీసులు నిర్భందించారు. బీజేపీ అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసనపై సర్వత్రా చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉండగా, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసన వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది.

Woman Loses 63 Kg In 14 Months Shares Diet Tips10
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో

ప్రస్తుత కాలంలో అందర్నీ భయపెడుతున్న సమస్య అధిక బరువు. జీవన శైలి, ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఈ బాధలనుంచి విముక్తి పొందేందుకు, స్లిమ్‌గా కనిపించేందుకు భారీ కసరత్తులే చేస్తున్నారు. అంతేకాదు బరువు తగ్గడంతో తాము సాధించిన విజయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. 14 నెలల్లో 63 కిలోలు తగ్గిన మహిళ వెయిట్‌ లాస్‌ జర్నీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె కథ చాలా హైలైట్‌గా నిలిచింది. కొన్ని టిప్స్‌ను కూడా ఇన్‌స్టాలో షేర​్‌ చేసింది. అవేంటో తెలుసుకుందాం ఈ కథనంలో.ఫిట్‌నెస్ మోడల్ నెస్సీ చుంగత్ వెయిట్‌ లాస్‌ జర్నీ చాలా స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. 138 కిలలో బరువున్న ఆమె కష్టపడి 75 కిలోలకు చేరింది. 2023లో నవంబరులో మొదలు పెట్టి, 2025 జనవరి నాటికి అంటే 14 నెలల్లో ఏకంగా 63 కిలోల బరువు తగ్గించుకుంది. "138 కిలోల నుండి బరువు తగ్గే ప్రయాణం అంత సులభం కాదు" అని నెస్సీ తన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోను 40 లక్షలమంది వీక్షించారు. బరువు తగ్గాలనే స్థిర చిత్తం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బలమైన సంకల్ప శక్తి ద్వారా 63 కిలోల బరువును తగ్గించుకుంది. "ఇది ఒక మైండ్ గేమ్" అని చెబుతుంది నెస్సీ.‘‘ఇక నేను చేయలేను .. ఆపేస్తా..’’అని చాలాసార్లు అనిపించినా .. ఆమె దివంగత తల్లి ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడిన తీరు గుర్తొచ్చి, తన ప్రయత్నాన్ని కొనసాగించింది. తన సొంత అనుభవంతో రూపొందించుకున్న నిబంధనలు, సూత్రాల ద్వారా నెస్సీ తన ఫ్యాట్‌ను తగ్గించుకునే ప్లాన్‌కు కట్టుబడి ఉంది. చివరికి అనుకున్నది సాధించింది.ఇదీ చదవండి: రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్‌ చేస్తే..!మూడంటే..మూడు టిప్స్‌షుగర్‌కు చెక్‌: ముఖ్యంగా మూడే మూడు డైట్ చిట్కాలు పాటించినట్టు నెస్సీ చెప్పుకొచ్చింది. చక్కెరను తగ్గించండి, కానీ ఆనందాన్ని , సంతోషాన్ని కాదు సుమా. రోజువారీ ఆహారం నుంచి చక్కెను పూర్తిగా తొలగించాలి. కానీ వారానికి ఒక కేక్ ముక్క లేదా చిన్న చాక్లెట్ ముక్క తినవచ్చు.ఉదయాన్నే వేడి నీళ్లు : ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించాలి. ఇది ఒక చిన్న అడుగే, కానీ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది వెయిట్‌లాస్‌కు బాగా ఉపయోగపడుతుంది.చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్నీట్రస్ట్‌ది ప్రాసెస్‌: మీరు పాటిస్తున్న పద్ధతిపై విశ్వాసాన్ని కోల్పోకండి. అద్దాన్ని కాదు.. నమ్మేది.. ట్రస్ట్‌ది ప్రాసెస్ మొదలు పెట్టిన తొలినెలలో మార్పు కనిపించకపోతే.. భయపడకండి అంటుంది ఆమె. ఆ నమ్మకమే తనకు బాగా ఉపయోగపడిందని నెస్సీ వెల్లడించింది. తక్షణం వచ్చే ఫలితంపై కాకుండా, నిరాశపడకుండా, దీర్ఘకాలిక లక్ష్యంపై గురి పెట్టి తన శరీర బరువును తగ్గించుకున్న నెస్సీ స్టోరీ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నోట్‌ : బరువు పెరగడం, తగ్గడం అనేది శరీరతత్వం, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుందనే గమనించాలి. ఆరోగ్య మార్పులు, వ్యాయామం, విశ్వాసం ప్రధాన పోషిస్తాయి. ఏదైనా కొత్త ఆహారం లేదా ఫిట్‌నెస్ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Nessy chungath ❇️🧸🌸 (@call_me_nessykutty)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement