లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు | CBDT announced that govt expected to exceed its direct tax collection target of Rs 22.07 lakh crore | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు

Nov 19 2024 9:12 AM | Updated on Nov 19 2024 9:12 AM

CBDT announced that govt expected to exceed its direct tax collection target of Rs 22.07 lakh crore

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. నిర్దేశిత రూ.22.07 లక్షల కోట్ల లక్ష్యాన్ని దాటేస్తాయని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌ రవి అగర్వాల్‌ తెలిపారు. కార్పొరేట్, నాన్‌–కార్పొరేట్‌ పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ (ఐఐటీఎఫ్‌)లో ట్యాక్స్‌పేయర్స్‌ లాంజ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. సీబీడీటీ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 10 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 15.41 శాతం పెరిగి రూ.12.11 లక్షల కోట్లకు చేరాయి.

ఇదీ చదవండి: గోల్డ్‌ ఈటీఎఫ్‌లు కళకళ

మరోవైపు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ ఆదాయం, అసెట్స్‌ను తమ ఐటీఆర్‌లలో వెల్లడించని వారు సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 31 వరకు గడువుందని అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా విదేశీ అసెట్స్‌ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కి అందుతాయని, ఐటీఆర్‌లలో పొందుపర్చిన వివరాలతో వాటిని సరిపోల్చి చూస్తుందని తెలిపారు. అధిక విలువ అసెట్స్‌ను వెల్లడించనివారికి ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌ పంపే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వివరించారు.  ఆదాయ పన్ను చట్టంలో భాషను సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మార్చడంపై 6,000 పైచిలుకు సలహాలు తమకు వచ్చినట్లు అగర్వాల్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement