ప్రధాన వార్తలు

QR కోడ్తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం.. ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్ నిజంగా అశ్చర్యకరం. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్మెన్ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు గన్మెన్పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి గన్మెన్ లేఖ రాశారు. మరో గన్మెన్ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్రెడ్డిపై, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్పై కేసులు. ఇలా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్ చేశారు?టీవీ డిబెట్లో అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా?మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా అని వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటిప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.కరెంట్ బిల్లుల బాదుడే.. బాదుడు15వేల కోట్లు కరెంట్ బిల్లుల బాదుడు,గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్ వెహికల్స్ వాహనాల్ని తీసేశాడు. రేషన్ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరిపంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు. చంద్రబాబు పెట్టిన తాకట్టు.. చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్ ప్రాజెక్ట్ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి ప్రెస్మీట్లో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ను వైఎస్సార్సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.

యాభై ఏళ్ల చీకటి గాయం
ఏదైనా చారిత్రక పరిణామం మీద సరైన అంచనాకు రావడానికి యాభై ఏళ్ల కాలం విశేషంగా దోహదం చేయగలదు. చరిత్రను పునర్లిలిఖించుకునే బాధ్యత ప్రతి తరం మీద ఉందన్న వాస్తవాన్ని గుర్తిస్తే, 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలాన్నీ, దాని ఫలితాలనూ అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయమే. ఎమర్జెన్సీ విధించిన వారు దేశానికి స్వాతంత్య్రం తెచ్చామని చెప్పే పార్టీ వారు కావచ్చు. అయినా చరిత్ర తీర్పు ముందు అంతా సమానమే. ఎమర్జెన్సీ దేశంలో ‘క్రమశిక్షణ’ తెచ్చిందా? లేక చీకటి యుగంలోకి నెట్టిందా? ప్రేరేపించిన కారణాలేమిటి?1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మంత్రిమండలి సిఫారసుతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 352లోని 1వ నిబంధన ఆ అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది. ఆంతరంగిక భద్రతకు తీవ్ర విఘాతం వాటిల్లితే రాష్ట్రపతి ఈ అసాధారణ చర్య తీసుకుంటారు.ఎమర్జెన్సీ విధించిన సమయానికి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అవి రాజ్యాంగం నిర్దేశించినట్టు ఉన్నాయా? 1974 జన వరి నుంచి చూసినా ఆ పరిస్థితులు కానరావు. కొంచెం గట్టిగా కనిపించే పరిణామం లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) సంపూర్ణ విప్లవం మాత్రమే. మెస్చార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో మొదలై, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న స్థాయికి వెళ్లిన గుజరాత్ విద్యార్థి ఆందోళన ఉంది. 1975 జనవరిలో సమస్తిపూర్(బిహార్)లో రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రా సభలో బాంబు పేలి, ఆయన చని పోయారు. దీనిని జేపీ ఉద్యమంతో ముడిపెట్టలేక పోయారు.సంపూర్ణ విప్లవానికి మద్దతుగా పార్లమెంటుకు జనతా మార్చ్ నిర్వ హించాలని విపక్షాలన్నీ (సీపీఐ మినహా) నిర్ణయించాయి. ఈ మధ్యలో జరిగిన మరొక అనూహ్య పరిణామం, రాయ్బరేలీ ఎన్నిక పిటిషన్పై మార్చి 18న అలహాబాద్ హైకోర్టు బోనులో ఇందిర నిలబడటం. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని మొరార్జీ దేశాయ్ ప్రారంభించిన నిరాహార దీక్షను ఏప్రిల్ 13న విరమించారు. ఎన్నికలు జరిపించడానికి ఇందిర సుముఖత వ్యక్తం చేశారు.అయినా స్వతంత్ర భారత చరిత్రను మలుపు తిప్పిన అత్యవసర పరిస్థితి వంటి తీవ్ర నిర్ణయం ఇందిర ఎందుకు తీసుకున్నారు? రెండు తక్షణ కారణాలు. 1971 నాటి సాధారణ ఎన్నికలలో రాయ్బరేలీ నియోజక వర్గం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్సిన్హా 1975 జూన్ 12న తీర్పు ఇవ్వడం. ఇందిరపై పోటీ చేసి ఓడిన సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ ఈ కేసు వేశారు. అదే రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్ని కలలో ప్రజా తీర్పు వచ్చింది. కాంగ్రెస్ ఓడి, జన మోర్చా గెలిచింది. రెండోది: అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద శాశ్వత స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళితే జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ 1975 జూన్ 25న షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చి, ఇందిరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఓటు హక్కు లేకుండా చేయడం. న్యాయ వ్యవస్థ చేసిన ఈ రెండు నిర్ణయాలు, గుజరాత్ ప్రజాతీర్పు ఆమెను ఇరకాటంలోకి నెట్టాయి. కాంగ్రెసేతర పక్షాలు ఇందిర పదవిలో కొనసాగడానికి అనర్హులని ప్రకటిస్తూ ఆ సాయంత్రం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సభ నిర్వహించి కొత్త ఉద్యమం కోసం లోక్సంఘర్ష సమితిని ప్రకటించాయి. ఆ అర్ధరాత్రి రాష్ట్ర పతి ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. మరునాడు ఉదయం ఆరు గంటలకు ఇందిర నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి మండలి ఎమర్జెన్సీ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి అప్పటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి రాష్ట్రపతి సంతకం పడిన తరువాత తెలిసింది.ప్రతిపక్షం అవసరం లేదా?ఇందిర భారత పాలనా వ్యవస్థకు కొత్త రూపం ఇవ్వాలను కున్నారు. దేశాభివృద్ధి అధ్యక్ష తరహా పాలనలోనే సాధ్యమన్న ఒక వాదాన్ని అప్పటికే ప్రచారంలో పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్కాంత్ బారువా ‘ఇందిరే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ అన్నారు. మరొక నినాదం కూడా ఇచ్చారు. ‘వర్తమాన పరిస్థితులలో భారత దేశానికి అసలు ప్రతిపక్షమే అవసరం లేదు’ అని! నాటి హరి యాణా ముఖ్యమంత్రి ఇందిరను జీవితకాలపు అధ్యక్షురాలిగా (పార్టీకి), తద్వారా యావజ్జీవితం దేశ ప్రధానిగా చూడాలని కోరుకున్నారు.ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యం కూడా ఇందిర చర్యకు ప్రాతిపదిక ఇచ్చాయి. ‘సోవియెట్ నాయకుల సలహాతో దేశంలో అత్యవసర పరి స్థితి విధించినట్లు అర్థమైంది. సోవియెట్లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని సైబీరియాకు పంపిస్తారు. ఇక్కడా ప్రతిపక్షాల వారిని అదే విధంగా జైళ్ల పాలు చేశారు.’ మాజీ గవర్నర్, పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి సుర్జీత్ సింగ్ బర్నాలా రాసిన ‘క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్: స్టోరీ ఆఫ్ ఏన్ ఎస్కేప్’ గ్రంథంలోని వాక్యాలివి. బర్నాలా ఎమర్జెన్సీ బాధితుడే. ‘చిలీ పాలకుడు సాల్వెడార్ అలెండి తరువాత నిన్నే అమెరికా లక్ష్యంగా చేసుకుంది’ అంటూ క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో చేసిన హెచ్చరికతోనే ఇందిరాగాంధీ ఆగమేఘాల మీద అత్యవసర పరిస్థి తిని విధించారన్న వాదన గురించి సంజయ బారు ప్రస్తావించారు. 1975 జూన్ 25 అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్య జయ ప్రకాశ్ నారాయణ్ను, మొరార్జీ దేశాయ్ని పోలీసులు అరెస్టు చేశారు. మరునాడు ఉదయం జనసంఘ్ నాయకులు వాజ్పేయి, అడ్వాణీ, మధు దండావతె, మరికొందరిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఆంధ్రలో పెద్దలు గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, జూపూడి యజ్ఞనారాయణ, యలమంచిలి శివాజీ వంటి వారిని అరెస్టు చేశారు. దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ పేరుతో ఆ 21 మాసాలలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు. 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఎదురు దెబ్బ తప్పదు!ఎమర్జెన్సీ విధించిన వెంటనే తీసుకున్న చర్య సెన్సార్ షిప్. దీనితో దాదాపు భారతీయ పత్రికలన్నీ మూగబోయాయి. ఇది జూన్ 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్, ఆనందమార్గ్, జమాతే ఇస్లాం, సీపీఐ (ఎం.ఎల్.)లతో సహా 26 సంస్థలపై నిషేధం విధించారు. న్యాయమూర్తులను బదిలీ చేశారు. క్రమశిక్షణ పేరుతో వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆనాడు లోక్సభలో ప్రతిపక్షాలన్నింటి బలం అరవై లోపే! కానీ, లోక్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చరిత్రా త్మక ఉద్యమమే జరిగింది. దాంతో లోక్సభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఇందిర 1977 జనవరి 18న ఆకాశవాణి ప్రసంగంలో వెల్లడించారు. 1977 జనవరి 20న జనతా పార్టీ ఆవిర్భవించింది. ఆ ఎన్నికలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ,సంజయ్గాంధీ కూడా ఓడిపోయారు. 1977 మార్చి 21న తాత్కాలిక రాష్ట్రపతి బి.డి. జెట్టి ఎమర్జెన్సీని రద్దు చేశారు.ఎమర్జెన్సీ అంటే కొందరు విపక్షాల నాయకుల అర్ధరాత్రి అరెస్టులు మాత్రమే కాదు. కోటీ పదకొండు లక్షల మందికి జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు; మీసా, డిఫెన్స్ ఇండియా రూల్స్ పేరుతో లక్షా పద మూడు వేల మంది అమాయకుల అక్రమ అరెస్టులు; స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తితో ఏర్పడిన రాజ్యాంగానికి జరిగిన తీరని అవమానం. అన్నింటికి మించి భార తీయ ఆత్మకు అది పెద్ద గాయం. న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం భంగపడి ప్రజాస్వామ్యం బలహీనమైంది.ఇక అత్యవసర పరిస్థితి, తదితర పరిణామాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని తానే సిద్ధం చేసుకుంది. బీజేపీ అనే ఒక రాజకీయ పక్షం అలా దేశ రాజకీయ రంగం మీదకు వచ్చింది.డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634

ఇదెక్కడి దౌత్యనీతి?!
దేన్నయినా ఒకటికి పదిసార్లు చెబితే అది నిజమై కూర్చుంటుందని, ప్రపంచం దాన్ని మాత్రమే విశ్వసిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. పాకిస్తాన్ ఉగ్ర ఎత్తుగడను తిప్పికొట్టడానికి మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’తో అక్కడి ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దానికి ప్రతిగా భారత్పై పాక్ సైన్యం చేసిన దాడుల్ని తిప్పి కొట్టడంతోపాటు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. గత నెల 6న మొదలై 9వరకూ సాగిన ఈ ఘర్షణలు... ఇరుపక్షాలూ 11న కాల్పుల విరమణ ప్రకటించటంతో ముగిశాయి. కానీ ట్రంప్ వేరే పనిలేనట్టు ఆనాటి నుంచీ ‘కాల్పుల విరమణ’ తన ఘనతేనంటూ చెప్పుకు తిరుగు తున్నారు. అక్కడితో ఆగలేదు. సంధి కుదుర్చుకోనట్టయితే వాణిజ్య ఒప్పందం ఉండబోదని భారత్ను హెచ్చరించాకే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. మన దేశం దాన్ని ఖండించినప్పుడు ‘అవును... నిజమే. వారిద్దరూ మాట్లాడుకొని సంధి కుదుర్చుకున్నారు. ఇందులో మాపాత్ర లేద’ని నాలుక మడతేస్తుంటారు. మళ్లీ నాలుగు రోజులు గడిచేసరికల్లా పాత పాటే అందుకుంటారు. భారత్, పాకిస్తాన్లు కాల్పుల విరమణ ప్రకటించటానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఆ సంగతి వెల్లడించటమైతే వాస్తవం. ప్రకటించటంలో రెండు దేశాలూ కొంత వ్యవధి తీసుకోవటాన్ని ఆసరా చేసుకున్న ట్రంప్ దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బుధవారం మరోసారి ఆ పనే చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 35 నిమిషాలసేపు ఆయనతో ఫోన్లో సంభాషించారు. ‘కాల్పుల విరమణ ప్రతిపాదన ఏ దశలోనూ మీ నుంచి రాలేదు. అలాగే వాణిజ్య ఒప్పందం గురించి ఇంతవరకూ మీ దేశంతో చర్చించలేదు’ అని వివరణనిచ్చారు. అక్కడితో అయిందనుకుంటే... మరికొన్ని గంటలు గడిచాక మరోసారి ట్రంప్ పాత పాటే వినిపించారు.రష్యా–ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించి ఆయన అభాసుపాలయ్యారు. అక్కడ యథావిధిగా పోరు సాగుతోంది. గాజాలో ఇప్పటికి 56,000 మంది పౌరుల్ని ఊచకోత కోసిన ఇజ్రాయెల్పై చర్యకు అడ్డుపడటమే కాదు... వారంరోజుల క్రితం దాన్ని ఉసిగొల్పి ఇరాన్పై దాడులు చేయించారు. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ను బెదిరిస్తున్నారు. పైగా ఆ దేశంపై సైనిక దాడికి పథక రచన చేస్తున్నారు. పశ్చిమాసియా ఊబిలోకి దేశాన్ని దించవద్దంటూ స్వదేశంలో, స్వపక్షంలో అనేకులు హెచ్చరిస్తున్నా ట్రంప్కు పట్టడం లేదు. ఇలాంటి వ్యక్తి భారత్, పాకిస్తాన్ల మధ్య సంధి కుదిర్చానని ఎలా చెప్పుకుంటారో అనూహ్యం. కశ్మీర్ సమస్యపై గానీ, భారత్–పాక్ల మధ్య ఉన్న ఇతరేతర సమస్యలపై గానీ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించ బోమని దశాబ్దాలుగా భారత్ చెబుతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ వైఖరే కొనసాగుతోంది. తాజాగా మోదీ ప్రభుత్వం దీన్ని మరికాస్త సవరించింది. మూడో పక్షం జోక్యాన్ని ఒప్పుకోబోమని చెబుతూనే మున్ముందు పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పైనా, ఉగ్రవాదుల అప్పగింత పైనా మాత్రమేనని స్పష్టం చేసింది. ట్రంప్తో సంభాషించినప్పుడు పెహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ మొదలుకొని అన్ని విషయాలూ మోదీ పూసగుచ్చినట్టు చెప్పారని, ఇక నుంచి ఉగ్రదాడిని పరోక్ష యుద్ధంగా పరిగణించదల్చుకోలే దని, దాన్ని యుద్ధంగానే చూస్తామన్నారని మన విదేశాంగ కార్యదర్శి మిస్రీ తెలియజేశారు. జిత్తులమారితనం దౌత్యం అనిపించుకోదు. స్పష్టంగా, పారదర్శకంగా, అరమరికలు లేకుండా వ్యవహరించినప్పుడే ఎంతటి సంక్లిష్ట సమస్యయినా దారికొస్తుంది. దౌత్యం విజయవంతమవుతుంది. బెదిరింపులకు దిగటం, బెదిరించానని గొప్పలుపోవటం దౌత్యమెలా అవుతుంది? తన వ్యాపారాన్ని విస్తరించుకోవటానికీ, ప్రత్యర్థులపై పైచేయి సాధించటానికీ పూర్వాశ్రమంలో నేర్చు కున్న కళలన్నీ ట్రంప్ వైట్హౌస్లో ప్రదర్శిస్తున్నట్టు కనబడుతోంది. దీన్ని వదిలించుకోనట్టయితే నవ్వులపాలవుతానన్న ఆలోచన ఆయనకు స్ఫురిస్తున్నట్టు లేదు. ఉగ్రవాదులకు పాక్ సైన్యం ఊత మిస్తున్న వైనం స్పష్టంగా కనబడుతున్నా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు బుధవారం విందుకు ఆహ్వానించారు. అది ఆయన ఇష్టం. కానీ అదే రోజు మోదీ అక్కడుండాలని కోరుకోవటం, వేరే దేశాల పర్యటన రద్దుచేసుకుని వాషింగ్టన్ రమ్మనటం హుందాతనం అనిపించుకుంటుందా? పర స్పరం కత్తులు దూసుకుంటున్న వైరిపక్షాలను ఒకేసారి పిలవటం తెలివితక్కువతనం అను కోవాలా? అతి తెలివి అనుకోవాలా? ఒకపక్క కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయటం సమ్మతం కాదని మన దేశం పదే పదే చెబుతున్నా ఈ మూర్ఖత్వం దేనికి? రేపో మాపో ఇరాన్పై తాము దండెత్తితే రీఫ్యూయలింగ్ కోసం పాకిస్తాన్ అవసరపడుతుంది. అందుకోసం ఆ దేశాన్ని దువ్వుతూ మనల్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నట్టు ఈ కపటనాటకం ఎందుకు?జీ7 శిఖరాగ్ర సదస్సు నుంచి హడావిడిగా నిష్క్రమించనట్టయితే, అక్కడ మోదీ ప్రసంగాన్ని నేరుగా విన్నట్టయితే ట్రంప్కు విషయం కాస్తయినా అర్థమయ్యేది. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమా ణాలు పాటిస్తున్న పాశ్చాత్య దేశాలను మోదీ నిశితంగా విమర్శించారు. సొంత కారణాలతో కొన్ని దేశాలపై ఆంక్షలు పెడుతూ, ఉగ్రవాదుల్ని ఉసిగొల్పే దేశాలను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారని మోదీ చెప్పారు. అయినా ట్రంప్ ధోరణి మారలేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్తో సహా అన్ని అంతర్జాతీయ అంశాల్లోనూ స్వతంత్ర విధానం పాటించటమే మనకు శ్రేయస్కరం. ద్వంద్వ నీతిని అనుసరించేవారికి తమ స్థానం ఏమిటో చెప్పనట్టయితే మనమే నష్టపోతాం.

మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి–సాగర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. గతంలో కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ అనుసంధాన ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను వినియోగించదలిస్తే కేంద్రం సాయమందించే ఇచ్చంపల్లి–సాగర్ లింకు ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ మేరకు ఒక ప్రతిపాదనను తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముందుంచారు. దీంతో నాలుగేళ్ల కిందట గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) తయారు చేసిన ఇచ్చంపల్లి–సాగర్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.మొత్తం 247 టీఎంసీల మళ్లింపు ఎన్డబ్ల్యూడీఏ 2020–21లో రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు అందజేసిన డీపీఆర్లో..ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధాన ప్రాజెక్టు, జలాల లభ్యత, మళ్లించే విధానం, అవసరమయ్యే నిధులు, ఆయా రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలు, వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితర అంశాలను స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం.. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరి నదిపై 15.8 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ నిర్మించి తమిళనాడులో కావేరి నదిపై ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. బరాజ్ నుంచి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున నీటిని సాగర్కు మళ్లిస్తారు. ఈ దారిలో గొట్టిముక్కల బ్రాంచి కాలువ కింద నల్లగొండ జిల్లాలోని మునుగోడు, చండూరు ప్రాంతాల్లో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు, ఎస్సారెస్పీ–2 కింద 1.78 లక్షలు, ఎస్ఎల్బీసీ కింద 1.09 లక్షల హెక్టార్లకు నీరందించాల్సి ఉంటుంది. ఇక ఏపీలో సాగర్ కుడి కాలువ కింద 1.26 లక్షల హెక్టార్లు, నాగార్జునసాగర్–సోమశిల కింద 1.68 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీటిని ప్రతిపాదించారు. సోమశిల–కావేరి మధ్య 2.5 లక్షల హెక్టార్లకు నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. మూడు రాష్ట్రాలకు 230 టీఎంసీలుగోదావరిలో వరద ఉండే జూన్–అక్టోబర్ నెలల్లో 143 రోజుల్లో 247 టీఎంసీలను మళ్లిస్తారు. ఇందులో ఆవిరి నష్టాలు పోనూ మిగిలే 230 టీఎంసీలలో తెలంగాణ 65, ఆంధ్రప్రదేశ్ 79.9, తమిళనాడు 84 టీఎంసీలు వినియోగించుకునేలా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు ఆ సమయంలోనే రూ.85 వేల కోట్ల మేర వ్యయాన్ని అంచనా వేసింది. ఇచ్చంపల్లి నుంచి సాగర్కు నీటిని మళ్లించే క్రమంలో మూడు లిఫ్టులు నిర్మించాల్సి ఉండగా, వీటి నిర్వహణకు 3,840 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమవుతుందని, ఇందుకు ఏటా రూ.770 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఇక ఇచ్చంపల్లి వద్ద నిర్మించే బరాజ్తో 9,300 హెక్టార్లు ముంపునకు గురికానుండగా, 22 వేల మంది నిరాశ్రయులవుతారని ఎన్డబ్ల్యూడీఏ పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనను అప్పట్లో తెలంగాణ వ్యతిరేకించింది. దీనికి దిగువన అకినేపల్లి నుంచి ఒక ప్రతిపాదన, తుపాకులగూడెం నుంచి మరో ప్రతిపాదన, దుమ్ముగూడెం నుంచి ఇంకో ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే ఇంద్రావతి మిగులు జలాలపై ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో దీనిపై చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలవరం–బనకచర్ల చేపట్టడంతో, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ తాజాగా ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
ఒక ప్రమాదం, అందులోనూ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, జరగగానే ఒకటి రెండు రోజులు గగ్గోలు పెట్టడం, ఆ ప్రమాద కారణాలను గుర్తించి సవరించే పని ఎంత మాత్రమూ చేయకుండా మరొక ప్రమాదం దాకా మౌనంగా ఉండి పోవడం మన సమాజానికీ, రాజ కీయ నాయకత్వానికీ, ప్రచార సాధ నాలకూ బాగా అలవాటు అయిపోయింది. నిజానికి సమాజం మొత్తంగా ఇందులో చేయగలిగినదేమీ లేదు. ఆ బాధ్యత రాజకీయ నాయకత్వాలదీ, ప్రభుత్వాలదీ, అధికార వ్యవస్థలదీ! ఒక ప్రమాదం జరగగానే కూలంకుషంగా అధ్యయనం చేసి, ప్రమాద కారణాలను అన్వేషించి, మరొకసారి అటువంటి ప్రమాదం జరగడానికి వీలులేని విధంగా ఆ కారణాలన్నిటినీ తొలగించవలసిన బాధ్యత అధికార వ్యవస్థలదే! అహ్మదాబాద్ విమాన ప్రమాదం అత్యంత విషాద కరమైన, ఘోరమైన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్ది సెకన్ల లోనే కూలిపోయి, 241 మంది విమాన ప్రయాణికులు, కనీసం 40 మంది ఇతరులు చనిపోయారు. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో శాస్త్రీయ విశ్లేషణ జరిపి కారణాలు నిర్ధారించడానికి మూడు నాలుగేళ్లు పడుతుందంటున్నారు. ఈలోగా మన వాట్సప్ కార్ఖానాలూ, వాచాల త్వమే పెట్టుబడిగా నడుస్తున్న ఛానళ్లూ, సంచలనాత్మకమైతే చాలు ఎంత అబద్ధమైనా, ఎంత నిరాధారమైనా మాట్లాడ వచ్చునని అనుకుంటున్న సామాజిక మాధ్యమాలూ చాలా కారణాలను వండి వార్చాయి.ఈ ప్రమాదానికి సాంకేతిక కారణాలు ఎట్లాగూ అధ్యయనంలో బయటపడతాయి కాని ఈలోగా ఆలోచించ వలసిన సామాజిక, రాజకీయార్థిక కోణాల వైపు నుంచి చూస్తే అధికార వ్యవస్థల నిర్లక్ష్యం, లేదా లాభాపేక్షాపరుల అక్రమాలను అధికారులు అవినీతి వల్లనో, సోమరితనం వల్లనో చూసీ చూడనట్టు పోవడం మూల కారణం అని తేలుతుంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించి 2022 జనవరిలో టాటా గ్రూప్కు అప్పగించినప్పటి నుంచీ గడచిన మూడేళ్లలో ఆ సంస్థ నిర్వహణలో భద్రతా లోపాల గురించీ, నిర్వహణ లోపాల గురించీ, నిబంధనల ఉల్లంఘనలగురించీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనేక సార్లు మందలించింది, జరిమానాలు వేసింది, హెచ్చ రించింది. విమానాల నిర్వహణలో, కాక్ పిట్ క్రమశిక్షణలో, అంతర్గత జవాబుదారీతనంలో లోపాలను ఎత్తి చూపింది. అర్హత లేని పైలట్లను వాడుతున్నారని 2025 జనవరిలో కూడా ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అంత ర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలలో ఒకటని గతంలోనే పేరు పొందింది. విమానాలకు పక్షుల తాకిడి అతి ఎక్కువగా ఉండే విమానా శ్రయం అది. ఎందువల్లనంటే దాని రన్ వేలు సరాసరిగా కిక్కిరిసిన జనసమ్మర్దపు కాలనీలకూ, భవనాలకూ అంటు కుని ఉంటాయి. రన్ వేకూ నివాస గృహ, భవన సము దాయాలకూ మధ్య ప్రామాణికంగా ఉండవలసినంత దూరం కాదు గదా, కనీసమైన స్థలం కూడా లేదు. అందు వల్ల టేకాఫ్లో విఫలమయ్యే విమానం ఆ నివాస గృహాల మీద కూలిపోక తప్పదు. ఆ నివాస గృహాల భవన సముదాయాల కుప్పలో ఒకటి ఇప్పుడు నలభై మంది వైద్య విద్యార్థులు మరణించిన బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థి వసతిగృహం. అయితే ఈ సంగతి ఇప్పుడు, ఇంత ఘోరమైన ప్రమాదం జరిగాక మాత్రమే తెలిసినది కాదు. ఎన్నో భద్రతా అధ్యయనాలు ఈ సంగతి ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నాయి. విమానాశ్రయ రన్ వే అంచుల్లో నివాస గృహాలు ఉన్నాయనీ, ఆ ఇళ్లవాళ్లు తమ చెత్తను ఈ గోడ ఇవతల పారబోస్తున్నారనీ, అక్కడ పురుగులు చేరి, ఆ పురుగుల కోసం పక్షులు వచ్చి, సరిగ్గా విమానం టేకాఫ్ సమయంలో ఫాన్లలోకి పక్షులు ఎగిరే అవకాశం ఉందనీ; అక్కడ నేల చదునుగా లేదనీ, మురికి కాల్వల మాన్ హోల్స్ మీద కప్పులు కూడా లేవనీ ఇదివరకు తెలిసిన విషయాలే. అధ్యయనాలలో, నివేదికలలో రాసినవే. పరిష్కరించాలని సిఫారసులు అందినవే. డీజీసీఏ 2019 నివేదికలోనే అహ్మ దాబాద్ విమానాశ్రయం భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమయిందని వివరంగా రాసింది. అంతకు ముందే 2018లో ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుజరాత్ ప్రభుత్వానికి సమర్పించిన ఒక విజ్ఞాపనలో రన్ వే భద్రత కోసం, 29.79 ఎకరాల అదనపు స్థలం కావాలని కోరింది. దానికి గుజరాత్ ప్రభుత్వ ఆమోదం కూడా దొరి కింది. కాని అక్కడ ఉన్న 350 కుటుంబాలను తరలించి, స్థలం ఖాళీ చేయించడంలో రాజకీయాలు అడ్డుపడి ఏడు సంవత్సరాలు గడిచినా ఆ పని జరగలేదు.ప్రస్తుత విమానాశ్రయం మీద ఒత్తిడి తగ్గించే పరి ష్కారంగా ధోలేరాలో పదివేల ఎకరాలలో రెండో విమా నాశ్రయాన్ని 2022లో ప్రకటించారు. అది 2025 కల్లా ప్రారంభమవుతుందన్నారు. దాని ప్రచార కార్యక్రమం నడిచినంతగా నిర్మాణ కార్యకలాపాలు సాగలేదు.విజయ్ రూపానీ ఐదు సంవత్సరాల పాటు 2016 నుంచి 2021 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమా దాల హెచ్చరికలన్నీ ఉన్నాయి. వాటిని నివారించే అవకాశాలూ ఉన్నాయి. కాని నిర్లక్ష్యమే రాజ్యమేలింది. ప్రస్తుత విమాన ప్రమాదంలో రూపానీ విషాదకర మరణానికి ఆ నిర్లక్ష్యమూ కారణమే! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్

ఆ దుస్సాహసం వద్దు.. అమెరికాకు రష్యా వార్నింగ్
మాస్కో: ‘ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో తాము భాగస్వాములం కావొచ్చు. కాకపోవచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఒకడుగు ముందకేసి మరీ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. కాగా, ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య యుద్ధం భీకర రూపాన్ని దాల్చింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది. ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపిస్తోంది. చాలా నగరాలు నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. వలసదారులు తప్పితే ఇరాన్ నగరాల రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు.

విజయవాడ: జైలులో వల్లభనేని వంశీకి అస్వస్థత
సాక్షి, విజయవాడ: జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జైలు అధికారులు.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలించారు. వాంతులు, విరోచనాలు, డీ హైడ్రేషన్తో వంశీ బాధ పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఆయన గత నెలలో కూడా తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్థారించారు.ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్2న) డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.కాగా, వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది.

బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్లో లగ్జరీ రెస్టారెంట్
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్లోని బంజారా హిల్స్(రోడ్ నంబర్ 3)లో 'జోహార్ఫా' పేరిట సరికొత్త లగ్జరీ రెస్టారెంట్ను సిరాజ్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. కస్టమర్ల కోసం పర్షియన్, అరేబియన్, మొఘలాయ్, చైనీల్ లాంటి రకరకాల వంటకాలు తమ రెస్టారెంట్లో అందించనున్నట్లు తెలిపాడు.ఈ ఫుడ్ బిజినెస్లో అతడి సోదరుడు భాగస్వామి ఉన్నట్లు సిరాజ్ మియా పేర్కొన్నాడు. అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభ తేదీ ఎప్పుడో ఇంకా సిరాజ్ వెల్లడించలేదు. కాగా భారత క్రికెటర్లు ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదేమి తొలిసారి కాదు. ఇప్పటికే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. బెంగళూరు, ముంబై, పుణే, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్లో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు సైతం ఫుడ్బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. ఇక సిరాజ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సన్నద్దమవుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి భారత బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.చదవండి: నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్

ప్చ్.. పాకిస్తాన్ పీత కష్టాలు
ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ సూపర్ సక్సెస్.. ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అని డప్పు కొట్టి ప్రకటించుకున్నా పాక్ను పట్టించుకునే నాథుడే(దేశం)కరువయ్యాడు. పైగా 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పాక్ పాలిట పీడకలగా తయారయ్యాడు.భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఈ విషయాన్ని బయటపెట్టిన డామియన్.. ఇప్పుడు మరో కీలక సమాచారాన్ని ఎక్స్ వేదికగా వదిలాడు. అందులో రహీం యార్ ఖాన్ బేస్ను పాక్ ఎంతకీ పునరుద్ధరించలేకపోతోందని వెల్లడించాడు.Pakistan once again issues a NOTAM for Rahim Yar Khan, the runway struck by India in May 2025 now remains offline estimated till 04 July 2025 pic.twitter.com/M6nE1ONTmL— Damien Symon (@detresfa_) June 19, 2025ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఫేజ్1లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం.. ఫేజ్2లో రహీమ్ యార్ ఖాన్ బేస్ను సైతం దెబ్బ తీసింది. అయితే జులై 4వ తేదీ దాకా దాని కార్యకలాపాలు ప్రారంభం కాబోవని పాక్ సైన్యం తాజాగా నోటామ్(notice to airmen) సైతం జారీ చేసింది.ఆపరేషన్ సిందూర్లో భాగంగా.. పక్కా ప్రణాళికతో భారత్ ఈ ఎయిర్బేస్ను దెబ్బ తీసింది. దీంతో పాకిస్తాన్కు జరిగిన నష్టం మాములిది కాదు. పంజాబ్ ప్రావిన్స్లో పాక్కు ఇదే వ్యూహాత్మక స్థావరంగా ఉండేది. అంతేకాదు.. ఈ ఎయిర్బేస్కు అనుసంధానంగా రహీమ్ యార్ ఖాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఒకే రన్వే ఉన్న ఈ ఎయిర్పోర్టును భారత్ జరిపిన దాడి తర్వాత వారం పాటు మూసే ఉంచుతామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే అది కూడా ఇప్పటిదాకా తెరుచుకోకపోవడం గమనార్హం. దీంతో.. దాడి ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ‘‘అది ఇంకెప్పటికి తెరుచుకుంటుందో?’’ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.India didn’t just respond, it decimated yet another key site of #Pakistan's attack. #Rahimyarkhan airport, a key launchpad for Pakistani drone attacks, now lies in ruins.Precision. Power. Payback.#PakistanIndianWar pic.twitter.com/zvkaaWFH5R— DrVinushaReddy (@vinushareddyb) May 10, 2025విశేషం ఏంటంటే.. రాజస్థాన్ బికనీర్లో నిర్వహించిన ఓ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్బేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాక్ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది. అది ఎప్పటికీ తిరిగి తెరుచుకుంటోందో కూడా చెప్పలేకపోతున్నారు అని మోదీ తన ప్రసంగంలో వ్యంగ్యం ప్రదర్శించారు. " مودی" نے رحیم یارخان ائیر بیس تباہ کردیا 😂😂راجھستان ، رحیم یارخان بارڈر کے دوسری طرف عوامی جلسے سے خطاب#modi #rajasthan #RahimYarKhan #rahimyarkhanpakistan pic.twitter.com/9oRsvL5ql6— Rana Kashif (@ranakashi102) May 23, 2025📍రహీం యార్ ఖాన్ (Rahim Yar Khan) పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఒక ప్రముఖ నగరం(జిల్లా కేంద్రం కూడా). ఇది పాకిస్తాన్లో 21వ అతిపెద్ద నగరం. ఈ నగరం పూర్వపు పేరు నౌషెహ్రా. అయితే 1881లో బహావల్పూర్ రాష్ట్ర నవాబ్ సాదిక్ ఖాన్ IV.. తన కుమారుడు రహీం యార్ ఖాన్ (1877–1881) పేరును ఈ నగరానికి పెట్టాడు. ఈ ప్రాంతంలో పట్టన్ మినారా అనే 2000 సంవత్సరాల పురాతన బౌద్ధ స్థూపం ఉంది, ఇది మౌర్యుల హక్రా లోయ నాగరికతకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తుంటారు.

ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్: అమిత్ షా
ఢిల్లీ: మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని.. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివన్న అమిత్ షా.. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు.. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను.’’ అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.మన దేశాన్ని, మన సంస్కృతి, చరిత్ర, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏవిదేశీ భాష కూడా సరిపోదని అమిత్ షా వ్యాఖ్యానించారు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేం. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాం. ప్రపంచాన్ని కూడా నడిపిస్తాం’’ అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) గురించి వివరిస్తూ.. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని అమిత్ షా అన్నారు. అమృత్ కాల్ కోసం మోదీ జీ 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు)కు పునాది వేశారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని.. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని అమిత్ షా చెప్పారు.
తోడబుట్టిన బలగం
కోహినూరు వజ్రం కాకతీయులదే!
టీవీలకు కనెక్ట్ అవుతున్నారు!
54 ఉన్నత విద్యాసంస్థలకు గ్లోబల్ గుర్తింపు
తక్కువ పంట కాలం.. అధిక దిగుబడి
రేవంత్కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జి ఎక్కువ
బనకచర్లను అడ్డుకోండి
మ్యాట్రిక్స్తోనే డేటాలో 'కిక్'
రేవంత్ కోసం ‘ఆర్ఆర్ మాడ్యూల్’!
వాహనాలన్నీ 'కంట్రోల్'లోనే!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
సాక్షి కార్టూన్ 18-06-2025
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
నాకు పునర్జన్మనిచ్చింది వారే.. లైవ్ లో కన్నీరు పెట్టుకున్న కొమ్మినేని
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
తోడబుట్టిన బలగం
కోహినూరు వజ్రం కాకతీయులదే!
టీవీలకు కనెక్ట్ అవుతున్నారు!
54 ఉన్నత విద్యాసంస్థలకు గ్లోబల్ గుర్తింపు
తక్కువ పంట కాలం.. అధిక దిగుబడి
రేవంత్కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జి ఎక్కువ
బనకచర్లను అడ్డుకోండి
మ్యాట్రిక్స్తోనే డేటాలో 'కిక్'
రేవంత్ కోసం ‘ఆర్ఆర్ మాడ్యూల్’!
వాహనాలన్నీ 'కంట్రోల్'లోనే!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
సాక్షి కార్టూన్ 18-06-2025
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల
సినిమా

ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
"పుష్ప" సినిమాలో, హీరో పుష్పరాజ్ ఇంటిపేరు కోసం, ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం, జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్గా తనను వెతుక్కుంటూ ఆ ఇంటిపేరు తన గుమ్మం ముందు వాలుతుంది. ఒకరకంగా ఎన్టీఆర్ పరిస్థితి కూడా పుష్పరాజ్ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా! తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పలు విషయాలు పంచుకున్నారు.దూరం పెరిగింది..సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ (Jr NTR)ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం పెట్టారో ఇలా చెప్పారు. ' జూనియర్ ఎన్టీఆర్ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కారణాలు అయితే ఉన్నాయి. కొంచెం దూరం పెరిగింది. కానీ, ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం' అని ఆమె చెప్పారు.(చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు)తారక్ మనసులో ఏముంది?ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి కూడా పురందేశ్వరి మాట్లాడారు.' రాజకీయాల్లోకి తారక్ రావాలనుకుంటే వస్తారు. అతనిది ఇంకా చిన్న వయసు. అలాంటప్పుడు పాలిటిక్స్లోకి తారక్ రావాల్సిన అవసరం ఉందా..? అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే, రాజకీయాల గురించి తారక్ మనసులో ఏముంది..? అనేది నాకు తెలియదు. ఈ విషయం గురించి ఎప్పడు కూడా చర్చించలేదు' అన్నారు.తారక్తో ఇబ్బంది లేదుగతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్ తన పిల్లలతో రెగ్యులర్గా టచ్లో ఉంటాడని పురందేశ్వరి చెప్పారు. తను నటించిన సినిమా విడుదలైతే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటానని ఆమె అన్నారు. తనను జూ. ఎన్టీఆర్ అత్తా అనే పిలుస్తాడని, తనతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పలుమార్లు పంచుకున్నారు.చదవండి: వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్

అఖిల్ వెడ్డింగ్.. శోభితను అలా చూస్తుండిపోయిన నాగచైతన్య!
ఏడాది వ్యవధిలోనే అక్కినేని వారి ఇంట రెండు పెళ్లిళ్లు జరిగాయి. గతేడాది నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడారు. ఆ తర్వాత ఇటీవలే అఖిల్ అక్కినేని సైతం ఓ ఇంటివాడయ్యారు. గతేడాది తన ప్రియురాలు జైనాబ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ జూన్ 6న తన మెడలో మూడు ముళ్లు వేశారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్కు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో నాగచైతన్య- శోభిత పాల్గొని సందడి చేశారు. తమ్ముడి వెడ్డింగ్లో చైతూ- శోభిత స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు.తాజాగా వీరిద్దరి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పెళ్లి వేడుకలో శోభిత ధూలిపాళ్ల దోశ తింటూ ఉండగా.. పక్కనే నాగచైతన్య తన సతీమణి వైపే అలానే చూస్తూ ఉండిపోయారు. ఈ వెడ్డింగ్లో తన భార్యతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు చైతూ. ఈ వీడియోను ప్రముఖ కేటరింగ్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అఖిల్ గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో అఖిల్- జైనాబ్ జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి.

బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే గూగుల్పే..
బిగ్బాస్ షోకు రెండుసార్లు వెళ్లొచ్చాడు గౌతమ్ కృష్ణ (Gautham Krishna). మొదటిసారి ఫినాలే వరకు చేరకుండానే ఎలిమినేట్ అయ్యాడు. రెండోసారి మాత్రం వైల్డ్ కార్డ్లా వెళ్లి వైల్డ్ ఫైర్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. అతడు హీరోగా నటిస్తున్న రెండో చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్ తన బిగ్బాస్ సంపాదనను బయటపెట్టాడు. బిగ్బాస్ షోలో నేను పది వారాలున్నాను. అందుకుగానూ నేను రూ.30 లక్షలు సంపాదించాను. నా సంపాదనలో కొంత భాగం సమాజ సేవకు ఉపయోగించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకెప్పుడు వచ్చిందంటే.. 25 ఏళ్ల మురళీనాయక్ అనే వ్యక్తి ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం పోరాడి వీరమరణం పొందారు.స్టేజీపై ఆర్థిక సాయంమరి నేనేం చేశాను? అని ఆలోచించుకున్నాను. అందుకే సమవర్తి అనే ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా సంపాదనలో సగం ఈ ట్రస్టుకే ఇస్తాను. అలా బిగ్బాస్ ద్వారా సంపాదించినదాంట్లో సగం అంటే రూ.15 లక్షలు ఈ సంస్థ ఖాతాలో వేస్తున్నాను. మొదటగా మురళీ నాయక్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను చచ్చేలోపు లక్ష మందికి సాయం చేయాలన్నదే నా కోరిక. నేను నా మాట నిలబెట్టుకోకపోతే నన్ను ఏకిపారేయండి అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే మురళీ నాయక్ కుటుంబానికి స్టేజీపై లక్ష రూపాయలు గూగుల్ పే చేశాడు. సోలోబాయ్ చిత్రం జూలై 4న విడుదల కానుంది.చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు

రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు
కొన్ని ప్రదేశాలు నెగెటివ్ వైబ్స్ ఇస్తుంటాయి. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లినప్పుడు తనకూ అలాంటి నెగెటివ్ వైబ్స్ వచ్చాయంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు అంతా సరిగా ఉన్నట్లు అనిపించలేదని, వెంటనే తిరిగి వెళ్లిపోవాలనిపించిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటుగా రామోజీ ఫిలిం సిటీని వర్ణించింది.హోటల్లో దెయ్యాలు?ఇలాంటి చేదు అనుభవం కాజోల్కు మాత్రమే కాదు, తాప్సీ (Taapsee Pannu), రాశీఖన్నా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఎదురైందట! గతంలో తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దెయ్యాలున్నాయని నేను బలంగా నమ్ముతాను. అవంటే నాకు చాలా భయం. రామోజీ ఫిలిం సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు నాతో పాటు ఎవరో ఉన్నట్లే అనిపించింది. ఆ హోటల్లో దెయ్యాలున్నాయని అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్ధాలు వినిపించాయి. దెయ్యంతో పోరాడలేనుభయంతో వణికిపోయినప్పటికీ అదంతా నా భ్రమే అని నాకు నేను సర్ది చెప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను. దెయ్యంతో పోరాడేంత సినిమా నాకు లేదు అని చెప్పుకొచ్చింది. రాశీఖన్నా (Raashii Khanna) కూడా.. అదే హోటల్లో బస చేసినప్పుడు తన బెడ్ దానంతటదే ఊగిపోయిందని, తను కప్పుకున్న దుప్పటి కూడా ఎవరో లాగేశారంది. ఆ గదిలో కచ్చితంగా దెయ్యం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే, తనకంటే ముందు పలువురు యాక్టర్స్కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పినట్లు ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది.కీరవాణిదీ అదే అభిప్రాయంఅలాగే ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani)కి కూడా చంద్రముఖి 2 సినిమా సమయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కీరవాణి మాట్లాడుతూ.. అత్యంత భయంకరమైన ప్రదేశం ఏది? అని ఇంటర్నెట్లో కొడితే రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) పేరే వస్తుంది. అక్కడున్న సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాట పాడుతున్నారు. అప్పుడు వారి చెవిలో ఏవో శబ్ధాలు వినిపించాయి అని చెప్పాడు. సెలబ్రిటీలందరూ ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే ఏదో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

‘అప్పటికప్పుడు ఆటను మార్చుకోవాలి’
లీడ్స్: ఇంగ్లండ్ గడ్డపై భారత్ మెరుగైన ఫలితం సాధించాలంటే బ్యాటర్లు ఒకే తరహా శైలికి కట్టుబడి ఉండరాదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మైదానాల్లో పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయని, దానికి అనుగుణంగా తమ బ్యాటింగ్ ను కూడా మార్చుకోవాలని అతను సూచించాడు. ‘నా ఆట ఇలాగే ఉంటుంది. నేను ఇలాగే ఆడతాను అనే వన్వే ట్రాఫిక్ ఇంగ్లండ్లో పనికి రాదు. ఇక్కడి పరిస్థితులను కొద్దిగా గౌరవించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా తమ ఆటను మార్చుకోవాలనే ఆలోచనలు మనసులో సాగుతూనే ఉండాలి. అప్పుటే ఆటపై పట్టు చిక్కి అంతా చక్కబడుతుంది. ఎప్పుడు దూకుడు పెంచాలో, ఎప్పుడు డిఫెన్స్ ఆడాలో తెలియాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని సచిన్ వివరించాడు. అయితే ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లలో ఆడిన అనుభవం జట్టులో అందరికీ ఉందని, వాటినుంచి నేర్చుకున్న విషయాలను మెరుగుపర్చుకుంటే ఇక్కడా మంచి ఫలితాలు వస్తాయని అతను అన్నాడు. భారత కెప్టెన్గా తొలి సిరీస్ ఆడనున్న శుబ్మన్ గిల్కు కూడా సచిన్ పలు సలహాలు ఇచ్చాడు. అతను బయటి విషయాలను పట్టించుకోరాదని, తన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని దిగ్గజ బ్యాటర్ సూచించాడు. ‘కెప్టెన్గా గిల్కు కొంత సమయం ఇవ్వడంతో పాటు అందరూ అతనికి అండగా కూడా నిలవాలి. భారత కెప్టెన్ అంటే తీవ్రమైన ఒత్తిడి ఉండే బాధ్యత. ఇలా చేయాలి అలా చేయాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు. అభిప్రాయాలు చెప్పే హక్కు బయటి నుంచి ఎవరికైనా ఉంటుంది. ఇవన్నీ గిల్ పట్టించుకోకూడదు. డ్రెస్సింగ్ రూమ్లో చర్చించిన వ్యూహాలను మైదానంలో అమలయ్యేలా చూడాలి’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ ఆవిష్కరణ..భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్కు ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’గా పేరు పెట్టారు. ఈ ట్రోఫీని గురువారం ఆవిష్కరించారు. అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్లుగా సచిన్ (200), అండర్సన్ (188) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ (15,921) పేరిట ఉండగా... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంతో (704 వికెట్లు) అండర్సన్ కెరీర్ ముగించాడు. వీరిద్దరి పేర్లను ట్రోఫీకి పెట్టి ఈసీబీ, బీసీసీఐ సముచితంగా గౌరవించాయి. మరోవైపు ఇప్పటి వరకు ట్రోఫీకి ‘పటౌడీ’ పేరు ఉండేది. ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టు కెపె్టన్కు ‘పటౌడీ మెడల్’ అందజేస్తారు. పేరు మార్పు విషయంలో తాను పటౌడీ కుటుంబంతో స్వయంగా మాట్లాడానని ... ఏదో రూపంలో వారి గౌరవం కొనసాగేలా తాను ప్రయత్నిస్తానని వారితో చెప్పినట్లు సచిన్ వెల్లడించాడు.

ఇంగ్లండ్- భారత్ టెస్టు సిరీస్.. డేంజర్లో సచిన్, కోహ్లి రికార్డులు
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు రంగం సిద్దమైంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్.. శుక్రవారం(జూన్ 20) నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్-ఇంగ్లండ్ జట్లు సిద్దమయ్యాయి.అయితే ఈ సిరీస్కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ ఇంగ్లండ్ గ్రేట్ బ్యాటర్.. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డులపై కన్నేశాడు.మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ తన కెరీర్లో ఇంగ్లండ్పై 16 టెస్టు ఫిప్టీలు చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ 13 హాఫ్ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.ఆ తర్వాత స్ధానంలో జూరూట్(11 హాఫ్ సెంచరీలు) ఉన్నాడు. ఈ క్రమంలో రూట్ మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే.. సచిన్ అధిగమిస్తాడు. అదేవిధంగా ఆరు హాఫ్ సెంచరీలు చేస్తే సునీల్ గవాస్కర్ ఆల్టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.చరిత్రకు అడుగు దూరంలో..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి ఇప్పటివరకు ఇంగ్లండ్పై మూడు ఫార్మాట్లలో 4036 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్(3990) ఉన్నాడు. ఈ లిస్ట్లో మూడో స్ధానంలో జో రూట్(3858) ఉన్నాడు. ఇప్పుడు రూట్ 133 పరుగులు చేస్తే సచిన్ను, 179 పరుగులు సాధిస్తే విరాట్ను అధిగమించి అగ్రస్ధానానికి చేరుకుంటాడు.కాగా భారత్పై జో రూట్కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు రూట్ టీమిండియాపై రూట్ 28 సార్లు (13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు) ఏభైకి పైగా పరుగులు చేశాడు. రూట్ మరో ఐదు అర్ధ శతకాలు చేస్తే సచిన్, కోహ్లి(32)ను దాటేస్తాడు.చదవండి: Mohammed Siraj: బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్లో లగ్జరీ రెస్టారెంట్

బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్లో లగ్జరీ రెస్టారెంట్
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్లోని బంజారా హిల్స్(రోడ్ నంబర్ 3)లో 'జోహార్ఫా' పేరిట సరికొత్త లగ్జరీ రెస్టారెంట్ను సిరాజ్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. కస్టమర్ల కోసం పర్షియన్, అరేబియన్, మొఘలాయ్, చైనీల్ లాంటి రకరకాల వంటకాలు తమ రెస్టారెంట్లో అందించనున్నట్లు తెలిపాడు.ఈ ఫుడ్ బిజినెస్లో అతడి సోదరుడు భాగస్వామి ఉన్నట్లు సిరాజ్ మియా పేర్కొన్నాడు. అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభ తేదీ ఎప్పుడో ఇంకా సిరాజ్ వెల్లడించలేదు. కాగా భారత క్రికెటర్లు ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదేమి తొలిసారి కాదు. ఇప్పటికే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. బెంగళూరు, ముంబై, పుణే, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్లో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు సైతం ఫుడ్బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. ఇక సిరాజ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సన్నద్దమవుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి భారత బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.చదవండి: నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్

నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్
లీడ్స్లోని హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు శుక్రవారం(జూన్ 20) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో శుభరంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం(జూన్ 18) టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు గిల్ సమాధనమిచ్చాడు. భారత కెప్టెన్గా తను ఎదుర్కొనున్న ఛాలెంజ్స్ కోసం గిల్ మాట్లాడాడు. అయితే కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్పై పడకుండా చూసుకుంటాని అతడు చెప్పుకొచ్చాడు. "ఇప్పటివరకు ఏ విధంగా అయితే పూర్తి స్వేఛ్చతో బ్యాటింగ్ చేశానో, ఇకపై కూడా అదే కొనసాగిస్తున్నాను. కెప్టెన్సీ గురుంచి ఎక్కువగా ఆలోచించకుండా నా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ సిరీస్లో బెస్ట్ బ్యాటర్గా ఉండాలని భావిస్తున్నా. విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ధానం కోసం ఇప్పటికే గంభీర్ భాయ్, నేను చర్చించుకున్నాము. మా దగ్గర రెండు వేర్వేరు కాంబినేషన్లు సిద్దంగా ఉన్నాయి. పిచ్ను పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ పేర్కొన్నాడు.భయపెడుతున్న గిల్ రికార్డు..శుబ్మన్ గిల్ తన కెరీర్లో 32 టెస్టులు ఆడి 1893 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. కానీ సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి రికార్డు మాత్రం టీమ్మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. సెనాదేశాల్లో గిల్ ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 514 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్లో అయితే అతడి ప్రదర్శన మరి దారుణంగా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టులు ఆడిన శుబ్మన్.. 14.66 సగటుతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’
బిజినెస్

అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
ఓ వైపు బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను (10 గ్రాములకు) చేరుకుంటే ఇంకో వైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్టైమ్ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది.ఈ నేపథ్యంలో ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మాటలపై అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు సామాన్య జనంలోనూ చర్చ సాగుతోంది. అమ్మో బంగారం అంత పెరిగింది... ఇంత పెరిగింది.. అని చర్చించుకుంటున్న జనం ఇప్పుడు పెరుగుతున్న వెండి ధరలను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి ఇటీవల వెండి గురించి సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు.👉 ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది! ఇటీవలి ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ "నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం" అని అభివర్ణించారు. అంటే వెండి ఇప్పుడే కొనుక్కోండి.. రాబోయే రోజుల్లో కొనడం కష్టమవుతుందున్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంసీఎక్స్లో కిలో వెండి ధర రూ.1.06 లక్షలుగా ఉండగా, వెండి ఇప్పటికే గత ఏడాదిగా అద్భుతమైన లాభాలను చవిచూసింది.ఆర్థిక విశ్లేషకులు ఆచితూచి ఆశావహంగా ఉన్నారు. కొంతమంది కియోసాకి అంచనాను తీవ్రమైనదిగా భావిస్తుండగా, మరికొందరు ఆయనతో ఏకీభవిస్తున్నారు. ఇందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలలో పెరిగిన వెండి వినియోగం, అలాగే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎత్తి చూపుతున్నారు. వెండి జోరు నిజమే కానీ ఏకంగా రూ.2 లక్షలకు చేరుతుందా అన్నదానిపై ‘దీనికి కొన్ని తీవ్రమైన కారణాలు ఉండవచ్చు' అని ముంబైకి చెందిన కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ మీరా దేశ్ పాండే అన్నారు.

నెలకు రూ.10,000 జీతం.. సెకండ్ హ్యాండ్ ఫోన్
ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ డబ్బు పొదుపునకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన వార్షిక ఆదాయంలో 95% ఆదా చేస్తున్నట్లు చెప్పారు. తన ఆర్థిక క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అక్షత్ ఎక్స్లోని వివరాల ప్రకారం.. తాను నెలకు కేవలం రూ.10,000 సంపాదనతో కెరియర్ ప్రారంభించారు. తల్లిదండ్రులతో కలిసి ఉంటూ సెకండ్ హ్యాండ్ ఫోన్ వాడుతూ, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోకుండా ఇంట్లో తయారు చేసిన భోజనం తింటూ నెలకు రూ.1,000-2,000 పొదుపు చేయగలిగాడు. అప్పులు చేయలేదు.. అనవసరమైన ఖర్చులు లేవు. మొదటి నుంచి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చిన్నమొత్తంలో స్థిరంగా పొదుపు చేస్తూ వచ్చారు.కొన్నేళ్ల తర్వాత రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరారు. తర్వాత అతని పొదుపు అలవాట్లు కూడా పెరిగాయి. ఏడాదికి కనీసం రూ.20 లక్షలు పొదుపు చేస్తూ అప్పులేని జీవనం కొనసాగించారు. అందులో ఎక్కువ భాగాన్ని అధిక వృద్ధి పెట్టుబడులకు మళ్లించారు. కాలక్రమేణా ఆ పెట్టుబడులు సొంత ఆదాయాన్ని సృష్టించడం ప్రారంభించాయి. దాంతో రిటైర్మెంట్ కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగులు వేశారు.[1] When I started my career: my salary was 10K, I used to live with my parents; used a 2nd hand mobile phone. Ate home cooked meals (almost all the time). I was not married/had kids, took no debt. And, still saved 1-2K/month. [2] Fast forward a few years: I got a good…— Akshat Shrivastava (@Akshat_World) June 15, 2025ఇదీ చదవండి: ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్..ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు, ప్రపంచ ప్రయాణాలు చేస్తూ ఖరీదైన నగరంలో నివసిస్తున్నప్పటికీ అక్షత్ తన పొదుపు రేటు ఇప్పటికీ 95% కొనసాగిస్తున్నారు. జీవనశైలి మారుతున్నా పొదుపు మాత్రం మరవకూడదని చెబుతున్నారు. ఏళ్ల తరబడి తనకు మార్గనిర్దేశం చేసిన నియమాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘మీరు ఏదైనా రెండుసార్లు కొనగలిగితే తప్పా దాన్ని ఒకసారి కొనవద్దు. మీ నైపుణ్యాలు మెరుగుపడే పనికి మాత్రం ఖర్చు చేసేందుకు వెనుకాడవద్దు’ ఇది తెలిపారు.

ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్..
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత ఆటోమోటివ్ వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించింది. భారత్లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించి ఆరేళ్లు అవుతున్న నేపథ్యంలో ఎంజీ సంస్థ తన జెడ్ఎస్ ఈవీ మోడల్పై గణనీయమైన ధర తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. లిమిటెడ్ టైమ్ యానివర్సరీ ఆఫర్లో భాగంగా జెడ్ఎస్ ఈవీ ఇప్పుడు రూ.16.75 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుందని పేర్కొంది.ఇదీ చదవండి: వాట్సప్, ఇన్స్టాగ్రామ్ షట్డౌన్!ఎంజీ జెడ్ఎస్ ఈవీ వేరియంట్లను అనుసరించి ఎక్స్షోరూమ్ ధరల్లో మార్పులు ప్రకటించింది. దాంతో ఎసెన్స్ వేరియంట్పై అత్యధికంగా రూ.4,44,000 వరకు రాయితీ పొందవచ్చని ఎంజీ తెలిపింది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ క్లీన్ మొబిలిటీని పోత్సహించేలా వినియోగదారులకు ఈ ప్రత్యేక ధరలను అందిస్తున్నట్లు తెలిపింది.

వాట్సప్, ఇన్స్టాగ్రామ్ షట్డౌన్!
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఇంటర్నెట్ సర్వీసుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తూ ఇటీవల దేశవ్యాప్తంగా దాదాపు ఇంటర్నెట్ బ్లాక్అవుట్(ఇంటర్నెట్లో తీవ్ర అంతరాయం-పూర్తి బ్లాక్అవుట్ కాదు)ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతుందని, అందుకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ మేరకు ఇంటర్నెట్ను పరిమితం చేస్తూ ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.ఇరాన్ ప్రభుత్వ నిర్ణయం ద్వారా వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సేవలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. తప్పుడు సమాచారం వ్యాప్తిని అణచివేయాలని దాంతోపాటు సైబర్ దాడులను అరికట్టాలని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని ట్రాక్ చేసే కంపెనీలు కెంటింక్, నెట్బ్లాక్స్ను ఉటంకిస్తూ ఎన్బీసీ తెలిపిన నివేదిక ఆధారంగా ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం జూన్ 17, సాయంత్రం 5:30 గంటలకు ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. ఇది పూర్తిగా బ్లాక్అవుట్ కాదు. విదేశీ వెబ్సైట్లకు కనెక్ట్ అయ్యేందుకు అనుమతించే వీపీఎన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తారనే ఆందోళనలతో వాట్సప్ వంటి యాప్లను ఉపయోగించకుండా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.ఇదే మొదటిసారి కాదు..ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేయడం లేదా ప్రజలు ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయకుండా నిరోధించడం ఇది మొదటిసారి కాదు. 2019లో దేశంలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా వరుసగా ఆరు రోజుల పాటు పూర్తిగా లాక్డౌన్ విధించింది. అప్పుడు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్పై దాడుల తర్వాత 220 మందికి పైగా మరణించారని ఇరాన్ చెబుతుండగా, ప్రతీకార దాడుల్లో 24 మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతోంది.ఇదీ చదవండి: పుత్తడి ఈ పూట రేటెంతంటే..గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ కూడా..గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లను కూడా ఇరాన్ నిలిపేసింది. ప్రజలు తమ డివైజ్లలో కొత్త యాప్లను డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకోకుండా నిషేధం విధించింది. అదే సమయంలో వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ ఇప్పటికే ఉన్న డివైజ్లలో పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఇరాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో భాగమైన ప్రభుత్వం ఆమోదించిన సైట్లు అందుబాటులో ఉన్నాయి.
ఫ్యామిలీ

బోధనకు సృజన తోడైతే ఇంత బాగుంటుందా..!
చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. ఇక పిల్లలు, పెద్దలు హడావిడి మాములుగా ఉండదు. ఇన్నాళ్లు జాలీగా గడిపిన చిన్నారులకు ఇప్పుడు స్కూల్కి వెళ్లాంటే ఉంటుంది బాధ..మాములుగా ఉండదు. వాళ్లని యథావిధిగా స్కూల్కి వెళ్లేలా చేయలేక పేరెంట్స్ తంటాలు ఓ రేంజ్లో ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో సామాజిక మాధ్యమంలో ఓ టీచర్ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతున్న వైరల్ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇలా ప్రతి టీచర్ పిల్లల్నిఎంజాయ్ చేసేలా పాఠాలు చెబితే వాళ్లు స్కూల్కి వెళ్లనని మారం చెయ్యరు అంటున్నారు నెటిజన్లంతా. మరీ ఆ వీడియో కథాకమామీషు ఏంటో చూద్దామా..!.వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తెరిచిన రోజు సామాజిక మాధ్యమాల్లో ఒక టీచర్ వీడియో వైరల్ అయింది. తొలి రోజు తరగతి గదిలో నృత్యం చేస్తూ, పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్ పేరు వందనరాయ్. కర్నాటకలోని కర్కలకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలను నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటోంది. పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆడుతూ, పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు సందర్భోచితంగా మేకప్ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తారు. ఆమె వీడియోలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. బోధనకు, సృజనాత్మకత తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలు చెప్పకనే చెబుతాయి. "Vandana Rai Karkala, a teacher & a social media sensation"She is a teacher in Karkala, Udupi district. Her teaching methods are integrated with music & nature, rooted in our culture. No wonder her videos have gone viral with millions of views.Youtube: https://t.co/zWQbi6y3Xa pic.twitter.com/Rc3zbBUppQ— Girish Alva (@girishalva) April 24, 2023(చదవండి: రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!)

మీ పిల్లలది మంచి స్కూలేనా? ఇవన్నీ చెక్ చేశారా?
స్కూల్ ఫీజ్ ఎంత కడుతున్నారో మీకు తెలుసుగాని ఆ కట్టిన డబ్బులోని ప్రతి పైసాకు సరి పడే విధంగా అక్కడ పాఠాలు చెబుతున్నారా? సౌకర్యాలు ఉన్నాయా? టీచర్లు యోగ్యులేనా? విద్యావిధానంలో వారి తాత్త్వికత ఏమిటి? స్టూడెంట్–టీచర్ మధ్య అనుబంధం ఉందా? ఆటలు ఉన్నాయా? విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం నేటి నుంచి అవగాహన కథనాలు... ‘మా పిల్లలు చాలా పెద్ద స్కూల్లో చదువుతున్నారు’ అని పేరెంట్స్ అనుకున్నంత మాత్రాన అది మంచి స్కూల్ అయిపోదు. ‘ఏదో చిన్న స్కూల్లో చదువుతున్నారులే’ అన్నంత మాత్రాన అది చెడ్డ స్కూల్ అయిపోదు. చాలా ఎక్కువ ఫీజు ఉన్నది చాలా మంచి స్కూల్ అనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. దగ్గరగా ఉందనో, ట్రాన్స్పోర్ట్ ఉందనో, అందరూ అక్కడే చదువుతున్నారనో... రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రులు పిల్లలను ఎంచిన స్కూళ్లలో చేరుస్తుంటారు. చేర్చి, మళ్లీ స్కూల్ వైపే చూడకుండా క్లాసుల మీద క్లాసులు చదివిస్తుంటారు. మన పిల్లలకు వచ్చే మార్కులను బట్టే అది మంచి స్కూల్ అనుకునేవారు కూడా ఉంటారు. అంటే పిల్లలకు నూటికి 90కి పైన వస్తున్నంత కాలం ఆ స్కూల్ ఎలా ఉన్నా వారికి పర్వాలేదు. కాని ఇలాంటి అంచనాలన్నింటితో ఒక స్కూల్ని ఎంచడం విద్యార్థికి ఏదో ఒక మేర నష్టం చేయడమే అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: టెంట్ చూస్తే చాలు.. గుండెల్లో గుబులు...ఏం చేయాలి?ఒక స్కూల్ ఎప్పుడు మంచి స్కూల్ అవుతుంది అనే దానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. పేపర్లో ఆ స్కూల్ విద్యార్థుల మార్కుల కనిపించడం వల్ల మాత్రమే మంచి స్కూల్ అనుకోక నిజంగా పిల్లలు సరైన స్కూల్లో చేరాలంటే, కొనసాగాలంటే తల్లిదండ్రులు ఆ స్కూల్ను ఈ ప్రమాణాల రీత్యా పరిశీలించాల్సి ఉంటుంది.విద్యా తాత్త్వికత ఎలాంటిది?ప్రతి మంచి స్కూల్కు ఒక తాత్త్వికత ఉంటుంది. తమ బడిలో చదివిన పిల్లల వికాసం ఏ రీతిన సాగాలో ఆ స్కూల్ ఏర్పాటు సమయంలోనే నిర్వచనం చేసుకుని ఉంటారు. భారతీయతలోని భిన్న సమాజాల పిల్లల కలయికతతో తరగతి ఉండాలనీ, అన్ని భాషల సంప్రదాయాల పిల్లల మధ్య సమ భావనతో తరగతి ఉండాలని, ఏ ఒక్క సమూహపు అహం/ ప్రాధాన్యం పెరగని విధంగా చూడగలరని, విద్యార్థుల మధ్య పోటీతత్త్వం ఎగదోసి ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసే విధానం అవలంబించరని, బోధన ఇంగ్లిష్ మీడియం అయినా ప్రతి మాతృభాషనూ గౌరవించగలిగే స్కూల్ను మంచి స్కూల్గా ఎంచవచ్చు.బుర్రలా... మరబొమ్మలా?చదువు ఎలా నేర్పిస్తారో చూడాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యంగా, పిల్లలు పాఠాలు బట్టీయం వేసి, పరీక్షల్లో ముక్కస్య ముక్కహ రాసి, నూటికి నూరు తెచ్చుకొనేలా తోముతారా లేదా ప్రశ్న మార్చి ఇచ్చినా రాసేలాగా, బుర్ర పెట్టి ఆలోచించగలిగేలాగా, సొంతంగా నేర్చుకునే లాగా, సబ్జెక్ట్స్పై ఆసక్తి కలిగేలాగా చెబుతారా? ఈ రెండో విధానం కలిగినది మంచి స్కూల్.చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తోవినూత్నమైన టీచింగ్టీచింగ్ ఎలా ఉంటుందనేది చూడాలి? అదే మూస సంప్రదాయ పద్ధతిలోనేపాఠాలు చెబుతున్నారా? లేదంటే ఆధునికమైన ఉపకరణాలు, సాధనాల సహాయంతో చెబుతున్నారా చూడాలి. ఎప్పటికప్పుడు సిలబస్ను వర్తమాన పరిస్థితులను బట్టి మెరుగు పరుచుకుంటూ పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ అవసరమైతే ఎక్స్పర్ట్లను బయటి నుంచి పిలిపించి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తూ పిల్లలను ఉత్సాహ పరుస్తున్నారా లేదా చూడాలి. రెండో రకం స్కూలుకు ప్రాధాన్యం ఇవ్వాలి.టీచర్లు ఉన్నారా?ఒక స్కూల్ మనుగడ ఆ స్కూల్లో పని చేసే టీచర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్కూల్ యాజమాన్యం క్వాలిఫైడ్ టీచర్లను తీసుకుంటున్నారా? వారికి మర్యాదకరమైన జీతాలు ఇస్తున్నారా? టీచర్లు ఆ యాజమాన్యానికి లాయల్గా ఉన్నారా? ఐదేళ్ల పాటైనా ఒక్కో టీచర్ ఆ స్కూల్లో పని చేయగలుగుతున్నారా? ఈ సంవత్సరం ఉండి మరో సంవత్సరం మారి΄ోయే టీచర్లు ఉన్న స్కూల్లో పాఠాలు నడవవు. స్కూల్ మీద ప్రేమతో ఉంటూ పాఠాలు చెప్పే తపన కలిగిన టీచర్లు ఉన్న స్కూల్ను ఎంచుకోవాలి. అలాగే టీచర్లు మొరటుగా ఉంటూ స్టూడెంట్స్తో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటే గనక ఆ స్కూల్ జోలికి పోరాదు. స్ట్రిక్ట్గా ఉండటం వేరు స్టూడెంట్స్ను అవమానిస్తూ, భయభ్రాంతం చేయడం వేరు.క్రీడలు, కళలుక్రీడలకు, కళలకు స్థానం లేని స్కూల్కు ఆమడ దూరం ఉండాలి. ఆటస్థలం లేని స్కూల్ ప్రైమరీ లెవల్ నుంచి హైస్కూల్ లెవల్ వరకూ పనికి రాదు. ప్లేగ్రౌండ్ ఉన్నా ఆటలను ప్రోత్సహించక చివరి పీరియడ్ వరకూ పాఠాలతో ఊదరగొట్టే స్కూల్స్ను మంచివి అనుకోకూడదు. పిల్లల్లో ఎంతో సృజన ఉంటుంది. దానిని ప్రోత్సహిస్తే వారికి ధన, కనక, వాహనాలిచ్చినట్టే. విద్యార్థి ఎదుగుదల సమగ్రంగా జరగాలి. పాఠాలతోపాటు ఆట పాటలకు విలువిచ్చే బడికే ఓటు.సామాజిక బాధ్యత నేర్పుతున్నదా?మన పాటికి మనం చదువుకుని, పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, సుఖంగా బతికే ధోరణిని పెంచేలా వీరి తర్ఫీదు ఉంటుందా లేదంటే ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజం గురించి ఎరుక పరిచి, అందులో ఉన్న అంతరాల వల్ల బాధ పడేవారి కోసం, సమాజంలో ఉన్నతి కోసం ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత రేపు పెద్దయ్యాక ఉంటుంది అనే చెప్పేలా తర్ఫీదు ఉంటుందా చూడాలి. రెండో రకం తర్ఫీదు మంచిది.భద్రత, పరిశుభ్రతఅన్నింటి కంటే ముఖ్యం భద్రత. పిల్లలు ఉన్న చోట వేయి కళ్లతో ఉండాలి. స్కూల్లో ఆయాలు, సెక్యూరిటీ వాళ్లు సరైన ట్రయినింగ్ ఉన్న వాళ్లేనా? బస్ల డ్రైవర్లు లైసెన్స్లు ఉన్నవాళ్లేనా? కెమెరాల నిఘా ఉందా? ఔట్ పాస్ నియమాలు ఎలా ఉన్నాయి? టాయిలెట్ల దగ్గర రక్షణ ఉందా? ఇవి చూడాలి. అలాగే స్కూల్లో పరిశుభ్రతపాటిస్తున్నారా? గాలి వెలుతురు ఉండేలా చూస్తున్నారా? మంచి నీరు ఇస్తున్నారా? పిల్లల ఆరోగ్యం హటాత్తుగా పాడైతే వారు వెంటనే తల్లిదండ్రులకు తెలియ చేస్తున్నారా? ఫస్ట్ ఎయిడ్ ఇవ్వ గలుగుతున్నారా... ఇవన్నీ చూసుకుని, సంతృప్తికరంగా ఉంటే అది మంచి స్కూల్. ప్రతి పైసాకు ప్రతిఫలంస్కూళ్లు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తాయి. ఆ వసూలు చేసిన ఫీజుకు జవాబుదారీగా స్కూల్ను నిర్వహిస్తున్నారా? ప్రతి పైసాకు ప్రతిఫలం ఇస్తున్నంత బాగా విద్యార్థిని తీర్చిదిద్దుతున్నారా? పిల్లలు సంతోషంగా స్కూల్కు వెళ్లి సంతోషంగా తిరిగి ఇల్లు చేరుతున్నారా? ఇవన్నీ పరిశీలించుకుని ఇప్పుడు మీ పిల్లలు చదువుతున్నది మంచి స్కూలో కాదో తేల్చుకోండి.

రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!
‘కాపాడుకో...కాపాడు’ నినాదంతో కోలిండియా వరల్డ్ క్లాస్ ఆల్–విమెన్ రెస్క్యూ అండ్ రికవరీ టీమ్లను ఏర్పాటు చేసింది.ఇప్పుడు అదే బాటలో సింగరేణి సంస్థ తొలిసారిగా ఆల్–విమెన్ రెస్క్యూ టీమ్లకు శ్రీకారం చుట్టింది. శిక్షణ మొదలైంది. సింగరేణి చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా నిలవనుంది...రెండేళ్ల క్రితమే సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో సింగరేణి నిర్వహించిన ఎక్స్టర్నల్ పోస్టుల్లో మహిళా గ్రాడ్యుయేట్ ట్రెయినీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లో చేరారు. సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 1,995కి పెరిగింది. రెస్క్యూ శిక్షణ కోసం మైనింగ్ గ్య్రాడ్యుయేట్ ట్రెయినీలతో ఒక్కో బ్యాచ్కు 14 మంది చొప్పున రెండు బ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు.కోలిండియాలోని పలు సంస్థలో ఇప్పటికే మహిళా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది సింగరేణిలో జరిగిన ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కోల్ ఇండియాకు చెందిన రెండు మహిళా టీమ్లు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో కూడా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు జట్లకు పదహారు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఫస్ట్ ఎయిడ్, రివైనింగ్, రక్షణ పద్దతులు, గనుల్లో గ్యాస్ ఏర్పడినప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గోడలు కట్టే విధానం, అత్యవసర సమయాల్లో స్పందించే పద్ధతి, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు రక్షించే విధానం...మొదలైన అంశాలపై శిక్షణ ఇస్తారు. ‘ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్లో చేరాను’ అంటోంది ఎన్.రక్షిత. ‘కోల్ ఇండియా స్థాయి రెస్క్యూ పోటీల్లో మా జట్టు సత్తా చూపుతాం’ అంది బి.కళ్యాణి. అందరి మాటల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. సాహసానికి ఇంధనం ఆ ఉత్సాహమే కదా!– కాల్వ చంద్రశేఖర్రెడ్డి, సాక్షి, గోదావరిఖనిటఫ్ జాబ్ అంటే ఇష్టం...ఏదో ఒక ఉద్యోగం చేయడం అని కాకుండా టఫ్ జాబ్ చేయడం అంటే మొదటి నుంచి నాకు ఆసక్తి. ఇప్పుడు నా ఉత్సాహానికి తగిన పని దొరికింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో రెస్క్యూ శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణ మాకు భవిష్యత్లో ఎంతగానో ఉపకరిస్తుంది. – ఎం.లిఖిత, భూపాల్పల్లిఆత్మస్థైర్యం పెంచేలా...మహిళ మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రెయినీలు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. రెస్క్యూ బ్రిగేడియర్ శిక్షణ మాలో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు తోటివారికి సహాయ పడేలా చేస్తోంది.– అల్లం నవ్యశ్రీ, ఎంజీటీ, జీడీకే–11 (చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!)

సైలెంట్ డీ హైడ్రేషన్..! హెచ్చరిస్తున్న వైద్యులు
‘మీకు డీహైడ్రేషన్ సమస్య ఉంది.. అనగానే చాలా మంది ‘నేను బాగానే నీరు తాగుతున్నా కదా అంటారు అయితే అది కొందరి అపోహ. నీరు మాత్రమే తాగితే సరిపోదు అని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు ఆలివ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ డా.అబ్దుల్ మజిద్ ఖాన్. నగరంలో వాతావరణ మార్పులకు అతీతంగా వేధిస్తున్న డీహైడ్రేషన్ సమస్య గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఎండలు మండే సీజన్లో డీహైడ్రేషన్ సమస్య గురించి తరచూ చర్చిస్తుండటం సహజం.. అయితే కాలాలకు అతీతంగా ఈ డీహైడ్రేషన్కు గురయ్యే వారి సంఖ్య ఎక్కువే ఉంటోంది అంటున్నారు భాగ్యనగరం వైద్యులు. దీనికి కారణాల్లో తగినంత నీరు తాగకపోవడం ప్రధాన కారణమైతే.. విభిన్న రకాల జీవనశైలి అలవాట్లు కూడా మరో కారణంగా చెబుతున్నారు. టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలతో పాటు ఎనర్జీ డ్రింక్స్ కూడా శరీరంలో ద్రవనష్టాలకు కారణంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ సిటిజనుల్ని సైలెంట్ డీహైడ్రేషన్కి గురిచేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు సైతం డీహైడ్రేషన్ ముప్పును తెస్తున్నాయన్నారు. నీరు తాగితే చాలదు.. హైడ్రేషన్ అంటే కోల్పోయిన నీటిని పొందడం మాత్రమే అనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే శరీరం ద్రవాలను మాత్రమే కాకుండా, మరిన్నింటిని కూడా పునరుద్ధరించాల్సి ఉంటుందని అంటున్నారు వైద్యులు. దీనినే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రొలైట్స్, ఎనర్జీ(ఎఫ్ఇఇ) ఈక్వేషన్ అని పిలుస్తారు. ఉక్కపోత నుంచి అతి వ్యాయమం వరకూ.. వీటి వల్ల శరీరం సోడియం, పొటాషియం, మెగ్నిషియం మొదలైన ఎలక్ట్రోలైట్లను గ్లూకోజ్ను కోల్పోతుంది. గుండె లయ, నరాల సంకేతాలు, కండరాల కదలిక మానసిక ఆరోగ్యానికి కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే కేవలం కోల్పోయిన నీటి భర్తీ వల్ల ఈ సమతుల్యత పునరుద్ధరించడం జరగదు. సాదా నీటిపై మాత్రమే ఆధారపడి ఊరుకుంటే సమస్య మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. ఆహారమూ కీలకమే.. మన ఆహారంలో తరచూ ఊరగాయలు, పాపడ్స్ ఉప్పగా ఉండే స్నాక్స్ ఉంటాయి. అవి కూడా ద్రవనష్టానికి దారి తీస్తాయి. కండరాల సంకోచాలు, నరాల పనితీరు హైడ్రేషన్ను నియంత్రించడానికి కీలకమైన ఖనిజం పొటాషియం. మన దేశంలో పోషకాహార ధోరణులపై జరిపిన అధ్యయనం ప్రకారం, ప్రతి ఐదుగురిలో ఒకరికి పొటాషియం లోపం ఉంది. వేసవిలో పొటాషియం, సోడియం అసమతుల్యత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అరటిపండ్లు, ఆకుకూరలు, పప్పులు, నారింజ లేత కొబ్బరి వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను అత్యంత తక్కువగా తీసుకుంటారు. ఐసిఎంఆర్ ప్రకారం, ఈ ఆహారాలు మన ఉత్తమ సహజ వనరులు అని గుర్తించింది. సూచనలు: ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ గ్లూకోజ్. మూడింటి మేళవింపుగా లభించే రెడీ–టు–డ్రింక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ ఆదరణ పొందుతున్నాయి. సరైనవి ఎంచుకోవచ్చు. డీహైడ్రేటింగ్కు కారణమయ్యే టీ, కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు, అలాగే ఆల్కహాల్, ఎరేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించండి. డీహైడ్రేషన్ వల్ల కండరాల తిమ్మిరి, నోరు పొడిబారడం, తలనొప్పి, అలసట లేదా మైకం లాంటివి కలుగుతుంటే విస్మరించవద్దు. వెంటనే లవణాలు గ్లూకోజ్ రెండింటినీ కలిగి ఉన్న హైడ్రేషన్ ద్రావణాన్ని తీసుకోండి విరేచనాలు వంటి తీవ్ర లక్షణాలు లేకుండానే శరీరాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని నిశ్శబ్ద డీహైడ్రేషన్ అని పిలుస్తారు.– డా.అబ్దుల్ మజిద్ ఖాన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఆలివ్ హాస్పిటల్ (చదవండి: '4ఏ మోడల్'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఇరాన్పై దాడి ప్లాన్కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్ణణలు నేటికి (గురువారం) ఏడవ రోజుకు చేరాయి. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి విషయంలో అమెరికా ప్రమేయం ఉంటుందా లేదా అనే దానిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాటవేత సమాధానమిచ్చారు. వైట్ హౌస్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇజ్రాయెల్కు మద్దతు పలకాలా? వద్దా అనే దానిపై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. ‘నేను అలా చేయవచ్చు. అలా చేయకపోవచ్చు... నేను ఏమి చేయబోతున్నానో ఎవరికీ తెలియదు’ అని ఆయన అన్నారు. ఇరాన్ అధికారులు తమతో సమావేశం అయ్యేందుకు వాషింగ్టన్కు రావాలని అనుకుంటున్నారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పౌర ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తుందని హామీ ఇచ్చేలా ఒప్పించే లక్ష్యంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ విదేశాంగ మంత్రులు శుక్రవారం జెనీవాలో సమావేశం కానున్నారని జర్మన్ దౌత్య వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ విధమైన దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో టెహ్రాన్(ఇరాన్)కు చెందిన కొంతమంది ప్రజలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుండి రక్షణ కోరుతూ నగరం వెలుపల రహదారులను దిగ్బంధించారు.ఇరాన్పై దాడి ప్రణాళికలను తాను ఆమోదించానని ట్రంప్ తన సీనియర్ సహాయకులకు చెప్పారని, కానీ టెహ్రాన్ (ఇరాన్) తన అణు కార్యక్రమాన్ని విరమించుకుంటుందో లేదో వేచిచూసే నేపధ్యంలో తుది ఆదేశం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా ఇరాన్ ప్రభుత్వం పడిపోతుందని మీరు అనుకుంటున్నారా? అని ట్రంప్ను అడిగినప్పుడు ఖచ్చితంగా జరగవచ్చని అన్నారు. ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, తాము అటువంటి పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నామని, అయితే తాము ఆ పని చేయబోతున్నామనే అర్థం దీనిలో లేదన్నారు.ఇదిలావుండగా, ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ టెలివిజన్లో ప్రసారమైన రికార్డెడ్ ప్రసంగంలో.. ఈ ఘర్షణల్లో యూఎస్ సైనిక జోక్యం.. నిస్సందేహంగా కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని అమెరికన్లు తెలుసుకోవాలని, ఇరాన్ దేనికీ తలొగ్గదని స్పష్టం చేశారు. కాగా ఇజ్రాయెల్ తమ వైమానిక దళం జరిపిన తాజా దాడులలో ఇరాన్ పోలీసు ప్రధాన కార్యాలయం ధ్వంసం అయినట్లు తెలిపింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా

నిండుకుంటున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు
టెల్ అవీవ్: ఇరాన్పై యుద్ధంలో తమపై పైచేయి అవుతోందని, ఇరాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ పదేపదే చెప్పుకుంటోంది. కానీ, యుద్ధాన్ని కొనసాగించడానికి కావాల్సిన సాధన సంపత్తి రోజురోజుకీ తరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ క్షిపణులను నేలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్రేంజ్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది. ఇజ్రాయెల్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు తగినంతగా లేవని అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది. గత ఆరు రోజులుగా ఇరుదేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్పై దాదాపు 400 బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించింది. వీటిలో చాలావరకు మిస్సైళ్లను ఇజ్రాయెల్ సైన్యం మధ్యలోనే కూల్చివేసింది. ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఇంకా 1,600 ఉన్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ, వాటన్నింటినీ కూల్చే ఇంటర్సెప్టర్లు ఇజ్రాయెల్ వద్ద లేవు. అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు తేల్చిచెబు తున్నారు. ఇప్పుడున్న సిస్టమ్స్ మరో 10 నుంచి 12 రోజు ల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.

మధ్యవర్తిత్వం మాటే లేదు
కననాస్కీస్(కెనడా): ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన పరస్పర సైనిక చర్యల ముగింపు పర్వంలో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పాక్తో పోరులో శాంతిస్థాపన కోసం తానే చొరవ తీసుకుని ఇరుదేశాల మధ్య ఆపానని ట్రంప్ పదేపదే ప్రకటించుకోవడం, అమెరికా జోక్యంపై విపక్షాలు దుమ్మెత్తిపోసిన నేపథ్యంలో ట్రంప్తో మోదీ మాట్లాడటం విశేషం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్తో మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి. అత్యవసరంగా, అర్ధంతరంగా జీ7 భేటీ నుంచి ట్రంప్ నిష్క్రమించిన నేపథ్యంలో ట్రంప్తో మోదీ మంగళవారం ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ట్రంప్తో మోదీ సంభాషణ వివరాలను మిస్రీ మీడియాకు వెల్లడించారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తర్వాత వెనువెంటనే భారత్, పాక్ మధ్య మొదలైన పరస్పర కాల్పుల ఉదంతంలో ఇరుదేశాల మిలిటరీ విభాగాల చర్చల తర్వాత దాడులు ఆగాయి. ఇందులో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదు. అయినా మూడోవర్గం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు. పాకిస్తాన్ అభ్యర్థించడం వల్లే భారత్ కాల్పుల విరమణకు ఒçప్పుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఇకపై పరోక్ష యుద్ధంగానే భావించబోం. ప్రత్యక్ష యుద్ధంగానే భావిస్తాం’’ అని ట్రంప్కు మోదీ స్పష్టంచేశారు.వాణిజ్య అంశాల ఊసేలేదుయుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యాన్ని ఆపేస్తానని భారత్ను ట్రంప్ బెదిరించారని వచ్చిన వార్తలపై మోదీ ట్రంప్కు స్పష్టతనిచ్చారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో అమెరికా అస్సలు జోక్యంచేసుకోలేదు. భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన కూడా అందలేదు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా, ఏ స్థాయిలోనూ భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలు ప్రస్తావన అస్సలు లేదు. భారత్ ఇంతకుముందుగానీ ఇకమీదటగానీ మధ్యవర్తిత్వాన్ని ఏ రకంగానూ అంగీకరించే ఆస్కారంలేదు. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా భారత్లో ఏకాభిప్రాయం ఉంది. మే9వ తేదీ రాత్రి మీ దేశ ఉపాద్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్చేశారు. పాకిస్తాన్ ప్రతిదాడులకు సంసిద్ధ్దమవుతోందని నాతో అన్నారు. అదే నిజమైతే పాక్కు కనీవినీ ఎరుగని రీతిలో బుద్ధిచెప్తామని స్పష్టంచేశా. మే 9 అర్ధరాత్రిదాటాక పాకిస్తాన్లోని కీలక సైనిక, వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులుచేసి నాశనం చేశాం. మా దాడుల్లో వాళ్ల సైనిక ఎయిర్బేస్లు బద్దలయ్యాయి. నిరుపయోగంగా మారాయి. దీంతో దిక్కుతోచక మాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్లే తొలుత అభ్యర్థించారు’’ అని ట్రంప్తో మోదీ చెప్పారు.అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్35 నిమిషాలకుపైగా జరిగిన ఈ టెలిఫోన్ సంభాషణలో చివర్లో మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు ముగిశాక తిరుగు ప్రయాణంలో అమెరికాకు వచ్చిపోవాలని మోదీని ట్రంప్ కోరారు. క్రొయేషియాలో పర్యటించాల్సి ఉన్నందున అమెరికాలో పర్యటించడం కుదరదని ట్రంప్కు మోదీ సుతిమెత్తగా చెప్పి అభ్యర్థనను తిరస్కరించారు.

పాత్రికేయుల ఎదుటే పౌరునిపై పోలీసు కాల్పులు
నైరోబీ: పోలీసుయంత్రాంగం కొన్ని దేశాల్లో కారాగారాలను నరకానికి నఖలుగా మార్చేస్తుంటే మరికొన్ని దేశాల్లో పోలీసులు యమునికి ప్రతిరూపాలు గా అవతరిస్తు న్నారు. కొట్టే అధికారం ఉందనే గర్వంతో లాఠీలతోపాటు తూటాలకూ పనిచెప్పిన ఓ పోలీసు ఉదంతం ఇప్పుడు కెన్యాలో వివాదమైంది. పాత్రికేయుల ఎదుటే ఒక పౌరునిపై పోలీస్ అధికారి అన్యాయంగా తుపాకీ గురిపెట్టిన కాల్చిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. మంగళవారం నైరోబీలోని అత్యంత రద్దీగా ఉన్న ఒక రహదారిలో నిరసన ర్యాలీ జరిగింది. జూన్ ఆరో తేదీన ఆల్బర్ట్ ఒజ్వాంగ్ అనే బ్లాగర్ను పోలీసులు లాకప్డెత్ చేశారు. పోలీసుపై తప్పుడు కథనం రాశాడని అరెస్ట్చేసి పట్టుకొచ్చి చితకబాదడంతో అతను లాకప్లో కన్నుమూశాడు. సంబంధిత పోలీసులను అరెస్ట్చేయాలంటూ బుధవారం నైరోబీలో నిరసనర్యాలీ జరిగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్చేశారు. అదేసమయానికి మాస్క్లను అమ్ముకునే 22 ఏళ్ల వీధి వ్యాపారి బొనిఫేస్ కరియుకీ అటుగా వచ్చాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఇద్దరు సాయుధ పోలీసులు హెచ్చరించారు. ఉద్యమకారులతో తనకేం సంబంధంలేదని వివరణ ఇచ్చేలోపే ఒక పోలీసు ఇతని తలకు తుపాకీ గురిపెట్టి కాల్చాడు. దీంతో రక్తమోడుతూ కరియుకీ కుప్పకూలాడు. జర్నలిస్టుల ఎదుటే ఈ దారుణం జరిగింది. అదృష్టవశాత్తు అతడికి వెంటనే శస్త్రచికిత్సచేసి బుల్లెట్ను తీసేయడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్సపొందుతున్నాడు. విషయం తెల్సి ఆందోళనకారులు మళ్లీ నిరసనచేపట్టారు. దీంతో చివరకు ఆ అధికారిని అరెస్ట్చేశామని పోలీస్విభాగం ఒక ప్రకటన విడుదలచేసింది.
జాతీయం

న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ
సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్లో జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్లో ఉన్న స్టో రూమ్లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధికారిక నివాసం…” పేజీ 59లో: “... స్టోరుమ్లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వచ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని సదరు వ్యక్తి త్రిసభ్య కమిటీకి చెప్పారు. కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్దమొత్తంలో స్టోరూంలో లభ్యమవ్వడంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదికలో ప్రస్తావించింది.జస్టిస్ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా కమిటీ విచారించింది. విచారణలో ఈ ఇద్దరూ స్టోరూంలో నగదు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అగ్నిమాపక సిబ్బందిని కోరినట్లు తేలింది.దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిస్ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు. సుప్రీం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్ను సభ్యులుగా ఉన్నారు.

యోగా జిల్లాగా మైసూరు?.. ఘనత ఇదే..
మైసూరు: కర్నాటకలోని మైసూరు అటు సాంస్కృతిక, ఇటు ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రంగా విలసిల్లుతోంది. ఇప్పుడు ఈ పట్టణం మరో ఖ్యాతిని కూడా దక్కించుకోనుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మైసూర్ను దేశంలోని మొట్టమొదటి ‘యోగా జిల్లా’గా మార్చాలని కోరుతూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఒక ప్రతిపాదన పంపింది.2024లో ఆయుష్ అధికారుల బృందం నిర్వహించిన సర్వేలో మైసూర్ జిల్లాలోని 50 శాతం కుటుంబాలు క్రమం తప్పకుండా యోగాను అభ్యసిస్తున్నాయని వెల్లడయ్యింది. మైసూర్ శక్తివంతమైన వెల్నెస్ వ్యవస్థను కలిగి ఉంది. కర్ణాటకలోని 326 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో 22 ఒక్క మైసూర్లోనే ఉన్నాయి. వీటిలో శిక్షణ పొందిన యోగాచార్యులు ఉన్నారు. జిల్లాలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం, ప్రకృతి వైద్య కళాశాలలు, పంచకర్మ కేంద్రాలు, యోగా కేంద్రాలు కూడా ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభ్యాసకులకు మైసూర్ ఇష్టమైన ప్రాంతంగా మారింది. ఈ నగరంలో ప్రతియేటా 25 వేల మంది విదేశీయులు యోగాను నేర్చుకుంటున్నారు. అంతేకాకుండా మైసూరులో 600 సర్టిఫైడ్ యోగా శిక్షణ సంస్థలున్నాయి. మైసూరును అధికారికంగా యోగా జిల్లాగా ప్రకటిస్తే, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. ఇది కూడా చదవండి: రాహుల్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

రాహుల్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఈరోజు(జూన్ 19) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతకు ఆయన ‘ఎక్స్’లో అందించిన ఒక సందేశంలో రాహుల్ దీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. Birthday greetings to the Leader of the Opposition in the Lok Sabha, Shri Rahul Gandhi. May he be blessed with a long and healthy life.@RahulGandhi— Narendra Modi (@narendramodi) June 19, 2025రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర అగ్ర నేతలు కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.సోషల్ మీడియాప్లాట్ఫారం ‘ఎక్స్’లో సింగ్ ఇలా రాశారు, ‘లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అనిరాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా కాంగ్రెస్ నేత రాహుల్కు శుభాకాంక్షలు తెలిపారు. తన ఆదర్శ సోదరుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ తమ నేత పుట్టినరోజు సందర్భంగా న్యూఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. అయితే బీజేపీ ఈ మేళాను ప్రచార స్టంట్గా అభివర్ణించింది.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..

‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
మీరట్: మధ్యప్రదేశ్లోని మీరట్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్లు వివాహమయ్యాక హనీమూన్ కోసం మేఘాలకు వెళ్లారు. అక్కడ వారిద్దరూ అదృశ్యమయ్యారు. కొద్దిరోజులకు ఒక లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమయ్యింది. ఇంతలో సోనమ్ తాను భర్తను హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయింది. పోలీసుల దర్యాప్తులో సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా హస్తం ఈ హత్య కేసులో ఉందని తేలింది. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.సోనమ్ తన వివాహానికి ముందు, ఆ తరువాత సంజయ్ వర్మ అనే వ్యక్తికి 200 కి పైగా కాల్స్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో సోనమ్కు సంజయ్ వర్మతోనూ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసులు.. సంజయ్ వర్మ మరెవరో కాదని, సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని తేల్చారు. సోనమ్.. రాజ్ నంబర్ను ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్ చేసింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు అలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్, సంజయ్ల మధ్య 39 రోజుల వ్యవధిలో 239 కాల్స్ నడిచాయి. అయితే సంజయ్ మొబైల్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా సోనమ్ సోదరుడు గోవింద్ తనకు సంజయ్ అనే వ్యక్తితో పరిచయం లేదన్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్ విద్యార్థుల ఆగ్రహం
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.

మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్కౌంటర్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అరుణ అలియాస్ అరుణక్క..వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రిఅగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్రగాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్కౌంటర్పై అనుమానాలు.. నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్

ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
వర్గల్(గజ్వేల్): తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమ జంట బలవన్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మంగళవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో చోటుచేసుకున్నది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్కల ఆంజనేయులు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కల్పన(18) ఉంది. కల్పన ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి మల్లేశం, మంజుల దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శివకుమార్ (21) ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన కల్పన, శివకుమార్ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కుటుంబీకులు వారి ప్రేమను అంగీకరించలేదు. మరోవైపు కూతురు వివాహం కోసం సంబంధం కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో తమ ప్రేమ విఫలమైందని కల్పన, శివకుమార్ మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం ఉదయం శివకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే కల్పన తన ఇంట్లో పైకప్పు పైపునకు చున్నీతో ఉరివేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.

కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం.