ప్రధాన వార్తలు

మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? కమ్మవారు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా? చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే.. వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్ చేయడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇలా చేయడం కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు? ఏం పాపం చేశారని మా పార్టీలో ఉన్న కమ్మ వారిపై తప్పుడు కేసులు పెట్టారు?సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సంక్షేమాభివృద్ధి అన్నది పక్కకుపోయి రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా కక్ష సాధింపు మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. పోలింగ్ రోజు నుంచే రెడ్బుక్ రూల్ అమలవుతోందని చెప్పడానికి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీలో కమ్మ కులస్తులు ఉండటం తప్పా? ఏం పాపం చేశారని వైఎస్సార్సీపీలోని కమ్మ నేతలను వేధిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. కమ్మవాళ్లు పుట్టింది మీకు ఊడిగం చేయడానికా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తామని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపులునా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న (కొర్లకుంట వెంకటేశ్వరరావు) సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మా పార్టీ నాయకుడు. ఈయన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్కు ముందు టీడీపీ నేతలు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నది ఈ గ్రామంలో కనిపిస్తుంది. 2024 జూన్ 4న అంటే కౌంటింగ్ రోజున.. అల్లర్లు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్కు తీసుకుపోయి సెల్లో వేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడం మొదలు కాగానే, నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. అక్కడ పోలీస్ స్టేషన్లో నాగమల్లేశ్వరరావును సీఐ రాజేష్ తీవ్రంగా బెదిరించారు. ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచి పెట్టాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్న్ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్ 4న కౌంటింగ్ పూర్తయినా, మర్నాడు 5వ తేదీ సాయంత్రం వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. చేయని నేరాలన్నీ మోపారు. ఆ రోజు రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్చేసి, స్టేషన్లో పోలీసుల బెదిరింపులు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకు నాగమల్లేశ్వరరావును ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్ 9న చనిపోయాడు.దీనికి బాధ్యులెవరు?నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. మరి దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారిలో ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు? అని అడుగుతున్నా. ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇక్కడ యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న కోర్టు ద్వారా ప్రైవేటు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు.చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్కు పిలిచిన సీఐ, ఎస్ఐలు ఇద్దరూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచి పెట్టారు. మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హనుమంతరావు ఆయన్ను స్టేషన్కు పిలిపించి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కుల ఉన్మాది. ‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’ అని నేను ఆ డీఎస్పీని అడుగుతున్నా. లక్ష్మీనారాయణను స్టేషన్కు పిలిచిన డీఎస్పీ హనుమంతరావు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైఎస్సార్సీపీలో ఎలా ఉన్నావ్? ఎందుకు ఉన్నావ్?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. తప్పుడు సాక్ష్యాలతో జైలుకు పంపుతానని కూడా బెదిరించి, లెంపకాయలు వేసి కొట్టి అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ సెల్ఫీ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. పోలీసు శాఖలో కొందరు ఏ రకమైన కుల ఉన్మాదంతో పని చేస్తున్నారో.. వారిని చంద్రబాబు, లోకేశ్ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారనేది సూసైడ్ అటెంప్ట్ వీడియోలో స్పష్టంగా చెప్పారు.సత్తెనపల్లిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం అసలు వారంతా ఏం పాపం చేశారు?⇒ మా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కమ్మ వారిని వేధిస్తారా? ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్ వస్తే.. వెంటనే ఇంకో కేసు పెడతారు.. మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది. వంశీ ఇంకా చంద్రబాబు శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీ మాజీ మంత్రి కొడాలి నానిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు? దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే ఆయనపై తొమ్మిది కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని దేవినేని అవినాష్ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒక్క కారణంతో అవినాష్పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా వెళ్లగొట్టేశారు. తనను కూడా బెదిరించి, తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ⇒ మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద ఎందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు? తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.⇒ మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్ పోసాని కృష్ణమురళిని నెల రోజులపాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు?⇒ మంగళగిరికి చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్కు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెల రోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్కుమార్ను దారుణంగా కొట్టి, చొక్కా విప్పించి లోకేశ్ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు?మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం⇒ ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం. మీరంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని మీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది.⇒ చంద్రబాబును ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. చంద్రబాబును వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా మొత్తం కలిసి చంద్రబాబును వెనకేసుకొస్తూ.. ఆయన్ను వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?⇒ సీఐ రాజేష్ మీద నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్బుక్ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది.

తిరోగమన‘మే’
సాక్షి, అమరావతి: ఈ ఏడాది మే నెలలోనూ రాష్ట్ర సంపద తిరోగమనంలోనే సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం గణనీయ ప్రగతి కనబరుస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెల వరకు కాగ్ వెల్లడించిన బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే జీఎస్టీతోపాటు ఆమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లోనే ఏకంగా రూ.22,505 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. జీఎస్టీ, అమ్మకం పన్ను తగ్గిపోతోందంటే ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోందనడానికి బలమైన సంకేతమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో వృద్ధి నమోదవుతుందని, లేదంటే ఆదాయం తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు వచ్చిన జీఎస్టీ ఆదాయం కన్నా.. ఈ ఏడాది మే నెల వరకు వచ్చిన ఆదాయం రూ.350 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను కూడా రూ.136 కోట్లు పడిపోయింది. పన్నేతర ఆదాయమూ రూ.49 కోట్లు తగ్గిపోయింది. కేంద్ర నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులూ ఏకంగా రూ.1300 కోట్లు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నా.. గ్రాంట్లను తీసుకురావడంలో విఫలమైంది. ఇతర రాష్ట్రాల్లో పెరుగుదల.. ఇక్కడ తగ్గుదల సాధారణంగా జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో ఏటా ఎంతో కొంత పెరుగుదల కనిపిస్తుంటుంది. అయితే ఈ ఏడాది ఎలాంటి విపత్కర పరిస్థితులు లేకున్నా.. జీఎస్టీ, పన్నుల ఆదాయం తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ రాబడి మిగతా రాష్ట్రాల్లో పెరుగుతుండగా రాష్ట్రంలో తగ్గుతోందని, దీనికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మరో పక్క ఈ ఏడాది ఏప్రిల్, మే రెండు నెలల్లోనే రూ.22,505 కోట్లు అప్పు తెచ్చినా.. మూలధన వ్యయం మే నెల వరకు రూ.2,242 కోట్లు మాత్రమే చేయడం కూడా ఆందోళన కలిగించే అంశమనే వాదన వినిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మేనెల వరకు విద్య, వైద్య, సంక్షేమం తదితర సామాజిక రంగాలపై చేసిన వ్యయంతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా రూ.6,184 కోట్లు తగ్గిపోయింది. సామాజిక రంగ వ్యయమూ సాధారణంగా గతం కన్నా పెరగాలి. అయితే అందుకు భిన్నంగా తగ్గిపోవడం గమనార్హం. సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు గత ఆర్థిక సంవత్సరం సంపద సృష్టించకపోగా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారు. ఈ ఆర్థిక సంవత్సరమూ రెండు నెలల్లోనే భారీగా అప్పులు చేశారు. ఇదే విషయాన్ని కాగ్ గణాంకాలూ స్పష్టం చేస్తున్నాయి.

ఉగ్రవాదులను పెంచిపోషించే దేశాలకు నిధులు,రుణాలా..?
కనానాస్కిస్: తమ పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాక్ పాలకులు ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లపై స్పందించకుండా కళ్లు మూసుకొని ఉంటే మానవత్వానికి ద్రోహం చేయడమే అవుతుందని తేలి్చచెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం కెనడాలో జీ7 కూటమి సదస్సులో ‘ఇంధన భద్రత’ అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్న పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి ప్రతి భారతీయుడి ఆత్మ, గుర్తింపు, గౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ముష్కర మూకలను అంతం చేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండొద్దని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పోషకులను, ఉగ్రవాద బాధితులను ఒకే గాటన కట్టడం, ఒకేలా పరిగణించడం ఏమిటని నిలదీశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా? ‘‘ఉగ్రవాదం మానవత్వానికి బద్ధశత్రువు. ప్రజాస్వామ్య విలువలు పాటించే అన్ని దేశాలనూ ఉగ్రవాదం వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాద భూతాన్ని సమూలంగా నాశనం చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. అన్ని దేశాలు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించగలం. దురదృష్టవశాత్తూ మా పొరుగుదేశం ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది. ప్రపంచ శాంతి, సౌభాగ్యాల కోసం.. ఉగ్రవాదులకు అండగా నిలిచే దేశాలను శిక్షించాలి. అలాంటి దేశాలను జవాబుదారీగా మార్చాలి. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు నిధులు, రుణాలు ఇచ్చి సత్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో మనం నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా? ఉగ్రవాదం మన ఇంటి తలుపు తట్టినప్పుడు మాత్రమే ఉగ్రవాదానికి అసలైన అర్థాన్ని తెలుసుకుంటామా? ఉగ్రవాదులను ఎగదోస్తున్న వారిని, ఉగ్రవాద బాధితులను ఒకేలా చూడడం ఏమిటి? మన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో నిర్ణయాత్మక చర్యలు అవసరం. ఇంధన భద్రత మన బాధ్యత భవిష్యత్తు తరాల కోసం ఇంధన భద్రత సాధించడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు. ఇంధన భద్రత సాధించడం కేవలం ప్రాధాన్యత మాత్రమే కాదు.. పౌరుల పట్ల మన బాధ్యత కూడా. ఇంధనం రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. కలిసి పనిచేయాలి. ‘నేనొక్కడినే కాదు.. మనమంతా’ అనే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు, అనిశి్చత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంధన సరఫరా లేక గ్లోబల్ సౌత్ దేశాలు నష్టపోవాల్సి వస్తోంది. వాటిపై అధిక భారం పడుతోంది. ఆయా దేశాల్లో ఆహార, ఇంధన, ఎరువులతోపాటు ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. తయారీ, రవాణా రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. కృత్రిమ మేధ(ఏఐ)ను ప్రపంచ సౌభాగ్యం కోసం ఒక శక్తిగా మార్చాలి. డీప్ఫేక్స్ పెద్ద ముప్పుగా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఏఐతో సృష్టించే కంటెంట్లో వాటర్మార్క్ ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. జీ7 దేశాల అధినేతలతో మోదీ చర్చలు కెనడాలో జీ7 సదస్సు సందర్భంగా కూటమి దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాదంపై పోరాటంతోపాటు ప్రపంచానికి ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే–మ్యూంగ్, ఫ్రాన్స్ అధినేత ఇమ్మానుయేల్ మాక్రాన్, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ పార్దో, జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డసిల్వా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ. యూరోపియన్ కౌన్నిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితరులతో మోదీ భేటీ అయ్యారు. క్రొయేషియా ప్రధాని ప్లెంకోవిచ్తో చర్చలు ప్రధాని మోదీ కెనడా పర్యటన ముగించుకొని బుధవారం క్రొయేషియా చేరుకున్నారు. జాగ్రెబ్ ఎయిర్పోర్టులో క్రొయేషియా ప్రధానమంత్రి అండ్రెజ్ ప్లెంకోవిచ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. క్రొయేషియాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత ప్రధానమంత్రి మోదీయే కావడం విశేషం. ట్విట్టర్లో పోరాటం సాగిస్తున్నారా? కెనడాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘‘ఈరోజుల్లో మీరు ట్విట్టర్లో పోరాటం సాగిస్తున్నారా? ట్విట్టర్లో మీరు చాలా చురుగ్గా ఉంటున్నారు’’ అని మాక్రాన్ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మాక్రాన్, మోదీ సైతం బిగ్గరగా నవ్వేశారు. ఇటీవల వియత్నాం పర్యటనకు వెళ్లినప్పుడు విమానం దిగే సమయంలో మాక్రాన్ను ఆయన భార్య బ్రిగెట్టా నెట్టివేసినట్లు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇలాంటివి జరిగేటప్పుడు తలుపులు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి అని మాక్రాన్కు సలహా ఇచ్చారు. ఈ ఉదంతాన్ని గుర్తుచేస్తూ మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. మోదీ–మాక్రాన్ సంభాషణ పట్ల సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మోదీ నవ్వుతూ మాట్లాతూనే మాక్రాన్కు గట్టిగా చురక అంటించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.అష్టమి ఉ.8.43 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.45 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.7.08 నుండి 8.39 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.43 వరకు, తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు, అమృతఘడియలు: సా.4.10 నుండి 5.38 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.32. మేషం... రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.వృషభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మిథునం.. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. శుభవార్తలు. ఆస్తి లాభం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనయోగం.కర్కాటకం.... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.సింహం.... ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అదనపు బా«ధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయాలు సందర్శిస్తారు.కన్య.... ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.తుల... బంధువులతో సఖ్యత. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు. గృహ, వాహనయోగాలు.వృశ్చికం.. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ధనుస్సు.. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.మకరం... పనుల్లో విజయం. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.కుంభం... దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు.మీనం... శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.

కేసీఆర్ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీలకి మించి నీళ్లు అవసరం. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు చర్చించుకుని నీళ్లను వాడుకోవాలని 2016 సెపె్టంబర్ 21న అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది కేసీఆరే. ఆ నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఆయనే. కేసీఆర్ సూచన నుంచే గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్లో కేసీఆర్ చేసిన సూచనలను రికార్డు చేశారని, ఆ మినట్స్ కాపీని ఎంపీలందరికీ అందజేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నికర జలాల వినియోగం పూర్తి కాకముందే మిగులు జలాల లభ్యతను ఎలా తేల్చుతారంటూ బీజేపీ ఎంపీ రఘునందర్రావు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిస్తూ కేసీఆర్పై ఆరోపణలు చేశారు. గోదావరి జలాల తరలింపే ఆ భేటీల లక్ష్యం ‘చంద్రబాబు, కేసీఆర్ మధ్య సమస్యలు రావడంతో 2016 తర్వాత 3 వేల టీఎంసీల మిగులు జలాల అంశం మరుగున పడిపోయింది. ఆ తర్వాత 2019 ఆగస్టులో నాటి ఏపీ సీఎం జగన్తో ప్రగతిభవన్లో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమై మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం అని ఆ సమావేశంలో కేసీఆర్ అన్నారు. కేసీఆర్, జగన్లు ప్రగతిభవన్లో నాలుగుసార్లు సమావేశమై గోదావరి జలాలను రాయలసీమకు తరలించుకోవడంపై చర్చలు జరిపారు. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించడమే నాటి సమావేశాల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తుతం ఏపీ చేపట్టింది. 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని అప్పట్లో కేసీఆర్, జగన్ మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నేరుగా 200 టీఎంసీలు, పరోక్షంగా 100 టీఎంసీలు కలిపి 300 టీఎంసీలను తరలిస్తామంటూ ఏపీ తాజాగా ప్రతిపాదించింది..’ అని రేవంత్ చెప్పారు. ఆ మినట్స్నే గుదిబండగా మార్చాలని ఏపీ చూస్తోంది.. రాయలసీమకు గోదావరి జలాల తరలింపునకు పెద్దన్నగా సహకరిస్తా అని నాడు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. దీనిపై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించి.. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు తరలించే ఉద్దేశంతో కేసీఆర్ ఆ ప్రతిపాదనలు చేశారని వివరణ ఇచ్చారు. బనకచర్లతో తెలంగాణ నష్టపోకుండా ప్రభుత్వానికి సహకరించడానికే తాము ఈ భేటీకి వచ్చామన్నారు. సీఎం జోక్యం చేసుకుని అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్లో ఉన్న అంశాలను మళ్లీ చదివి వినిపిస్తా అని అన్నారు. ‘గోదావరి నీళ్లను శ్రీశైలంలో వేయాలంటే తొలుత సాగర్లో వేయాల్సి ఉంటుంది. కానీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సాగర్లో వేయకుండా నీళ్లను నేరుగా తరలించుకుంటామని ఏపీ ప్రతిపాదించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్లో ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించిన తీసుకున్న నిర్ణయం ప్రకారమే బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ వాదిస్తోంది..’ అని చెప్పారు. దీంతో.. రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్న ఈ సమావేశం నుంచి తాము వాకౌట్ చేస్తున్నట్టు వద్దిరాజు ప్రకటించారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ నచ్చజెప్పబోగా, ‘పోనీయండి’ అంటూ సీఎం వారించారు. కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినందుకు మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టు ఉన్నాడని వ్యాఖ్యానించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్నే తెలంగాణకు గుదిబండగా మార్చడానికి ఏపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను 2015లో నాటి సీఎం కేసీఆర్ అంగీకరించడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. జూలైలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తాం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి టెక్నికల్, లీగల్, పొలిటికల్..మూడు మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గురువారం మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి అభ్యంతరం తెలుపుతామని అన్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఈ సమావేశానికి రాలేమని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాచారం ఇచ్చారని, వారిని సైతం సీఆర్ పాటిల్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. జూలైలో జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక, పర్యావరణ శాఖల మంత్రులను కలిసి అభ్యంతరాలు తెలియజేస్తామని వెల్లడించారు. రాజకీయ ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ అసదుద్దీన్ సూచించినట్టు జలవివాదాల్లో నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని చెప్పారు. పార్టీలకు అతీతంగా బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఎంపీలందరూ ఈ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని ప్రతిపాదించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిక్షించిన తర్వాతే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరదామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, సలహదారు ఆదిత్యనాథ్ దాస్లు ఎంపీలను సమన్వయం చేస్తారన్నారు. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఎంపీలందరికీ అందించాలని ఆదిత్యనాథ్ను ఆదేశించారు. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తాడంటూ విమర్శలు చేస్తున్నారని, నిరంతరం వెళ్లి సంప్రదింపులు చేస్తేనే ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని సీఎం అన్నారు. భవిష్యత్తులో సైతం కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, రఘురాం రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

భారత్లో మధ్యప్రాచ్యపు సెగలు
2025 జూన్ 12, 13 వేకువజాముల్లో ఇజ్రాయెల్ భారీ సైనిక చర్యకు తెరతీసింది. ఇరాన్ అణుశక్తి సదుపాయాల మీద దాడులు చేసింది. రెండు దేశాల నడుమ నెలల తరబడిగా సాగుతున్న ఉద్రిక్తత, ఈ ఘటనతో పెను యుద్ధంగా మారింది.దశాబ్దాల నుంచీ అపరిష్కృతంగా కొన సాగుతున్న భౌగోళిక రాజకీయ వైరాలు ఎంత దారుణంగా పరిణమిస్తాయో అంద రికీ అవగతమైంది. ఈ యుద్ధాలను ప్రజలు ప్రారంభించారా? లేదు! ఎవరెవరి అధికార దాహానికో వారు బలవుతున్నారు. ఇజ్రాయెల్ దాడి ఫలితంగా మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్ప దన్న అంచనాలతో బ్రెంట్ క్రూడ్ ధర భగ్గుమని బ్యారెల్ 116 డాలర్లకు చేరింది. కోవిడ్, ఉక్రెయిన్, ఎర్ర సముద్రం సంక్షోభాలతో విచ్ఛిన్నమై ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ప్రపంచ సరఫరా వ్యవస్థలు మరోసారి ఖంగుతిన్నాయి. ఇరాన్లోని హోర్మూజ్ జల సంధి హై–రిస్క్ యుద్ధక్షేత్రంలో ఉండటంతో, అంతర్జాతీయ చమురు సరఫరాలు 20 శాతం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో నౌకారవాణాపై బీమా చార్జీలు ఒక్కఉదుటున నాలుగు రెట్లు పెరిగాయి. మరోవైపు ఇన్వెస్టర్లు తమ నిధులను సురక్షితమైన బంగారం మార్కెట్లోకి తరలించడంతో, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు (31.1 గ్రాములు) 2,450 డాలర్ల రికార్డు ధర పలికింది. ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి.ఇండియా తప్పించుకోగలదా?అనేక వర్ధమాన దేశాలతో పాటు ఇండియా సైతం ఈ పరిణా మాల ప్రభావం నుంచి తప్పించుకోలేదు. ఇంధన, ఆహార ధరలు పెరుగుతాయి. ఉపాధి దెబ్బతింటుంది. కోట్ల మంది జీవితాలు మధ్య ప్రాచ్య ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నాయి. ఇండియా తన అవసరాల్లో రమారమి 85 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ధరల్లో కొద్ది పాటి తేడా వచ్చినా రూపాయి విలువ ఆటుపోట్లకు గురవుతుంది. గల్ఫ్ దేశాల్లో ఇంజి నీర్లు, నర్సులు, కార్మికులు, ప్రొఫెషనల్స్గా 90 లక్షల మంది భారతీ యులు పనిచేస్తున్నారు. వారి భద్రత ఇప్పుడు అపాయంలో పడింది. వారు ఏడాదికి 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే నిధులు స్వదే శానికి పంపిస్తున్నారు. ఎన్నో లక్షల కుటుంబాలు ఈ డబ్బుతోనే జీవనం సాగిస్తున్నాయి. ఇక, మధ్య ఆసియాను ఇండియాతో అనుసంధానం చేసే ఇరాన్ చాబహార్ పోర్టు కూడా యుద్ధ ప్రాంతంలోనే ఉంది. ఇండియాకు ఎంతో ముఖ్యమైన ఈ వాణిజ్య పోర్టు ప్రాజెక్టు నుంచి వైదొలగాల్సిందిగా ఇప్పుడు అమెరికా నుంచి ఒత్తిడి వస్తుంది. రెడ్ సీ, హోర్మూజ్ల ముట్టడి ముప్పు కూడా పొంచి ఉంది. 60 శాతం పైగా ఇండియా వర్తకం ఈ కారిడార్ల ద్వారానే జరుగుతోంది. దాడి, ప్రతిదాడుల దృష్ట్యా సరుకు రవాణాలో జాప్యం జరుగుతుంది. బీమా వ్యయాలు చకచకా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ వాణిజ్యం దెబ్బ తింటుంది. కరెన్సీ మార్కెట్ లోనూ అస్థిరత్వం చోటు చేసుకుంటుంది. డాలరుకు రూపాయి విలువ ఇప్పటికే 86 దాటింది. దీంతో మార్కెట్లో సరఫరా పెంచేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించాల్సి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తాయి. ఈ అంకెలకు అందని నష్టం మరొకటి ఉంది. అది లెక్కించడానికి అలవి కానిది. పెరిగే చమురు ధరల వెనుక, నౌకా రవాణాలో జాప్యం వెనుక ఎందరో సామాన్యుల ఇక్కట్లు దాగి ఉంటాయి. పూర్తిస్థాయి యుద్ధం కొనసాగితే అది ఒక ప్రాంతానికి పరి మితం కాదు. ప్రపంచ వ్యాప్త అస్థిరతకు నాంది పలుకుతుంది. మధ్యప్రాచ్యపు అగ్నిజ్వాలలు ఖండాంతర కార్పొరేట్ బోర్డు రూము ల్లోకి, కుటుంబాల డైనింగ్ టేబుల్స్ మీదకు, పాఠశాలల క్లాస్ రూముల్లోకి నాలుకలు జాపుతూ విస్తరిస్తాయి.నష్ట నివారణ చర్యలువాటి బారిన పడకుండా ఇండియా లోగడ రూపొందించుకున్న వ్యూహాలు, యంత్రాంగాలు ఎంతవరకు ఉపకరిస్తాయన్నది కీలకం. వీటిలో ముందుగా ప్రస్తావించాల్సింది ఇంధన కవచం. దేశంలోని 39 మిలియన్ బ్యారెళ్ల వ్యూహాత్మక రిజర్వుల నుంచి అవసరమైనప్పు డల్లా కొంత కొంత చమురును మార్కెట్లోకి విడుదల చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్వల్పకాలిక ధరల ఒడుదొడుకులను ఈ విధానంతో అధిగమించవచ్చు. గల్ఫ్ చమురు సరఫరా లోటు భర్తీ చేసేందుకు రష్యా, వెనిజులా, బ్రెజిల్, గయానా దేశాల నుంచి దిగు మతులను పెంచుతోంది. అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమై ఇంధన దిగుమతులకు డాలర్లకు కొరత ఏర్పడేట్లయితే, దాన్ని తట్టుకు నేందుకు వీలుగా ద్వైపాక్షిక చెల్లింపు(రూపాయిల్లో పేమెంటు) ఏర్పాట్లను పునః ప్రారంభిస్తోంది.ప్రవాసుల భద్రత మరో అంశం. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్ దేశాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవాసుల కోసం నిరంతరాయంగా పనిచేసే సహాయక కేంద్రాలను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితిలో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రణాళికలు రూపొందించి గల్ఫ్ ప్రభుత్వాల సహకారంతో వాటికి రిహార్సల్స్ చేస్తోంది. స్వదేశాలకు డబ్బు పంపించడానికి ఇబ్బంది లేకుండా యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు ఏర్పాట్లు జరిగాయి.దౌత్యపరంగా సున్నితమైన సమతుల్యతను ఇండియా పాటిస్తోంది. ఒమన్, యూఏఈ, సౌదీలతో తెరవెనుక దౌత్యం నెరపుతోంది. తక్షణం వైరాలకు స్వస్తి పలకాలని, ఉద్రిక్తతలను నివారించాలని, బేషరతు చర్చలు జరపాలని యూఎన్ సమావేశంలో పిలుపు నిచ్చింది. మరోవంక, ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో 16 యుద్ధనౌకలను సన్నద్ధం చేసింది. గల్ఫ్ గస్తీలను పెంచింది. ప్రస్తుత ఘర్షణలు ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోకుండా సైబర్ ఇంటెలిజన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ద్రవ్యరంగంలో కరెన్సీ ఆటుపోట్లను నివారించేందుకు ఆర్బీఐ చేతిలో 643 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం జడలు విప్పకుండా కేంద్రం అదనపు ఆహార నిల్వలను విడుదల చేస్తోంది. ఎంఎస్ఎమ్ఈ ఎగుమతిదారు లకు ఇచ్చే ఎగుమతి ప్రోత్సాహకాలు, రుణహామీలు రెడ్ సీ బాధిత సంస్థలకూ వర్తింప చేస్తోంది. మన వ్యూహం ప్రస్తుత సైనిక ఘర్షణల సమయంలో ఇండియా ‘పవర్ ప్లేయర్’గా ఉండాలనుకోవడం లేదు. ఇంధన భద్రత, ప్రవాసుల క్షేమం, వర్తక మార్గాల రక్షణ... ఈ మూడు అంశాలకూ ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తోంది. దీనికోసం అనివార్యంగా ‘సంరక్షణాత్మక తటస్థత’ అనే సంక్లిష్ట వ్యూహం అనుసరించాల్సి వస్తోంది. జూన్ 2025 ఒక సంక్షుభిత దశాబ్దాన్ని వినాశకరమైన మలుపు తిప్పింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయలపై జరిగిన దాడి, ఇరాన్ ప్రతీకార దాడుల ఫలితంగా మధ్యప్రాచ్యం అంతటా దీర్ఘకాలిక అస్థి రత నెలకొంటుంది. ఇండియా విషయానికి వస్తే, ఈ పరిణామాన్ని విదేశాంగ విధానానికి సవాలుగా మాత్రమే పరిగణించలేము. వ్యూహా త్మక పరిపక్వతకు, ఆర్థిక పటుత్వానికి, నైతిక స్థైర్యానికి ఇది ఒక పరీక్ష లాంటిది. మనం అప్రమత్తంగా ఉంటూ, మధ్యప్రాచ్యంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలని, మనకు చేరువలోనే కాలి బూడిదవుతున్న ఈ ప్రాంతంలో తిరిగి వివేకం ఉదయించాలని కోరుకోవాలి.శైలేశ్ హరిభక్తి వ్యాసకర్త పారిశ్రామికవేత్త, పర్యావరణ కార్యకర్త(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)

జీ7 మేల్కొనదా?!
నానాటికీ మసకబారుతున్న ప్రతిష్ఠను కాస్తయినా పునరుద్ధరించుకోవాలన్న స్పృహ కూడా లేకుండా ఎప్పటిలా జీ7 రెండు రోజుల సమావేశాలు కెనడాలోని ఆల్బెర్టాలో పేలవంగా ముగిశాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అంతూ దరీ లేకుండా కొనసాగుతుండగా, తాజాగా ఇరాన్పై అమెరికా అండతో ఇజ్రాయెల్ దండెత్తింది. కానీ రెండు విషయాల్లోనూ తన వైఖరి ఎలావుండాలో, ఏం చేయాలో జీ7 తేల్చుకోలేకపోయింది. సమావేశాల ముగింపులో లాంఛనంగా విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన కరవైంది. ఏకపక్షంగా ఇరాన్పై దాడులకు దిగి పశ్చిమాసియాలో మరో మహాసంగ్రామానికి తెరలేపిన ఇజ్రాయెల్ను పల్లెత్తు మాట అనకుండా తప్పంతా ఇరాన్దేనని ఈ దేశాలు తేల్చాయి. ఆ యుద్ధం పర్యవసానాలు తమను సైతం చుట్టుముడతాయనీ, అమెరికా ఆ ఊబిలోకి దిగితే అది మరో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉన్నదనీ తెలిసినా కిక్కురుమనలేదు. ఇరాన్ను ఏదో ఒకటి అనకపోయినా... రష్యాను నిందించే ప్రయత్నం చేసినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఆగ్రహం కలుగుతుందన్న భయం జీ7 దేశాలను వెన్నాడింది. సమావేశాలకు ముందు బ్రిటన్, కెనడాలు రష్యాపై మరిన్ని ఆంక్షలుంటాయని ఆర్భాటంగా ప్రకటించాయి. కానీ ట్రంప్ తీరు చూశాక వాటికి నోరుపెగల్లేదు. గాజా విషయంలో ఇజ్రాయెల్ను తప్పుబట్టినట్టు కనబడుతూనే, ఇరాన్పై దండయాత్ర విషయంలో ఒక్క మాట అనలేకపోయాయి. అసలే జీ7 ‘నిన్నటి క్లబ్’ అని పేరుబడింది. ఆ అపకీర్తిని మరింత పెంచుకోవటానికే సభ్యదేశాలు పాటుపడుతున్నట్టు కనబడుతోంది!ఒకప్పుడు జీ7 మహా శక్తిమంతమైనది. 1980వ దశకంలో ప్రపంచ జీడీపీలో దాని వాటా ఏకంగా 70 శాతం. నిరుడు ఆ వాటా 30 శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంది. ఆర్థిక కార్యకలా పాలు పశ్చిమం నుంచి తూర్పు దిశకు వలసవచ్చి చాన్నాళ్లవుతోంది. ఈ పారిశ్రామిక దేశాలకు చైనా సవాలుగా నిలిచింది. ఆర్థికంగా బలపడుతోంది. ఆ దేశానికి జీ7లో చోటు లేదు. అటు రష్యాకు మధ్యలో కొన్నాళ్లు సభ్యత్వం ఇచ్చినా 2014లో క్రిమియాను దురాక్రమించటంతో వెళ్లగొట్టారు. మన దేశం సైతం ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అయినా పరిశీలక హోదాయే తప్ప సభ్యత్వం లేదు. ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక ప్రపంచ సంస్థలను అమెరికా చిన్నచూపు చూడటం మొదలైంది. భద్రతామండలికి విలువే లేకుండా పోయింది. తానే నిర్మించిన డబ్ల్యూటీవోను అమెరికా బేఖాతరు చేస్తోంది. ప్యారిస్ ఒప్పందం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికొచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఖాళీని భర్తీ చేయొచ్చన్న ఆలోచనగానీ, అందుకు తగిన ప్రణాళికలుగానీ జీ7 దగ్గర లేవు. ఎంతసేపూ అమెరికా తోకపట్టుకు పోవాలన్న ధోరణే. ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనకు ప్రధాన ఎజెండా అయిన వాణిజ్యంపై ధ్యాసలేదన్న సంగతి తెలుస్తుంది. సదస్సులో ఎక్కువసేపుంటే ఉక్రెయిన్ విషయంలో ఒత్తిడి తప్పదన్న భయం వల్లనో, ఇరాన్ సంగతి తేల్చాలన్న ఆవేశంతోనో ఆయన మధ్యలోనే నిష్క్రమించారు. వెళ్లేముందు రష్యా దురాక్రమణకు మీరే కారణమంటూ నిందించారు. తమ మాజీ అధ్యక్షుడు ఒబామా, అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్లు 2014లో రష్యాను జీ7నుంచి బయటకు నెట్టకపోతే ఇవాళ ఆయన సమావేశాల్లో ఉండేవారని, యుద్ధం ఆపటానికి ఒత్తిడి తెచ్చేవారమని నిష్ఠూరమాడారు. అసలు యుద్ధమే వచ్చి వుండేది కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందుకే, ఇక్కడ న్యాయానికి చోటులేదని గ్రహించారో ఏమో... ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం సమావేశాలకు మధ్యలోనే గుడ్బై చెప్పారు. నిరుడు జూన్లో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్కు 5,000 కోట్ల డాలర్ల రుణమిస్తామని తీర్మానించారు. దాని ప్రకారం నెలకు వంద కోట్లు ఉక్రెయిన్కు అందించాలి. కానీ ట్రంప్ రాకముందే డిసెంబర్లోనే అప్పటి అధ్యక్షుడు బైడెన్ దానికి కోత పెట్టారు. ఆయనొచ్చాక ఇక చెప్పేదేముంది? ఈ భారాన్ని ఇతర సభ్య దేశాలు మోస్తున్నాయి. నిజానికి, గత వైభవం మళ్లీ దక్కాలంటే జీ7 పరిపూర్తి చేయాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు తమ వంతు కృషి అవసరం. కృత్రిమ మేధ, క్వాంటమ్లకు కావాల్సిన అత్యంత కీలకమైన ఖనిజాల సరఫరా ఆటంకం లేకుండా చూసుకోవాలి. పటిష్ఠమైన మౌలిక సదుపాయాల కల్పనకూ, యువతకు భారీయెత్తున ఉద్యోగావకాశాలు వచ్చిపడే రంగాలపై దృష్టి సారించాలి. కానీ ఇవన్నీ సాకారం కావాలంటే యుద్ధాలు లేని ప్రపంచం ఉండాలి. మరి దానికోసం జీ7 చేసిందేమిటి? ఈ దేశాలన్నీ అమెరికా సాగించిన యుద్ధాల్లో భాగస్వాములుగా మారి చేజేతులా ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసుకున్నాయి. నిజానికి ఇజ్రాయెల్ను పూర్వంలా యూరప్ దేశాల్లో జనం వెనకేసుకు రావటం లేదు. ఇరాన్ అణ్వస్త్రం తయారు చేయటం అనర్థమన్న అభిప్రాయం ఉన్నా ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని ఒప్పించాలని మెజారిటీ జనం భావిస్తున్నట్టు సర్వేల్లో తేలింది. అయినా జీ7 దేశాలకు పట్టదు. మనవరకూ చూస్తే ఈ సదస్సు ఎంతో కొంత తోడ్పడిందని చెప్పాలి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత నేరుగా పారిశ్రామిక దేశాధినేతలందరినీ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తీరు గురించి, దానిపై చర్య తీసుకోక తప్పని పరిస్థితి గురించి వివరించగలిగారు. ఏదేమైనా ఇలాంటి సదస్సులు మొక్కుబడిగా, బాతాఖానీ క్లబ్లుగా మారితే ఫలితం ఉండదు. కనీసం వచ్చే సమావేశాల నాటికైనా జీ7 దేశాలు ఈ సంగతి గ్రహించాలి.

ప్రభుత్వ కుట్ర.. సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్రతో సిట్ సాగిస్తున్న అక్రమ కేసు పన్నాగం మరోసారి బట్టబయలైంది. పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికే ఆ కుట్రను మరోసారి బయటపెట్టింది. ఓ కానిస్టేబుల్ను ప్రలోభాలకు గురిచేసి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసి.. తాము చెప్పినట్టు వినని మరో కానిస్టేబుల్పై థర్డ్ డిగ్రీతో చిత్రహింసలు.. కేసే లేకుండా అక్రమంగా లుక్ అవుట్ నోటీసులు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. ఈసీ పరిధిలోని కేసు వక్రీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ అక్రమాలు, కుట్రలు అంతేలేకుండా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు ప్రభుత్వ పెద్దల కుట్రను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేష్నాయుడును సిట్ అధికారులు బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్ర, దర్యాప్తు ముసుగులో సిట్ అధికారుల కుతంత్రాన్ని చెవిరెడ్డి్డ, ఆయన తరఫు న్యాయవాదులు దుష్యంత్రెడ్డి, వాణి తదితరులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇది పక్కా రాజకీయ కుట్రతో పెట్టిన అక్రమ కేసేనని స్పష్టం చేశారు. ‘సత్యమేవ జయతే’ అని నినదిస్తూ..వాదనలు విన్న న్యాయస్థానం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు జూలై 1 వరకు రిమాండ్ విధించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి జైలులో పరుపు, దిండు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అనంతరం వారిద్దరిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైలుకు వెళుతూ చెవిరెడ్డి ‘సత్యమేవ జయతే.. న్యాయపోరాటం చేస్తాం.. అక్రమ కేసును ఎదుర్కొంటాం.. దేవుడి ఆశీస్సులు, పార్టీ అధినేత మద్దతు మాకు ఉంది’ అని నినదించారు. గన్మెన్కు ప్రమోషన్ ప్రలోభం.. అబద్ధపు వాంగ్మూలంచెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పనిచేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ను బెదిరించి, ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం కుట్ర తీవ్రతను బయటపెడుతోంది. అందుకోసమే కానిస్టేబుల్ గిరిని సిట్ అధికారులు తెరపైకి తెచ్చారు. దాదాపు 10 నెలలుగా సాగుతున్న ఈ అక్రమ కేసులో ఇప్పటివరకు ఆయన ప్రస్తావనే లేదు. కానీ.. హఠాత్తుగా తెరపైకి తెచ్చి ఆయనే కీలక సాక్షి అంటూ నమ్మించేందుకు సిట్ యత్నించింది. ఈ విధంగా ప్రతీసారి ఓ కొత్త పాత్రను ప్రవేశపెట్టి తమ కుట్రకు మరింత పదును పెట్టడం సిట్కు అలవాటుగా మారింది. అందుకోసం సిట్ అధికారులు పక్కా పన్నాగంతో వ్యవహరించారు. కానిస్టేబుల్ గిరిని వారం రోజులపాటు సిట్ అధికారులు తమ అదుపులో ఉంచుకుని బెదిరించారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయన్ను కూడా ఈ కేసులో నిందితుడుగా చేరుస్తామని.. సస్పెండ్ చేయిస్తామని.. జైలుకు పంపుతామని బెదిరించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే జీతం పెంపుదలతోపాటు కోరుకున్న విభాగంలో పోస్టింగ్ ఇస్తామని ప్రలోభపెట్టారు. దాంతో గిరి సమ్మతించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పడంతో హైదరాబాద్ నుంచి నగదును వాహనంలో ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారు. తాము చెప్పినట్టు చేసిన గిరికి వెంటనే 60శాతం జీతం పెంపుదలతో ఆయన కోరుకున్న ఆక్టోపస్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అంటే గిరి బెదిరింపులు, ప్రలోభాలకు గురయ్యే ఆ వాంగ్మూలం ఇచ్చినట్టు స్పష్టమైంది. కానిస్టేబుల్ గిరి చెప్పింది నిజమేనని భావిస్తే.. నగదు అక్రమంగా తరలింపునకు సహకరించిన ఆయన ఈ కేసులో నిందితుడు కావాలి. కానీ ఆయన్ను సిట్ అధికారులు సాక్షిగా ఎలా పేర్కొంటారని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. అక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగిని సాక్షిగా పేర్కొనడం సరికాదని.. నిందితుడిగానే పేర్కొనాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. ఆధారాలు లేవు.. సేకరించాల్సి ఉందన్న విచారణ అధికారిఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసు నమోదు చేసినట్టు సిట్ విచారణ అధికారే పరోక్షంగా అంగీకరించడం గమనార్హం. నగదు అక్రమంగా తరలించారని సిట్ చెబుతున్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కానిస్టేబుల్ గిరితో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా రికార్డు ఉందా అని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు విచారణ అధికారిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆ డేటా ఇంకా లేదని.. సేకరించాల్సి ఉందని విచారణ అధికారి చెప్పారు. అంటే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా సిట్ ఇప్పటివరకు కనీస ఆధారాలు కూడా సేకరించలేదని స్పష్టమైంది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం అక్రమమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. తుడా వాహనంపై కట్టుకథలుగత ఏడాది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ‘తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా)’ వాహనంలో నగదును అక్రమంగా తరలించారని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత తుడా వాహనం చైర్మన్ ఆధీనంలో ఉండదు. ప్రభుత్వ వాహనాలను రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉపయోగించడం నిషేధం. తుడా వాహనం ఆ సంస్థ వైస్ చైర్మన్గా ఉన్న ప్రభుత్వ అధికారి ఆధీనంలో ఉంది. కానీ ఆ వాహనంలో నగదును తరలించారని అభియోగం మోపడం పూర్తిగా కుట్ర పూరితమని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి కట్టబెడతామన్నారుఈ అక్రమ కేసులో సిట్ అరెస్టు చేసిన వెంకటేశ్నాయుడు న్యాయస్థానంలో అసలు కుట్రను వెల్లడించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తనను, తన భార్యను సిట్ అధికారులు తీవ్రంగా బెదిరించి, వేధించారని తెలిపారు. ఆయన చెబితే నగదును అక్రమంగా తరలించినట్టు అంగీకరించాలని వేధించారన్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే రూ.2 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తామని ప్రలోభపెట్టారని వెంకటేశ్నాయుడు వెల్లడించారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడానికి తాము సమ్మతించనందునే తనను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారని ఆయనన్యాయస్థానానికి నివేదించారు. ఈసీ కేసు వక్రీకరణ.. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనచెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్టు కోసం సిట్ ఏకంగా హైకోర్టు ఆదేశాలనే సిట్ ఉల్లంఘించింది. ఈసీ పరిధిలో ఉన్న కేసును వక్రీకరిస్తూ ఆయనపై నిరాధార అభియోగాలు నమోదు చేసింది. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) జప్తు చేసిన రూ.8.37 కోట్ల నగదు కేసును సిట్ అధికారులు వక్రీకరిస్తూ రిమాండ్ నివేదికలో పేర్కొనడమే అందుకు తార్కాణం. 2024 ఎన్నికల ముందు ఓ ప్రైవేటు సంస్థ హైదరాబాద్ నుంచి తీసుకు వస్తున్న రూ.8.37 కోట్ల నగదును పోలీసులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆ కేసును పర్యవేక్షిస్తోంది. కాగా.. ఆ నగదు తమ సంస్థకు చెందినదని అప్పట్లోనే తిరుపతిలోని ఈశా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఈసీకి తెలిపింది. ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి ఆ నగదుకు సంబంధించిన పూర్తి రికార్డులు, బ్యాంకు వోచర్లు, ఇతర ఆధారాలు సమర్పించారు. అంటే ఆ నగదు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు తరలిస్తోంది కాదని.. ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల కోసం అధికారికంగా తరలిస్తున్న పూర్తి వైట్మనీ అని నిర్ధారణ అయ్యింది. అందుకే ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ పేరిట వేధింపులకు పాల్పడకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కేసు విచారణ పేరిట ఆ సంస్థ ఎండీని గానీ, ఇతరులు ఎవర్నీగానీ పోలీస్ స్టేషన్కు పిలవవద్దని హైకోర్టు 2024 మే 31నే పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆ కేసు విషయాన్ని ఇతర కేసుల్లో కూడా ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయి. అయినా సరే హైకోర్టు ఆదేశాలను సిట్ అధికారులు ఉల్లంఘించడం విభ్రాంతి కలిగిస్తోంది. సిట్ అధికారులు మాత్రం ఎన్నికల ముందు జప్తు చేసిన ఆ నగదు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బు అంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించారు. అదే వక్రీకరణతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఆ ఈసీ కేసు వివరాలను ప్రస్తుత అక్రమ కేసుకు ముడిపెడుతూ నిరాధారణ ఆరోపణలు చేయడం సిట్ బరితెగింపునకు నిదర్శనమని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి నివేదించారు.కట్ అండ్ పేస్ట్ కుట్రేముందస్తు కుట్రతోనే అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నట్టు సిట్ మరోసారి తన రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడించింది. ప్రైవేటు వ్యాపారి అయిన వెంకటేశ్నాయుడును రిమాండ్ నివేదికలో ఐఏఎస్ అధికారి అని పేర్కొంది. గతంలో ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డిని అరెస్టు చేసినప్పటి రిమాండ్ నివేదికనే కాపీ పేస్టుచేసినట్టు బయటపడింది. ఆయనను ఐఏఎస్ అధికారిగా పేర్కొన్న సిట్ అధికారులు అదే నివేదికను కాపీ పేస్ట్ చేయడంతోనే వెంకటేశ్నాయుడు కూడా ఐఏఎస్ అధికారి అని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో వచ్చింది. ఈ కేసులో సిట్ కాపీ అండ్ పేస్ట్ కుట్ర బయటపడటం ఇది రెండోసారి కావడం గమనార్హం.సిట్ కార్యాలయంలో చెవిరెడ్డి విచారణవిజయవాడ స్పోర్ట్స్/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మద్యం విధానం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్నాయుడును సిట్ కార్యాలయంలో అధికారులు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారణ జరిపారు. ఈ స్కాం ద్వారా వచ్చిన నగదును 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఒంగోలుకు ఎలా తరలించారు?, ఎంత తరలించారు, ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డితో ఉన్న సంబంధాలు ఏమిటనే విషయాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఈ కేసులో తాజాగా నిందితులుగా చేర్చిన బాలాజీకుమార్ యాదవ్, నవీన్, హరీష్, మోహిత్రెడ్డి పాత్రపైనా విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూటమి అక్రమ కేసులు పెడుతోందికూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఆయనను తీసుకు రాగా.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నాపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. విచారణలో వారు చెప్పినట్టు సంతకం పెట్టమంటున్నారు. వారు చెప్పినట్టు నేనెందుకు సంతకం పెడతాను. నన్ను ఎప్పుడు రమ్మంటే అప్పుడు అందుబాటులో ఉంటా. నామీద ఏ కేసులు లేవు. ఇప్పుడు అన్యాయమైన, అధర్మమైన కేసులు పెడుతున్నారు’ అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్కు ఆస్కార్ అవార్డు
హాలీవుడ్ ప్రముఖ నటుడు–నిర్మాత టామ్ క్రూజ్ ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు అందుకోనున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పదిహేనేళ్లుగా ప్రతి ఏడాది గవర్నర్స్ అవార్డ్స్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. 16వ వార్షిక అవార్డు ప్రదానం ఈ ఏడాది నవంబరులో జరగనుంది. ఈసారి ఆస్కార్ గవర్నర్ అవార్డులను అందుకోనున్న వారి వివరాలను ఆస్కార్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. హాలీవుడ్ నటుడు–నిర్మాత టామ్ క్రూజ్తో పాటు అమెరికన్ నటి–దర్శక–నిర్మాత–కొరియోగ్రాఫర్ డెబ్బీ అల్లెన్, ప్రొడక్షన్ డిజైనర్ విన్ థామస్లు ఈ ఏడాది ఆస్కార్ గౌరవ పురస్కారా లను స్వీకరించనున్నారు. అలాగే అమెరికన్ గాయని–నటి–రచయిత– సంగీత దర్శకురాలు డాలీ పార్టన్కు జీన్ హెర్షోల్ట్ హ్యూమానిటేరియన్ అవార్డు లభించింది.సినిమా రంగంలో సుధీర్ఘమైన కెరీర్, సినిమాల పట్ల ఎంతో అంకితభావం చూపిన నలుగురు దిగ్గజ వ్యక్తులను ఈ ఏడాది ఆస్కార్ గవర్నర్స్ అవార్డ్స్తో సత్కరించనున్నాం’’ అని ఆస్కార్ అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యాంగ్ పేర్కొన్నారు. ఇక ఈ 16వ ఆస్కార్ గవర్నర్స్ అవార్డ్స్ వేడుక కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లో నవంబరు 16న జరగనుంది. ఇక ఇప్పటివరకు నాలుగు ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ దక్కించుకున్నప్పటికీ టామ్ క్రూజ్కు అవార్డు దక్కలేదు. ఫైనల్గా ‘అకాడమీ గౌరవ పురస్కారం’ దక్కుతున్నందుకు ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక 98వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.

నయా నంబర్ 4 గిల్
లీడ్స్: భారత టెస్టు క్రికెట్లో బ్యాటింగ్ ఆర్డర్కు సంబంధించి నాలుగో స్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ‘ఆల్టైమ్ గ్రేట్’ సచిన్ టెండూల్కర్ తన 200 టెస్టుల సుదీర్ఘ కెరీర్లో 179 టెస్టుల్లో నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. 1992లో సచిన్ ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ వరకు కొనసాగాడు. సచిన్ వీడ్కోలు పలికిన తర్వాత భారత్ ఆడిన తొలి టెస్టు నుంచే మరో దిగ్గజం విరాట్ కోహ్లి నాలుగో స్థానాన్ని భర్తీ చేశాడు. విరాట్ 99 టెస్టుల్లో ఆ స్థానంలో బరిలోకి దిగాడు. మిడిలార్డర్లో పదునైన బ్యాటింగ్తో టెస్టు మ్యాచ్ గమనాన్ని శాసించే అవకాశం ఉన్న ఈ స్థానంలోకి ఇప్పుడు కొత్త ఆటగాడు వస్తున్నాడు. ఇంగ్లండ్తో శుక్రవారం నుంచి జరిగే తొలి టెస్టులో కెప్టెన్ శుబ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయమైంది. టీమ్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ విషయాన్ని నిర్ధారించాడు. ‘బ్యాటింగ్ ఆర్డర్లో శుబ్మన్ నాలుగో స్థానంలో ఆడతాడు. నేను ఎప్పటిలాగే ఐదో స్థానంలోనే కొనసాగుతాను. అయితే మూడో స్థానం విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దానిపై చర్చిస్తున్నాం’ అని పంత్ వెల్లడించాడు.తనకూ, కెప్టెన్ గిల్కు మధ్య మైదానం బయట ఉన్న సాన్నిహిత్యం జట్టు సానుకూల ఫలితాలు రాబట్టేందుకు ఉపయోగపడుతుందని పంత్ వ్యాఖ్యానించాడు. ‘మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. సహజంగానే ఇది మైదానంలో కూడా ప్రతిఫలిస్తుంది. మేమిద్దరం బాగా కలిసిపోయి ఏ విషయాన్ని అయినా సౌకర్యవంతంగా చర్చించుకోగలం. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతున్నా’ అని అతను అన్నాడు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లాంటి దిగ్గజాలు దూరం కావడం ఇంగ్లండ్ జట్టుకు కూడా లోటే అని పంత్ అభిప్రాయపడ్డాడు. ‘అండర్సన్, బ్రాడ్ లేకపోవడం మాకు కాస్త ఊరట అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఏళ్లు వారు జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. గత రెండు సిరీస్లలో నేను వారిని ఎదుర్కొన్నాను. అయితే ప్రస్తుత ఇంగ్లండ్ బౌలింగ్ బృందం కూడా పదునుగా ఉంది. మేం ఎవరినీ తక్కువగా అంచనా వేయడం లేదు. పరిస్థితులను బట్టి వారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మా యువ ఆటగాళ్లూ సిద్ధంగా ఉన్నారు’ అని పంత్ వివరించాడు. కోహ్లితో తలపడాలనుకున్నా: స్టోక్స్తమతో ఆడే సిరీస్లో విరాట్ కోహ్లి లేకపోవడం అవమానకరంగా అనిపిస్తోందని ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. భారత్కు ఇది పెద్ద లోటని అతను అభిప్రాయపడ్డాడు. ‘మైదానంలో కోహ్లి ప్రదర్శించే పోరాటతత్వం, ఎలాగైనా గెలిచేందుకు పోటీ పడే శైలిని భారత్ కోల్పోయింది. 18 నంబర్ జెర్సీకి అతను ఒక స్థాయిని కల్పించాడు. ఇప్పుడు ఆ జెర్సీ మైదానంలో కనిపించదు. కోహ్లికి ప్రత్యర్థి గా తలపడాలని నేను ఎంతో కోరుకున్నాను. మైదానంలో పోటీపడే విషయం మా ఇద్దరి లక్షణాలు ఒకటే. నీతో ఆడే అవకాశం లేకపోవడం అవమానంగా భావిస్తున్నాను అని నేను కోహ్లికి మెసేజ్ పంపించా’ అని స్టోక్స్ వెల్లడించాడు. మరోవైపు భారత జట్టు ఈ సిరీస్ కోసం అన్ని విధాలుగా సన్నద్ధమై వచ్చిందని... తమకు గెలుపు అంత సులువు కాదని ఇంగ్లండ్ ప్రధాన బ్యాటర్ జో రూట్ వ్యాఖ్యానించాడు. ‘నా దృష్టిలో ఈ సిరీస్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. భారత్ లాంటి జట్టుతో తలపడేందుకు నేను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. టీమిండియా చాలా బలంగా ఉంది. పదునైన పేస్ బౌలింగ్, ప్రతిభావంతులైన బ్యాటర్లు, బలమైన స్పిన్తో వారంతా సన్నద్ధమై వచ్చారు. స్వదేశంలో మా రికార్డు మాకు కొంత సానుకూలాంశం’ అని రూట్ స్పందించాడు.బ్యాటింగ్ పిచ్ సిద్ధం... తొలి టెస్టులో బ్యాటింగ్కు బాగా అనుకూలమైన పిచ్ అందుబాటులో ఉండటం దాదాపు ఖాయమైంది. ‘బజ్బాల్’ శైలిలో దూకుడుగా ఆడేందుకు సిద్ధమైన ఇంగ్లండ్ తమ ఆలోచనలకు తగిన రీతిలో పిచ్ను సిద్ధం చేయిస్తోంది.క్రిస్ వోక్స్ పునరాగమనంతొలి టెస్టుకు రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. సీనియర్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్కు ఇందులో చోటు దక్కింది. గాయం కారణంగా వోక్స్ ఇంగ్లండ్ ఆడిన గత రెండు టెస్టులకు దూరమయ్యాడు. మూడో స్థానంలో యువ ఆటగాడు బెథెల్ను కాదని ఓలీ పోప్కు ఇంగ్లండ్ ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టెస్టును మినహాయిస్తే దాదాపు ఏడాది కాలంగా పోప్ వరుసగా విఫలమవుతున్నా... అతని అనుభవాన్నిదృష్టిలో ఉంచుకొని టీమ్లోకి ఎంపిక చేసింది. ముగ్గురు పేసర్లతో పాటు ఏకైక స్పిన్నర్గా షోయబ్ బషీర్ బరిలోకి దిగుతాడు. తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, వోక్స్, కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
బాలిలో బద్ధలైన అగ్ని పర్వతం
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం
కశ్మీర్లో రాజకీయ దుమారం
శిశువుకు 'ముహూర్తం' గండం
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
వార్షిక ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి
పశ్చిమ గాలుల ప్రభావం.. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోంది
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
ఏపీలో అమ్మకు కష్టాలు (చిత్రాలు)
నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా!
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!
ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం'
భర్తతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
తాట తీస్తా.. తోలు తీస్తా.. అన్నావ్ కదా పవన్ ఇప్పుడు ఏమైంది?
నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
బాలిలో బద్ధలైన అగ్ని పర్వతం
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం
కశ్మీర్లో రాజకీయ దుమారం
శిశువుకు 'ముహూర్తం' గండం
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
వార్షిక ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి
పశ్చిమ గాలుల ప్రభావం.. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోంది
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా!
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!
ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం'
తాట తీస్తా.. తోలు తీస్తా.. అన్నావ్ కదా పవన్ ఇప్పుడు ఏమైంది?
నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?
సడన్గా ఓటీటీలో వచ్చేసిన రాధికా ఆప్టే సినిమా
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
సినిమా

రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు!
దర్శకుడు శంకర్ ఇప్పుడంటే తడబడుతున్నాడు కానీ అద్భుతః అని చెప్పుకునే సినిమాలు గతంలో బోలెడు తీశాడు. రోబో, అపరిచితుడు, ఇండియన్, జీన్స్, శివాజీ.. ఇలా ఎన్నో కళాఖండాలు ఆయన సృష్టించినవే! వీటిలో అపరిచితుడు సినిమా వచ్చి జూన్ 17 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావత్ దేశాన్ని అల్లాడించేసింది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.🎥 తమిళ అన్నియన్ తెలుగులో అపరిచితుడు (Aparichitudu Movie)గా రిలీజైంది. విక్రమ్, సదా జంటగా నటించారు. దాదాపు రూ.26.38 కోట్ల బడ్జెట్తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు.🎥 శంకర్ (Shankar Shanmugam) సినిమాలకు డైలాగ్స్, స్క్రీన్ప్లేలో స్టార్ రైటర్ సుజాత రంగరాజన్ భాగమే ఎక్కువగా ఉంటుంది. అపరిచితుడు కథ కూడా ఆయనే రాశారని ప్రచారం జరగ్గా.. అది తన కథే అని శంకర్ వెల్లడించాడు.🎥 ఎక్కడైనా హీరో డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒకే మనిషి ముగ్గురి(రామానుజం, రెమో, అపరిచితుడు)లా కనిపిస్తాడు.🎥 దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజైన (హిందీలోనూ డబ్ అయింది) ఈ మూవీ 37 సెంటర్స్లో వంద రోజులు ఆడింది.🎥 అపరిచితుడు పబ్లిక్తో మాట్లాడే సీన్ను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తీశారు.🎥 శంకర్ ఈ కథ మొదటగా రజనీకాంత్కు వినిపించాడు. ఆయన సారీ అనడంతో విక్రమ్ (Chiyaan Vikram.) దగ్గరకు వెళ్లినట్లు భోగట్టా!🎥 విక్రమ్ భార్య శైలజ సైకాలజిస్ట్. దీంతో సినిమాలో హీరోకున్న పర్సనాలిటీ డిజార్డర్ గురించి భార్యను అడిగి ఆ మూడు పాత్రలకు తగ్గట్లుగా తనను తాను మల్చుకున్నాడు విక్రమ్.🎥 హీరోయిన్గా కూడా జీన్స్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ను అనుకున్నారు. కానీ బాలీవుడ్లో బిజీ అవడంతో కుదర్లేదు. సిమ్రాన్ను అడగ్గా అప్పుడే పెళ్లి పిక్స్ అవడంతో తనూ చేజార్చుకుంది. చివరగా జయంతో పెద్ద హిట్ కొట్టిన సదాకు ఈ అవకాశం వరించింది.🎥 ఏఆర్ రెహమాన్ లేకుండా సినిమా చేయని శంకర్.. ఈ చిత్రానికి రెహమాన్ శిష్యుడు హ్యారిస్ జైరాజ్ను తీసుకున్నాడు.🎥 ఫ్రెంచ్ భాషలో రిలీజైన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది.🎥 ఫైట్ సన్నివేశం కోసం 120 కెమెరాలు ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం.🎥 అపరిచితుడు మే 17, 2024లో రీరిలీజ్ అయింది.20 ఏళ్ల క్రితం లంచం, నిర్లక్ష్యం లేని సమాజాన్ని కోరుకున్న అపరిచితుడు కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది!

శేఖర్ కమ్ముల కుబేర.. భారీగా కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్!
నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించారు. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.అయితే ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న కుబేర చిత్రానికి భారీగానే కట్స్ పడినట్లు తెలుస్తోంది. తెలుగులో 181 నిమిషాలు ఉండగా.. తమిళంలో 182 నిమిషాలు రన్టైమ్తో సీబీఎఫ్సీ అనుమతిచ్చింది. అయితే కుబేర సినిమాలోని 19 సన్నివేశాలకు కట్ చెప్పింది. దీంతో రన్టైమ్ దాదాపు 14 నిమిషాలు తగ్గిపోయింది. సెన్సార్ బోర్డ్ ట్రిమ్ చేసిన సీన్స్లో ధనుశ్, రష్మిక మందన్న, నాగార్జున కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం 19 సన్నివేశాలు కట్ చేసిన సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే 13 ఏళ్లలోపు పిల్లలు ఈ మూవీ చూసేందుకు అనుమతి లేదు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవలే కుబేర ట్రైలర్ విడుదల కాగా సినిమాపై అంచనాలు పెంచేసింది.

మంచు విష్ణు కన్నప్ప.. అతని ఎంట్రీ మరిచిపోలేని జ్ఞాపకం!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా మంచు విష్ణు తన కుమారుడి వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తన కుమారుడు అవ్రామ్ కన్నప్ప మూవీతో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తను సెట్లోకి రావడం, మాటలు చెప్పడం, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్లో నటించడం నా జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటని తెలిపారు. ఒక తండ్రిగా నేను ఒకప్పుడు కలలు కన్న అదే ఆకాశం కింద మన బిడ్డ ప్రకాశించడం చూస్తే అంతకు మించింది ఏదీ ఉండదు..ఇది కేవలం అరంగేట్రం కాదు. ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని తన పోస్ట్లో రాసుకొచ్చారు. మీరు ఎల్లప్పుడూ నాకు ఇచ్చిన అదే ప్రేమ, ఆశీర్వాదాలతో మీరందరూ నా కుమారుడిపై కూడా చూపిస్తారని నేను ఆశిస్తున్నా.. అవ్రమ్ ప్రయాణం ప్రారంభం.. అది కన్నప్పతో మొదలు కావడం చాలా సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. కన్నప్పలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటించారు. ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు. వీరితో పాటు అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, సప్తగిరి, ముఖేష్ రిషి, మధుబాల, ఐశ్వర్య భాస్కరన్, బ్రహ్మాజీ, దేవరాజ్, రఘు బాబు, శివ బాలాజీ కీలక పాత్రల్లో మెప్పించారు. కాగా.. ఈ సినిమాను ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu)

పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'.. ఆ బిగ్ మూవీతో పోటీ పడనుందా?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈనెలలో విడుదల కావాల్సినా ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ నెలలోనే థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడడం.. పెద్దగా బజ్ లేకపోవడంతో హరిహర వీరమల్లుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు. ఇక చేసేదేం లేక జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేయక తప్పలేదు.తాజాగా ఈ హరిహర వీరమల్లుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మూవీ విడుదల తేదీని గురువారం ప్రకటిస్తామని పోస్టర్ను పంచుకున్నారు. ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో కాస్తా ఆశలు చిగురించాయి. అయితే ఈ నెల చివరి వారంలో బాక్సాఫీస్ వద్దకు రానుందా..వచ్చే నెలలో రిలీజ్ కానుందా? అనేది రేపు క్లారిటీ రానుంది. అయితే మరో వైపు జూలై 25న థియేటర్లలో రానుందని సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ విడుదల కానుంది. ఆ డేట్ కనుక ఖరారైతే బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్తో హరిహర వీరమల్లు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. Release Date Announcement Tomorrow 🦅💥#HariHaraVeeraMallu @MegaSuryaProd pic.twitter.com/9v6jryuTV0— HariHaraVeeraMallu (@HHVMTeam) June 18, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

భారత్ X పాకిస్తాన్
దుబాయ్: వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్లో భారత జట్టు తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం విడుదల చేసింది. 24 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీ ఫైనల్ జూలై 5న ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరగనుంది. మొత్తం ఏడు వేదికల్లో 33 మ్యాచ్లు నిర్వహించనున్నారు. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత జట్టు తమ తొలి పోరులో వచ్చే ఏడాది జూన్ 14న ఎడ్జ్బాస్టన్ వేదికగా దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. » ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య జూన్ 12న జరిగే మ్యాచ్తో ప్రపంచకప్నకు తెరవలేవనుంది. » లార్డ్స్ వేదికగా ఫైనల్ జరగనుండగా... ఎడ్జ్బాస్టన్, హ్యాంప్షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్, ద ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్స్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. » జూన్ 30, జూలై 2న ఓవల్ వేదికగా రెండు సెమీఫైనల్స్ జరగనున్నాయి. » మహిళల వరల్డ్కప్లో మొత్తం 12 దేశాలు పాల్గొంటుండగా... అందులో ఆరేసి జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. » ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆ్రస్టేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో కలిసి టీమిండియా గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. మరో రెండు జట్లు క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా గ్రూప్ ‘ఎ’లో పోటీపడతాయి. » డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంకతో పాటు మరో రెండు క్వాలిఫయింగ్ జట్లు గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. » గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించనున్నాయి. » తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో పోరు అనంతరం భారత జట్టు వరుసగా... జూన్ 17న క్వాలిఫయింగ్ జట్టుతో... 21న దక్షిణాఫ్రికాతో... 25న క్వాలిఫయింగ్ టీమ్తో... 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. » దేశంలోని ప్రఖ్యాత స్టేడియంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నామని... వరల్డ్కప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీగా ప్రేక్షకులు తరలివస్తారని టోర్నమెంట్ డైరెక్టర్ బెత్ బారెట్ విల్డ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ల అత్యుత్తమ Ind-Eng జట్టు.. కోహ్లికి నో ప్లేస్!
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) టెస్టు సిరీస్ గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా ఇరుజట్లకు ఇదే తొలి సిరీస్. దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది.ఇక విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోయే తొలి సిరీస్ కూడా ఇదే. యువ ఆటగాడు శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో దిగ్గజాలు లేని భారత జట్టు స్టోక్స్ బృందాన్ని వారి సొంతగడ్డపై ఢీకొట్టనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.విరాట్ కోహ్లికి నో ప్లేస్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ ఆర్థర్టన్, నాసిర్ హుసేన్.. 21వ శతాబ్దానికి సంబంధించి భారత్- ఇంగ్లండ్ ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేశారు. అయితే, వీరిద్దరు సంయుక్తంగా ఎంచుకున్న ఈ జట్టులో టీమిండియా దిగ్గజ బ్యాటర్, లెజెండరీ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం చోటు ఇవ్వలేదు.ఈ విషయం గురించి నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. టీమిండియా- ఇంగ్లండ్ నుంచి మేము ఎంపిక చేసుకున్న అత్యుత్తమ జట్టులో కోహ్లి లేడు. జో రూట్ కూడా లేడు. వారిద్దరు లేకపోవడాన్ని అందరూ జీర్ణించుకోలేకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్ నుంచి విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్తో పాటు ‘వాల్’ రాహుల్ ద్రవిడ్, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్తో పాటు ప్రస్తుత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ఆర్థర్టన్, నాసిర్ హుసేన్ చోటు ఇచ్చారు.21వ శతాబ్దానికి గానూ ఆర్థర్టన్, నాసిర్ హుసేన్ ఎంచుకున్న భారత్- ఇంగ్లండ్ కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..వీరేందర్ సెహ్వాగ్, అలిస్టర్ కుక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్-2025కి భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవేభారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్.

‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఒక్కడి కోసం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు ఎంతో మంది గొప్ప ఆటగాళ్ల కెరీర్ను నాశనం చేశారని ఆరోపించాడు.ఒక్కడికి అండగా నిలిచేందుకు సర్వనాశనంఈ మేరకు.. ‘‘సీనియర్ల నుంచి సౌరవ్, సచిన్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), వీవీఎస్ లక్ష్మణ్, జవగళ్ శ్రీనాథ్, అని కుంబ్లే.. యువతరం నుంచి భజ్జీ (హర్భజన్ సింగ్), యువీ (యువరాజ్ సింగ్), వీరూ (వీరేందర్ సెహ్వాగ్), మహ్మద్ కైఫ్, జహీర్ ఖాన్.తండ్రులు- కుమారులు.. పెద్దన్నలు- తమ్ముళ్ల కలయికతో జట్టు ఎంతో బాగుండేది. సీనియర్ల సలహాలతో జూనియర్లు రాటుదేలేవారు. కానీ మనం ఏం చేశాం?.. ఒక్కడికి అండగా నిలిచేందుకు మన ఇంటిని మనమే నాశనం చేసుకున్నాం.అతడి పేరును నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. కానీ ఈరోజుకీ అతడి వల్లే ఇదంతా జరిగిందని చెప్పగలను. అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జట్టు పరిస్థితి ఎలా ఉంది?సచిన్ అలాంటివాడే..స్వార్థం కోసం ఇతరుల కెరీర్ను నాశనం చేసేవాళ్లు కొందరైతే.. కొంతమంది నిస్వార్థంగా ఇతరులను ప్రేమిస్తారు. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్ లాంటివాళ్లు రెండో కోవకు చెందిన వారు.ఇతరుల కోసం వారు ఆడతారు. స్టార్లు కావాలన్న తాపత్రయం వారికి లేదు’’ అంటూ యోగ్రాజ్ సింగ్ ఇన్సైడ్ స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యులైన వారిపై ఎలాంటి కారణం లేకుండానే బీసీసీఐ సెలక్టర్లు వేటు వేశారని ఆరోపించాడు.ధోనిని ఉద్దేశించేనా?‘‘గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహ్మద్ కైఫ్ వంటి వాళ్ల కెరీర్ను బీసీసీఐ సెలక్టర్లు నాశనం చేశారు. 2011 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వారిని బయటకు పంపేశారు’’ అని యోగ్రాజ్ సింగ్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించే యోగ్రాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.గతంలో కూడా అతడు ధోని తన కుమారుడు యువీ కెరీర్ను నాశనం చేశాడంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా.. పేరు చెప్పకపోయినప్పటికీ ధోనిని దృష్టిలో పెట్టుకునే యోగ్రాజ్ సింగ్ ఇలా మాట్లాడి ఉంటాడని క్రికెట్ ప్రేమికులు అంచనా వేస్తున్నారు. కాగా ధోని కెప్టెన్గా వచ్చిన తర్వాత జట్టులో మార్పులు చేస్తూ యువ తారలతో నింపేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు అతడి హయాంలోనే ఎదిగారు. ఇక సారథిగా ధోని టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అందించాడు. చదవండి: Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే బ్యాటింగ్ చేస్తాడు: రిషభ్ పంత్

భారత్తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
టీమిండియా(Ind vs Eng 1st Test)తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. జాక్ క్రాలేతో పాటు బెన్ డకెట్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. మూడో స్థానంలో ఓలీ పోప్ బరిలోకి దిగనున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో భారీ శతకం (171)తో విరుచుకుపడిన పోప్నకు సెలక్టర్లు మరో అవకాశం ఇవ్వగా.. జేకబ్ బెతెల్ (Jacob Bethell)కు నిరాశే మిగిలింది.ఇక బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఈ జట్టులో క్రిస్ వోక్స్కు స్థానం దక్కింది. డిసెంబరు తర్వాత అతడు ఇంగ్లండ్ తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇక దుర్హం సీమర్ బ్రైడన్ కార్సే కూడా భారత్తో తొలి టెస్టులో భాగం కానున్నాడు. సొంతగడ్డపై అతడికి ఇదే మొదటి టెస్టు కావడం విశేషం.చివరగా అతడు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో ఆయా దేశాల్లో జరిగిన సిరీస్లలో పాల్గొన్నాడు. మరోవైపు.. జేమీ స్మిత్ వికెట్ కీపర్గా కొనసాగనున్నాడు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ టీమిండియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరుజట్లకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో ఇదే తొలి సిరీస్. శుక్రవారం (జూన్ 20) నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. లీడ్స్లోని హెడ్డింగ్లీ మైదానం ఇందుకు వేదిక.టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.భారత్తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్.సిరీస్ పేరు అదే.. గెలిచిన కెప్టెన్కు పటౌడీ పతకంటీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్కు ఇరు దేశాల దిగ్గజాలను గుర్తు చేసేలా టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy) పేరు ఖరారైంది. ఇప్పటి వరకు ‘పటౌడీ ట్రోఫీ’గా ఉన్న పేరును మారుస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గతంలోనే ప్రకటించింది. దాంతో పటౌడీ పేరు తొలగించడంపై విమర్శలు వచ్చి చర్చ జరిగింది. కానీ ఈసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు.తాము అనుకున్న పేరునే ఖాయం చేసింది. తొలి టెస్టుకు ముందు రోజు ఈ నెల 19న ఈ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. అయితే పటౌడీని ఏదో ఒక రూపంలో గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తికి మాత్రం ఈసీబీ సానుకూలంగా స్పందించింది. టెస్టు సిరీస్లో విజేతగా నిలిచే కెప్టెన్కు ‘పటౌడీ మెడల్’ను అందజేస్తారు.కాగా భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పటౌడీ ససెక్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జట్ల తరఫున కూడా ఆడగా... ఆయన తండ్రి ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ భారత్, ఇంగ్లండ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో వారి గౌరవార్ధం ఇప్పటి వరకు ‘పటౌడీ ట్రోఫీ’గా పిలిచారు. అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్లుగా సచిన్ టెండూ ల్కర్ (200), జేమ్స్ అండర్సన్ (188) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 81,237 వద్ద కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 138.64 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 41.35 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 24,812.05 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.46 శాతం, 0.23 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మీడియా 1.27 శాతం నష్టపోగా, నిఫ్టీ ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రియల్టీ, ఎనర్జీ, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.టీసీఎస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ షేర్లు 1.6 శాతం వరకు నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్ 4.4 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్లలో ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.89 శాతం క్షీణించి 14.27 పాయింట్ల వద్ద స్థిరపడింది.ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం తీవ్రతరం కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నాటాంజ్ వద్ద ఇరాన్ భూగర్భ యురేనియం కర్మాగారం దెబ్బతిన్నదన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు ఐదో రోజు కూడా కొనసాగాయి.దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, భవిష్యత్తులో రేట్ల కోత, ముడిచమురు ధరలు పెరగడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాలపై చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు.

జాబ్లో చేరకుండానే రూ.25 లక్షలు..
ఆఫర్ లెటర్ అనేది ఉద్యోగ ఎంపికలో కీలక దశ. స్క్రీనింగ్ టెస్టులు, ఇంటర్వ్యూలు.. ఇలా ఎంపిక ప్రక్రియ అంతా పూర్తయి ఆఫర్ లెటర్ చేతికొచ్చేసిందంటే ఇక ఉద్యోగం ఖరారైపోయిందని అభ్యర్థులు ఆనందంగా భావిస్తారు. కానీ ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతమూ ఇవ్వకుండా వేధిస్తున్న కంపెనీని కోర్టుకు లాగి సరిగ్గా బుద్ధి చెప్పాడో అభ్యర్థి..ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోని అబుదాబిలోని ఓ కంపెనీపై స్థానిక కోర్టు తగిన చర్యలు తీసుకుంది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సదరు బాధిత ఉద్యోగికి 'బకాయి వేతనం'గా 1,10,400 దిర్హమ్లు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.25 లక్షలు చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. 2024 నవంబర్ 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు తన వేతనాన్ని యజమానులు నిలిపివేశారని ఆరోపిస్తూ సదరు ఉద్యోగి కంపెనీపై దావా వేశారు.👉 సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!ఆఫర్ లెటర్ ప్రకారం.. ఉద్యోగితో ఆ కంపెనీ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 7,200 దిర్హమ్ల బేసిక్ వేతనం, నెలకు 24,000 దిర్హమ్ల ప్యాకేజీ ఇస్తామని ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ నిబంధనల్లో పేర్కొంది. కానీ అతని జాయినింగ్ తేదీని కంపెనీ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతం కూడా ఇవ్వకపోవడంతో సదరు ఉద్యోగి కంపెనీని కోర్టుకు లాగాడు.కోర్టు ఏం చెప్పిందంటే..వేతన నివేదిక, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సమర్పించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ల ఆధారంగా ఉద్యోగి విధుల్లో చేరిక జాప్యానికి కంపెనీ యాజమాన్యమే కారణమని స్పష్టమైందని కోర్టు పేర్కొంది. కార్మిక చట్టాల ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగికి రూ.1,10,400 (సుమారు రూ.25 లక్షల వరకు) వేతనం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.మరోవైపు, సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లాడని, విధులకు హాజరు కాకపోవడం వల్ల అతను పూర్తి వేతనానికి అర్హుడు కాదని కంపెనీ వాదించింది. అయితే ఉద్యోగి విధులకు గైర్హాజరయ్యాడన్నదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని విధుల్లో చేరిక జాప్యం పూర్తిగా కంపెనీ తప్పిదమేనని కోర్టు తేల్చిచెప్పింది. కాగా తాను ఎనిమిది రోజులు మాత్రమే సెలవు తీసుకున్నట్లు ఉద్యోగి చెప్పడంతో ఈ మేరకు అతని జీతంలో మినహాయించారు.

భారత ఆటబొమ్మల నాణ్యత భేష్
భారత ఆటబొమ్మల (టాయ్స్) నాణ్యత ప్రమాణాలు అంతర్జాతీయ బెంచ్మార్క్ కంటే మెరుగైనవని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) సైంటిస్ట్ డైరెక్టర్ (వెస్టర్న్ రీజినల్ ఆఫీస్ ల్యాబరేటరీ) అద్భుత్ సింగ్ తెలిపారు. దేశీ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడంలో ఈ ప్రమాణాలు సాయపడుతున్నట్టు చెప్పారు.టాయ్స్కు సంబంధించి భౌతిక, రసాయన, ఎలక్ట్రికల్ భద్రతా ప్రమాణాలను బీఐఎస్ రూపొందించి, అమలు చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఐఎస్వో, ఐఈసీ సంస్థలు నిర్ణయించిన బెంచ్మార్క్ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ ప్రమాణాలను బీఐఎస్ అభివృద్ది చేసింది. వీటి ప్రకారం దేశీయంగా తయారీకి, దిగుమతులకు గాను ఏడు రకాల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారత ఆటబొమ్మల అమ్మకాలు పెరిగేందుకు సాయపడినట్టు అద్భుత్ సింగ్ తెలిపారు. పోటీకి అవకాశం..బీఐఎస్ ప్రమాణాలు ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు దిగ్గజ కంపెనీలతో పోటీపడే అవకాశం కల్పించినట్లు ముంబైకి చెందిన జెఫిర్ టాయ్మేకర్స్ ప్రైవేటు లిమిటెడ్ సీఈవో మోయిజ్ గబ్జీవాలా తెలిపారు. ‘బీఐఎస్ ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత (2021 జనవరి 1 నుంచి) మా ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల ఆదాయం సాధించాం. 2025–26లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం’ అని ప్రకటించారు. ఇదీ చదవండి: ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్తమ ఉత్పత్తుల్లోకి వినియోగించే ముడి సరుకుల్లో 99 శాతం దేశీయంగా తయారైనవేనని చెప్పారు. 15 కేటగిరీల్లో 100కు పైగా రకాలతో 1–1.5 లక్షల బొమ్మలను నెలవారీగా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. భారత కంపెనీలు ఇప్పుడు నాణ్యమైన ఆటబొమ్మలను అందుబాటు ధరలకే ఉత్పత్తి చేయగలుగుతున్నట్టు వివరించారు. బీఐఎస్ సర్టిఫికేషన్ ఉంటే సంబంధిత ఆటబొమ్మల్లో పాదరసం, థాలేట్స్ వంటి విషపూరిత పదార్థాలు లేవని, మింగేందుకు అవకాశం ఉన్న చిన్నపాటి విడిభాగాల్లేవని, పదునైన అంచుల్లేవన్న భరోసానిస్తుందని అద్భుత్ సింగ్ తెలిపారు. గ్లోబ్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం చూస్తే.. 2023–24లో టాయ్స్ ఎగుమతులు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 154 మిలియన్ డాలర్ల నుంచి 152 మిలియన్ డాలర్లకు తగ్గడం గమనార్హం.

ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్
దేశవ్యాప్తంగా జీరో కమీషన్ మోడల్ను అమలు చేస్తున్నట్లు ఓలా క్యాబ్స్ తెలిపింది. 10 లక్షలకు పైగా డ్రైవర్ భాగస్వాములు తమ సంపాదనలో 100 శాతం ఆదా చేసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న ఈ కార్యక్రమం ఆటోలు, బైకులు, క్యాబ్ డ్రైవర్లకు బిగ్ రిలీఫ్ అవుతుందని పేర్కొంది. రైడ్ పరిమాణం లేదా ఆదాయంపై ఎటువంటి పరిమితులను ఉండవని పేర్కొంది.కొత్త ప్రోగ్రామ్లో భాగంగా డ్రైవర్లు ఈ ప్రణాళికను ఎంచుకోవచ్చని చెప్పింది. కమీషన్ రూపంలో ఓలాకు వెళ్లే ఛార్జీలను ఎటువంటి మినహాయింపులు లేకుండా డ్రైవర్లు ఆ మొత్తాన్ని పొందవచ్చు. అయితే అందుకు నెలవారీ సబ్స్క్రిప్షన్ పొందాలని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ను ఉపయోగించుకునే డ్రైవర్లు 30 రోజుల పాటు రోజుకు రూ.67 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంటే నెలకు రూ.2,010 అవుతుంది.ఇదీ చదవండి: వార్షిక టోల్ పాస్ను ప్రకటించిన కేంద్రంఈ ఫీచర్తో డ్రైవర్లు జీరో కమీషన్ క్లెయిమ్ చేసుకునే ఛార్జీలపై ఎలాంటి పరిమితులు లేవని, తమ ఛార్జీల మొత్తాన్ని క్లెయిమ్ చేసేటప్పుడు వాహనం ఎంపికపై కంపెనీ ఎలాంటి ఆంక్షలు విధించదని తెలిపింది. ఈ ఫీచర్ ఓలా ఆటో, ఓలా బైక్స్, ఓలా క్యాబ్స్కు అందుబాటులో ఉంది. ‘కమీషన్లను తొలగించడం వల్ల డ్రైవర్ భాగస్వాములకు మరింత అవకాశాలు లభిస్తాయి’ అని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పు వల్ల డ్రైవర్ ఆదాయం ఏటా రూ.1,36,000 పెరుగుతుందని, ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది 30 శాతం అధికమని చెప్పింది.
ఫ్యామిలీ

భాగ్యనగరంలో మధ్యధరా-ఆసియా రుచులు..
భాగ్యనగరానికి మధ్యధరా–ఆసియా ఫ్లేవర్లను తీసుకొచ్చేందుకు ‘కైమా’ రెస్టారెంట్ ఆరంభమైంది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని సత్వా నాలెడ్జి పార్కులో నగరంలో మొదటి సారిగా కైమా రెస్టారెంట్ మంగళవారం ప్రారంభించారు. మొదటి కైమా రెస్టారెంట్ ముంబయిలోనూ, రెండో రెస్టారెంట్ పుణెలోనూ, మూడో రెస్టారెంట్ను హైదరాబాద్ నాలెడ్జి సిటీలోనూ ఏర్పాటు చేయడం విశేషం. సహజసిద్ధమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా రాళ్లు, బంకమట్టితో నిర్మించిన గోడలను తలపించే రీతిలో యాంబియన్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. టెర్రకోట, గిరిజన మూలాంశాలలోని కథలను వివరించేలా ఆకర్షణీయమైన అలంకరణతో, అబ్బురపరిచే లైటింగ్ ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ యజమానులు నిఖితాపూజారి, అంకితాపూజారి, నారాయణ్ పూజారి, మేనేజింగ్ పార్ట్నర్ నిఖిల్ రోచ్లాని, చెఫ్లతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరం విభిన్న నగరమే కాకుండా వివిధ రకాల రుచులను ఆస్వాదించే ప్రజలకు అందుబాటులో ఉండేలా తమ కైమా రెస్టారెంట్ ఏర్పాటు చేశామని యాజమాన్యం తెలిపింది. ప్రత్యేకమైన వంటకాలతో.. కైమా రెస్టారెంట్లో వివిధ దేశాల సంప్రదాయ వంటకాలను ఆసియా రుచులతో అనుసంధానించేలా ఏర్పాటు చేశారు. నగరవాసులకు ప్రాన్స్రూబియాన్, చికెన్షిఫ్ తవూక్, ఈజిప్షియన్ కోషారీ, సిగ్నేచర్ క్లాసిక్ లెబ్నెహ్ షగ్, కాటేజ్ చీజ్ పాకెట్స్ వంటి వాటిని ఆహారప్రియులైన నగరవాసులు ఆస్వాదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆసియన్ వంటకాల్లో కిమ్చి–జ్జిగే సూప్, తాజా రుచికరమైన ట్రిపుల్–ఇ స్పినాచ్ ఆస్పరాగస్ సలాడ్, సిట్రస్–ఫార్వర్డ్ సాల్మన్ టిరాడిటో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ట్రిపుల్–ఇ ఎడామామ్ మనీ బ్యాగ్, గొర్రె లేదా జాక్ఫ్రూట్తో మసాలా రెండాంగ్ గ్యోజా, బోల్డ్ స్పైసీ మష్రూమ్ చెయుంగ్ఫాంగ్, ఇటాలియానో సాల్మన్ రోల్, క్వినోవా అవోకాడో రోల్ వంటి సుషీ వెరైటీలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు సాల్మన్ టామ్యమ్, చిలగడ దుంప– వాసబిమాష్, స్మోకీ–స్వీట్ లాంబ్ చాప్ బుల్గోగి, సామ్జియోప్సల్ ప్లాటర్ వంటి ప్రధాన వంటకాలు, బక్లావా చీజ్కేక్ నుంచి సుగంధ సాఫ్రాన్ మిల్క్ కేక్, కునాఫా వంటివి కూడా ఆహారప్రియులను అలరించనున్నాయి. (చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!)

' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!
మెల్లి మెల్లిగా వర్షాలు పడటంతో నగరంలో చల్లదనపు వాతావరణం ఆవరించుకుంటోంది. గాలి తేమతో నిండిపోయి, ప్రకృతి కళగా మారిన ఈ సమయంలో నగరవాసులు వారి ఇళ్లకు, అపార్ట్మెంట్లకు, మిద్దెలకు ఆకుపచ్చ అందాన్ని అద్దేందుకు సంసిద్ధమవుతున్నారు. మొక్కలు నాటేందుకు ఇది అత్యుత్తమ కాలం కావడం, అదే సమయంలో గ్రీన్ లివింగ్ పై నగరవాసుల్లో పెరిగిన ఆసక్తి వర్షాకాలాన్ని సరైన సమయంగా మార్చుతోంది. ఇంట్లో చిన్నదైనా సరే.. ఒక గ్రీన్ కార్నర్ ఉంటే, అది మన మూడ్కు, ఆరోగ్యానికి, జీవనశైలికి నూతన శోభను తీసుకురాగలదు. మొక్కలతో బంధాన్ని పెంచుకుంటే ఈ బీజీ లైఫ్లో కాసింతైనా ఉపశమనం లభిస్తుందని నగరవాసుల అభిలాష. ఈ నేపథ్యంలో మొక్కల ప్రేమికులు నర్సరీల బాట పడుతుంటే, మరికొందరు ఆన్లైన్లో ఆర్డర్స్ పెడుతున్నారు. గత దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, ఇంటీరియర్ ప్లాంటేషన్ వంటి అభిరుచి గణనీయంగా పెరిగాయి. పని ఒత్తిడిని తేలికపరచడానికి,ఇంట్లోకి ప్రకృతి పారవశ్యాన్ని తీసుకురావడానికి మొక్కలు సరైన ఎంపికగా మారాయి. ఇది ఒక హాబీ అనడం కన్నా.. ఓ నూతన జీవన శైలిలో భాగంగా మారిందనడం సరైనదేమో. ప్లాంట్ థెరపీ అనే ట్రెండ్ ఇప్పుడు మెట్రో లైఫ్ స్టైల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. నర్సరీల్లో సందడి.. ఈ వర్షాకాలంలో హకీంపేట్, బేగంపేట్, ఖాజాగూడ, కొంపల్లి, బాచుపల్లి, అమీర్పేట్, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో నర్సరీలు రద్దీగా మారాయి. అంతేకాదు, పాతబస్తీ నుంచీ కొత్తబస్తీ వరకూ పూల మొక్కలతో పాటు డెకరేటివ్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్, కూల్ ఎయిర్ ప్లాంట్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ సీజన్లో డిమాండ్ పెరగడంతో నర్సరీ యజమానులు ఎక్కువగా మొక్కలను దిగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా కడియం (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు, పుణె వంటి గార్డెనింగ్ మార్కెట్ల నుంచి నగరానికి మొక్కలు ఎక్కువగా వస్తుండటమే కాకుండా కొన్నింటి ధరలు గణనీయంగా పెరిగాయి. అయినా సరే, మొక్కలపై ఉన్న ప్రేమ ముందు ధరలు విషయమే కాదనుకుంటున్నారు ప్లాంట్ లవర్స్. హైదరాబాద్ మహా నగరంలో ఏడాదంతా అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ.. ఈ సీజన్లో ఎక్కువగా అమ్ముడుపోయే మొక్కలే తమకు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయని కూకట్పల్లికి చెందిన నర్సరీ నిర్వాహకులు వేణుమాధవ్ తెలిపారు. బిజీ లైఫ్.. ఆన్లైన్ ఆర్డర్స్.. బిజీ లైఫ్లో మొక్కలు కొనడానికి సమయం లేనివారు ఇప్పుడు మొక్కలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఉగావో, నర్సరీలీవ్, మైబాగీచ, అమెజాన్, బిగ్బాస్కేట్, గార్డెనింగ్ స్టోర్, అర్బన్ మాలి వంటి ప్లాట్ఫాంల ద్వారా నేరుగా ఇంటి వద్దకే మొక్కలు డెలివరీ అవుతున్నాయి. కొంత మేరకు ఖర్చు ఎక్కువైనా, బ్రాండెడ్ ప్లాంట్ ప్యాకేజింగ్, ఎలా నాటాలి–పెంచాలనే సూచనలు, పెంపకం టిప్స్ ఇవ్వడం వల్ల కొనుగోలు ధోరణి పెరుగుతోంది. జీవనశైలిగా మారిన పచ్చదనం.. కేవలం అందం కోసమే కాక, కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా, ఇంట్లో మంచి హ్యుమిడిటీకి, ఆక్సిజన్ సరఫరాకు మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గ్రీన్ ఇంటీరియర్ డిజైనింగ్, బాల్కనీ గార్డెనింగ్, వాల్స్పై వరి్టకల్ గార్డెన్, వాటర్ సేవింగ్ ప్లాంటేషన్ వంటి కాన్సెప్ట్లు పెరుగుతున్నాయి. ట్రెండింగ్ ప్లాంట్స్.. ఇండోర్ డెకోరేటివ్ ప్లాంట్స్– మోన్సె్టరా, పీలియా, స్నేక్ ప్లాంట్, జెడ్ ప్లాంట్–పూల మొక్కలు–బోగన్విల్లా, రోసెస్, లిల్లీస్, హైబిస్కస్, హెల్కోనియా –ఔషధ మొక్కలు–తులసి, అశ్వగంధ, మఠి, అలోవెరా–ఫ్రూట్ ప్లాంట్స్–జామ, నేరేడు, మామిడి, లిచి, సీతాఫలం వంటి మొక్కలు ప్రస్తుతం ట్రెండింగ్ ప్లాంట్స్గా ఉన్నాయి. ఇంటింటా.. మిద్దె పంట.. నగరంలో ప్రధానంగా ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వారు మిద్దె పంటలకు పెద్దపీట వేస్తున్నారు. ఇంటికి సరిపడా కూరగాయలు, పూలను పెంచుకోవడంతో పాటు పచ్చదనాన్ని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా టమాట, బీర, దోస, కీరా, మునగ, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకుంటూ ఆరోగ్యాన్ని చక్కబెడుతున్నారు. (చదవండి: శరీరానికి సరిపడ బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ఇలా..!)

అతిరథుడు బాహ్లికుడు..చదివితే భారతమే చదవాలి!
‘కొడుకా! నేనెటులొ, అట్లె బాహ్లికుడు కూర్చున్ నీకు...’ అంటాడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడితో! ‘కుమారా! నీకు నేనెంతో, అంత గానూ కావలసినవాడు, ప్రియబాంధవుడూ బాహ్లికుడు. నేనూ, బాహ్లికుడూ, భీష్ముడూ... నీకు అత్యంత పూజనీయులం. మా మాట కాదని ధర్మరాజుతో యుద్ధానికి దిగవద్దు’ అని దీనంగా బతిమాలు కొంటాడు. ఈ ఘట్టం విన్నప్పుడు, దుర్యోధనుడికి తండ్రి తాతల సరసన మూడో అతి ముఖ్య బంధువయిన బాహ్లి కుడు ఎవరు, ఆయన ఎందుకు ప్రసిద్ధుడు కాలేదు అని సందేహం వస్తుంది.బాహ్లికుడు, భీష్ముడి తండ్రి శంతనుడి సోద రుడు. భీష్ముడికి పెత్తండ్రి. ఆయన తండ్రి ప్రతీపుడు తను రాజుగా ఉన్నప్పుడే, బాహ్లికుడికి కొంత రాజ్యభాగం ఇచ్చి రాజును చేశాడు. ఆ తరవాత కొన్ని అసా ధారణ పరిస్థితుల వల్ల చిన్న కొడుకయిన శంతనుడికి హస్తినాపుర రాజ్యాధికారం లభించింది. పరిశీలనగా చూస్తే, చరిత్రలో ఎన్నెన్నో రాజ్యాధికార వారసత్వాలు అసాధారణంగా సంక్రమించటం కనిపి స్తుంది. భారతంలో అలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి. ఇదీ చదవండి: షారూఖ్ను మించిపోయేలా, మహేష్ టేస్ట్ అండ్ స్టైల్ : ధర రూ. 8 కోట్లు!భారతంలో బాహ్లికుడికి ప్రధాన పాత్ర లేదు. ఆయన పేరు అరుదుగా వినిపిస్తుంది. కానీ వంశంలో అందరి కంటె వృద్ధుడిగా, ఆయన కౌరవ పాండవులిద్దరికీ సన్నిహితుడే. వాళ్ళ ఇళ్ళలో శుభాశుభ కార్యాలన్నిటికీ ఆయనే ఇంటి పెద్ద. పూజ్యుడు.ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు, ఆయన వచ్చిఇంటి పెద్దగా గొప్ప గౌరవం పొంది, ఒక ఉత్తమ రథాన్ని కానుకగా ఇస్తాడు. ద్రౌపదీ మానభంగ ఘట్టంలో నిస్సహాయంగా చూస్తూ ఊరు కొన్న కురు వృద్ధ, గురు వృద్ధ, బాంధవులలో బాహ్లికుడు ఉన్నాడు. తరవాత జరిగిన రెండో విడత జూదం వారించేందుకు గట్టిగా చెప్పి చూసిన పెద్దలలో బాహ్లికుడి పేరు కూడా కనిపిస్తుంది.భీష్మ పితామహుడికే పెద తండ్రి అయిన బాహ్లికుడు, పండు ముసలితనంలో కూడా భారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరా డాడు. భీష్ముడి పరిగణనలో ఆయన కౌరవ పక్షంలో ఉన్న మహావీరు లలో అగ్రగణ్యులలో ఒకడు. ‘అతిరథుడు బాహ్లికుడు విను, అతులిత బలు, డతని యట్ల ఆత్మజుడును...’ అని అభివర్ణిస్తాడు గాంగేయుడు. యుద్ధంలో వీరోచితంగా పోరాడి, చివరికి భీముడి చేత వీరమరణం పాలవుతాడు. మహాభారత కథ ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన ఉదాత్తమైన పాత్రల ద్వారా మానవ స్వభావాన్ని అనేక కోణాల నుంచి ఆవిష్కరించి చూపు తుంది. అందుకే, చదివితే భారతమే చదవాలి!– ఎం. మారుతి శాస్త్రి

శరీరానికి సరిపడ బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ఇలా..!
నగరంలో ఫుడీస్, ఫుడ్ లవర్స్, భోజనప్రియులు.. పేరేదైనా కానీ.. విభిన్న వంటకాలు ఆస్వాదించేవారు పెరుగుతున్నారు. మరోవైపు రెస్టారెంట్స్లో మాత్రమే కాదు సంపన్నుల బఫే డిన్నర్స్లోనూ, పారీ్టస్లోనూ విభిన్న రకాల విదేశీ రుచుల వడ్డన సర్వసాధారణం అయ్యింది. అయితే కంటికి ఇంపైనంత మాత్రాన ఇంటికి ఇంపు కావాలని లేనట్టే, నోటికి ఇంపుగా అనిపించినంత మాత్రాన శరీరానికి ఇంపు కాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రుచుల వేట సాగించేవాళ్లు ముందస్తుగా ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్టు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. సాధారణంగా మనుషులు తినకూడని ఆహారాలు మనకి తెలుసు. తినదగినవీ తెలుసు. కానీ కొందరికి మాత్రమే తినదగినవి, కొందరు తినకూడనివి కూడా ఉంటాయి. అలానే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా కొన్నిసార్లు అస్వస్థతకు కారణమవుతాయి. ఇవి జీర్ణక్రియ సమస్యలు, చర్మం మీద ర్యాషెస్, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలను కలిగించవచ్చు. అయితే ఎటువంటి ఆహారం అనారోగ్యానికి కారణమవుతుందో గుర్తించడం చాలా కష్టం. అనేక సందర్భాల్లో ఈ లక్షణాలు ఆహారం తిన్న కొన్ని గంటల తరువాత మాత్రమే బయటపడతాయి. ఈ క్రమంలో ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫుడ్ అలర్జీ.. లక్షణాలు ఇలా.. ఆహారం పడకపోవడం వల్ల మొదటిగా చర్మంపై పొక్కులు, ఎర్రని దద్దుర్లు, నొప్పులు రావచ్చు. అయితే చిన్నపిల్లల్లో మొదటి లక్షణంగా చర్మంపై ర్యాష్ కనిపిస్తుంది. అలాగే శ్వాస సంబంధిత వ్యవస్థపై ప్రభావంతో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుదల, ముక్కు పొంగడం వంటి సమస్యలు కలగవచ్చు. జీర్ణ వ్యవస్థపై దాడితో.. నాలుక ఉబ్బిపోవడం, బొజ్జ నొప్పి, నోటిలో మెటాలిక్ రుచి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అనాఫిలాక్టిక్ షాక్ అనే తీవ్ర పరిస్థితి ఏర్పడినప్పుడు వేగంగా నాడీ స్పందన, పెదవులు, గొంతు ఉబ్బిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం తెల్లగా కనిపించడం, మూర్ఛ వంటివి కూడా రావచ్చు.నప్పనివి ఏమిటి? సాధారణంగా నప్పని ఆహారాల్లో పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, షెల్ ఫిష్, పీనట్స్, వాల్నట్, ఆల్మండ్, కాజు, పీకాన్ వంటి డ్రై ఫ్రూట్స్.. అయితే ఇవి నప్పకపోవడానికి వాటిలో ఉండే కొన్ని ఉపపదార్థాలు కూడా కారణమే. ఉదాహరణకు పాలలో ఉండే లాక్టోజ్ అనే ఒక రకమైన తియ్యటి పదార్థం, గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రొటీన్, ఫుడ్ ఫ్లేవర్ పెంచడానికి ఉపయోగించే ఎంఎస్జీ అనే పదార్థం.. ఇలా.. కొన్ని సందర్భాల్లో అతి తక్కువ మోతాదులో ఈ ఆహారాలను తీసుకున్నా తీవ్ర సమస్యలకు కారణం కావచ్చు. అలాగే మనకు ఏ మాత్రం పరిచయం లేని వంటకాల్లో ఏయే దినుసులు కలుపుతున్నారో వాటిలో ఏవి మనకు నప్పవో తెలీదు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం. ఆహారం.. అసహనం.. మన శరీరానికి హానికరం కాని ఆహారాలను హానికరమైన వైరస్లా గుర్తించి స్పందించే స్థితి కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు చిన్నపాటి జీర్ణ సమస్యలుగా ఉంటే, మరికొన్నిసార్లు అనాఫిలాక్టిక్ షాక్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. ఈ సమస్య చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం కంటే ఎక్కువ మంది చిన్నారులు దీని ప్రభావానికి లోనవుతున్నారు. చాలామంది పిల్లలు పెద్దయ్యాక ఈ అసహనాన్ని సహనంగా మార్చుకోగలుగుతారు. కానీ కొందరు మాత్రం కొన్నింటిని నప్పేలా చేసుకుంటారు కొన్నింటి పట్ల అసహనాన్ని కొనసాగిస్తారు. ఫుడ్ అలర్జీ పరీక్షలు.. ఎలా? ఎక్కడ? అనుమానాస్పద ఆహారాన్ని స్వల్పంగా ప్రయోగించి శరీరం ఎలా స్పందిస్తుందో పరిశీలించడాన్ని ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు. అలాగే అనుమానాస్పద ఆహారాలను పూర్తిగా ఆపి, తర్వాత ఒక్కొక్కటిగా మళ్లీ ఆహారంలో చేర్చడాన్ని ఎలిమినేషన్ డైట్, ఆహారాన్ని చర్మంపై ఉంచి సూదితో తక్కువగా గుచ్చి చేసే స్కిన్ ప్రిక్ టెస్ట్, రక్తంలో ఐజీఇ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది పరీక్షించడానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు. నగరంలో థైరోకేర్, మై డయాగ్నోస్టిక్స్, డీఎన్ఎ ల్యాబ్స్ ఇండియా, రెడ్ క్లిఫ్ ల్యాబ్స్, ల్యూసిడ్.. వంటి చోట్ల ఈ పరీక్షలు చేస్తున్నారు. కనీసం 200 రకాలు.. ఆ పైన అలర్జీలను గుర్తించేందుకు చేసే పరీక్షల వ్యయం కనీసం రూ.5వేల నుంచి రూ.15వేల వరకూ అవుతుంది. (చదవండి: ఆ జంట పిల్లలు కోసం సరోగసికి వెళ్తే.. ఊహకందని ట్విస్ట్! చివరికి..)
ఫొటోలు
అంతర్జాతీయం

ఈ యుద్ధం.. ప్రపంచానికి పెనుభారం
సాక్షి, నేషనల్ డెస్క్: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో అగ్రశ్రేణి దేశాల్లో ఒకటైన ఇరాన్ నేడు యుద్ధభూమిగా మారింది. పశ్చిమాసియాలో బలీయమైన సైనిక శక్తి కలిగిన రెండు దేశాలు ప్రత్యక్షంగా తలపడుతున్నాయి. ఈ యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, వైమానిక రంగంతోపాటు కీలక రంగాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. భారీగా సంపద హరించుకుపోయింది. సోమవా రం కొంతవరకు కోలుకున్నాయి. మరోవైపు ఆయుధ తయారీ సంస్థలతోపాటు చమురు కంపెనీల షేర్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ మారెŠక్ట్ను నమ్ముకోవడం తెలివైన పని కాదన్న ఆలోచనతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు దృష్టి పెట్టారు. వారు తమ సొమ్మును బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. 100 డాలర్లకు ముడి చమురు? ఇరాన్లో ఎప్పుడు యుద్ధం జరిగినా తక్షణమే ప్రభావితమయ్యేది చమురు రంగమే. బ్యారెల్(158.98 లీటర్లు) ముడి చమురు ధర సోమవారం 74.60 డాలర్లకు చేరుకుంది. గురువారంతో పోలిస్తే 7 శాతం పెరిగింది. ఒకవేళ యుద్ధం మరింత ఉధృతంగా మారి, హొర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటేస్తుందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ గోల్డ్మాన్ సాచ్స్ తేల్చి చెప్పింది. ప్రపంచంలో సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో మూడింట ఒకవంతు హొర్మూజ్ జలసంధి గుండానే జరుగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది.ఇరాన్, గల్ఫ్ దేశాలను వేరుచేసే అతిసన్నని సముద్ర మార్గమైన హొర్మూజ్పై ఆధిపత్యం ఇరాన్దే. ఇజ్రాయెల్తో యుద్ధం తీవ్రస్థాయికి చేరితే హొర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే భారత్, జపాన్, చైనా సహా పలు ఆసియా దేశాలకు చమురు కష్టాలు తప్పవు. 1980వ దశకంలో ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో హొర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదు. ఈసారి కూడా మూసివేసే పరిస్థితి ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ముడి చమురు ఎగుమతులు ఆగిపోతే ఇరాన్ ఆర్థికగా నష్టపోవడం ఖాయం. పొంచి ఉన్న ద్రవ్యోల్బణ ముప్పు చమురు ధరలు పెరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతుంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అంతిమంగా ఆ భారం భరించాల్సింది వినియోగదారులే. చమురు కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. వృద్ధిరేటు తగ్గిపోతుంది. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఇప్పటికే కొన్ని దేశాలు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. జీ7 దేశాల్లో కేంద్ర బ్యాంకులు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. విమానయానం మరింత ప్రియం యుద్ధం వల్ల పశ్చిమాసియాలో చాలా దేశాలు ముందు జాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో విమానయాన సంస్థలు తమ విమానాలను కూడా రద్దు చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నాయి. దీంతో వ్యయం పెరుగుతోంది. విమానయానం మరింత ఖరీదుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్వేస్ తదితర సంస్థలు ఇరాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా వంటి దేశాల నుంచి తమ విమానాలు నడపడం లేదు. తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించాయి. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా తమ గగనతలం పూర్తిగా మూసి ఉంటుందని ఇరాన్ అధికార వర్గాలు ప్రకటించాయి.

G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా..
న్యూఢిల్లీ: భారత్-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేందర్ మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలుసుకున్నారు. గత ఏడాది అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో క్షీణించిన సంబంధాలు తాజా ద్వైపాక్షిక సమావేశాలతో బలోపేతమవుతాయని భారత్ భావిస్తోంది.ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్న సమయంలో ప్రధాని మోదీ భారతదేశం-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో కీలకమైనవని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గొప్ప గౌరవం అని కార్నీ అన్నారు. ఇంధన భద్రత, ఏఐ భవిష్యత్తులతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసిపోరాడాలని కెనడా ప్రధాని అన్నారు.ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆల్బెర్టాకు వెళ్లారు. భారతదేశానికి జీ7 దేశాలలో సభ్యత్వం లేదు. అయినా సమావేశాలకు కెనడా ఆహ్వనం మేరకు హాజరయ్యింది. భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు బహుళ రంగాలలో కొనసాగుతున్న భాగస్వామ్యాలను తిరిగి గాడిలో పెట్టేందుకు కెనడా.. భారత్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 2023లో ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం భారత్తో కెనడా సంబంధాలు మరింత దిగజారాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ కెనడాకు వెళ్లడం ఇదే తొలిసారి.నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం.. ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు కెనడాలో బలోపేతం అయ్యేందుకు అనుమతించిందని ఆరోపించింది. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ఆర్థికవేత్త కార్నీ, ఏప్రిల్లో జస్టిన్ ట్రూడో స్థానంలో ప్రధానిగా అత్యున్నత పదవి చేపట్టారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వాలు పెరుగుతున్న నేపథ్యంలో జీ-7 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనిలో జీ 7 దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్ చర్యలను ఖండించాయి.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్తో పాటు ప్రియుడు..

‘ఇరాన్’ పని ఖతం.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా కూడా ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరాన్పై దాడుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.ఇక, జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన అమెరికా చేరుకున్నారు. అమెరికా వెళ్లిన అనంతరం, అమెరికా జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై సమీక్షించారు. చర్చల అనంతరం టెహ్రాన్లోని న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. దీంతో, ఇరాన్పై దాడులు మరింత తీవ్రతరం కానున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందే ట్రంప్.. ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్కు ట్రంప్ హితవు పలికారు. దాడులు ఆగాలంటే అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ను తొలగించే (చంపే) ఉద్దేశం మాకు లేదు. అయితే, పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. మా సహనం నశిస్తోంది. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు. సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోతే మంచిది అని స్పష్టం చేశారు.ఇరాన్కు అణుబాంబు దక్కదు అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు.

కీవ్పై రష్యా దాడులు
కీవ్: నెలల తరబడి ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న రష్యా సోమవారం రాత్రివేళ ముప్పేట దాడికి దిగింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులను ఉధృతంచేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై కన్నెర్రజేసింది. రాత్రంగా పలుచోట్ల జరిగిన క్షిపణి దాడుల్లో 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని కీవ్ నగర సైనిక పరిపాలన అధిపతి తైమూర్ త్కచెన్కో మంగళవారం ప్రకటించారు. ఈ దాడుల్లో 156 మంది గాయపడ్డారు. క్షిపణి దాడుల ధాటికి 9 అంతస్తుల భవనం ఒకటి నేలమట్టమైంది. మరికొన్ని అపార్ట్మెంట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.ఉక్రెయిన్ రాజధానిపై ఇటీవలికాలంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటని తైమూర్ పేర్కొన్నారు. యుద్ధం మొదలై మూడు సంవత్సరాలు గడిచినా, రెండుసార్లు ప్రత్యక్ష చర్చలు జరిగినా ఈ రణం రవ్వంతైనా సానుకూల, శాంతిపథం దిశగా సాగట్లేదని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. కేవలం సైనికుల పరస్పర మార్పిడి, బందీల విడుదల వంటి కంటితుడుపు చర్చలు తప్పితే కీలకమైన కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడట్లేదు. తీరప్రాంత నగరం ఒడెసాపైనా రష్యా డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఒకరు చనిపోయారు. 17 మంది గా యపడ్డారు. సోమవారం రాత్రి రష్యా ఏకంగా 440 డ్రోన్లు, 32 మిస్సైళ్లను కీవ్పై ప్రయోగించిందని జెలెన్స్కీ చెప్పారు.
జాతీయం

Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి బోధన నుంచి ఉపసంహరించారు. మరాఠీ, ఇంగ్లీష్ తర్వాత మూడవ భాషగా హిందీని పరిగణిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని మూడవ భాషగా తప్పనిసరిగా బోధించడాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నూతన నోటిఫికేషన్ జారీ చేసింది.ఒక తరగతిలో 20కి మించిన విద్యార్థులు హిందీకి బదులుగా మరొక భాష నేర్చుకోవాలనుకుంటే, సంబంధిత ఉపాధ్యాయుణ్ణి అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా ప్రణాళిక- 2024 ప్రకారం మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతులకు హిందీ ఇకపై మూడవ భాషగా ఉంటుంది. అయితే ఈ విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భారతీయ భాషలలో ఒకదాన్ని మూడవ భాషగా నేర్చుకోవాలనుకుంటే వారికి అందుకు అనుమతి కల్పిస్తారు. మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మరాఠీ భాషను తప్పనిసరి చేశారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి

Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఢిల్లీ నుండి బీహార్కు వెళ్తున్న బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025బులంద్షహర్ జిల్లాలో జహంగీరాబాద్-బులంద్షహర్ రహదారిపై జానిపూర్ గ్రామం సమీపంలో ఒక వాహనం వంతెనను ఢీకొని, అనంతరం బోల్తా పడి, మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బులంద్షహర్ ఎస్పీ (గ్రామీణ) తేజ్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుదౌన్లో జరిగిన వివాహానికి హాజరైన పెళ్లి బృందం ఢిల్లీలోని మాలవీయ నగర్కు తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ఆగ్రాలో జరిగిన మరో విషాదకర ఘటనలో ఒక పికప్ వాహనం బ్యాలెన్స్ కోల్పోయి సహద్ర ఫ్లైఓవర్పై నుంచి కింద పడింది. అది నేరుగా మార్నింగ్ వాకర్స్పై పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు అధికారి హేమంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పికప్ వాహనం మామిడి పండ్లను రవాణా చేస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందాడు. అతని సహాయకుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ మూడు కేసులను నమోదు చేసుకున్న ఆయా ప్రాంతాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా

భయంతో కేకలు.. ప్రమాదం వేళ యువతులు ఎలా తప్పించుకున్నారంటే..
అహ్మదాబాద్: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిన అనంతరం బీజే మెడికల్ కాలేజీ(బీజేఎంసీ)క్యాంపస్లో భీతిల్లిన విద్యార్థులకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. భవనంలో మంటలు చెలరేగడం చూసిన రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న విద్యార్థులు ప్రాణభయంతో వణుకుతూ కేకలు వేయగా, కొందరు దుప్పట్లు, ఇతర దుస్తులను ఒకదానికొకటి ముడివేసి వాటి సాయంతో కిందికి దిగడం, మరికొందరు దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో ఉంది.విమానం కూలిన ప్రాంతంలో కొన్ని మీటర్ల దూరంలోనే మంటలు వ్యాపిస్తుండటం చూసిన ఓ యువతి కేవలం రెయిలింగ్ సాయంతోనే కిందికి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్న మరో ఓ వీడియోలో రికార్డయింది. క్యాంపస్ వెలుపలి గోడపై నుంచి ఈ వీడియో తీస్తున్న వారు.. కింద పడిపోతే గాయాలవుతాయని ఆమెను హెచ్చరిస్తూ వేస్తున్న కేకలు సైతం వినిపించాయి. మరో వ్యక్తి కూడా అదే రెయిలింగ్ ద్వారా కిందికి దిగేందుకు ప్రయత్నించారు. #Watch | A horrifying plane crash struck the BJ Medical College UG hostel mess in Meghani Nagar, claiming the lives of several MBBS students. Heart-wrenching videos have surfaced from the moment of the crash, showing hostel students desperately trying to escape through the… pic.twitter.com/tmDxB3XfdJ— The Daily Jagran (@TheDailyJagran) June 17, 2025 Shocking video from #AhmedabadCrash: As the plane hit the medical college hostel, students jumped from windows to save their lives. Video shot moments after impact. pic.twitter.com/1CvGMV7iZ8— Neha Bhan🇮🇳 (@neha_journo) June 17, 2025మెడికల్ కాలేజీ హాస్టల్ మూడో అంతస్తు వరకు నిచ్చెనలు వేసుకుని ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించినట్లుగా మరో వీడియోలో ఉంది. విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 29 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. విమాన ప్రమాదంతో మెడికల్ కాలేజీకి సంబంధించిన నాలుగు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.Removal of the aft fuselage section of the Air India Boeing 787-8(VT-ANB) from the BJ Medical College, Ahmedabad.#AirIndiaCrash #Ahmedabad #AirindiaPlane #BreakingNews pic.twitter.com/kGkxtK0WFt— The Metropolitan Times (@times66982) June 17, 2025 Black day for India 💔Visuals from inside of the BJ Medical College UG Boys hostel mess in Meghani Nagar, Amdavad, Gujarat where Air India London bound flight crashedEngine tore the walls of the hostel. Many students are feared to be dead as it was lunch time #PlaneCrash https://t.co/zJyrnyJAVB pic.twitter.com/nRps7cXAbM— Karnataka Weather (@BengaluruRains_) June 12, 2025

Ahmedabad Plane Crash: భద్రతకు ఢోకాలేదు.. కానీ.. ‘వాచ్డాగ్’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు దారితీసిన అంశాలపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఏవియేషన్ వాచ్డాగ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ఎయిర్ ఇండియాకు చెందిన 24.. 33 బోయింగ్ 787 డ్రీమ్లైనర్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది.లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల సమీక్ష చేపట్టింది. దీనిలో పాల్గొన్న డీజీసీఏ.. 24 బోయింగ్ 787 విమానాలతో ఎటువంటి భద్రతా సమస్యలు లేవని తెలిపింది. అయితే ఇంజనీరింగ్, ఆపరేషన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ యూనిట్లలో అంతర్గత సమన్వయాన్ని బలోపేతం చేయాలని ఎయిర్ ఇండియాకు సూచించింది.తాజాగా ఎయిర్ ఇండియా తన దగ్గరున్న మొత్తం 33 బీ 787-8/9 విమానాలలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తోంది. వీటిలో 24 విమానాల తనిఖీలు పూర్తయ్యాయి. జూన్ 12- 17 మధ్య కాలంలో ఎయిర్ ఇండియా మొత్తం 514 విమానాలను నడిపింది. వాటిలో 83 రద్దు అయ్యాయి. వీటిలో 66 రద్దులు బోయింగ్ 787 విమానాల విమానాలకు సంబంధించినవి. అత్యధిక సంఖ్యలో డ్రీమ్లైనర్లు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు సంయుక్తంగా దేశీయ, అంతర్జాతీయంగా ప్రతిరోజూ వెయ్యికి పైగా విమానాలను నడుపుతున్నాయి.ఇది కూడా చదవండి: G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా..
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం.

భర్తను కలవాలి, ఎవరికైనా మంత్రాలు తెలుసా?
అన్నానగర్(తమిళనాడు): నెల్లై జిల్లాలోని పనగుడి సమీపం పళవూర్ మదన్పిళ్లై ధర్మం గ్రామానికి చెందిన శివలింగదురై కుమార్తె కయల్విళి (28). ఆమె వివాహం చేసుకుని భర్త నుండి విడిపోయి తల్లిదండ్రులతో నివశిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 5న ఆలయానికి వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయిన కయల్విళి అదృశ్యమైంది. ఫిర్యాదు ఆధారంగా పళవూరు పోలీసులు గత 8 నెలలుగా కేసు నమోదు చేసి వెతుకుతున్నారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డింగులను పరిశీలించినప్పుడు, కన్యాకుమారి జిల్లాలోని కొట్టారం ప్రాంతానికి చెందిన శివ స్వామి అనే పూజారి కయల్విళిని కారులో తీసుకెళ్లినట్లు వెల్లడైంది. దీని తరువాత అతన్ని అరెస్టు చేసి విచారించారు. అతను తన సహచరులతో కలిసి కయల్విళి మెడలో ఉన్న 7 సవర్ల బంగారు చైన్ కోసం ఆమెను గొంతు నులిమి హత్య చేసి, 80 అడుగుల కోయ మహాదేవి కాలువలోకి విసిరేసినట్లు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలువడ్డాయి. కాలువ నుండి కయల్విళి అస్థిపంజరాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఖైదీలను విచారించగా దిగ్భ్రాంతికరమైన సమాచారం వెల్లడైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఈమె 2022లో బెంగళూరులో పనిచేస్తున్న యువకుడిని వివాహం చేసుకుంది. ఆమె ఫిబ్రవరి 2024లో తన భర్త నుండి విడిపోయింది. కయల్విళి తన భర్తతో తిరిగి కలవాలని ప్రార్థించడానికి అనేక దేవాలయాలను సందర్శిస్తోంది. ఈ పరిస్థితిలో ఆమె ఫేస్బుక్లో తన భర్తతో కలపటానికి మంత్రం బాగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని పోస్ట్ చేసింది. మాయాండి రాజా మొదట ఈ విషయంపై కయల్విళిని సంప్రదించాడు. వారు ఆమెను మంత్రవిద్య చేసే శివస్వామి వద్దకు తీసుకెళ్లి, ఆమె నుండి డబ్బు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. దీని ప్రకారం శివస్వామి, మాయాండి వీరు కయల్విళిని నుంచి అనేక వాయిదాలలో మొత్తం రూ.5 లక్షలు చెల్లించాడు. ఆమెను మళ్లీ ఆమె భర్తతో కలిసి జీవించనిస్తానని చెప్పాడు. ఒకానొక సమయంలో, వారు మోసం చేస్తున్నారని తెలిసిన కయల్విళి వారిని తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరింది. మాయాండి, శివస్వామి, అతని కుమారుడు శివ, సంఘటన జరిగిన రోజున కయల్విళికి ఫోన్ చేసి, డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. తరువాత మాయాండి రాజా, అతని సోదరి కుమారుడు, వీరవనల్లూరుకు చెందిన కన్నన్, శివనేశ్వరి సహా నలుగురు హత్య చేశారు. తరువాత ఆమె ధరించిన 7 తులాల నగలను తీసుకొని, కయల్విళి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి, చేరన్మాదేవి పక్కన ఉన్న గంగానకుళం సమీపంలోని 80 అడుగుల కాలువలో విసిరేసి, సాధారణ జీవితాన్ని గడిపారని తేలింది. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. తదనంతరం, శివనేశ్వరిని కొక్కిరాకుళం మహిళా జైలుకు, మిగిలిన ముగ్గురిని పాలైయంగోటై సెంట్రల్ జైలుకు తరలించారు.

భర్తను కాదని.. వేరే వ్యక్తితో పరిచయం..!
భీమునిపట్నం: భీమిలిలో నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మంగళవారం బీచ్రోడ్డులోని జీడి తోటలో శవమై కనిపించింది. కృష్ణాకాలనీకి చెందిన బంగారు కవిత (28) గత నెల 10న సరకులు తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె భర్త పైడిరాజు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కవిత అదృశ్యంపై ఆమె భర్త, కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. కాగా.. బీచ్రోడ్డులోని మార్లిన్ కే రెస్టారెంట్ ఎదురుగా ఉన్న జీడి తోటలో ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న మహిళ తల, వేరుపడిన శరీరం ఉండడాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ తిరుమలరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.హత్య? ఆత్మహత్య? కవిత మృతి విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనేది తేలాల్సి ఉంది. అదృశ్యమైన ఒకటి, రెండు రోజుల్లోనే ఆమె చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. మంగళవారం వరకు మృతదేహం ఎవరికీ తెలియకపోవడంతో తల నుంచి శరీరం నేల మీద పడిపోయి, బాగా పాడైపోయిన స్థితిలో ఉంది. దీంతో పోస్టుమార్టంను అక్కడే నిర్వహించారు.పోలీసుల దర్యాప్తులో ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఏదైనా గొడవలు జరిగి ఇక్కడకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు సరైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు బీచ్రోడ్డులో నిరసన తెలిపారు.

నమ్మించి గొంతుకోసి.. కారు ప్రమాదంగా చిత్రీకరించి..
సంగీత ప్రపంచంలో పాపులారిటీ సంపాదించుకుంటోందనుకున్న సమయంలోనే.. ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెది ప్రమాదం కాదని.. హత్య చేశారనే విషయం బయటపడడంతో అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రముఖ హర్యానా మోడల్ శీతల్ చౌద్రీ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను నమ్మించి.. గొంతుకోసి హత్య చేశాడని క్రైమ్బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు. ఆపై ఘటనను ఓ కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. నిందితుడు సునీల్ తన నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. హర్యానా మోడల్ అయిన శీతల్ చౌద్రీ.. అక్కడి మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ ఆల్బమ్స్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె తన బంధువుల అమ్మాయిలతో పానిపట్ సత్కర్తర్ కాలనీలో నివసించసాగింది. అయితే జూన్14వ తేదీన ఓ ఆల్బమ్ షూట్కు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మాత్లౌదా పీఎస్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు.. ఆదివారం(జూన్ 15న) ఓ కాలువలో ఆమె ప్రయాణించిన కారు కొట్టుకువచ్చింది. అయితే అందులో ఆమె మృతదేహాం లేదు. ఆ మరుసటిరోజు.. కారు దొరికిన 80 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతిపై ఉన్న టాటూల ఆధారంగా అది శీతల్ మృతదేహామేనని నిర్ధారించుకున్నారు. ఈలోపు.. ఆమె ప్రియుడు, ప్రమాదం నుంచి బయటపడ్డ సునీల్ చెప్పిన మాటల్ని అంతా నమ్మారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోస్ట్మార్టం నివేదికలో ఆమె గొంతు, శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, ఆ గాయాల కారణంగానే ఆమె మరణించిందని తేలింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన హర్యానా క్రైమ్ బ్రాంచ్ విభాగం.. చివరగా ఆమె కారులో వెళ్లిన ప్రియుడు సునీల్ను గట్టిగా విచారించడంతో విషయం బయటకు వచ్చింది. శీతల్ గతంలో సునీల్ పని చేసిన ఓ హోటల్లో రిసెప్షనిస్ట్గా పని చేసింది. వీళ్ల మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది. శీతల్ ఐదు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తాబిడ్డలను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని సునీల్ శీతల్కు ప్రపోజ్ పెట్టారు. ఈలోపు సునీల్కు ఇదివరకే పెళ్లైందని.. ఇద్దరు బిడ్డలకు తండ్రి అనే విషయం శీతల్కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. తన పరువును బజారున పడేస్తుందన్న భయంతో.. మాట్లాడుకుందామని శీతల్ను పిలిచాడు సునీల్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని కారులో ఉంచి కాలువలోకి నెట్టేశాడు. నిందితుడు సునీల్ నేరం అంగీకరించడంతో.. పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్ 14వ తేదీ.. పానిపట్లో శీతల్ ఆల్బమ్ షూటింగ్.. ఆపై సునీల్తో ఔటింగ్. అర్ధరాత్రి దాకా కలిసి తాగిన శీతల్-సునీల్. ఆపై తన సోదరికి కాల్ చేసి సునీల్ దాడి చేస్తున్నాడని చెప్పిన శీతల్. కాల్ కట్ కావడంతో కంగారుపడిపోయిన శీతల్ సోదరి. జూన్ 15వ తేదీ.. మిస్సింగ్ కేసు నమోదు. పోలీసులు ఎంక్వైరీ. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ను ప్రశ్నించిన పోలీసులు. తాము కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, తాను ఈత కొడుతూ బయటకు వచ్చి ఆస్పత్రిలో చేరానని, శీతల్ కారుతో సహా కొట్టుకుపోయిందని సునీల్ వాంగ్మూలం. శీతల్ ప్రయాణించిన కారు స్వాధీనం.జూన్ 16వ తేదీ.. శీతల్ మృతదేహాం లభ్యం. పోస్ట్మార్టం నివేదికలో హత్య జరిగిందని నిర్ధారణ.జూన్ 17వ తేదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ నేరాంగీకరణ. ఉదయాన్నే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధింపు.CCTV Footage में आखिरी बार अपने Boyfriend के साथ दिखी Haryana Model sheetal । India News Haryana #haryananews #crimenews #cctv #model #sheetalchaudhary #mudercase #boyfriendexpose #boyfriendgirlfriend #viralvideo #ytshorts #breakingnews #latest pic.twitter.com/0yGuANnWns— India News Haryana (@indianews_hr) June 17, 2025Video Credits: India News Haryana