ఆటో బోల్తా: 12 మంది విద్యార్థినులకు తీవ్రగాయాలు | 12 Students injured in auto accident at nomulla village in nakrekal mandalam | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 12 మంది విద్యార్థినులకు తీవ్రగాయాలు

Published Tue, Aug 13 2013 4:17 PM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

12 Students injured in auto accident at nomulla village in nakrekal mandalam

నకిరేకల్ మండలం నోముల వద్ద మంగళవారం ఆటో బోల్తా పడిన ఘటనలో 12 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దాంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. విద్యార్థినులంతా విహార యాత్రకు వెళ్లుతుండగా ఆ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement