
భన్వర్లాల్
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచి 276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్లాల్ చెప్పారు. రేపు నిర్వహించే రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి డిజిపి బి.ప్రసాదరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రతి ఎమ్మెల్యే పోలింగ్ ఏజెంట్కు చూపించే ఓటు వేయాల్సి ఉంటుందని భన్వర్ లాల్ చెప్పారు. పోలింగ్ ఏజెంట్, పార్టీ ఓటు రహస్యాన్ని కాపాడాల్సి ఉంటుందన్నారు.