
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు
చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు హుండీ ఆదాయం రూ.3.57 కోట్లకు చేరింది.
తిరుమల : చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు హుండీ ఆదాయం రూ.3.57 కోట్లకు చేరింది. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. అక్కడ స్వామివారి దర్శనానికి 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం నాడు స్వామి వారిని 60,135 మంది భక్తులు దర్శించుకున్నారు.