తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం | Tirumala TTD Latest News Updates On July 21 2024 | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Published Sun, Jul 21 2024 7:57 AM | Last Updated on Sun, Jul 21 2024 7:58 AM

Tirumala TTD Latest News Updates On July 21 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5  గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న (శనివారం) 83,538 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 30,267 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం  4.25  కోట్లుగా లెక్క తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement