మెదడువాపు వ్యాధితో చిన్నారి మృతి | 6 years old girl dies of Encephalitis | Sakshi

మెదడువాపు వ్యాధితో చిన్నారి మృతి

Nov 17 2015 6:09 PM | Updated on Sep 3 2017 12:37 PM

కనుమరుగైందనుకుంటున్న మెదడు వాపు వ్యాధి మరోసారి వెలుగు చూసింది.

మహానంది (కర్నూలు) : కనుమరుగైందనుకుంటున్న మెదడు వాపు వ్యాధి మరోసారి వెలుగు చూసింది. కర్నూలు జిల్లాలో ఆరేళ్ల బాలిక మెదడువాపు వ్యాధితో మంగళవారం మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన దీపికాబాయి (6) గత శనివారం నుంచి జ్వరంతో బాధపడుతోంది.

తల్లిదండ్రులు మొదట ఇద్దరు వైద్యులకు చూపించినా తగ్గకపోవడంతో నంద్యాలలోని ఓ చిన్న పిల్లల వైద్య నిపుణుడికి చూపించారు. మెదడువాపుగా నిర్ధారించిన డాక్టర్ మందులు సూచించడంతో అవి తీసుకుని వాడుతున్నామని, పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం దీపికాబాయి మృతి చెందినట్టు ఆమె తండ్రి కాశీరాంసింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement