ఆధార్‌తో బోగస్‌కు తెర | aadhaar number integration cm chandrababu video conference | Sakshi

ఆధార్‌తో బోగస్‌కు తెర

Sep 21 2014 12:02 AM | Updated on Oct 22 2018 7:36 PM

ఆధార్‌తో బోగస్‌కు తెర - Sakshi

ఆధార్‌తో బోగస్‌కు తెర

ఆధార్ నంబర్ అనుసంధానంతో ప్రభుత్వ పథకాల్లో బోగస్ లబ్ధిదారులకు తెర పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలు(అగ్రికల్చర్): ఆధార్ నంబర్ అనుసంధానంతో ప్రభుత్వ పథకాల్లో బోగస్ లబ్ధిదారులకు తెర పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సామాజిక భద్రతా పథకం పింఛన్ల వెరిఫికేషన్, జన్మభూమి- మా ఊరు, నీరు-చెట్టు తదితర వాటి ప్రాధాన్యతలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సందేశాన్ని ఆర్‌డీఓ, తహశీల్దారు, పంచాయతీ కార్యాలయాల్లో లైవ్ టెలీకాస్ట్ చేశారు. కర్నూలులో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయ్‌మోహన్, జేసీ కన్నబాబు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పింఛన్లు అర్హులకే ఇవాలనే ఉద్దేశంతో పంచాయతీ, వార్డు స్థాయిలో పకడ్బందీ సర్వే చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పురోగతి సాధించామని 100శాతం పూర్తయ్యేందుకు కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000లకు పెంచుతున్నామన్నారు. అదే రోజు నుంచి 20వ తేదీ వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా చూడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement