![AC Not Working In Spicejet Flight From Tirupati To Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/29/spice-jet_1.jpg.webp?itok=HY32sOUk)
సాక్షి, తిరుపతి: తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో అధికారులు దానిని నిలిపివేశారు. ఈ కారణంగా ప్రయాణికులు మూడు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఆ తర్వాత ఏసీ పనిచేస్తుందని విమానాన్ని ప్రయాణానికి సిద్ధం చేశారు. తీరా బయలుదేరిన సమయంలో ఏసీ మళ్లీ పనిచేయలేదు. దీంతో ఏసీ లేకుండానే ప్రయాణికులు హైదరాబాద్కు పయనమయ్యారు. స్పైస్జెట్ సేవలపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment