అనంతపురం : హంద్రీ - నీవా ప్రాజెక్టుకు నిధులు రూ.2వేల కోట్లు కేటాయించాలంటూ జాతీయ రహదారి - 44ను అనంతపురం సీపీఎం నేతలు దిగ్బంధించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. రహదారిని దిగ్బంధించినందుకు సీపీఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ సహా 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.