వచ్చే జూన్ 2 నుంచి మంత్రులు విజయవాడలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
హైదరాబాద్: వచ్చే జూన్ 2 నుంచి మంత్రులు విజయవాడలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రధాన శాఖల కార్యాలయాలను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయానికి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ప్రతి శాఖలో ఈ గవర్నెన్స్ అమలు చేయాలని, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు.