Andhra Pradesh Politics
-
లోకేశ్ ‘లెక్కే’ వేరు..!
సాక్షి, అమరావతి: టీడీపీలో పదవులు ఒకప్పుడు చంద్రబాబు (Chandrababu) ఇష్ట ప్రకారం లభించేవి. రకరకాల సమీకరణలు, ప్రాధాన్యతలు, ఆర్థిక వ్యవహారాలను బట్టి పదవులను కట్టబెట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన తనయుడు లోకేశ్ (Lokesh) ఆశీస్సులు ఉంటేనే పదవులు వస్తాయని టీడీపీలో కింది స్థాయి కార్యకర్తలు సైతం చెబుతున్నారు. ఆయన ఆశీస్సులు ఉండాలంటే ఆర్థికంగా బలవంతులై ఉండాలనే సూత్రం చాలాకాలం నుంచి అమలవుతోంది. గత ఎన్నికల్లో సీట్లు డబ్బు మూటలిచ్చిన వాళ్లకే ఇచ్చారని ఆ పార్టీలోనే బహిరంగంగానే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులకూ అదే సూత్రాన్ని పాటించినట్లు పార్టీ సీనియర్ నేతలు వాపోయారు.ఆయన కోటరీకే ఎమ్మెల్సీ పదవులు ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులోనూ అదే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. టీడీపీకి మూడు పదవులు దక్కితే మూడు లోకేశ్కి అత్యంత విధేయులుగా ఉన్న వారికే లభించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర లోకేశ్ కోటరీలో కీలక వ్యక్తి కావడంతోపాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి వెతుక్కుంటూ వచ్చినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. బీటీ నాయుడు (BT Naidu) కూడా లోకేశ్కు దగ్గరి వ్యక్తి కావడంతోపాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకుడే. కావలి గ్రీష్మ (Kavali Greeshma) లోకేశ్ కోటరీకి చెందిన నేతే. మహానాడులో బూతులు తిడుతూ తొడ కొట్టిన నాయకురాలు కావడంతో ఆమెకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. ఉత్తరాంధ్రలో అనేక మంది సీనియర్ నేతలు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నేతలుంటే అంత చురుగ్గా పని చేయని గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి దక్కడానికి చినబాబు ఆశీస్సులు ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.రాజ్యసభ స్థానాల్లోనూ అంతేమూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు దక్కగా ఆ రెండింటినీ ధన బలం ఉన్నా సానా సతీష్బాబు, బీద మస్తాన్రావుకి ఇచ్చారు. సానా సతీష్బాబు.. లోకేశ్ కోటరీలో ప్రస్తుతం అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చారు. బీద మస్తాన్రావు కూడా డబ్బు మూటలతో వచ్చిన వ్యక్తేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. అధికారం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు.చదవండి: యనమలకు బాబు 'షాక్' హ్యాండ్చినబాబు ఆశీస్సులు ఉంటే.. చింత అక్కర్లేదు..మరోవైపు నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేశ్ చెప్పిన వారికే పదవులు వచ్చాయి. కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, ఇతర పదవులను ఆయన ఇచ్చిన జాబితా ప్రకారమే కేటాయించారు. పదవుల కోసం ఎవరైనా చంద్రబాబు వద్దకు వెళితే ఆయన తన కొడుకును కలవమని చాలామంది నేతలకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీనియర్లు చంద్రబాబు మారిపోయాడని, ఆయన కొడుకును కలవాల్సిన అవసరం ఏమిటని భావించి వెళ్లలేదు. కొందరు వెళ్లి కలిసినా, ప్రయోజనం లేదని చెబుతున్నారు. మొత్తంమీద ఈ పరిణామాలు పార్టీలో సీనియర్లకు ఆందోళన కలిగిస్తున్నాయని సమాచారం. -
నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గతంలో తనకున్న జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను అంతమొందించడమే ప్రస్తుత అధికార కూటమి ప్రధాన లక్ష్యమని, తనకున్న ప్రాణహానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహానిని సరైన రీతిలో మదింపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను కుదించిందని, ఈ నేపథ్యంలో.. 3–6–2024 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అంతేగాక.. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్ అసాల్ట్ టీమ్స్, జామర్లను సైతం అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలని అభ్యర్ధించారు. తన భద్రత కుదింపు విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు, రాజ్యాంగ అధికరణలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. వైఎస్ జగన్ తన పిటిషన్లో ఏం పేర్కొన్నారంటే.. నన్ను ప్రమాదంలోకి నెట్టేందుకే.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకున్న జెడ్ ప్లస్ భద్రతను ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరుతూ మా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు అధికార కూటమి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. నన్ను ప్రజల నుంచి దూరంగా ఉంచేందుకు, వ్యక్తిగతంగా నేను దాడులకు గురయ్యేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో గత రెండునెలలుగా యథేచ్ఛగా వ్యవస్థీకృత రాజకీయ హింస కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసు పెద్దలు చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నాకున్న ప్రాణహానిని సరైన కోణంలో మదింపు చేయలేదు. ప్రజాసేవలు, రాజకీయ జీవితంలో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఉపసంహరించింది. నా భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ మా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ఎలాంటి స్పందనలేదు. నా జీవితాన్ని, స్వేచ్ఛను ప్రమాదంలోకి నెట్టేందుకు ఈ అధికార కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగిస్తోంది. ఉన్నపళంగా, అకారణంగా, ఏకపక్షంగా నాకున్న భద్రతను కుదించింది. ఇటీవల నా భద్రతా వలయంలో ఉల్లంఘనలు జరిగినా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదు. వారు కూటమి ప్రభుత్వ పెద్దల పల్లకీలు మోస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తమ విధులను వారు విస్మరించడంవల్లే ఇటీవల కాలంలో మా పార్టీ కేడర్పై, ఆస్తులపై వ్యవస్థీకృత హింస పెరిగిపోయింది. దీనిపై మేం ఢిల్లీలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం. నన్ను భౌతికంగా లేకుండా చేయడమే అధికార కూటమి లక్ష్యం. ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేతల మధ్య సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్నపాత్రుడు నా గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయానని, ఇంకా బతికే ఉన్నానని’ ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక.. చచ్చేవరకు కొట్టాలని కూడా వారు మాట్లాడుకున్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా భద్రత కుదింపు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాకు భద్రతను కుదించారు. అది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తగ్గించారు. నాకు భౌతిక హాని తలపెడతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో పదేపదే చెప్పారు. అందులో భాగంగానే నాపై ఎన్నికల ప్రచార సమయంలో గులకరాయి దాడి జరిగింది. గతంలో నాపై కోడికత్తితో హత్యాయత్నం కూడా చేశారు. వీటన్నింటి దృష్ట్యా నాకు 3–6–2024 నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీచేయండి. నాకు రక్షణగా ఇద్దరు అధికారులే ఉన్నారు..రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంది. అయితే, అధికార పార్టీ కూటమి నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే మా పార్టీ కేడర్, నేతలపై దాడులు జరగడానికి పునాది. నా భద్రతను కుదించేందుకు అధికారుల వద్ద సహేతుక కారణాలుగానీ, ఆధారాలుగానీ ఏమీలేవు. అత్యున్నత భద్రత వ్యవస్థ అయిన జెడ్ ప్లస్ నుంచి నా భద్రతను కుదించారు. వాస్తవానికి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను తొలగించనప్పటికీ, నా చుట్టూ ఉన్న భద్రత సిబ్బందిని మాత్రం బాగా కుదించారు. నాకు రక్షణగా ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉన్నారు. నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. అధికార పార్టీ నుంచి నిరంతరం నేను బహిరంగ బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. అందువల్ల ప్రభుత్వం నాకు ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. నాకు అత్యంత సమీపంలో ఉండే క్యాట్ ఆక్టోపస్ టీమ్స్ను ఈ ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉంటున్నారు. గతంలో ఇలా 10 మంది ఉండేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల కంటే నా వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల సంఖ్యే తక్కువ. గతంలో ఇల్లు, ఆఫీసు వద్ద 11 మంది గార్డులు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ఇక నా భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందన్న విషయం నాకు రక్షణగా ఇచ్చిన బుల్లెట్ప్రూఫ్ కారును చూస్తే అర్థమైపోతుంది. అద్దాలు పగుళ్లు వచ్చి ఉన్నాయి. వెనుక డోర్ తెరుచుకోవడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకొచ్చే పరిస్థితిలేదు. మధ్యలో ఆగిపోతోంది. ఇటీవల ఓ పర్యటనకు వెళ్తుండగా మధ్యలో ఆగిపోవడంతో పర్యటనను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. నేను నా వ్యక్తిగత బుల్లెట్ప్రూఫ్ కారు వాడుకునేందుకు అనుమతి కోరగా అధికారులు అనుమతినివ్వలేదు. పైగా వాళ్లు ఇచ్చే కారునే వాడాలన్నారు. నేను ప్రజలను కలవకుండా ఇంటి వద్దనే ఉండాలన్న కారణంతోనే అలాంటి కారును ఇచ్చారు. -
శ్వేతపత్రం కాదు.. మా కేసుల సంగతి చూడండి!
సాక్షి, అమరావతి: శాసన సభ సమావేశాల్లో గురువారం విచిత్ర పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభ్యులు చర్చించేందుకు స్పీకర్ అవకాశం కల్పించగా.. దొరికిందే ఛాన్సన్నట్లుగా సభ్యులు కేసులు ఎత్తేయాలని కోరడం కొసమెరుపు. శ్వేత పత్రాల సంగతి తర్వాత చర్చించాలని కోరుతూ చాలామంది ఎమ్మెల్యేలు.. కోరికల చిట్టా విప్పారు. పాత కేసులు కూడా ఎత్తేయాలని కోరారు. తమ ఒక్కరిపై ఉన్న కేసులంటేనే బాగోదని భావించి, పార్టీ కార్యకర్తల పైన ఉన్న కేసులూ ఎత్తేయాలని చెప్పారు. ఒక సందర్భంలో సభలో కేసులున్న సభ్యులు లేచి నిల్చోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా.. దాదాపు 90 శాతం సభ్యులు లేచి నిలబడ్డారు. వీళ్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. -
రంగంలోకి వైఎస్ జగన్.. ఇక బాబు అండ్ కోకు చుక్కలే!
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కసారి రోడ్డు మీదకు రావడం ఆరంభం అయితే ఎలా ఉంటుందో చూశారుగా. దెబ్బకు దెయ్యం దిగివచ్చినట్లు ప్రభుత్వంలో కూడా కాస్త చలనం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించక తప్పలేదు. తెలుగుదేశంవారు హింసకు పాల్పడినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఏమి వ్యాఖ్యానించేవారంటే.. వైఎస్సార్సీపీవారు దాడులు చేసినా ప్రతిదాఢులు చేయవద్దని చెప్పారే తప్ప టీడీపీవారు హింసాకాండకు దిగవద్దని బాబు ఒక్క మాట కూడా అనలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు నోరే విప్పలేదు. హోం మంత్రి అనిత ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, ఇతర నేరాలపై మాట్లాడుతూ తాను లాఠీ తీసుకుని వెళ్లాలా అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ రకంగా ఒక బాధ్యత లేకుండా సాగుతున్న పాలనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారని అనుకోవాలి.వినుకొండ వద్ద జరిగిన రషీద్ దారుణ హత్య తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి స్వయంగా అక్కడకు వెళ్లడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. నెలనర్నరకు పైగా టీడీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినా, వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర కష్టాలపాలవుతున్నా, పార్టీపరంగా గట్టిగా సమాధానం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉండేది. జగన్మోహన్రెడ్డి వెంటనే రంగంలో దిగాలని పలువురు కోరుకునే వారు. కానీ జగన్మోహన్రెడ్డి తొందరపడకుండా ఉండాలని భావించినట్లు ఉన్నారు. అవసరమైనప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు.ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాకముందే జనంలోకి వెళితే భిన్నమైన సంకేతం వెళుతుందని అనుకుని ఉండవచ్చు. కానీ పరిస్థితి రోజు, రోజుకు దిగజారి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తిగా భయాందోళనకు గురి అయ్యారు. 36 మంది హత్యలకు గురి అయ్యారు. వందల మందిపై హత్యాయత్నాలు జరిగాయి. వందల కొద్ది ఆస్తుల విధ్వంసాలు సాగాయి. రెండువేలమందికి పైగా ఇళ్ళు వదిలి వేరే ప్రాంతాలలో తలదాచుకోవలసి వచ్చింది. చివరికి మూడుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిపై దాడి జరిగిన తీరు, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటివద్ద కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన వైనం దారుణంగా ఉన్నాయి. వారిద్దరి కార్లను ధ్వంసం చేయడం, రెడ్డప్ప వాహనాన్ని దగ్ధం చేయడం, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా వీరిపైనే హత్యాయత్నం కేసు పెట్టడం శోచనీయంగా ఉంది.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక రోజులలో ఉన్నామా? అన్న అనుమానం వస్తుంది. దానికి తగ్గట్లుగా చంద్రబాబు, లోకేష్ వంటివారు హింసను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఏపీలో వ్రజలకు రక్షణలేకుండా పోయింది. ప్రతిపక్షం లేకుండా చేయాలని గత టరమ్లో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, ఈసారి కార్యకర్తలను భయపెట్టి వైఎస్సార్సీపీని దెబ్బతీయాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ యువ నేత రషీద్ జరిగిన హత్య సమాచారం తెలిసిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగుళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకుని మరుసటి రోజు వినుకొండకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనకు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. పదిహేను చోట్ల ఏదో కారణం చెప్పి ఆయన కాన్వాయిని పోలీసులు నిలువరించే యత్నం చేశారట. ఆయన వెంట పార్టీ ఇతర నేతలు ఎవరూ రాకూడదని ఆంక్షలు పెట్టారట. చివరికి ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పాతది, సరిగా పనిచేయనిది అని వైఎస్సార్సీపీ వర్గాలు చెప్పాయి. తత్పలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వేరొక వాహనం మారి ప్రయాణించవలసి వచ్చింది.సాధారణంగా తాడేపల్లి నుంచి వినుకొండకు గంటన్నరలో చేరుకోవచ్చు. కానీ వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయా చోట్ల గుమికూడి సాదరంగా స్వాగతం చెబుతుండడంతో కాన్వాయి బాగా ఆలస్యం అయింది. వినుకొండ జనసంద్రమే అయింది. వంద కిలోమీటర్ల దూరం కూడా లేని వినుకొండకు చేరుకోవడానికి ఏడుగంటలకుపైగా పట్టింది. దీనితో వైఎస్సార్సీపీలో ఒక విశ్వాసం ఏర్పడింది. కష్టకాలంలో తమకు పార్టీ అండదండగా ఉంటుందన్న ధీమా వచ్చింది. అధికార తెలుగుదేశం కూటమికి చెందినవారు చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి వారు సిద్ధమవడానికి అవకాశం ఏర్పడింది.రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎండగట్టారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నరకే ఎవరూ ఈ డిమాండ్ చేయరు. కానీ 36 మంది హత్యలకు గురి కావడం, వందలమందిపై హత్యాయత్నం చేయడం, వందల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్ తెగబడడంలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఒక హెచ్చరిక పంపడానికి ఈ డిమాండ్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. డిల్లీలో ధర్నా చేయాలని తలపెట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రిలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంధర్భంలో ఒక కీలకమైన సంగతి ఏమిటంటే తమతో కలిసివచ్చే ఇతర రాజకీయ పక్షాలను కూడా ధర్నాకు ఆహ్వానించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం.ఇంతకాలం వైఎస్సార్సీపీ ఒంటరియానం సాగించింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి సహకరించినా, అందులో భాగం కాలేదు. అలాగే కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో ఎన్డీఏని వ్యతిరేకించినా కాంగ్రెస్ కూటమిలో భాగం కాలేదు. బీజేపీనేమో తమ సొంత రాజకీయం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీతో సంబంధాలకు విఘాతం ఏర్పడింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో ఏవైనా ఈ ధర్నాకు వస్తే విశేషమే అవుతుంది.అలాగే వైఎస్సార్సీపీని దగ్గర చేసుకుంటే ఉపయోగం ఉంటుందని భావించి కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు ఏవైనా డిల్లీలో జరిగే దర్నాకు హాజరైతే ప్రధాన వార్తే అవుతుంది. ఈ రెండు కూటమిలలో లేని పార్టీలవారు ఎందరు వస్తారో చూడాలి. ఎవరు వచ్చినా, రాకపోయినా ఈ ధర్నా జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఒక సూచన అవుతుంది. ధర్నాలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనుసరించవలసిన ప్రక్రియలే. దీనివల్ల దేశ వ్యాప్తంగా ఏపీలో జరుగుతున్న హింసాకాండ గురించి ప్రజలకు, రాజకీయవర్గాలకు తెలుస్తుంది. ఎంత మిత్రపక్షమైనా బీజేపీ కూడా టీడీపీకి హెచ్చరికలు పంపించే అవకాశం ఉంటుంది.శాసనసభలో సైతం గవర్నర్ ప్రసంగ టైమ్లో కానీ, ఇతర సంధర్భాలలో కానీ ఈ అంశాన్ని లేవనెత్తుతామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజలలోకి ప్రభుత్వ పార్టీ హింసాకాండను ఎండగడితేనే టీడీపీలో కాస్త అయినా జంకు వస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డుమీదకు రావడం వల్లే, ఆయనకు జనంలో ఉన్న విశేష ఆదరణ కనిపించడం వల్లే చంద్రబాబు సైతం కాస్త వెనక్కి తగ్గి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఎన్ని విమర్శించినా, రషీద్ హత్య గురించి ఆయన మాట్లాడక తప్పలేదు. శాంతిభద్రతల సమస్యపై వివరణ ఇవ్వక తప్పలేదు. ఎవరు శాంతి భద్రతల సమస్య సృష్టించినా చర్యలు తీసుకోవాలని పోలీసులను మాటవరసకైనా కోరక తప్పలేదు. అది వైఎస్ జగన్మోహన్రెడ్డి పవర్! గెలిచినా, ఓడినా.. సింహం, సింహమే!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులుఇదీ చదవండి: అరాచక పాలనపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా.. ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జగన్ -
యూటర్న్ బాబు.. ఎందుకంత ఉలికిపాటు?
విశాఖపట్నంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. విధ్వంసం సృష్టించారు. విలువైన ప్రింటింగ్ యంత్ర సామాగ్రిని నాశనం చేయాలని చూశారు.. ఇది డెక్కన్ క్రానికల్ అధికారికంగా ఇచ్చిన కథనం. మరో విషయం చూద్దాం. ఏపీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీనిపై ఒక ప్రకటన చేశారు. 'డెక్కన్ క్రానికల్ డిస్ ప్లే బోర్డుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ భావోద్వేగాలను ఇలా చూపరాదు'.ఈ రెండు ప్రకటనల మధ్య తేడాను గమనించారా? తెలుగుదేశం కార్యకర్తలు కేవలం బోర్డును తగులపెట్టారు తప్ప ఇంకేమీ జరగలేదన్నట్లుగా లోకేష్ ప్రకటన ఉంటే, తమ కార్యాలయంపై టీడీపీ గూండాలు ఏ రకంగా దాడి చేసింది, ఫర్నిచర్ తదితర సామాగ్రిని ధ్వంసం చేసింది. మహిళా ఉద్యోగుల పట్ల ఎలా అసభ్యంగా వ్యవహరించింది. ఆఫీస్పై రాళ్లు విసిరిన వైనం మొదలైనవాటి గురించి క్రానికల్ సవివరంగా రాసింది. అంటే ఈ ఘటన తీవ్రత కనిపంచకుండా ఉండడానికి లోకేష్ యత్నిస్తూ, ఒక విషయాన్ని మాత్రం అంగీకరించారు. క్రానికల్ ఆఫీస్పై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనని. క్రానికల్ పత్రిక మాత్రం వారంతా టీడీపీ గూండాలని స్పష్టంగా ప్రకటించింది. వారిలో కొందరు మహిళలు కూడా ఉండడం మరో ప్రత్యేకత. తదుపరి రెండు రోజులకు విశాఖ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై పెద్దగా స్పందించకుండా కార్యకర్తలు ఆఫీస్ల వద్ద నిరసనలు చెప్పవద్దని సలహా ఇచ్చారు. అంతే తప్ప ఇలాంటి దాడులు తప్పు అని చెప్పినట్లు కనిపించలేదు.ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంభవించిన విధ్వంస కాండ గతంలో ఎన్నడూ జరగనిది. టీడీపీ గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు వైఎస్పార్సీపీ అనుకూలరులపై దారుణమైన రీతిలో దాడులు చేశారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. వైఎస్సార్ విగ్రహాలను దగ్దం చేశారు. కొంతమందిని కత్తులతో పొడిచారు. కర్రలతో కొట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి బోర్డులు పీకేశారు. ఇంత జరుగుతున్నా చేష్టలుడిగిన పోలీస్ యంత్రాంగం, మానసికంగా పైశాచికానందం పొందుతున్న టీడీపీ నాయకత్వం కారణంగా టీడీపీ గుండాలు తమ ఇష్టారాజ్యంగా అరాచకాలను కొనసాగిస్తున్నారు. వాటికి పరాకాష్టగా ఇప్పుడు మీడియాపై కూడా దాడి చేశారు.ఇలాంటి ఘటనే కనుక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే మొత్తం దేశం అంతా ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియా హోరెత్తించేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టేవారు. వీలైతే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రి.. ఇలా ఎవరు కలిస్తే వారిదగ్గర ఏపీ అంతా అట్టుడికిపోతోందని చెప్పేవారు. పత్రికా స్వేచ్చ కనుమరుగు అవుతున్నా జర్నలిస్టులకు చీమ కుట్టినట్లు లేదని చంద్రబాబు ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు స్వయంగా టీడీపీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఖండించలేదు. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి చేసినవారిని పట్టుకుని కేసు పెట్టాలని, వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. ఆయనే మాట్లాడనప్పుడు హోం మంత్రి అనిత వంటివారు ఎందుకు పట్టించుకుంటారు!టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న లోకేష్ కూడా ఎక్కడా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పలేదు. క్రానికల్ ఆఫీస్పై దాడి గురించి సిబ్బంది ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. కానీ వారిని చూసి టీడీపీ గూండాలు పారిపోయారని క్రానికల్ తెలిపింది. మరి ఈ దాడులు చేసినవారిని ఎప్పటికి పట్టుకుంటారో, ఎప్పటికి కేసులు పెడతారో తెలియదు. అరెస్టులు చేయకుండా నోటీసులు ఇవ్వడం విశేషం. ఏపీ వ్యాప్తంగా వందలాది చోట్ల టీడీపీ గూండాలు అకృత్యాలకు పాల్పడినా కేసులు పెట్టని పోలీసు యంత్రాంగం విశాఖలో మీడియా ఆఫీస్ మీద జరిగిన దాడి మీద మాత్రం గట్టిగా స్పందిస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడికి వచ్చినవారిని అదుపులోకి తీసుకుంటే మాత్రం అభినందించవచ్చు.మరో విషయం చెప్పాలి. గత ఐదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రంకెలు వేస్తూ, పచ్చి అబద్దాలను ప్రచారం చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏదో ప్రమాదం జరిగిపోయినట్లు ఉపన్యాసాలు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసంపైన, మీడియాపై జరిగిన దాడి మీద కనీసం స్పందించలేదు. అది ఆయన నిజాయితి, చిత్తశుద్ది. ఇప్పటికే సాక్షితో సహా పలు మీడియా సంస్థలపై అనధికార ఆంక్షలు పెట్టి వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇక ప్రత్యక్ష దాడులకు తెగబడడం అత్యంత దురదృష్టకరం.ఇక సంగతి ఏమిటి?విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నది క్రానికల్ రాసిన వార్త సారాంశం. నిజానికి క్రానికల్ ఈ వార్తను ముందుగా వెలుగులోకి తేలేదు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనే పత్రిక ఈ విషయాన్ని వెల్లడించి, టీడీపీ, జనసేనలు విశాఖ ఉక్కు విషయంలో యు టర్న్ తీసుకుంటున్నాయని తెలిపింది. ఒక టాప్ టీడీపీ లీడర్ ఈ విషయం చెప్పినట్లు కూడా ఆ పత్రిక రాసింది. అదృష్టవశాత్తు ఆ పత్రిక కార్యాలయం విశాఖలో లేదు కాబట్టి సరిపోయింది. ఉండి ఉంటే ఆ పత్రిక ఆఫీస్పై కూడా ఇలాగే దాడి చేసి బీభత్సం సృష్టించి ఉండేవారేమో!ఆ తర్వాత రోజు క్రానికల్ పత్రిక అదే వార్తను కొందరు దీనిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం కేంద్రంలో మంత్రులుగా ఉన్న కొందరు ప్రైవేటైజేషన్కు అనుకూలంగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతో కథనాన్ని ఇచ్చింది. అదే ఆ మీడియా చేసిన తప్పట. ఉన్న మాట అంటే ఉలికిపడినట్లుగా, టీడీపీ కూటమి యుటర్న్ తీసుకుంటోందని చెప్పడం వారికి ఆగ్రహం కలిగించింది. నిజానికి తెలుగుదేశంకు, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు యూటర్న్లు తీసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఆ సంగతి దేశ ప్రధాని నరేంద్ర మోదీనే గతంలో ఒకసారి చెప్పి యుటర్న్ బాబు అని పేరు పెట్టారు.నిజంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో టీడీపీ, జనసేనల వైఖరి మారకపోతే అదే విషయాన్ని స్పష్టం చేసి ఉండవచ్చు. ఖండన ఇవ్వవచ్చు. లేదా ఆ పత్రిక అసత్యం రాసిందని వారు భావిస్తే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు. అలాకాకుండా ఇలా దహనకాండకు పాల్పడ్డారంటే ఏమని అనుకోవాలి. ఏపీలో శాంతిభద్రతలు ఇంత ఘోరంగా ఉన్నాయని అర్ధం అవడం లేదా?తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎవరూ ఎందుకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై నిర్దిష్టంగా మాట్లాడడం లేదు. విశాఖ టూర్లో చంద్రబాబు తాము ప్రైవేటైజేషన్కు వ్యతిరేకమని మొక్కుబడిగా చెప్పినట్లు ఉంది తప్ప, దానికి కట్టుబడి ఉంటే ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పిస్తామో చెప్పి ఉంటే కొంత విశ్వాసం ఏర్పడేది.కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్ మూతపడకుండా చూస్తామని అంటున్నారు తప్ప ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టంగా చెప్పినట్లు అనిపించదు. నిజమైన టీడీపీ, జనసేన కార్యకర్తలైతే ముందుగా తమ నాయకులను దీనిపై నిలదీయాలి! కనీసం వాస్తవమా? కాదా?అన్నది తెలుసుకోవాలి. అలాకాకుండా దహనకాండకు తెగబడడం అంటే వారి అరాచక స్వభావాన్ని నగ్నంగా ప్రదర్శించినట్లు అనుకోవాలి! చంద్రబాబు, పవన్ కల్యాణ్లు విశాఖ స్టీల్పై తమ కార్యాచరణను స్పష్టం చేస్తే సరే! లేకుంటే మీడియాలో వచ్చిన కథనాలన్ని వాస్తవమేనని భవిష్యత్తులో తేలుతుంది కదా! అప్పుడు అలవాటు ప్రకారం టీడీపీ కూటమి యూ టర్న్ తీసుకున్నట్లే కదా! దాని గురించి మీడియా రాస్తే మాత్రం దహనకాండకు పాల్పడతారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సూపర్ సిక్స్ కాదిది.. సూపర్ మోసం: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: పిల్లలను బడులకు పంపించడానికి పేదరికం అడ్డు కాకూడదని, బడి ఈడు పిల్లలు పనులకు పోకూడదన్న మంచి సంకల్పంతో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుకునే పిల్లలున్న తల్లులకు ఏటా రూ.15 వేలు ఇవ్వడం ద్వారా పేదరికంలో ఉన్న వాళ్లకు వైఎస్ జగన్ మేలు చేశారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయనటువంటి వినూత్న ఆలోచనను చేసిన నేత ఒక్క జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఒక్క పథకానికే ఏకంగా రూ.26 వేల కోట్లు తల్లుల ఖాతాల్లోకి జమ చేశారన్నారు. ఐదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తెలుగుదేశం కూటమి కాపీ కొట్టడమేకాక, మాట నిలుపుకోలేదని ధ్వజమెత్తారు. ‘ఇంటిలో ఎంత మంది చదువుకున్నా జగన్ ఒక్కరికే రూ.15 వేలు ఇస్తున్నారు. మమ్నల్ని అధికారంలోకి తీసుకొస్తే ఒకరైతే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు అందజేస్తామని ప్రకటిస్తే ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబునాయుడికి ఉందా? లేదా?’ అని నిలదీశారు. ఇదే విషయాన్ని ప్రతి బహిరంగ సభలో కూడా చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్తో పాటు కూటమి నేతలంతా ప్రచారం చేశారని చెప్పారు. వారి ప్రచారానికి సంబంధించిన వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తల్లికి వందనం కాదు.. మోసం తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని చదివితే చాలా అనుమానాలు కలుగుతున్నాయని అంబటి అన్నారు. ఈ జీవో ప్రకారం ప్రతి ఏడాది తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తామని ఉందని చెప్పారు. ఎంత మంది పిల్లలను స్కూల్కి పంపినా రూ.15 వేలు మాత్రమే ఇస్తామని దాని అర్థం అన్నారు. ఇది సూపర్ సిక్స్ కాదని.. సూపర్ మోసమని అభివరి్ణంచారు. ఇది తల్లికి వందనం కాదని.. తల్లికి మోసమని నిప్పులు చెరిగారు. ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్ అయితే, ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు అని చెప్పారు. బాబు మోసంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు? జగన్ వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులు, కుటుంబాలు తాము ఎంత దారుణమైన మోసాలు చేసే వ్యక్తికి ఓట్లేశామో గుర్తించాలని అంబటి సూచించారు. ఇదే జగన్ ఉన్నట్లయితే జూన్ ఆఖరుకు ప్రతి తల్లి ఖాతాలో అమ్మఒడి జమ అయి ఉండేదని, ఇవాళ జూలై వచ్చినా ఆ డబ్బులు రాలేదన్నారు. ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను మార్చి ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున డబ్బులు ఇచ్చి తీరాల్సిందేనన్నారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్సార్సీపీ మీ వెంట పడుతుందని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇప్పుడు చంద్రబాబు చెప్పడం దారుణం అని, ఆ విషయం హామీలు ఇచ్చే ముందు తెలియదా అని నిలదీశారు. వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుని ఉంటే బావుండేదని రాష్ట్ర ప్రజలు అనుకునే రోజులు ప్రారంభమయ్యాయన్నారు. -
ఇద్దరు సీఎంల భేటీ.. పరువు పాయే.. అంతా తుస్సే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు విభజన సమస్యలపై చర్చించుకోవడానికి సమావేశం అవడం ముదావహమే. వారిద్దరి భేటీతో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని చాలామంది ఆశించారు. తెలుగుదేశం మీడియా ఇచ్చిన హైప్ చూసినవారికి ఏదో జరిగిపోతుందన్న భావన కలిగింది. తీరా ఇద్దరు సీఎంల సమావేశం అయిన తర్వాత ఇంతేనా.. ఏదో అయిపోతుందనుకుంటే ఇలా తుస్సుమనిపించారేమిటా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.పేరుకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్ల ప్రకటించినా అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చెప్పలేం. అధికారుల కమిటీ, మంత్రుల కమిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. గత అనుభవం కూడా ఇదే చెబుతోంది. ఈ విభజన సమస్యలు రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరు సీఎంలు దిశానిర్దేశం చేయనిదే కమిటీలు కూడా ఏమీ చేయజాలవు. గతంలో అప్పటి ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు చర్చలు జరిపినప్పుడు కూడా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సంప్రదింపులు కొనసాగించాలని భావించినా, ఆ తర్వాత కాలంలో అవి పెద్దగా జరగకపోవడంతో సీరియస్ నెస్ పోయినట్లయింది.ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగితే మంచిదే. విభజనలో కీలకమైన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దాటవేసే ధోరణినే అవలంబించినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఒకరికొకరు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చుకుంటున్నట్లు కనిపించడానికి ఈ సమావేశం జరిగినట్లు అనిపిస్తుంది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ కు, రేవంత్ కు పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. అలాగే చంద్రబాబును రేవంత్ అప్పుడప్పుడు పొగుడుతుంటారు. చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుడు అనే సంగతి బహిరంగ రహస్యమే. అయినా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి కోస్తా తీరంలో వాటా, టీడీపీలో షేర్ అడుగుతామంటూ లీక్ లు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డిమాండ్లపై గట్టిగా పట్టుబట్టకుండా చేశారన్న భావన కలుగుతుంది.ప్రత్యేకించి పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని ఆస్తులలో తమకు వాటా రావాలన్నది ఏపీ ప్రభుత్వ వాదన. ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలవారు కలిసి హైదరాబాద్ అభివృద్ది చేసుకున్నారు. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా చెల్లించిన పన్నులతో హైదరాబాద్ లో పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, వాటిలో షేర్ ఉంటుందన్నది ఏపీ వాదన. విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూల్ ల లోని ఆస్తుల విభజన ద్వారా ఏపీకి న్యాయబద్దమైన వాటా వస్తుందని ఆశించినవారికి ఈ సమావేశం ఆశాభంగం కలిగించింది.తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న ఆస్తులన్నీ తమవేనని ఉద్ఘాటిస్తోంది. హైదరాబాద్ లో సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ఉంటే, అందులో జనాభా నిష్పత్తి ప్రకారం ఏభై ఎనిమిది శాతం వాటా ఏపీకి వస్తాయని అనుకున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సమావేశం ఏపీకి 75 వేల కోట్ల రూపాయలు రావల్సి ఉందని అంచనా వేసింది. కానీ ఇవేవి చర్చకు వచ్చినట్లు అనిపించదు.ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇంత కీలకమైన రెండు రాష్ట్రాల సమావేశానికి రాకుండా తప్పించుకున్నారా? లేక చంద్రబాబు రమ్మనలేదో తెలియదు కానీ ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ఈ భేటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే, పవన్ కల్యాణ్ అసలు పాల్గొనలేదు. ఈ మధ్యకాలంలో పవన్ కల్యాణ్ ప్రాధాన్యత తగ్గుతోందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రామోజీరావు సంస్మరణ సభలో కేవలం చంద్రబాబు పేరు మాత్రమే వేయడం, ఢిల్లీ టూర్ లో పవన్ కల్యాణ్ లేకుండానే ప్రధాని మోదీని, ఇతరకేంద్ర మంత్రులను చంద్రబాబు ఒక్కరే కలవడం, ఇప్పుడు హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల కీలక చర్చలలో పవన్ కు అవకాశం ఇవ్వకపోవడం వంటివి కొన్ని సందేహాలకు అవకాశం ఇస్తున్నాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రధానిని కలవడం గమనార్హం. పవన్ కల్యాణ్ ఇలాంటి అవమానకర ఘటనల విషయంలో పెద్దగా ఫీల్ కాకపోతుండవచ్చు. ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ భేటీ ఎజెండాను ఖరారు చేయడానికి సమావేశం పెట్టారుకానీ ఆయన ఎందువల్లనో పాల్గొనలేదు. ఈ సంగతి పక్కనబెడితే ఇద్దరు సీఎంలు కలిసిన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడతారని అంతా ఊహిస్తారు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ మీడియాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేది తెలిసిన సంగతే. కానీ వారు మంత్రులకు ఆ బాధ్యత అప్పగించి వెళ్లిపోయారంటేనే దాని అర్ధం ఈ సమావేశం ఫలప్రదం కాలేదని అనుకోవాలి.ఒకవేళ ఏ ఒక్కదానిపైన అయినా అవగాహన కుదిరితే దాని గురించి అయినా ఘనంగా చెప్పుకునేవారు. విభజన సమస్యల వల్ల తెలంగాణకు పెద్దగా నష్టం ఏమీ లేదు. ఎటుతిరిగి ఏపీకే ఈ సమస్యల సత్వర పరిష్కారం అవసరం. తద్వారా నిర్దిష్ట మొత్తంలో నిధులు ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ సాధించలేకపోయిందని అనిపిస్తుంది. హైదరాబాద్ ఉమ్మడి ఆస్తుల గురించి తేల్చలేకపోతే చంద్రబాబు అంతటి సీనియర్ నేత వల్ల ఏపీకి ఏమి ఒరిగిందన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ లో భవనాలు ఇవ్వబోమని, కావాలంటే స్థలాలు ఇస్తాం.. బిల్డింగులు కట్టుకోండని రేవంత్ స్పష్టం చేశారంటే అది ఏపీకి నష్టం చేయడానికే ఆయన వెనుకాడడం లేదని అర్దం. దానిని చంద్రబాబు ఖండించలేకపోవడం, ఏపీ వాటా గురించి పట్టుబట్టలేకపోవడం ఆయన బలహీనత అనిపిస్తుంది. లేదా రేవంత్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు గట్టిగా మాట్లాడలేకపోయారని అనుకోవాలి.అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి ఏడువేల కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఏపీ ఫిర్యాదు చేస్తోంది. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి, హోం మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు. ఆయా అంశాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రింకోర్టుకు కూడా వెళ్లింది. చంద్రబాబు దానిని కొనసాగిస్తారో, లేదో తెలియదు. ఇప్పుడు తెలంగాణ తమకే 24వేల కోట్ల మేర ఏపీ నుంచి రావాలని ఎదురుదాడి చేసింది. అయినా చంద్రబాబు దీనిపై నోరెత్తినట్లు కనిపించలేదు.పోలవరం ప్రాజెక్టు కింద ముంపు మండలాలుగా ఉన్న ఏడింటిని ఏపీలో కలపడంపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. వాటిలో కనీసం ఐదు గ్రామాలనైనా తమకు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరుతోంది. దీనికి ఈ చర్చలలో ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించినట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఏపీ అధికారులు అన్నారని కథనం వచ్చింది. దానిని సానుకూలంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈ అంశంపై లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాదో లో ఉమ్మడి ఆస్తుల విషయంలో తెలంగాణ అంత గట్టిగా ఉన్నా, భద్రాచలం పక్కన ఉన్న గ్రామాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా ఉండడం విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.కృష్ణా జలాలలో తెలంగాణ ప్రభుత్వం అధిక వాటా కోరుతోంది. దానివల్ల ఏపీకి నష్టం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతానికి బాగా ఇబ్బంది వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంంల రేవంత్ తన మనుషుల ద్వారా అడ్డుకున్నారు. అలాంటి ముఖ్యమైన సమస్యలు అసలు చర్చకే వచ్చినట్లు లేదు. ఇద్దరు సీఎంల భేటీ ముందడుగు అంటూ టీడీపీ మీడియా ఊదరగొట్టింది కానీ అది ఏ రకంగానో చెప్పలేకపోయింది. పైగా డ్రగ్స్ అంశంలో ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీశారన్న వాదన వినవస్తోంది. డ్రగ్స్ అంశంలో ఇద్దరు డీజీపీలు సహకరించుకుని కఠినచర్యలు తీసుకుంటే అరికట్టవచ్చు. అది దేశ వ్యాప్త సమస్యగా ఉంది.అయినా ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు అదేదో ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు మాట్లాడడం దారుణంగా ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ తదితర నగరాలలో ఇది ఎంత పెద్ద సమస్యగా ఉందో చెప్పనక్కర్లేదు. కేవలం రాజకీయంగా వైఎస్సార్సీపీపై పిచ్చి ఆరోపణలు చేయడానికి ఇలా ప్రచారం చేసి ఏపీ మంత్రులే రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని చెడగొట్టడం శోచనీయం అని చెప్పాలి. 2017లో టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పట్లోనే ఏపీలో గంజాయి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీడియాకే చెప్పారు. అయినా టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పిస్తారు. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా టీడీపీ మంత్రులు మాట్లాడితే రాష్ట్రానికి ఏమి ప్రయోజనం వస్తుంది?ఏపీ డిమాండ్లకు ముకుతాడు వేయడానికి రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొత్త లీకులు ఇచ్చినట్లు అనిపిస్తుంది. కోస్తా తీర ప్రాంతం, ఓడరేవులలో వాటా ఇవ్వాలని, తిరుమల, తిరుపతి దేవస్థానంలో వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నట్లు మీడియాలో వార్తలు ప్రచారం చేయించింది. అది సంచలనంగా మారింది. ఆ రకంగా ముందరికాళ్లకు బంధం వేయడంతో చంద్రబాబు అసలు కీలకమైన ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు మొదలైన అంశాల గురించి పూర్తి స్థాయిలో ప్రస్తావించలేకపోయారా? అనే సంశయం ఏర్పడుతోంది.ఇటీవల తెలంగాణ కూడా తన ముఖ్యమే అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. అందువల్లే ఏపీ డిమాండ్లపై చంద్రబాబు పట్టలేదనిపిస్తుంది. వీటిపై పట్టుబట్టి రేవంత్ ను ఒప్పించలేకపోతే ఏపీకి ఆయన చాలా నష్టం చేసినవారు అవుతారని వేరే చెప్పనవసరం లేదు. అయినా చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా ఉంది కనుక ముందడుగు అని, ఏదో సాధించేశారనో రాయవచ్చుకానీ, వాస్తవరూపంలో ఏపీకి ఒక్క అంశంలో కూడా మేలు జరిగినట్లు అనిపించదు. ఈ మొత్తం ప్రక్రియ చూస్తే రాష్ట్రాల సమస్యల పరిష్కారం కన్నా, వేర్వేరు కూటములకు చెందిన చంద్రబాబు, రేవంత్ లు తాము రాజకీయంగా కలిసే ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీలో అందుకేనా టీడీపీ చర్యలు!
ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాలన సాగుతోంది? గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సొంత కారణాలతో ఘర్షణపడినా అందులో ఒకరికి వైఎస్సార్సీపీ రంగు పులిమి సైకో పాలన అంటూ విపరీతంగా దుష్ప్రచారం చేసేవారు. ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతున్నా రాష్ట్రంలో హింసాకాండ ఆగడం లేదు. వేధింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం ఒక వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు.తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఒక వైఎస్సార్సీపీ నేత భవనం కూల్చివేత జరిగింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులను టీడీపీ వారు వేధిస్తూనే ఉన్నారు. విధ్వంసం, దహనాలు జరిగిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఇష్టారాజ్యంగా దగ్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సైకో ప్రభుత్వం నడుస్తోందని, ఏపీలో ఆటవిక రాజ్యం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోందని అనిపించడం లేదా! ఇదేనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అనుభవం కలిగి, మరోసారి సీఎం అయిన చంద్రబాబు నుంచి ప్రజలు ఆశించింది!ఆయన రాజ్యంలో పోలీసులు బాధితులపై కేసులు పెడుతున్నారు. బాధితులపై దాడులు చేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించడం లేదు. ఇదంతా ప్రజాస్వామ్య స్పూర్తిగా తీసుకోవాలన్నమాట. రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడకు వెళ్లకూడదని పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసిన తీరు పోలీసుల అసమర్ధతకు అద్దం పడుతుందని అనుకోవాలి.గతంలో చంద్రబాబు నాయుడు తాను చెప్పిన మార్గంలో కాకుండా మరో రూట్లో పుంగనూరు వెళ్లి అక్కడ అరాచకానీకి కారకులయ్యారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని దగ్ధం చేశారు. ఒక పోలీస్ కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ సందర్భంగా కేసులు నమోదు అయ్యాయి. టీడీపీ నేత చల్లా బాబుపై కూడా కేసు పెట్టి అరెస్టు చేశారు. బహుశా అది టీడీపీ వర్గీయులకు కోప కారణం అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వీలు లేదంటూ టీడీపీ వారు అడ్డుపడితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఆ ప్రాంతంలో దౌర్జన్యాలకు గురైన వైఎస్సార్సీపీ వారిని, ఇతర బాధితులను పరామర్శించడానికి వెళ్లడానికి వీలులేదని పోలీసులు ఆదేశించారు.ఇదీ చదవండి: కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముకుతాడురామచంద్రారెడ్డి పర్యటన వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనుకుంటే టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేయాలి కానీ, పెద్దిరెడ్డిని పుంగనూరు నుంచి వెనక్కి పంపించడం ఏమిటి? పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏ టీడీపీ నేత పర్యటనలనైనా ఎవరైనా అడ్డుకున్నారా? కుప్పంలో చంద్రబాబు పర్యటించే క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు సైతం పోలీసులు ఎంతో సంయమనం పాటించి, అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఆయన పర్యటన పూర్తి అయ్యేలా చేశారే! అయినా ఆ రోజుల్లో చంద్రబాబు వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక, వైఎస్సార్సీపీ వారిని ఎవరిని కదలనివ్వడం లేదు. టీడీపీ వారు ప్రత్యర్ధుల పొలాలలోని తోటలను నరికి వేస్తున్నారు. పుంగనూరులో అయితే వైఎస్సార్సీపీ అనుకూలురైన పేదల ఇళ్లలోని ఆవులను కూడా తోలుకుపోతున్నారట.రాష్ట్రంలో అనేక చోట్ల పేదల ఇళ్లను కూల్చుతున్నారు. ఎక్కడో మణిపూర్, ఆస్సోం వంటి రాష్ట్రాలలో నెలల తరబడి హింసాకాండ జరుగుతుంటే ప్రజలు ఎలా భరిస్తున్నారా అని అంతా బాధపడుతుండేవాళ్లం. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతున్నా అందులో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ, బీజేపీ కానీ నోరు విప్పడం లేదు. కొన్ని చోట్ల జనసేన కూడా ఈ విధ్వంసంలో భాగస్వామి అవుతోంది. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. కూటమి నేతలు కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. పుంగనూరుకు ప్రతిష్టాత్మకమైన విద్యుత్ బస్ల తయారీ కర్మాగారాన్ని తీసుకు వస్తే, కూటమి నేతలు దానిని చెడగొట్టి పెట్టుబడులు రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమి చేయాలా? అని సందిగ్ధంలో పడిందట.విశేషం ఏమిటంటే మిథున్ రెడ్డి తిరుపతిలో ఉన్నప్పటికీ, అక్కడకు వచ్చిన పుంగనూరు పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని ఆయనను కలవనివ్వలేదట. పోలీసులు నిజంగానే లోకేష్ ఎర్రబుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. తాను ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్దమని, ప్రభుత్వ అరచాకాలను అడ్డుకుంటానని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు మిథున్ రెడ్డి మాదిరి స్పందించడం ఆరంభించవలసిన అవసరం ఉంది. టీడీపీ వారు కానీ, పోలీసులు కానీ ఎన్నాళ్లు దాడులు చేస్తారు! ఎన్ని కేసులు పెడతారు?గతంలో ఒకసారి పల్నాడులోని ఒక గ్రామంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. వెంటనే దానిని రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటనకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారు. దానిని చంద్రబాబు ఎంతగా విమర్శించింది అందరికి తెలుసు. అదే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్సీపీ వారిపై అంతకన్నా దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ వారు చేస్తున్న క్రిమినల్ చర్యలకు ప్రోత్సాహం ఇస్తోంది. హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావు పేటలో సైతం ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మహిళలని కూడా చూడకుండా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆటవిక చర్యలను ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ప్రతిఘటించికపోతే ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనమవుతుంది. ఏపీ ఒక ఆటవిక రాజ్యంగా మిగులుతుంది.ఈ సందర్భంలో వేమూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జీ వి. అశోక్ బాబు గట్టిగా సమాధానం ఇచ్చిన వైనం ప్రస్తావనార్హం. భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వారు దగ్ధం చేశారు. దానికి నిరసనగా అశోక్ బాబు అక్కడకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారట. దాంతో ఆయన మౌన దీక్ష చేశారు. ఫలితంగా పోలీసులు వెనక్కి తగ్గకతప్పలేదు. అంతేకాక మరో కొత్త విగ్రహాన్ని తెప్పించి ఆయన అదే స్థానంలో ఆవిష్కరించారు. ఇలా ప్రతిచోట టీడీపీ వారి దుండగాలను ఎదుర్కోకపోతే అప్రతిహతంగా ఇలాంటి వాటినే కొనసాగిస్తారు. కేవలం వైఎస్సార్సీపీవారిని భయభ్రాంతులను చేసి టీడీపీ హామీలు ఎగవేసినా ఎవరూ ప్రశ్నించకుండా ఉండడం కోసం కూడా ఈ హింసాకాండ సాగిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కేంద్ర నాయకత్వం కూడా క్రియాశీలకం అయి నిరసనలకు దిగి కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపవలసిన అవసరం ఉందన్న భావన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా నలభై ఆరేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏలుబడి ఇంత అధ్వాన్నంగా ఉందన్న విమర్శలు ప్రజలలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో చంద్రబాబుకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ వారి అరాచకాలను ఆపుతారని, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా ఆదేశాలు ఇస్తారని ఆశిద్దాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక
ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు.. రోజులు మీవే ఉండవని గుర్తు పెట్టుకో చంద్రబాబూ.. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి. ప్రజలు క్షమించని పరిస్థితి వస్తుంది. కచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా ఉంటాయి. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికినట్లే. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేప్పొద్దున మళ్లీ మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి తప్పదు. అటు వంటి తప్పుడు సంప్రదాయాలు ఇప్పటికైనా ఆపండి. ఇలాంటివి ఎవరు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఇలా ప్రోత్సహించడం దుర్మార్గం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఊరుకునేది లేదు. రియాక్షన్ అనేది కచ్చితంగా ఉంటుంది. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్లో రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దాడులు, విధ్వంసాలు ఆపాలని కోరడం లేదని, హెచ్చరిస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇది ఏ మాత్రం న్యాయం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై, మంచి పాలన అందించడంపై చంద్రబాబు దృష్టి పెడితే మంచిదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం వైఎస్ జగన్ ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసక చర్యలు జరుగుతున్నాయి. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటు వైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచిని అర్హత ప్రామాణికంగా ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాం. ఈ రోజు చంద్రబాబునాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ఆ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను విరగ్గొడుతున్నారు.. పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశు పాలుని పాపాల మాదిరిగా పండుతాయి. నెల్లూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరకు వెళ్లి ఫలాన మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, అన్యాయమైన కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే, అలాంటి రాజకీయం ఏ రోజూ నిలబడదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. అందుకే చంద్రబాబులో మార్పు రావాలి. లేదంటే ప్రజలు లెక్కా జమా సరిచేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..పిన్నెల్లిపై ఇంత అన్యాయంగా కక్ష సాధింపా?⇒ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టారు. ఏ రకంగా అన్యాయంగా అతన్ని జైల్లో నిర్బంధించారో చూస్తున్నాం. కారంపూడి ఘటన జరిగిందెప్పుడు? ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు అంటే మే 14న. కారంపూడిలో టీడీపీ ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలోని మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినందున వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి బయల్దేరాడు. ⇒ కారంపూడికి అటు వైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే.. ఎమ్మెల్యే ఊర్లోకి ప్రవేశించక ముందే ఇటు వైపు అడ్డగించారు. గొడవ టౌన్లో జరుగుతుంటే పిన్నెల్లిని ఊరుబయటే అడ్డగించారు. నారాయణస్వామి అనే సీఐని పిన్నెల్లి చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న గొడవ జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23న ఆయనకేదో జరిగింది అన్నట్లుగా ఆ సీఐ, రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. ఆ సీన్లో లేని వ్యక్తిపై ఈ కేసు బనాయించారు. ఇది అన్యాయం కాదా? ⇒ అసలు ఇన్సిడెంట్ నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగి ఉంటే మే 15న మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం సిట్ వేసింది. 17 నుంచి 20వ తేదీ వరకు పల్నాడు ప్రాంతంలో ఆ సిట్ బృందం తిరిగి ఘటనపై రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో ఎందుకు ఈ అంశం రాలేదు? అలాంటప్పుడు ఈ రకంగా హత్యాయత్నం కేసులో ఒక మనిషిని ఇరికించడం ధర్మమేనా?ప్రతి దశలో ఓ రెడ్బుక్⇒ ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల స్థాయిలో రెడ్బుక్స్ అని చెప్పి పెట్టుకున్నారు. చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్బుక్, లోకేశ్ స్థాయిలో ఒక రెడ్బుక్, ఎమ్మెల్యే స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇలా రెడ్బుక్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ⇒ మీ విధ్వంసాలు, దాడులను రాష్ట్రం మొత్తం చూస్తోంది. కానీ ఎవరూ మాట్లాడటం లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. చీనీ చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలు, పొక్లెయిన్ల మీద స్వయంగా ఎమ్మెల్యేలు తిష్ట వేసి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, దాడులు, దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.ఎమ్మెల్యే 10 సార్లు ఫోన్ చేసినా ఎస్పీ స్పందించలేదు⇒ మే 13న ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గరకు అప్పటి ఎమ్మెల్యే వెళ్లినప్పుడు జరిగిన ఘటన మీద మరో కేసు పెట్టారు. అసలు ఆ ఘటన ఎందుకు జరిగింది? అక్కడ ఉన్న ఎస్సీ సామాజిక వర్గం వారు పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేనప్పుడు ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్లారు. ఆ పరిస్థితులను చూసి ఎస్పీకి 10 సార్లు ఫోన్ చేసినా కూడా స్పందించని పక్షంలో కనీసం సీఐని, ఎస్సైని పంపించండనే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఘటన జరిగింది. ఆ ఈవీఎం పగలగొట్టిన కేసులో తనకు బెయిల్ వచ్చింది. కానీ ఎవరిపైనో హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టి ఇవాళ జైలు పాలు చేశారు. ⇒ ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున కేసులు పెట్టారు. రిగ్గింగ్ను అడ్డుకునే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తే, హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్టులో చెప్పాలి కదా? 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు పిన్నెల్లి గెలిచాడంటే మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంత వరకు ధర్మం? ఈ రోజు ఇది రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇలానే జరుగుతోంది. ⇒ వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, అంబటి రాంబాబు పిన్నెల్లితో ములాఖత్లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి తదితరులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు.ప్రజలు మీకు ఓటు వేసింది ఎందుకు?⇒ ప్రజలకు మంచి చేసి వైఎస్సార్సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితులయ్యారు. 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్నారు. ఖరీఫ్లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు. ఇంత వరకు రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానన్న దానికి అతీగతీ లేదు.⇒ బడులు మొదలయ్యాయి. అమ్మ ఒడి కింద జగన్ రూ.15 వేలు ఐదేళ్ల పాటు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తానని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు. తల్లికి వందనం కింద ఆ డబ్బులేమయ్యాయి అని ప్రతి తల్లీ అడుగుతోంది. ⇒ 18 ఏళ్లు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లే. అందరూ 18 సంవత్సరాలు నిండిన వారే. ప్రతి నెలా రూ.1500 ఇస్తానన్నావు, ఏమైంది? అని వీరందరూ ఈ రోజు అడుగుతున్నారు. ⇒ వీటన్నింటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రజలు ఎందుకు తమకు ఓటు వేశారు అని చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. ఇవేవీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు నెలకొల్పాలి.. రాష్ట్రంలో రావణకాష్టం రగిలించాలి.. దొంగ కేసులు పెట్టి ఇరికించాలి.. ఆస్తులను ధ్వంసం చేయాలి.. వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారెవరినీ ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం. -
బాబు ‘బిల్డప్’ షురూ.. సూపర్ సిక్స్ అయిపోయినట్లేనా..!?
ఏపీలో సామాజిక పెన్షన్ల రాజకీయం తమాషాగా ఉంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ప్రాంతం చూడం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం.. అని స్పష్టంగా చెప్పి ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా కార్యక్రమాలు అమలు చేసింది. అందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పెన్షన్లను వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. ఎక్కడా వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రమేయం లేకుండానే సాగిపోయేది. వలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగం కనుక వివాదం, పబ్లిసిటీ లేకుండా పెన్షన్లు పంచేవారు. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓటమిపాలైంది.కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తాను చెప్పిన విధంగా ఈ నెలకైతే పెంచిన సామాజిక పెన్షన్ లు ఇచ్చింది. అంతవరకు ఒకే. మిగిలిన స్కీముల గురించి ఇంకా చెప్పకపోయినప్పటికీ ఇప్పటికే అమలులో ఉన్న పెన్షన్ కు మరో వెయ్యి రూపాయలు పెంచి, మూడు నెలల బకాయిలు చెల్లించారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. కానీ ఇదేదో ఇప్పుడే సరికొత్తగా కనిపెట్టినట్లు, మొత్తం రాజకీయ కార్యక్రమంగా మార్చి టీడీపీ ప్రచారానికి వాడుకోవడం మాత్రం ఆక్షేపణీయమే.జూలై ఒకటిన జరిగిన తంతు చూశాకా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమాయకత్వంగా చిత్తశుద్దితో రాజకీయాలకు అతీతంగా వలంటీర్లు ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారా అనే భావన ఎవరికైనా రావచ్చు. అదే చంద్రబాబు అయితే ఫక్తు తనదైన రాజకీయ శైలిలో గతంలో జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈసారి తన పార్టీ కార్యకర్తల ద్వారా వీటిని పంపిణీ చేయించారు. వలంటీర్లు లేకుండానే పంపిణీ చేయగలం చెప్పుకోవడంతో పాటు ప్రచారం కూడా భారీగా రావాలన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేశారన్నది అర్ధం అవుతూనే ఉంది.ఇప్పటికే పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా పార్టీ కార్యకర్తల ద్వారా డబ్బు పంపిణీ చేయించవచ్చా అని అడిగితే ఎవరు బదులు ఇస్తారు. వారికి ఉన్న చట్టబద్దత ఏమిటని ఎవరు ప్రశ్నిస్తారు? పైగా టీడీపీ కేంద్ర కార్యాలయమే దీనిపై ఆదేశాలు ఇచ్చి మరీ కార్యకర్తలను రంగంలోకి దింపింది. పేరుకు సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇస్తారని తెలిపినా, హడావుడి చేసి ఫోటోలు దిగింది మాత్రం టీడీపీ, జనసేన కార్యకర్తలే. కొన్ని చోట్ల వీరి మధ్య గొడవలు కూడా జరిగాయట. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలో, సిబ్బందో ఐదువందల రూపాయలు కట్ చేసుకుని పెన్షన్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. మరికొన్నిచోట్ల వృద్ధుల ఇళ్లకు వెళ్లకుండా, అందరిని ఒక చోటకు పోగు చేసి పెన్షన్లు అందచేశారు. వైఎస్సార్సీపీకి సంబంధించినవారని చెప్పి పలాస తదితర కొన్నిచోట్ల పెన్షన్ ఇవ్వకుండా నిలుపుదల చేశారు. భవిష్యత్తులో పెన్షన్ దారుల సంఖ్యలో కోత పెట్టబోతున్నారని కూడా సమాచారం వస్తోంది.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సైతం స్వయంగా ఒక లబ్దిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం విశేషం. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా చేయలేదు. ఈసారి అలా చేయవలసి వచ్చిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వ్యవస్థ ప్రభావమే అని చెప్పాలి. అంతకు ముందు పద్నాలుగేళ్లు తాను సీఎంగా ఉన్నప్పుడు మాదిరి ఇప్పుడు కూడా లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని చంద్రబాబు చెప్పి ఉంటే నానా రభస అవుతుందని భయపడి ఇళ్లవద్దే పెన్షన్ పంపిణీ చేశారు. చివరికి ఆయన కూడా వలంటీర్ పాత్ర పోషించారని వైఎస్సార్సీపీవారు చమత్కరిస్తున్నారు.ఇక్కడే చంద్రబాబు అనండి.. తెలుగుదేశం వారు అనండి.. తమదైన శైలిలో అసత్యాలు చెప్పే యత్నం చేశారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఇదే తొలిసారి అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లలో చివరి మూడు నెలలు తప్ప మిగిలిన కాలం అంతా వృద్దులు, వికలాంగులు, తదితర వర్గాలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే సంగతి దాచేస్తే దాగని సత్యం. ఎన్నికల సమయంలో వలంటీర్లు ఈ కార్యక్రమం జరపకుండా అడ్డుపడిందే కూటమి నేతలు అనే సంగతి తెలిసిందే.జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వలంటీర్లు లేకపోతే పంపిణీ ఆగిందా అని ప్రశ్నించడం ద్వారా తన నైజం ప్రదర్శించుకున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల వద్ద లంచాలు తీసుకున్నారని ఆరోపించి వారిపై విషం కక్కారు. వారిపై ఇంకా తన అక్కసు తీరలేదని రుజువు చేసుకున్నారు. తీరాచూస్తే ఇప్పుడు కొంతమంది చేతివాటం ప్రదర్శించారని వీడియో సహితంగా తేలింది. అదే టైమ్ లో వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చంద్రబాబుతో పాటు తాను ఎందుకు హామీ ఇచ్చింది మాత్రం పవన్ కల్యాణ్ వివరించలేదు. పైగా వారిని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇస్తున్నారు. వారికి ప్రత్యామ్నయా ఉపాధి చూపుతారట.ఉన్న ఉద్యోగం పీకి కొత్తగా ఏదో చేస్తామంటే నమ్మడానికి జనం పిచ్చివారా! అబద్దాలు చెప్పినా జనం ఓట్లు వేసి గెలిపించారు కనుక వారు పిచ్చోళ్లే అని పవన్ కల్యాణ్ భావిస్తుండవచ్చు. తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పారు. లబ్దిదారుల అర్హతలపై రీసర్వే చేయించాలని అన్నారు. అంటే దాని అర్థం.. లబ్దిదారులలో కోత పెడతామనే కదా! ఈ సంగతి ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు. కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని మాత్రమే ఎందుకు ప్రచారం చేశారు. ఇది జనాన్ని మాయ చేయడం కాదా? అని అడిగితే జవాబు ఏమి ఉంటుంది. ఇక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికి గుర్తుకు వస్తారు. ఆయన పార్టీలు చూడకుండా ప్రజలకు మేలు చేయాలని తలపెట్టి దెబ్బతిన్నారు.చంద్రబాబు నాయుడు అయితే యథా ప్రకారం ప్రవచనాలు వల్లించారు. పేదరికం లేని సమాజం సృష్టించడమే ఆయన లక్ష్యమట. ఈ మాట 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. కాలం ఆయనకు కలిసి వచ్చి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ, పేదరికం మాత్రం పోలేదు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. ఆ బ్రహ్మ పదార్ధం ఎలా ఉంటుందో ఎవరికి కనిపించదు. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా ఉంటాయి ఈ మాటలు. పోలవరం పూర్తి అయితే సంపద వచ్చేసేదట. పేదరికం పోయేదట. ఆయన పాలన ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా! అయినా పేదరికం ఎందుకు కొనసాగుతోంది. జనాన్ని మభ్య పెట్టడానికి ఇలాంటివి మాట్లాడుతుంటారు. అందులో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిందని విమర్శించిన చంద్రబాబు తాను పవర్ లోకి వచ్చిన ఇరవైరోజులలోనే ఏడువేల కోట్ల అప్పు చేశారు. ఈ అప్పులనే సంపద అని ప్రజలు అనుకోవాలి కాబోలు. ఈ అప్పులలో తమకు ఎంతో కొంత వాటా వస్తుంది కనుక, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కూడా ఈ అప్పులపై నోరు విప్పడం లేదు. చంద్రబాబుకు అనుభవం ఉంది కనుకే పెన్షన్లు ఇవ్వగలిగారని పవన్ కల్యాణ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే మరి గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దగా ప్రచారం లేకుండానే ప్రతి నెల మొదటితేదీకే పెన్షన్లు ఇచ్చింది కదా! అది గొప్ప విషయం కాదా? చంద్రబాబు తన అనుభవంతో అప్పులు తెచ్చారని పవన్ భావిస్తున్నారా! ఈ అప్పులతో రాష్ట్రం శ్రీలంక అవ్వదని కూడా ఆయన చెప్పి ఉండాల్సింది.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించిన చంద్రబాబు ఈసారి ఒక్క పవన్ కల్యాణ్ కు మాత్రమే ఆ పదవి కట్టబెట్టి వెయిట్ పెంచారని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత అన్నిచోట్ల పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయన ఫోటోలు సైతం ఉంచాలని చంద్రబాబు చెప్పినట్లు లీకులు వచ్చాయి. కానీ వారంతా భావిస్తున్న ఇంత ప్రతిష్టాత్మక కార్యకమం ప్రచార ప్రకటనలో మాత్రం పవన్ కల్యాణ్ ఫోటో కనిపించలేదు. ఒక్క చంద్రబాబు ఫోటోనే ప్రచురించారు. రామోజీరావు సంస్మరణ సభ ప్రకటనలో కూడా పవన్ కల్యాణ్ పేరే వేయలేదు. అదేదో చంద్రబాబు రాజగురువు సంస్మరణ సభ కనుక పవన్ కల్యాణ్ పేరు వేయలేదులే అని అనుకున్నారు. కానీ పెన్షన్లు పంపిణీ ఇది ప్రభుత్వపరంగా చేసిన ప్రతిష్టాత్మక కార్యక్రమం కదా! అయినా పవన్ కల్యాణ్ పోటో వేయలేదేమిటా అని జనసేన వారు ఆవేదన చెందుతున్నారు.పవన్ కల్యాణ్ వెనుక ఉన్న సామాజికవర్గం వారు కూడా మదన పడుతున్నారు. ఆయా రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా ప్రచారంలో వాడుతుంటారు. అయినా పవన్ కల్యాణ్ దీనిని అవమానంగా భావించకపోవచ్చు. టీడీపీ వారు ఏమి చేసినా పడి ఉండడానికి ఆయన ఎప్పుడో సిద్దపడిపోయారన్న భావన ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రహితంగా ఇలాంటి సంక్షేమ స్కీములు ఎన్నిటినో అమలు చేసి తన మంచిని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తే తద్విరుద్దంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దీనిని ఫక్తు రాజకీయం చేసి పార్టీ కార్యక్రమం చేశారు. ఒక్క స్కీము అమలు చేసి, సూపర్ సిక్స్ అయిపోయినంతగా బిల్డప్ ఇచ్చే యోచనలో ఉన్నారు. చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు ఏమి చెప్పినా, ఏమి చేసినా అంతా రైటే అని జనం ఒప్పుకుంటారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
విరాళాలు, ఆస్తుల అమ్మకం.. ఆ విజన్కు ప్రపంచ స్థాయి అట!
సాక్షి, అమరావతి: ‘అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగు జాతికి జగన్ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకోరు. విధ్వంసానికి జగన్ ఒక కేస్ స్టడీ. మాకు రాజధాని లేదు అని చెప్పుకునేంత పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? రాష్ట్రంలో పుష్కలంగా వనరులు ఉన్నాయి. తెలివి గల మానవ వనరులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేశారు’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ఒక టైమ్ బాండ్ అంటూ పెట్టుకోలేదని, పాత ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళతామని స్పష్టం చేయడం చూస్తుంటే.. గత ప్రభుత్వం చెప్పిందే నిజమని స్పష్టమవుతోంది. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదని, రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు అమరావతి పేరును సూచించారన్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుంచి.. దేశంలోని అన్ని పవిత్ర ప్రదేశాల నుంచి నీరు, మట్టిని కూడా తీసుకొచ్చామన్నారు. కుప్పం వారికైనా, ఇచ్ఛాపురం వారికైనా అమరావతి సమదూరంగా ఉంటుందని, అందువల్లే ఇక్కడ రాజధాని నిర్ణయించినట్టు చెప్పారు. బుద్ధి ఉన్న ఏ వ్యక్తీ అమరావతి రాజధానిని వ్యతిరేకించరని, రాజధానికి రెండు వైపులా 12 చొప్పున ఎంపీ స్థానాలు ఉన్నాయని, విభజన అనంతరం శివరామృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటించి కృష్ణా, గుంటూరు లేదా ఆ 2 జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు చెప్పిందన్నారు. ఏటా 3 పంటలు పండే మంచి భూమిని రాజధాని కోసం తీసుకోవడం సరికాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని ఇక్కడ ఆయన వక్రీకరించి అనుకూలంగా మార్చుకున్నారు.హైదరాబాద్కు కరెంట్, నీళ్లు.. బాబు ఘనతేనటగతంలో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.15 వేల కోట్లు ఆర్థిక లోటు ఉన్నా, సైబరాబాద్ నిర్మాణ అనుభవంతో అమరావతిని నిర్మించాలని ఆలోచించామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్కు నాడు సరిగా కరెంట్, నీళ్లు లేవని.. రానురాను అన్నీ కలిసొచ్చాయన్నారు. ఎంత మంది ప్రయత్నించినా వీలుపడని కృష్ణా జలాలను హైదరాబాద్కు తీసుకొచ్చామని, 14 రోజుల పాటు అమెరికాలో తిరిగి ఐటీ పరిశ్రమలను కూడా సైబరాబాద్కు తీసుకొచ్చినట్టు సీఎం వివరించారు. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చామని, తన హయాంలో సాగు నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఎయిర్ పోర్టులకు భూములు ఇచ్చిన వారు సంతృప్తిగా ఉండేలా చేశానని బాబు గొప్పలు చెప్పుకున్నారు. తొలుత అమరావతికి ల్యాండ్ పూలింగ్ సాధ్యమవుతుందా.. అని అనుమాన పడినా, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను 29,966 మంది రైతులు ఇచ్చారన్నారు. ఈ రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వాలని నిర్ణయించామని, వ్యయసాయ కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్ అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 1నే దాన్ని రూ.5 వేలకు పెంచి అందించామన్నారు. వాస్తవంగా పెన్షన్ను పెంచింది గత ప్రభుత్వమనే విషయాన్ని మరచి తన ఖాతాలోకి వేసుకోవడం బాబుకే చెల్లింది.గత ప్రభుత్వంపై ఏడుపువైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభించారని, కనీసం నిబంధనలు కూడా పాటించకుండా ప్రజా వేదికను కూల్చేశారని, తర్వాత మూడు రాజధానులు ప్రకటించారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘జీఎన్.రావు, బోస్టన్ కమిటీ అంటూ ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేశారు. ప్రజావేదిక శిథిలాలను తొలగించవద్దని ఇప్పుడు అంతా చెబుతున్నారు. అది చూస్తే ప్రతి ఒక్కరిలో గత ప్రభుత్వ విధ్వంసం గుర్తుకు రావాలి. జగన్ నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారు. తిరుపతి యాత్రకు వెళితే ఉండటానికి మండపాలు ఇవ్వకుండా వేధించారు. అరసవెల్లి యాత్రకు వెళితే దాడులు చేసి మధ్యలోనే నిలిపేయించారు’ అని సీఎం చంద్రబాబు మొసలి కన్నీళ్లు కార్చారు. గత పాలకులు అధికారంలోకి రాగానే రాజధానిలో అన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారని, వ్యవసాయ కూలీలకు అందించాల్సిన పెన్షన్లు, రైతులకు ఇవ్వాల్సిన కౌలు నిలిపేశారని, మాస్టర్ ప్లాన్ రద్దు చేశారని, రూ.1000 కోట్లు గ్రాంట్ రాకుండా కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేశారని.. ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. సింగపూర్ కన్సార్టియంపైనా ఆరోపణలు చేశారని, 14 ఎకరాల్లో 12 టవర్లతో నిర్మాణం తలపెట్టిన హ్యాపీ నెస్ట్ను నాశనం చేశారని, అది పూర్తయితే ప్రభుత్వానికి రూ.57.37 కోట్లు ఆదాయం వచ్చేదని, మున్ముందు రూ.885 కోట్లకు పెరిగేదన్నారు. కానీ దాన్ని కూడా నాశనం చేయడంతో ఇప్పుడు రూ.164.5 కోట్ల నష్టంతో పాటు రాజధాని పరిధిలోని రోడ్లు, భవనాలు దెబ్బ తిన్నాయన్నారు.నిర్మాణ ఖర్చు పెంచడానికే ఈ మాటలు..గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసంతోనే రాజధాని నిర్మాణం ఖర్చు పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పడం చూస్తుంటే మళ్లీ ఎస్టిమేషన్లు పెంచుకోవడం కోసమేనని తెలుస్తోంది. ‘రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లింది. సంపద ఉత్పత్తి పెరగలేదు. అన్ని రంగాలు రివర్స్ అయ్యాయి. నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలో ఉన్న పనులు పూర్తవలేదు. రెవెన్యూ ఆదాయం తగ్గిపోయింది. ఏపీలో భూముల విలువ కూడా తగ్గిపోయింది. హైకోర్టు, హెచ్వోడీ, సచివాలయాల భవనాల ఐకానిక్ పునాదులన్నింటినీ నీళ్లలో ముంచేశారు. గెజిటెడ్ అధికారులు, మంత్రులు, జడ్జీల కోసం నిర్మించ తలపెట్టిన వాటిని కూడా అర్ధంతరంగా నిలిపేశారు. నేను పడ్డ కష్టం వృధా అయింది. అది చూస్తే మనసు నిగ్రహం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాజధాని కాలం కూడా అయిపోంది. పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయారు. సింగపూర్ ప్రతినిధులు వస్తారో రారో తెలీదు. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం మనది. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? నన్ను ఇబ్బందులు పెట్టారని నేను మాట్లాడడం లేదు. జగన్ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూడదు. బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతా’ అని అన్నారు.ఉద్యోగ కల్పనకు నిలయంగా రాజధాని రూపకల్పనరాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారికి ఉద్యోగాల కల్పన అమరావతిలో జరుగుతుందని సీఎం చంద్రబాబు మరోసారి చుక్కలు చూపారు. ప్రతి పంచాయతీ సంక్షేమానికి ఇది నిక్షేపంలా ఉంటుందన్నారు. అమరావతి నాది అని చెప్పుకునేలా ప్రణాళిక రూపొందించామని, మాస్టర్ ప్లాన్లో మార్పులు లేవని తెలిపారు. గతంలో రూపొందించిన అదే మాస్టర్ ప్లాన్ను కొనసాగిస్తామన్నారు. ఇన్ని చెప్పిన బాబు.. అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని, కొన్ని ఆస్తులు అమ్మి సంపద సృష్టిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం ఎన్నో సందేహాలకు తెర లేపింది. ఇక్కడ భూములమ్మిన వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొంటే అక్కడ కూడా విలువ పెరుగుతుందని, ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగి ఉంటే ప్రభుత్వానికి కూడా పన్నులు, జీఎస్టీ రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్నారు. విట్, ఎస్ఆర్, అమృత్ లాంటి యూనివర్సిటీల్లో పేద పిల్లలు చదువుకుంటే కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయని యువతను మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. రాజధాని పునర్నిర్మానంపై కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పారు. రాజధాని పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే పనులు ప్రారంభిస్తామే తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి సెంటు పట్టాలని డ్రామాలాడారని, ఇల్లు లేని వారికి వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ లెక్కన అమరావతిలో పేదలకు స్థానం లేదని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఎయిమ్స్కు కూడా నీళ్లివ్వకుండా గత ప్రభుత్వం వేధించిందని, తద్వారా పడకల పెరుగుదలకు అవరోధం ఏర్పడి ఆసుపత్రిలో ఓపీలు కూడా తగ్గాయని చెప్పారు. ఏ లెక్కన చంద్రబాబు ఈ మాట చెప్పారో అర్థం కావడం లేదు. వాస్తవానికి ఎయిమ్స్లో ఓపీలు పెరగడం గమనార్హం. గతంలో అనుమతులు పొందిన 132 సంస్థలకు గాను 122 సంస్థలు అమరావతికి రాలేదని చెప్పుకొచ్చారు. ఆ విజన్కు ప్రపంచ స్థాయి అట!అమరావతిలో 53,748 ఎకరాలు సేకరించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్లు, ఇతర నిర్మాణాలకు 27,885 ఎకరాలు, రిటర్నబుల్ ప్లాట్ల కింద 11,826, ఇతర అవసరాలకు 14,037 ఎకరాలు పోను ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వద్దనున్న భూమిని విక్రయించి రాజధాని నిర్మాణం చేయొచ్చని ఆలోచించామని, కేంద్ర ప్రభుత్వం కేపిటెల్ గెయిన్ మినహాయింపునిచ్చి రూ.2,500 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుని రూ.1,500 కోట్లు కూడా అందించిందన్నారు. నాడు రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జేఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చాయని, సింగపూర్తో ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. మొదట సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, తర్వాత రాజధాని మాస్టర్ ప్లాన్ను సింగపూర్ సంస్థ అందించిందన్నారు. దేశంలోనే స్మార్ట్ సిటీగా, ప్రపంచ స్థాయి ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్ రూపొందించినట్టు చెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్తో పాటు అన్ని విభాగాలు ఒకేచోట ఉండాలని మాస్టర్ ప్లాన్లో నిర్ణయించామన్నారు. దేశంలో ఏ సిటీకి లేనంత మేర నదీ ప్రాంతం అమరావతికి ఉందని, రెండు నదులను అనుసంధానం చేసే కాన్సెప్ట్తో నగరానికి రూపకల్పన చేశామన్నారు. రూ.51,687 కోట్లతో రాజధాని పనులకు అంచనా వేసి, రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచామని, అప్పటికే జరిగిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించామని, రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండింగులో ఉందన్నారు. -
ఏపీలో మొదలైన ముసళ్ల పండగ
గతంలో ఒక ప్రచార ప్రకటన వచ్చేది. ఈ నగరానికి ఏమైంది.. ఎటు చూసిన పొగ, నుసి.. అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అది కాలుష్యానికి సంబంధించినది అయితే, ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కు కూడా ఆ ప్రకటన సూట్ అయ్యేలా ఉంది. ఏపీలో ఎటు చూసినా జరుగుతున్న విధ్వంసం, హింసాకాండ గమనించిన తర్వాత ఈ ప్రకటన మాదిరే ఏపీ తయారైందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేసేది. కోడ్ అమలులోకి రావడంంతోనే అన్నీ తలకిందులు అవడం ఆరంభమైంది. ప్రభుత్వాన్ని సజావుగా నడవనివ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అన్ని ప్రయత్నాలు చేసేవి. ఎన్నికల కమిషన్ కూడా ఆ కూటమికి తన వంతు సాయం అందించింది. వలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా వృద్దులు పెన్షన్ పొందడానికి నానా పాట్లు పడేలా చేశారు.అవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతోనే హింసాకాండ, విద్వంసం వంటివి రాజ్యమేలాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన అరాచక శక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాయి. ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వంటివారు వారిని ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ పరిణామాలపై స్పందించకుండా కథ నడుపుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పరస్పరం పొగుడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.మరో వైపు ఏపీ వ్యాప్తంగా పారిశుద్ద్యం కొరవడి డయారియా వంటి వ్యాధులు ప్రబలాయి. నీటి కాలుష్యం తోడవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటివి వస్తే వెంటనే వలంటీర్లు ఆరా తీసి తగు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వానికి సమాచారం అందించేవారు. కరోనా వంటి పెద్ద సంక్షోభాన్ని సైతం వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆ ప్రభుత్వం ఎదుర్కుంది. కానీ గత పది, పదిహేను రోజులుగా ఈ విషయాలను పట్టించుకున్నవారే ఉన్నట్లు లేరు. కాకినాడ, జగ్గయ్యపేట, నంద్యాల మొదలైన చోట్ల గ్రామాలలో అతిసార వ్యాపించి పది మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనేక మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు.అదొక్కటే సరిపోదు. గ్రామాలలో కలుషిత సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలించి చర్యలు చేపట్టాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి ఉండాలి. కానీ ఆయన ఇది తన శాఖకు సంబంధించింది కాదనుకున్నారో, ఏమో కానీ గ్రామాలలో పారిశుధ్ద్యంపై చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చి గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే పట్టణాలలో అయితే మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించి సిబ్బందితో పని చేయించాలి. లేకుంటే ఈ సమస్యమరింత ప్రబలుతుంది.ఇక్కడ మరో సంగతి చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ టైమ్ లో ఎక్కడైనా కలుషిత సమస్య వచ్చి ఒకరిద్దరు మరణించినా, కొంతమంది ఆస్పత్రిలో చేరినా దానిని బూతద్దంలో చూపించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రస్తుతం తెలుగుదేశం ఏలుబడిలో మాత్రం ఇందుకు సంబంధించిన వార్తలను ప్రముఖంగా ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఇంకో వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్రానికి వందల కోట్ల ఆదాయం తీసుకువస్తే, ప్రస్తుతం అది అంతా అక్రమార్కుల పాలవుతున్నట్లుగా ఉంది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లో పోగుచేసిన ఇసుక గుట్టలు, గుట్టలుగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆ ఇసుకను గతంలో ఒక సిస్టమ్ ప్రకారం విక్రయించేవారు. టీడీపీ కూటమి ఇసుకను ఉచితం చేస్తామని హామీ ఇచ్చింది. అది అక్రమార్కులకు వరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఆయా చోట్ల విజృంభించి అందుబాటులో ఉన్న ఇసుకను తమ ఇష్టారీతిన అమ్ముకుంటున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల ఇలా లారీ ఒక్కింటికి పదమూడు వేల రూపాయల నుంచి పదహారువేల రూపాయల వరకు వసూలు చేసుకుంటూ అక్రమ రవాణా చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం స్పందించినట్లు కనిపించలేదు. ఈసరికే సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఇసుక టీడీపీ, జనసేనలకు చెందిన నేతల పరమైందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం పనిచేస్తోందో, లేదో అన్నట్లుగా పరిస్థితి ఉంటే అది ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదు.ఇదిలా ఉంటే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడం కూడా అంత తేలికకాదు. దాంతో ఆ అంశాలను డైవర్ట్ చేసే లక్ష్యంతో కూటమి పెద్దలు, వారికి సపోర్టు చేసే మీడియా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్సార్సీపీపైన పలు కథలు సృష్టించి జనం మీదకు వదలుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేసిన ఐదేళ్లు వీరు వెంటాడారు. ఓటమి తర్వాత కూడా అదే పనిచేస్తున్నారు. ఉన్నవి, లేనివి కలిపి అబద్దాలను వండి ప్రజలపై రుద్దుతున్నారు. వైఎస్సార్సీపీ ఆఫీస్ ల నిర్మాణంలో ఏవో అక్రమాలు జరిగాయని, అనుమతులు లేకుండా నిర్మించారంటూ స్టోరీలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ మాత్రమే ప్రభుత్వ స్థలాలు తీసుకున్నట్లు, తెలుగుదేశం అసలు తీసుకోనట్లు చిత్రీకరిస్తున్నారు.మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్య కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైఎస్సార్సీపీ ఆయా జిల్లాలలో నిర్మించిన భవనాలను పాలస్ లతో పోల్చుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. విశేషం ఏమిటంటే ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీస్ లకు ఇవ్వడానికి అధిక చొరవ తీసుకున్నది చంద్రబాబు నాయుడే. 1997లో ఉమ్మడి ఏపీలో ఎన్.టి.ఆర్ ట్రస్ట్ పేరుతో హైదరాబాద్ లో కెబిఆర్ పార్కు ఎదుట అత్యంత ఖరీదైన హుడా భూమిని దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నది చంద్రబాబు నాయుడే. అందులో పార్టీ ఆఫీస్ ను నడిపింది ఆయనే. అది ఏమీ చిన్న ఇల్లు కాదు. ఒక భారీ భవంతి.ఆ రోజుల్లో విపక్ష నేతగా ఉన్న పి జనార్ధనరెడ్డి ప్రభుత్వ భూమిని టీడీపీ ఆఫీస్ కు కేటాయించుకోవడంపై పెద్ద పోరాటమే చేశారు. కానీ అదేమి ఫలించలేదు. బహుశా లోకేష్ కు ఈ విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన అప్పటికి విద్యార్ధిగానే ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీలో పలు జిల్లాలలో ప్రభుత్వ భూములలో, కొన్నిచోట్ల అస్సైన్డ్ భూములలో కూడా పార్టీ ఆఫీస్ లు నిర్మించుకున్నారు. ఇందుకోసం జీఓలు కూడా ఇచ్చారు. అంతదాకా ఎందుకు!? పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లి వద్ద చెరువు, డొంక ప్రాంతం కూడా కొంత ఆక్రమించి నిర్మించారన్న అభియోగాలు ఉన్నాయి. తీసుకున్న అనుమతులు మించి అంతస్తులు కట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇది కానీ, జిల్లాలలో నిర్మించిన భవనాలు కూడా చిన్నవేమీ కాదు.లోకేష్ పరిభాష ప్రకారమే అయితే అవి కూడా పాలస్ లే అవుతాయి. రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలు నిర్మించుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాకాకుండా పొరపాట్లు చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. దీనిని బూతద్దంలో చూపుతూ టీడీపీ కథ నడుపుతోంది. అనేకమార్లు బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు తెచ్చే ప్రభుత్వాలు, ఇప్పుడు పార్టీ ఆఫీస్ లకు కొంత సమయం ఇచ్చి ఒకవేళ భవనాలకు అనుమతి లేనట్లయితే వాటిని రెగ్యులరైజ్ చేస్తే పద్దతిగా ఉంటుంది. ఎందుకంటే ఇవేమీ ఆక్రమిత స్థలాలు కావు. ఈ భవనాల నిర్మాణ సమయంలో అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారని తేలుతున్నందున ఆ బిల్డింగ్ లను క్రమబద్దం చేస్తే బెటర్. కాకపోతే గురివింద గింజ తన నలుపు తెలుసుకోలేదన్నట్లుగా, టీడీపీ వారు వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం.నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ భవనాన్ని కూల్చివేయడం ద్వారా తమ విధ్వంస పాలన ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. పదిహేను రోజులుగా వైఎస్సార్సీపీ వారి ఆస్తులు, రైతు భరోస కేంద్రాలు, సచివాలయాల భవనాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు, ఇప్పుడు ప్రభుత్వపరంగా కూడా ధ్వంస రచన సాగించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లు తాము హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. ఏదో అరకొరగా చేసి జనాన్ని మభ్యపెట్టే ఆలోచనలే సాగిస్తున్నారన్న అనుమానం ప్రజలలో ఉంది. కొన్ని స్కీములను ఎలా వాయిదా వేయాలా? అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు.ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని అమలు చేసే విషయం పరిశీలనకు మరో నెల పడుతుందని రవాణశాఖ మంత్రి రామ్ ప్రసాదరెడ్డి చెప్పారు. కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకటి, రెండు రోజులలోనే ఉచిత బస్ స్కీమ్ ను అమలు చేసింది. ఏపీలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారో అర్ధం చేసుకోవడం కష్టం కాదు. నిజానికి ఏపీలోనే ఈ స్కీము అమలు చేయడం తేలిక. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి మార్చడం ద్వారా ఆ సంస్థకు చాలా వెసులుబాటు కల్పించింది. అంటే జీతాల భారం తగ్గిందన్నమాట. అయినా ఈ స్కీమును అమలు చేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? అనేదానికి సరైన కారణం కనిపించదు.ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో ప్రభుత్వం తీరు అలాగే ఉంది. ప్రజలు నిజంగా గెలిపించారో, లేక ఈవిఎమ్ ల మాయ ఏమైన ఉందో తెలియదు కానీ, టీడీపీ ప్రభుత్వం ఇకనైనా ఈ విధ్వంసపాలన ఆపి ప్రజోపయోగ కార్యక్రమాలకు దిగితే మంచిది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీలో ‘పక్కదారి’ పాలన షురూ!
ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఎవరైనా టీడీపీ వారిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఇచ్చిన హామీలు ఎలా ఆచరణ సాధ్యం? అని ప్రశ్నిస్తే వారు ఠకీమని ఒక సమాధానం ఇచ్చేవారు. మా నాయకుడు అంత తెలివితక్కువవాడు కాదు. అవేమీ అమలు చేసేది ఉండదు. అవసరమైనవి, సాధ్యమైనవి మాత్రమే చేస్తారు అని చెప్పేవారు. మరి అది మోసం కాదా అని ప్రశ్నిస్తే, ఆ సంగతి తర్వాత, ముందు అధికారం రావాలి కదా! అని అనేవారు. సరిగ్గా అదే పంధాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా ఉంది. కాకపోతే ఈసారి ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు.ఇంతకాలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉన్నారనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యధాతధంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంత ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది.ప్రతి నెల మొదటి తేదీన వృద్దాప్య పెన్షన్ లు వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లకు గౌరవవేతనంతో పాటు ఇళ్లవద్దే ఉండి నెలకు ఏభైవేల రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది రోజులలోనే వలంటీర్లను వారి విధుల నుంచి పక్కనబెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.ఏపీలో తొలుత రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ రూపేణ వలంటీర్ల వ్యవస్థను కొంత డిస్టర్బ్ చేయడంలో టీడీపీ సఫలం అయింది. వారి ద్వారా పెన్షన్ లు పంపిణీ కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తెప్పించగలిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడంతో ఎన్నికల కమిషన్ కూటమికి పూర్తిగా సహకరించిందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత సుమారు ఎనభై వేల మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయినా ఇప్పటికీ సుమారు లక్షన్నర మందివరకు వలంటీర్లు కొనసాగుతున్నారు. ఆ వలంటీర్లను వాడుకుంటూ, వలంటీర్లు లేనిచోట సచివాలయ సిబ్బందితో పెన్షన్ లు పంపిణీ చేస్తామని చెప్పి ఉంటే ఎవరికి సందేహం వచ్చేది కాదు.వలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్ధసారథి చెప్పడం విశేషం. అంటే ఇందులో కొత్తగా తీసుకోవలసిన నిర్ణయం ఏమి ఉంటుంది? వలంటీర్ల వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్నదానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తుండాలి. ఒకప్పుడు ఈ వలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని ఒక రకంగా అవమానించేలా మాట్లాడారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చారు. కానీ ఎన్నికల టైమ్ కు వలంటీర్లను వ్యతిరేకించడం వల్ల తమకు నష్టం వస్తుందని అనుమానించి, వెంటనే ప్లేట్ మార్చి వారికి పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని, వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఇదే వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు వలంటీర్లను సస్పెన్స్ లో పెట్టారు.వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అనుకుంటే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండవచ్చు. అలా చేయలేదు. పైగా వారిపట్ల సానుకూలంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న వలంటీర్లను మార్చుతారేమోనన్న ప్రచారం జరిగేది. ప్రస్తుతం ఉన్నవారు వైఎస్సార్సీపీకి అనుకూలమైన వారన్నది టీడీపీ భావన. వీరికి బదులు టీడీపీకి సంబంధించినవారిని నియమించుకోవాలన్న ఆలోచన చేయవచ్చని అనుకున్నారు. కానీ అందుకువిరుద్ధంగా ఆ వ్యవస్థపైనే అనుమానాలు సృష్టించారు. వైఎస్సార్సీపీకి ఎన్నికలలో వలంటీర్ల వ్యవస్థ వల్ల రాజకీయంగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం ఏర్పడింది.ఈ నేపథ్యంలో టీడీపీలో కూడా పునరాలోచన ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో సచివాలయాల సిబ్బందితో ఇళ్ల వద్ద పెన్షన్ లు పంపిణీ చేయించడం కూడా కొంత వివాదాస్పదం కావచ్చు. తమకు కొత్త బాధ్యత పెడుతున్నారన్న అసంతృప్తి ఏర్పడవచ్చు. అయినా ప్రభుత్వం వారిపైనే ఒత్తిడి పెడుతున్నదంటే ఈ వ్యవస్థలో ఇంకా పలుమార్పులు తీసుకురావాలని ఆలోచిస్తుండవచ్చనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు పాలన కనిపించకూడదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పౌరసేవలు అందిస్తుంటారు. వలంటీర్లు ప్రజల నుంచి ఆయా దరఖాస్తులు తీసుకుని స్కీములలో చేర్చడం, వారికి కావల్సిన సర్టిఫికెట్లను సమకూర్చడం తదితర సేవలు అందించేవారు. ఇప్పుడు వీటన్నిటిని నిలుపుదల చేస్తే ఈ వలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి పని ఉండదు.ప్రస్తుతానికి సచివాలయాల సిబ్బందికి డిప్రమోషన్ ఇచ్చిన రీతిలో వారినే లబ్దిదారుల ఇళ్లచుట్టూ తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇష్టం లేనివారు ఉద్యోగాలు మానుకుంటారు. లేదా, భవిష్యత్తులో వేరే రకంగా వాడుకునే ఉద్దేశంతో ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడంతో మానిఫెస్టోలో చెప్పినవాటికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోకుండా, అంతా పరిశీలనలో ఉందని చెప్పవచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామని తెలపవచ్చు. అలాగే అభిప్రాయాలు సేకరించామని, ప్రజలకు వలంటీర్లవల్ల ఉపయోగం లేదని, పేర్కొనవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ఒకవేళ తొలగిస్తే రెండున్నర లక్షల మంది ప్రస్తుతం ఏదో రూపంలో పొందుతున్న ఉపాధిని కోల్పోయినట్లు అవుతుంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం చేస్తుందా? అనేది చూడాలి.అలాగే.. ఇన్నివేల సచివాలయాల అవసరం లేదని, సిబ్బందిని వేరే రూపంలో వినియోగించుకోవచ్చని ఏమైనా ఆలోచన జరుగుతుందా అన్న సందేహం కూడా ఉంది.చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే మాట మార్చుతారా అనే ప్రశ్న వస్తోంది. విశేషం ఏమిటంటే వలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్తపడడం కూడా గమనించదగ్గ అంశమే. అదే ఇలాంటి నిర్ణయం ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే.. ఈ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినా సమర్థించే మీడియా కనుక వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట తప్పారని ఎక్కడా ఒక్క మాట రాయలేదు. పైగా క్యాబినెట్ కీలక హామీలను నెరవేర్చిందని హెడింగ్ లు పెట్టి మరీ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాయి.చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలనే క్యాబినెట్ లో తీర్మానం చేశారు. మెగా డీఎస్సీ, వృద్దుల పెన్షన్ నాలుగువేల రూపాయలు చేయడం తప్ప మిగిలినవాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడం మరో ప్రత్యేకత. టీడీపీ మీడియాకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కీలకమైనవిగా కనిపించడం లేదు. స్కూళ్లు తెరిచిన ఈ టైమ్ లో తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం ప్రస్తావనే లేదు.ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా ఇరవైవేల రూపాయల ఆర్దిక సాయం, నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది క్యాబినెట్ లో చర్చించలేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఒక్కో హామీని ఏ రకంగా ఎగవేయాలా అనేదానిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. దానిని పక్కదారి పట్టించడానికి వీలుగా గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేసే కథను నడపడానికి ప్రభుత్వం సిద్దమైందని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఈవీఎంల గోల్మాల్.. తెరపైకి బ్యాలెట్.. ఇది అత్యవసర సమస్యే!
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) చర్చనీయాంశం అవుతున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుడు ఎలాన్ మస్క్, మరో ప్రముఖుడు శ్యామ్ పిట్రోడా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈవీఎంలపై చేసిన ట్వీట్ లు సహజంగానే అందరి దృష్టిని ఆకరర్షిస్తాయి. న్యాయం చేయడం కాదు.. న్యాయం జరిగినట్లు కనిపించాలన్న సూత్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉటంకించారు. అలాగే ప్రజాస్వామ్యం ఉందని అనుకోవడం కాకుండా, ప్రజాస్వామ్యం నిస్సందేహంగా అమలు అవుతున్నట్లు కనిపించాలని ఆయన అన్నారు.ప్రపంచవ్యాప్తంగా, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న దేశాలలో ఈవీఎం ల బదులు, బాలెట్ పత్రాలనే వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడడానికి మనం కూడా ఆ దిశగా వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ చేయడంపై అధికార పక్షం తెలుగుదేశం అభ్యంతరం చెప్పవచ్చు. ఆ ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా మాట్లాడలేదు కానీ, ఆయన ఆ పార్టీ నేతలు కొందరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో వైఎస్సార్సీపీ గెలిచిన ఘట్టాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.విశేషం ఏమిటంటే 2009, 2019లలో టీడీపీ ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎంలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 2009 లో అయితే చంద్రబాబు తన అనుచరుడు ఒకరు తీసుకు వచ్చిన ఈవీఎం తో అవి ఎలా హాక్ చేయవచ్చో తెలియచేస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2014లో విభజిత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. వైఎస్సార్సీపీ 67 సీట్లకే పరిమితం అయింది. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిపై ఏమీ ఆరోపణ చేయలేదు. ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజాక్షేత్రంలో పని చేసుకుంటూ సాగారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అప్పుడు టీడీపీ ఈవీఎం లపై అనుమానాలు వ్యక్తం చేయకపోలేదు.ఆ సమయంలో సహజంగానే వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. 2024లో వైఎస్సార్సీపీ మామూలుగా ఓడిపోయి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ప్రజలలో వ్యతిరేకత ఏర్పడిందేమోలే అనుకునేవారు. అలాకాకుండా ఎవరూ ఊహించని రీతిలో కేవలం పదకుండు స్థానాలకే వైఎస్సార్సీపీ పరిమితం అవడంతో ఈవీఎం లపై అనుమానాలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆ స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత లేదన్నది ఎక్కువమంది అభిప్రాయం. 2014లోనే 67 సీట్లు వస్తే, ఐదేళ్ల అధికారం తర్వాత, అనేక హామీలు అమలు చేసిన తర్వాత కేవలం 11 సీట్లే ఎలా వస్తాయన్నది పలువురి ప్రశ్నగా ఉంది.ఈవీఎం లపై సందేహాలు వచ్చినా, ప్రభుత్వపరంగా, లేదా పార్టీపరంగా జరిగిన లోటుపాట్లపైనే వైఎస్సార్సీపీ వర్గాలు దృష్టి పెట్టి చర్చించుకున్నాయి. కానీ ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు, టెస్లా కార్ల అధిపతి ఎలాన్ మస్క్ ఈవీఎం లపై చేసిన వ్యాఖ్యలతో అందరిలోను దీనిపై ఆలోచన ఆరంభం అయింది. ఆయన ఈవీఎం లను హాక్ చేయడం, టాంపర్ చేయడం సాధ్యమేనని వ్యాఖ్యానించారు. దానిని మరో నిపుణుడు, భారత్ లో కంప్యూటర్ల శకం ఆరంభించడంలో కీలక పాత్ర పోషించిన శ్యామ్ పిట్రోడా కూడా బలపరిచారు. తాను అరవై ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నానని, ఈవీఎం ల పనితీరును అధ్యయనం చేశానని, వాటిని మానిప్యులేట్ చేయడం సాద్యమేనని పేర్కొన్నారు. పేపర్ బాలెట్ వైపు వెళ్లడమే శ్రేయస్కరమని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈవీఎం లపై ఆరోపణలు చేయడం ఆరంభించాయి.శివసేన నేత ఆదిత్య ఠాక్రే అయితే నేరుగా బీజేపీ ఈవీఎం లను ట్యాంపర్ చేసిందని ఆరోపించారు. కాగా దేశంలో ఎన్నికల అవసరాలకు అరవైలక్షల ఈవీఎం లను సరఫరా చేశామని సంబంధిత సంస్థలు చెబుతుంటే, నలభై లక్షల ఈవీఎం లే తమ వద్ద ఉన్నాయని, మిగిలిన 20 లక్షల ఈవీఎం ల సంగతి తమకు తెలియదని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో ఇదంతా మిస్టరీగా మారింది. కర్నాటకలో ఈవీఎం ల గోల్ మాల్ జరిగిందని కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. అందువల్లే కర్నాటకలో కాంగ్రెస్ కు తక్కువ పార్లమెంటు సీట్లు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎం ల టాంపరింగ్ జరిగిందా? హాకింగ్ జరిగిందా? లేక ఈవీఎం లను మార్చివేశారా? అన్న అనుమానాలు ప్రజలలో వ్యాపిస్తున్నాయి.ఈ సందర్భంలో ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వెల్లడిచేసిన విషయాలు మరింత సంచలనంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఒక గ్రామంలో జరిగిన అనుభవాన్ని ఆయన వివరించారు. ఆ గ్రామంలో ఎప్పుడూ రిగ్గింగ్ లేదా కొందరు కూర్చుని ఓట్లు ఎవరికి వేయాలా అన్నది డిసైడ్ చేసి ఆ ప్రకారం చేస్తుంటారట. అందులో ఒక పార్టీకి అధిక ఓట్లు వేసి, ఎదుటి పార్టీకి కూడా కొన్ని ఓట్లు వేస్తారట. కానీ చిత్రంగా తాము తక్కువ ఓట్లు వేసిన పార్టీకి మెజార్టీ వచ్చినట్లు కౌంటింగ్ లో వెల్లడైందని, ఇదెలా సాద్యమని వారు ప్రశ్నిస్తున్నారట. ఆ గ్రామం, తనకు చెప్పిన వ్యక్తుల గురించి బహిరంగంగా వెల్లడించి ఎన్నికల కమిషన్ ను ఉండవల్లి అరుణకుమార్ నిలదీయగలిగితే, దీనిపై ఆయన న్యాయపోరాటం చేయగలిగితే మరో చరిత్రను సృష్టించినవారు అవుతారు. ఆయనకు ఆయా రాజకీయ పక్షాలు సహకరిస్తే మంచిదే. సీపీఐ నేత కే నారాయణ కూడా ఇదే తరహాలో ఈవీఎం లను వ్యతిరేకిస్తూ బాలట్ పత్రాలే బెటర్ అని స్పష్టం చేస్తున్నారు. అదే టైమ్ లో రాజీవ్ చంద్రశేఖరన్ అనే ప్రముఖుడు మాత్రం ఈ వాదనలను అంగీకరించలేదు. ఎలాన్ మస్క్ చెప్పినట్లు ఏ దేశంలో అయినా టాంపరింగ్ జరుగుతుందేమో కానీ, ఇండియాలో కాదని అన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ నిర్దిష్టమైన ప్రకటన చేసినట్లు కనిపించలేదు. ఈవీఎం లను సెల్ ఫోన్ ద్వారా మార్చవచ్చని కొందరు, చిప్ లను రహస్యంగా మార్చే అవకాశం ఉందని మరికొందరు, నెట్ కనెక్షన్ లేకపోయినా టాంపర్ చేయవచ్చని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసుకుని ఈ మానిప్యులేషన్ జరిగిందా అన్నది కొందరి ప్రశ్నగా ఉంది.ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీకి బాగా తక్కువ సంఖ్యలో సీట్లు రావడంతో పలువురు ఆసక్తి కొద్ది ఆరా తీస్తున్నారు. ఆ క్రమంలో అనేక చోట్ల ప్రజలు తాము వైఎస్సార్సీపీకి ఓట్లు వేశామని, అయినా మెజార్టీ టీడీపీకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్న ఘట్టాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. హిందుపూర్ లో వైఎస్సార్సీపీ ప్రాతినిద్యం వహిస్తున్న ఒక వార్డులో ఈ పార్టీకి ఒకే ఓటు వచ్చినట్లు నమోదు అవడం విస్తుపరచింది. 2019లో ఎన్నికల సమయానికి, 2024 ఎన్నికలనాటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. బీజేపీ, జనసేనలు టీడీపీకి దూరం అయ్యాయి. రుణమాఫీ, కాపుల రిజర్వేషన్ వంటి హామీలు నెరవేర్చకపోవడంతో టీడీపీ బాగా అన్ పాపులర్ అయింది.2024లో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ప్రజలకు నవరత్నాల పేరుతో ఏ హామీలు ఇచ్చారో వాటినన్నిటిని అమలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. సిద్దం సభలు, బస్ యాత్ర వంటివి బాగా విజయవంతం అయ్యాయి. పేద వర్గాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాయన్న భావన ఉంది. ప్రతిపక్ష దుష్ప్రచారం ప్రభావం కొంత పడినా, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయేంత కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. టీడీపీ కూటమికి, వైఎస్సార్సీపీకి మధ్య నువ్వా, నేనా అన్నంతగా పోటీ ఉండవచ్చని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అందుకు విరుద్దంగా ఫలితాలు రావడం అందరిని ఆశ్చర్యపరచింది.కొంతమంది కూటమి పెద్దలు అసెంబ్లీ సీట్లపై పందాలు కాసిన తీరు, మెజార్టీలపై కూడా బెట్టింగ్ లు కాసిన వైనం కూడా అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అసలు బీజేపీ గెలిచే అవకాశం ఉండదనుకున్న ఒక నియోజకవర్గంలో, తమకు ఇన్నివేల మెజార్టీ వస్తుందంటూ కొందరు నేతలు పందాలు కాశారట. 2019లో వైఎస్సార్సీపీ గెలిచినా మెజార్టీలు కొద్ది నియోజకవర్గాలలో మినహా మరీ అతిగా లేవు. అలాంటిది ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్దులకు వచ్చిన మెజార్టీలు అనూహ్యంగా ఉన్నాయి. అనేకమందికి ఏభైవేలకుపైగా మెజార్టీలు రావడం విస్తుపరుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈవీఎం ల టాంపరింగ్ పై ప్రజలలో డౌట్లు మొదలయ్యాయని అంటున్నారు. మాబోటి వాళ్లం కూడా ఈవీఎం ల టాంపరింగ్ సాధ్యం కాదేమో అనుకున్నప్పటికీ, గత కొద్ది సంవత్సరాలలో టెక్నాలజీ మరింతగా వృద్ది చెందడం, సైబర్ నేరాలు బాగా పెరగడం, హాకింగ్ పై వస్తున్న కథనాల నేపథ్యంలో ఈవీఎం లు కూడా వీటికి అతీతం కాదేమోనన్న డౌటుకు రావల్సి వస్తోంది. అందులోను అంతర్జాతీయ స్థాయి నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో ఎన్నికల సంఘం వీటిని నివృత్తి చేయడానికి గాను చర్యలు చేపడితే బాగుంటుందనిపిస్తుంది.ఇందుకోసం ఎలాన్ మస్క్ వంటివారిని, భారత్ కు చెందిన కొందరునిపుణులను పిలిచి ఈవీఎం ల ప్రామాణికత, హాకింగ్ అవకాశం ఉందా? లేదా? అనేదానిపై ప్రాక్టికల్ ప్రజెంటేషన్లు తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం అవసరం అనిపిస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పరిపుష్టం చేయాలని చెప్పాలి. నిజంగానే ఈవీఎం లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని తేలితే బాలట్ పత్రాలవైపు మొగ్గు చూపవచ్చు. అమెరికా, జపాన్ వంటి దేశాలలో బాలెట్ పత్రాలనే వాడుతున్నారు.ఇండియాలో బాలెట్ పత్రాల సిస్టమ్ ఉన్నప్పుడు రిగ్గింగ్ వంటి సమస్యలు ఎదురయ్యేవి. వాటిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టవచ్చన్నది ఈ పద్ధతికి అనుకూలంగా ఉన్నవారి భావన. మొత్తం మీద ఈవీఎం లపై వచ్చిన డౌట్లను తీర్చకపోతే ఎన్నికల సంఘం తీరుపై కూడా అనుమానాలు వస్తాయి. ఏపీలో ఎన్నికల సంఘం వ్యవహరించిన శైలిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కూటమిలోని పార్టీలకు కమిషన్ సహకరించిందన్న అభియోగాలు వచ్చాయి. అందువల్ల ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్న నమ్మకం కలగాలంటే ఈవీఎం లపై వచ్చిన సందేహాలన్నిటిని పరిష్కరించడం అత్యవసరమని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అమరావతి కోసం అప్పుల చిప్ప.. ఎదురు ప్రశ్నే సమాధానమా?!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైలే వేరు అన్నట్లుగా ఉంటారు. తన వద్ద సమాధానం లేని ప్రశ్నను ఎవరైనా వేస్తే, ఎదురు ప్రశ్నించడంతో వారి నోరు మూయించే యత్నం చేస్తుంటారు. అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించి మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఒక విలేకరి అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎంత వ్యయం చేస్తారు? అని ప్రశ్నించారు. ఆయన వద్ద దానికి సరైన జవాబు లేదు. అంతే! వ్యూహాత్మకంగా ఆయన మీరే చెప్పండి.. మీరు అయితే ఎంత కాలంలో నిర్మిస్తారు? అంటూ ఏదేదో మాట్లాడారు. అది విన్నవారు విస్తుపోవడం తప్ప చేయగలిగింది లేదు.ప్రభుత్వ గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. గత ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అర్ధం కావడం లేదు. ఆ వివరాలన్ని సిద్దం చేస్తున్నారు.. అని కూడా చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అది పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందో, ఇంకా ఎక్కువ అవుతుందో అని వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో అలా కూడా చెప్పలేదు. పైగా ప్రశ్నించివనారే ఎంత కాలం పడుతుందో చెప్పాలని అంటున్నారు. అమరావతిలో రకరకాల రూపాలలో సెంటిమెంట్ పండించడానికి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను విమర్శించడానికి ఆయన ఈ సందర్శనను వాడుకున్న సంగతి అర్ధం అవుతూనే ఉంది.రాజకీయాలలో ఇలాంటివి సహజమే అయినా చంద్రబాబు నాయుడు అసలు విషయాలను పక్కదోవన పట్టిస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది? ఒకవైపు అమరావతిని పూర్తి చేస్తామని అంటారు. అమరావతిలో ప్రభుత్వానికి మిగిలే భూముల అమ్మకంతో వచ్చే డబ్బుతో రాజధాని నిర్మాణంతో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అంటారు. అమరావతి రాజధానిలో మౌలిక వసతులకే లక్ష కోట్లకు పైగా వ్యయం అవుతుందని ఐదేళ్ల క్రితమే అంచనా వేశారు. అది ఇంకా పెరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తొలిదశకు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంచనా అవుతుందని అప్పట్లో లెక్కించామని, తాజాగా ఎంత అవుతుందన్నది గణించాలని కొద్ది రోజుల క్రితం చెప్పారు.ఇక్కడ అందరికి వచ్చే సందేహం ఏమిటంటే? ముందుగా ప్రభుత్వం సమీకరించిన భూమికి సంబంధించి రైతులకు ప్లాట్లు కేటాయించి, అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అంటే రోడ్లు, డ్రైన్లు, మంచినీరు తదితర సదుపాయాలు కల్పించాలన్నమాట. ఇక ప్రభుత్వ పరంగా నిర్మించదలచిన భవనాలకు కూడా వేల కోట్ల వ్యయం అవసరం. వీటన్నిటికి డబ్బు సమకూర్చుకోవాలంటే భూములు అమ్మాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఏదైనా చేయడానికి భూములను విక్రయించడానికి ప్రయత్నిస్తే టీడీపీ అడ్డుకునేది. ఇప్పుడు తాను భూములను అమ్మి సంపద సృష్టించి దానిని అటు అమరావతికి, ఇటు సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేస్తానని చెబుతున్నారు. ముందుగా అన్నీ వసతులు ఏర్పడితే కదా వాటిని కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చేది అనే ప్రశ్న వస్తుంది.రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చిన రాజధానిలో హైప్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు పర్యటన ఉపయోగపడవచ్చు. కానీ సకాలంలో చంద్రబాబు ప్రభుత్వం తాము చెప్పిన విధంగా సదుపాయాలు కల్పించి, ఆయా సంస్థలను రాజధానికి తీసుకురాలేకపోతే ఈ హైప్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాని వల్ల అక్కడ భూములు కొన్నవారికి నష్టం జరుగుతుంది. గత ఏడాది కాలంలో హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన భవనాల స్పేస్ కన్నా బాగా అధికంగా అందుబాటులో ఉండడం, అమెరికాలో మాంద్య పరిస్థితులు, ఇతర అంశాలు ఇందుకు కారణమని వారు అంటున్నారు. అమరావతిలో ప్రస్తుతం కొంతమేర రేట్లు పెరిగాయని సమాచారం. అది కొనసాగాలంటే ముందుగా ప్లాట్ల కేటాయింపు, అభివృద్ది పనులు పూర్తి కావాలి. అందుబాటులోకి వచ్చే ప్లాట్లు అమ్ముడుపోవడానికి తగిన డిమాండ్ ఉండాలి. ఒక ఏడాదిలోనో, రెండేళ్లలోనో జరిగేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుంది. నిజానికి చంద్రబాబు నాయుడు 2014 టరమ్ లో రాజధానికి అవసరమైన రెండువేల నుంచి ఐదువేల ఎకరాల వరకు భూములు తీసుకుంటే సరిపోయేది. మిగిలిన భూమిని ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అభివృద్ది చేసుకునేవారు. ప్రభుత్వపరంగా తీసుకోవల్సిన చర్యలు చేపడితే సరిపోయేది. అలా చేయకుండా ఏభైఐదువేల ఎకరాలభూమిని సమీకరించడంతో ఆ బాధ్యత అంతా ప్రభుత్వంపై పడింది.రైతుల నుంచి సమీకరించిన ముప్పైమూడు వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములు కలిపి ఏభైఐదువేల ఎకరాలు అభివృద్ది చేయాలంటే లక్షన్నర కోట్ల వరకు వ్యయం కావచ్చు. ఒకసారి చంద్రబాబు నాయుడు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని అంటారు. ఇంకోసారి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని అంటారు. మరోసారి ఎప్పటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామో చెప్పలేమని అంటారు.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికర సంగతి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి తేదీన ఉద్యోగుల జీతాలు పెన్షన్లు, వృద్దాప్య పెన్షన్లు తదితర ఖర్చుల నిమిత్తం పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనావేశారు. ఇందుకోసం వనరుల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, రుణ సమీకరణ చేస్తున్నారని టీడీపీ మీడియా ఈనాడు పత్రికలోనే రాశారు.గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేనికైనా రుణాలు తీసుకుంటే.. అప్పుల చిప్ప అని రాసిన ఈ పత్రిక ఇప్పుడు రుణ సమీకరణ అని చాలా గౌరవంగా చెబుతోంది. విశేషం ఏమిటంటే ఒక్క సామాజిక పెన్షన్లు నాలుగువేల రూపాయలు, బకాయిలతో సహా చెల్లించడానికి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లు చెల్లించడానికే పదివేల కోట్లు అవసరం అయితే, మరి మిగిలిన హామీలకు ఎన్నివేల కోట్లు అవసరం అవవుతాయన్న ప్రశ్న వస్తుంది. ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున నెలకు చెల్లిస్తామని, మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతి, తల్లికి వందనం స్కీమ్ లో ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని ఇలా అనేక హామీలను టీడీపీ, జనసేనల కూటమి మానిఫెస్టోలో ప్రకటించింది. వాటన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న వస్తుంది.ప్రస్తుతానికి ఏవైనా కొన్ని భవనాలను నిర్మించి సరిపెట్టుకుంటారా? లేక గతంలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పన్నులన్నిటిని ఇక్కడే ఖర్చు చేస్తారా? అనేదానిపై క్లారిటీ రావల్సి ఉంటుంది. దీనివల్ల ఇతర ప్రాంతాలలో అసంతృప్తి వస్తుంది. అన్నిటికి జిందా తిలస్మాత్ మాదిరి అమరావతి రాజధానిలో మిగులు భూముల అమ్మకం ద్వారా సంపద సృష్టించి కార్యక్రమాలు అమలు చేస్తామని చెబుతున్నారు. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి కోసం పదిహేనువేల కోట్ల సాయం అడిగారట. కేంద్రం ఆ డబ్బు ఇస్తే ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట అభిస్తుంది. కానీ అది సాధ్యమా అన్నది సంశయం.ఈ నేపథ్యంలో అమరావతి ఎప్పటికి అభివృద్ది కావాలి? ఎప్పటికి కొత్త సంస్థలు రావాలి? అక్కడ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నివేల మంది రావాలి? ఇదంతా జరగడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకు తమ హామీలను అమలు చేయలేమని చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెబుతుందా? ప్రభుత్వంలో గల్లా పెట్టె ఖాళీగా ఉందని చంద్రబాబు అంటున్నారు. అలాగే అప్పుల గురించి కూడా ఏమీ తెలియదన్నట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల అప్పు చేసిందని ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు చెప్పారు కదా! ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుతారేమిటి? అని ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెబుతాం.ఇక్కడ ఇంకో సంగతి ప్రస్తావించాలి. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అనేక స్కాములు జరిగాయని కేసులు పెట్టింది. అందులో చంద్రబాబుతో సహా పలువురు నిందితులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కేసులన్నీ ఏమి అవుతాయో తెలియదు. వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందా? లేక ఇంకేమైనా చేస్తారా అనేది చూడాలి. ఆ కేసులు పెట్టిన అధికారులపై ఇప్పటికే కక్షసాధింపు చర్యలు ఆరంభించారు. ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారి తీస్తాయో కాలమే తేల్చుతుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చేసేది చెప్పాం.. చెప్పింది చేశాం: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘చెప్పింది చెప్పినట్లు చేసి చూపెట్టాం. చెప్పనవి కూడా ఆచరణలో చూపెట్టాం. మనం చేయగలిగిందే ఎన్నికల్లో చెప్పాం. 40 శాతం మంది నమ్మి ఓటేశారు. మన వైపు ఉన్న మరో 10 శాతం మంది కూటమి వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నిలబెట్టుకుంటారో వేచిచూద్దాం. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించే రోజు రానే వస్తుంది. వైఎస్సార్సీపీ కేడర్ లక్ష్యంగా వ్యక్తిగత దాడులు, ఆస్తులు ధ్వంసం చేస్తూ కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోంది. కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. అండగా నిలుస్తాం. బాధితులందర్నీ కలుస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, అందుకోసం వైఎస్సార్సీపీ ప్రజాపక్షంగా నినదిస్తోందన్నారు. ‘మన హామీలను నమ్మి 40 శాతం మంది ఓటు వేశారు. 50 శాతం కూటమి వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, చెప్పిన పథకాలు అమలు చేయలేరు. ఆరు నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం బహిర్గతం అవుతుంది. కూటమికి ఓటేసిన ప్రజలు మరోమారు మోసపోయామని గ్రహిస్తారు’ అన్నారు.పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమైన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పోటెత్తిన యువత మాజీ సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు, ఆయనతో మాట కలిపేందుకు, ఫొటో దిగేందుకు యువత పెద్ద సంఖ్యలో పులివెందులకు వచ్చారు. సుపరిపాలన అందించిన జగన్ యోగ క్షేమాలు తెలుసుకోవాలని మరికొందరు తరలి వచ్చారు. పదవులు ముఖ్యం కాదు.. మీ వెంటే మేమంతా నడుస్తాం.. మీతోనే మాబాట.. అని భరోసా నింపేందుకు ఇంకొందరు విచ్చేయడంతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసింది. స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహిస్తూనే, మరోవైపు వచ్చిన వారికి ధైర్యం చెబుతూ వైఎస్ జగన్ రోజంతా బిజీబిజీగా గడిపారు. పులివెందుల క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఏకధాటిగా నిల్చొని వేలాది మంది ప్రజానీకాన్ని కలిశారు. ఈ క్రమంలో ఆయన్ను చూడాలని, కలవాలని యువత ఆత్రుత ప్రదర్శించే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. కిటీకి అద్దాలు పగలి ఓ యువకుడికి చిన్నపాటి గాయమైంది. జనం భారీగా తరలి రావడంతో కేవలం అర గంటలో మధ్యాహ్న భోజనం ముగించి, మళ్లీ సాయంత్రం వరకు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్బాషా, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, డాక్టర్ సుధీర్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, కడప మేయర్ కె సురేష్బాబు, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహార్రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప తదితరులు వైఎస్ జగన్ను కలిసి మాట్లాడారు.మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది వైఎస్సార్సీపీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని వైఎస్ జగన్ అన్నారు. మనం చేసిన మంచి, మేలు ప్రజల గుండెల్లో ఉండిపోయిందని చెప్పారు. శిశుపాలుడు లాగా తప్పులు మొదలయ్యాయని, రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్నారు. ‘మనకు ఓటు వేశారని, వారికి ఓటు వేయలేదనే కారణంగా ప్రజలు, వైఎస్సార్సీపీ కేడర్, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. శిశుపాలుని లాగా పాపాలు చేస్తున్నారు. ఆ పాపం పండే రోజు వస్తుంది. 2029లో ప్రజలు మన వైపే చూస్తారు. మంచి చేసిన మీ జగన్ వైపే ప్రజలు నిలవనున్నారు. ఎవ్వరూ అధైర్యపడొద్దు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలుస్తా. చంద్రబాబు సర్కార్ బాధితులందర్నీ కలుస్తా’ అని స్పష్టం చేశారు. టీడీపీ వాళ్లు తన భర్తను టార్గెట్ చేసి దాడి చేశారని ముదిగుబ్బ సర్పంచ్ సతీమణీ వాపోయారు. అధైర్య పడొద్దని, తాను అండగా ఉంటానని వైఎస్ జగన్ ఆమెను ఊరడించారు. మనకు మంచిరోజులు రానున్నాయని, అంత వరకు ఓపిగ్గా ఉండాలని సూచించారు. -
రాష్ట్రవ్యాప్తంగా రాజకోటల్లా టీడీపీ ఆఫీసులు
సాక్షి, అమరావతి: సర్కారు స్థలాలు, పేదల భూములను లాక్కుని పచ్చ భవనాలు నిర్మించుకున్న టీడీపీ పెద్దలు సుద్దులు వల్లించడం గురివింద సామెతను గుర్తు చేస్తోంది. అధికారంలో ఉండగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో అత్యాధునిక కార్యాలయాలు సమకూర్చుకున్న టీడీపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాగు పోరంబోకు, రైతుల భూమిని కబ్జా చేసి మంగళగిరిలో అత్యంత విలాసవంతమైన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకోగా విశాఖలో దసపల్లా భూముల్లో పాగా వేసి పచ్చ భవనాలు కట్టుకున్నారు. విజయవాడ ఆటోనగర్లో ఇరిగేషన్ స్థలం.. శ్రీకాకుళంలో దళితులకు కేటాయించిన భూమి.. కాకినాడలో జెడ్పీ స్థలం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్క చాంతాడును తలపిస్తుంది. ఇవన్నీ ఎన్టీఆర్ భవన్లే. అధికారం మాటున చంద్రబాబు సమకూర్చుకున్న పార్టీ కార్యాలయాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి కరకట్ట నివాసమే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటిది. నిబంధనలు, చట్టాలకు తూట్లు పొడిచి కృష్ణా నది ఒడ్డున కట్టిన ఆ విలాస రాజ భవనంలోనే చంద్రబాబు ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నారు. అక్రమాల బాటలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో విలాసవంతమైన కోటలు కట్టేశారు. వీటిని కప్పిపుచ్చి నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ కార్యాలయాలపై బురద జల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.పార్టీలకు భూముల జీఓ ఇచ్చిందే బాబునిజానికి చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడే రాజకీయ పార్టీలకు భూములు కేటాయించే విధానాన్ని తెచ్చారు. ఇందుకోసం 2016 జూలై 21న జీఓ నెంబర్ 826 విడుదల చేశారు. రాజధానిలో మూడు కేటగిరీలుగా పార్టీలకు భూములు కేటాయించాలని అందులో పేర్కొన్నారు. మొదటి కేటగిరీలో జాతీయ రాజకీయ పార్టీ / గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీకి అసెంబ్లీలో 50 శాతానికి పైగా బలం ఉంటే 4 ఎకరాలు కేటాయించాలి. రెండో కేటగిరీ కింద అసెంబ్లీలో 25 నుంచి 50 శాతం బలం ఉన్న పార్టీలకు అర ఎకరం కేటాయించాలి. మూడో కేటగిరీలో 25 శాతం కంటే తక్కువ ఉన్న పార్టీలకు వెయ్యి గజాల స్థలం కేటాయించాలి. దీని ప్రకారం అప్పట్లో టీడీపీకి 4 ఎకరాలు, నాడు 67 స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీకి అర ఎకరం పొందే అర్హత లభించింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం మొదటి కేటగిరీలో ఉన్న పార్టీలకు రెండు ఎకరాలు, రెండో కేటగిరీలో ఉన్న పార్టీలకు వెయ్యి గజాలు, మూడో కేటగిరీలో ఉన్న పార్టీలకు 300 గజాలు ఇవ్వాలన్నది జీవో సారాంశం. ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజుకు ఈ విధానంలో భూములు కేటాయించాలని నిర్ణయించారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం 30 సెంట్లు కేటాయించాలని 2017 డిసెంబర్ 8న మరో జీఓ 340 జారీ చేశారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు సంబంధించి 2016లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో లీజు నిబంధనలు బేఖాతర్తాను ఇచ్చిన జీవోకు అనుగుణంగా రాజధానితోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ కార్యాలయాల కోసం చంద్రబాబు వరసగా భూములు కేటాయించుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట ఈ భూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి చాలాచోట్ల భూములు కేటాయించి ఆగమేఘాల మీద భవనాలు కూడా కట్టేశారు. నాడు చంద్రబాబు ప్రకటించిన విధానం ప్రకారం 33 ఏళ్ల లీజుకు భూములు కేటాయించాలి. అయితే ఆ నిబంధనను కొన్నిచోట్ల ఉల్లంఘించి ఏకంగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేసుకున్నారు. మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళంలో 99 ఏళ్ల లీజుకు భూములు తీసుకున్నారు. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో అత్యంత విలువైన భూముల్లో స్థలాలు కేటాయించుకొని కార్యాలయాలు నిర్మించి ఇప్పుడు అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. అదే జీవో ప్రకారం వివిధ జిల్లాల్లో వైఎస్సార్సీపీ 33 ఏళ్లకు లీజుకు తీసుకుంటే అదేదో ఘోరం అనే రీతిలో దుష్ప్రచారానికి తెర తీశారు.హైదరాబాద్లో రాత్రికి రాత్రేఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో అత్యంత ఖరీదైన ఎకరం స్థలాన్ని రాత్రికి రాత్రే కేటాయించేసుకున్నారు. వాణిజ్య భూమిగా హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) చేతిలో ఉన్న ఆ స్థలాన్ని 1997 ఏప్రిల్ 30న జూబీ్లహిల్స్ మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎమ్మార్వోకు బదలాయించారు. ఆయన అదేరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీగా ఉన్న డి.శ్రీనివాసరావు పేరు మీదకు మార్చారు. అదే రోజున ట్రస్టుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటం గమనార్హం. ఈ పనులన్నీ గంటల వ్యవధిలో జరిగిపోయాయి. అంతటి విలువైన స్థలాన్ని నెలకు రూ.7,500 అద్దెకు చంద్రబాబు కేటాయించుకున్నారు. హైటెక్ సిటీ నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా అత్యాధునిక హంగులతో ఎన్టీఆర్ భవన్ను నిర్మించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల వారీగా టీడీపీ కార్యాలయాలకు భూములు కేటాయించుకున్న చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరును కొనసాగించారు.పోరంబోకు భూమికి మంగళం!ప్రస్తుతం చంద్రబాబు, టీడీపీ నేతలు సకల విలాసాలతో దర్జాగా మీడియా, పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం స్థలం కోల్కతా–చెన్నై హైవేను ఆనుకుని ఉంది. 3.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ రూ.75 కోట్లకుపైనే ఉంటుంది. ఇందులో వాగు పోరంబోకు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డి పట్టా భూములూ ఉన్నాయి. కాలువను పూడ్చి... పోరంబోకు భూమిని ఆక్రమించి... రైతుల భూములను కబ్జా చేసి మరీ టీడీపీ జాతీయ కార్యాలయం కట్టారు. 99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎకరాకు రూ.1,000 మాత్రమే. నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేర 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట 1.75 ఎకరాలను డి పట్టాలుగా ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి సాగు చేస్తున్న పంటలను పొక్లెయిన్లతో దున్నేసి రాత్రికి రాత్రే టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు. ఆ రైతుల తరపున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. 8 అంతస్తుల విలాసవంతమైన ఈ ఎన్టీఆర్ భవన్ను అనుమతి లేకుండా నిర్మించేశారు. ఉల్లంఘనలు, అక్రమాలకు పర్యాయపదం టీడీపీ జాతీయ కార్యాలయం.గుంటూరులోనూ గుటకాయ స్వాహాతొలుత 2015లో గుంటూరు అరండల్పేటలోని పిచుకలగుంటలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ భవనాన్ని నిర్మించారు. మున్సిపల్ స్థలాలను లీజుకు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు బలవంతంగా ఈ భూమిని లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్లో తీర్మానం చేయించి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకుని పార్టీ భవనం కట్టేశారు.సిక్కోలులో దళితుల భూమిలో పాగాశ్రీకాకుళంలో ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ సేకరించిన భూమిని టీడీపీ కార్యాలయానికి తీసుకున్నారు. ఉడా, కార్పొరేషన్ అధికారుల అనుమతి లేకుండా పార్టీ భవనాన్ని నిర్మించారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని ఆక్రమించేశారు. 80 అడుగుల ప్రధాన రోడ్డులో ఉన్న ఈ స్థలం విలువ 2017లోనే అనధికారికంగా రూ.20 కోట్లు ఉంది. ఏడాదికి రూ.25 వేల చొప్పున 99 సంవత్సరాల లీజుకు తీసుకున్న ఈ స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు స్వయంగా చంద్రబాబే ప్రారంభించారు.కాకినాడలో జెడ్పీ స్థలంపై కన్నేసి..కాకినాడలో విలువైన జిల్లా పరిషత్ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుని విలాసవంతమైన భవనాన్ని కట్టారు. మేడలైన్ ఆఫ్ కాకినాడ ప్రాంతంలో 2 వేల గజాలను 99 ఏళ్ల లీజుకి జిల్లా పరిషత్ తీర్మానం ద్వారా టీడీపీ పరం చేశారు. ఈమేరకు 2016 నవంబర్ 1న భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. దీని విలువ రూ.10 కోట్లకు పైమాటే.బెజవాడ నడిబొడ్డున రూ.40 కోట్ల స్థలంవిజయవాడ నడిబొడ్డున ప్రజావసరాలకు ఉపయోగపడే విలువైన భూమిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఒత్తిడితో టీడీపీ కార్యాలయానికి అప్పగించారు. గుణదల పరిధిలోకి వచ్చే ఆటోనగర్–గురునానక్ కాలనీకి ఆనుకుని ఇరిగేషన్ శాఖకు 95 సెంట్ల భూమి ఉంది. ఇరిగేషన్ విభాగం ఫ్లోరేజి, ఇతర పనుల కోసం దీన్ని వినియోగించేవారు. ఇందులో కార్యాలయం కూడా ఉండేది. అయితే టీడీపీ ఆఫీసు కోసం దీన్ని ఇవ్వాలని అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి కూల్చేశారు. ఇరిగేషన్ మెటీరియల్, యంత్రాలను మరోచోటకు తరలించారు. అన్ని అభ్యంతరాలనూ తోసిరాజని 99 ఏళ్ల లీజుకిచ్చేశారు. ఆటోనగర్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాలనే నిబంధన ఉన్నా ఐలా పాలకవర్గాన్ని బెదిరించి నోరు మూయి ంచారు. వాణిజ్య భూమిగా కన్వర్షన్ చేసి టీడీపీ కార్యాలయం నిర్మించుకున్నారు. దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే. విశాఖలో దసపల్లా కొండను తొలచి..విశాఖపట్నంలో దసపల్లా కొండను తొలిచి మరీ టీడీపీ కార్యాలయాన్ని కట్టేశారు. దసపల్లా భూముల్లో 2 వేల గజాల్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు లీజు చొప్పున 2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీకి కేటాయించింది. ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న కొండను (మరో వెయ్యి గజాల మేర) కూడా ఆక్రమించి 2016లో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండానే జీ+3 భవనం నిర్మించి 2018లో లోకేశ్ ప్రారంభించారు. -
మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఒక నియంత బుల్డోజర్లతో కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా’ అంటూ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. -
పోలవరంపై రివర్స్ గేర్ ఏం చెబుతుందంటే..
ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించాయి. కారణాలు ఏవైనా, ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదన్న సమాచారం బాధ కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్డ్డిను విమర్శించడానికి, పోలవరం జాప్యం నెపం మొత్తాన్ని ఆయనపై నెట్టడానికే అన్నట్లు పర్యటన సాగించారు.2014 నుంచి ఐదేళ్లపాటు చేసిన పాలనలో ఈ ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశానని చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. అందులో వాస్తవం ఉందా? లేదా? అనేది వేరే విషయం. నిజంగా అంత పని పూర్తి అయిపోయి ఉంటే కీలకమైన డయాఫ్రం వాల్ వరదలలో కొట్టుకుని పోయేది కాదు కదా అనే లాజిక్కు సమాధానం దొరకదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చిందని చంద్రబాబు అంటున్నారు. దానివల్ల జాప్యం అయిందని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను ఎందుకు మార్చారో చెప్పాలి కదా! నామినేషన్ పద్దతిన నవయుగ సంస్థకు ఎందుకు ఇచ్చారో వివరించాలి కదా! డయాఫ్రం వాల్తో సహా ఆయా పనులు నామినేటెడ్ పద్దతిన కొన్ని కంపెనీలకు ఎందుకు కేటాయించారన్నది వివరించాలి కదా!2014 టరమ్లో కేంద్రంలో పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి సత్వరమే పూర్తి చేయించేలా ఒత్తిడి తేవడం మాని, రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ఎందుకు కోరినట్లు? ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును తనకు కావల్సినవారికే ఇచ్చుకునేందుకే అన్న విమర్శలకు ఎందుకు తావిచ్చారు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ అయిందని ఎందుకు విమర్శించారు. దానికి చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేదు! మళ్లీ పొత్తు కుదిరింది కనుక మోడీ కూడా ఆ పాయింట్ మర్చిపోయినట్లు నటిస్తుండవచ్చు. అది వేరే విషయం. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించదలచినప్పుడు వ్యయ అంచనాలపై కేంద్రంతో ఎందుకు సరైన అవగాహనకు రాలేదు?కేవలం ప్రాజెక్టు నిర్మాణమే కాకుండా, ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అక్కడనుంచి తరలించడం, వారికి పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయం గురించి ఎందుకు కేంద్రంతో ఒప్పందం కాలేదు? కేంద్ర ప్రభుత్వం తాము ప్రాజెక్టు కడతాము కానీ, నిర్వాసితుల సమస్య రాష్ట్రమే చూసుకోవాలని చెప్పినప్పుడు ఎందుకు ప్రతిఘటించలేదు? అలాంటప్పుడు మొత్తం ప్రాజెక్టును కట్టి, రాష్ట్రానికి అప్పగించాలని ఎందుకు కోరలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే, గేట్ల అమరిక తదితర పనులను పూర్తి చేసింది నిజం కాదా? ఇవన్నీ అవ్వకుండానే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెబితే అది నిజమే అవుతుందా?2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలోనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందా? లేదా? అయినా ఎందుకు పూర్తి కాలేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులు ఆదాచేసే ప్రయత్నం చేసింది. పోలవరం ప్రాజెక్టులో కూడా సుమారు 850 కోట్ల మేర తక్కువ వ్యయానికి మెఘా సంస్థ టెండర్ పొందింది. దీనిని తప్పు పడుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ను కొనసాగించదలిచారా? లేదా? పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపుదల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారా? లేదా?బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఆ మొత్తం గురించి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా టీడీపీ నాయకత్వమే ఆపుచేయించిందన్న విమర్శల గురించి ఏమి చెబుతారు? బీజేపీతో పొత్తు పెట్టుకునే క్రమంలో ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల వ్యయం కేంద్రం పూర్తిగా భరించి సహకరించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎందుకు కోరలేకపోయారు? చంద్రబాబు తన హయాంలో ఆయా కీలక పనుల ప్రాధాన్యతలను మార్చి పనులు చేయించడంవల్లే ఈ సమస్య వచ్యిందన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన. దీనిని ఆయన గత అసెంబ్లీలో వివరణాత్మకంగా వివరించారు.కాఫర్ డామ్ పూర్తి కాకుండానే, గ్యాప్లు ఉంచి డయాఫ్రం వాల్ నిర్మాణం తలపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా? కాదా? డయాఫ్రం వాల్ నిర్మాణం వరద కారణంగా దెబ్బతిన్నదంటే అది నాణ్యతాలోపమా? లేక మరేదైనా కారణమా? దీనిపై కేంద్ర జల కమిషన్ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవడానికి తాత్సారం చేస్తోంది? కేంద్రంలో ఇప్పుడు కూడా టీడీపీ భాగస్వామి కనుక ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తే ఏమి ప్రయోజనం. తాను పూర్తి చేసి చూపిస్తే ఆయనకే పేరు వస్తుంది కదా! ఇన్ని రాజకీయాలు ఎందుకు!మొత్తం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పూర్తి చేయిస్తామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గతంలో అన్నారు కదా? ఆ ప్రకారం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తారా? కీలకమైన ఢయాప్రం వాల్ నిర్మాణం, సీపేజీ నీరు రాకుండా అడ్డుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టి, డామ్ నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. దానిని ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నించాలి కదా! కేవలం సాంకేతిక నిర్ణయం చేయడంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని ఎందుకు చంద్రబాబు ప్రశ్నించడం లేదు?పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది? అందులో ఎంత మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లించింది?మొదలైన వివరాలను చంద్రబాబు ఎందుకు వెల్లడించలేదు? ఇప్పుడు సమస్య రాష్ట్రం పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తప్పు పట్టడానికే అయితే చంద్రబాబు సోమవారం.. పోలవరం కార్యక్రమం చేపట్టినా ప్రయోజనం ఉండదు.వైఎస్ జగన్మోహన్ రెడ్డిను రాజకీయంగా విమర్శిస్తే విమర్శించండి. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తే యత్నించండి. ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు. ఎవరు ఏ మేరకు కృషి చేశారు? ఎవరు ద్రోహం చేశారు? ఎవరు మేలు చేశారు? అనే అంశాలు చరిత్రలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం ముఖ్యం కాదు. ప్రాజెక్టును పూర్తి చేసిన రోజున చంద్రబాబు కాలర్ ఎగురవేసుకుని ఏమి చెప్పినా వినవచ్చు. అలాకాకుండా కుంటి సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తే మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుంది.ప్రాజెక్టులో తొలిదశలో నీటిని నిల్వ ఉంచే విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో 194 టీఎమ్సీల నీటిని నిల్వ ఉంచాలంటే నిర్వాసితులకు ఇవ్వవలసిన పరిహారం సుమారు ముప్పైవేల కోట్లను కూడా కేంద్రం నుంచి ఎంత తొందరగా రాబట్టుకోగలిగితే అంత మంచిది. ఈ ప్రాజెక్టు ఆంధ్రుల దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీలో చాలా వరకు నీటి సమస్య లేకుండా పోయే అవకాశం ఉంటుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చింది. రాజశేఖరరెడ్డి కేంద్రం నుంచి అనుమతులు తేవడంలో చాలా కృషి చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు కూడా చొరవ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అనూహ్య మరణంతో ఉమ్మడి ఏపీ గతి మారిపోయింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై చూపవలసినంత శ్రద్ద చూపలేదు. కాంట్రాక్టర్ ఎంపికే పెద్ద వివాదంగా మారుతూ వచ్చింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడుతుందని పేర్కొనడంతో మళ్లీ ఆశలు చివురించాయి.వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం పనులపై ఎంతో శ్రద్దపెట్టి అనుమతులు తేకపోతే, విభజన సమయంలో ఈ ప్రాజెక్టు చట్టంలోకి కూడా వచ్చేది కాదేమో! విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఒక వరం అవుతుందని అంతా భావించారు. ఈ తరుణంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్యింది. తదుపరి కేంద్రం బదులు తామే నిర్మిస్తామని తీసుకోవడంతో అనేక కొత్త సమస్యలు వచ్చాయి.తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడం, వరదలు, కరోనా వంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. దాంతో ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కనుక బీజేపీపై ఒత్తిడి పెంచి సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏపీకి మేలు జరుగుతుంది. మరి ఆ విధంగా చంద్రబాబు చేయగలుగుతారా? లేక జగన్మోహన్ రెడ్డిను నిందించడానికే ప్రాధాన్యత ఇస్తారా?– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ప్రతి కార్యకర్తకూ 'తోడుగా ఉందాం': వైఎస్ జగన్
ప్రభుత్వ కార్యాలయాల్లో మేనిఫెస్టో కనిపించిన పాలన మనదైతే.. ఇప్పుడు రెడ్ బుక్ హోర్డింగ్లు పెడుతున్నారు. ఏ అధికారిపై కక్ష సాధించాలి? ఎవరిపై దాడులు చేయాలి? ఎవరిని నాశనం చేయాలి? ఎవరిపై కక్ష సాధించాలి? అని అందులో ఏకంగా పేర్లు రాసుకుంటున్నారు. వాళ్లను కొడతాం, చంపుతామంటూ నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శిశుపాలుడి పాపాల మాదిరిగా ఈ ప్రభుత్వం పాపాలు వేగంగా పండుతున్నాయి. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘మన కార్యకర్తలు కష్టాల్లోనూ, నష్టాల్లోనూ మనతోనే నిలబడ్డారు. జెండాలు మోసి కష్టపడ్డారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు కూడా తిన్నారు. ప్రతి కార్యకర్తకూ తోడుగా నిలిచి భరోసా ఇద్దాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఎన్నికల్లో శాసనసభ, లోక్సభ స్థానాలకు పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులతో గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. సోషల్ మీడియా కార్యకర్తలను, మనకోసం నిలబడ్డ వలంటీర్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామస్ధాయిలో మన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాలని, వారికి తోడుగా ఉండాలని ఆదేశించారు. ‘‘రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడని రీతిలో మన కార్యకర్తలు, సానుభూతిపరులమీద దాడులు చేస్తున్నారు. మనకు ఓటు వేసిన వారి మీద దాడులు చేస్తున్నారు. తీవ్రంగా అవమానించడంతోపాటు ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నారు. ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని చోట్ల చూశాం’’ అని పేర్కొన్నారు. ‘‘మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా.. మీ నియోజక వర్గాలలో కార్యకర్తలకు తోడుగా ఉంటూ పరామర్శించి భరోసా కల్పించండి. సోషల్ మీడియా కార్యకర్తలు, మనకోసం నిలబడ్డ వలంటీర్లకు తోడుగా నిలవాలి. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ ఇచ్చే సహాయాన్ని మీరు స్వయంగా అందచేయండి’’ అని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ‘‘రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుస్తా. నష్టపోయిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి కలసి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తా. మా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి మా వద్దకు రాలేదనే మాట అనిపించుకోవద్దు. ప్రతి కార్యకర్తకూ భరోసా కల్పిద్దాం. ఇది అవసరం’’ అని సూచించారు. ‘‘మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం పక్కకు తప్పుకుంటే వారంతా నష్టపోతారు. లక్షల మంది కార్యకర్తలు, వేలమంది నాయకులు, వందల మంది పోటీచేసిన అభ్యర్థులు కూడా నష్టపోతారు. మనల్ని నమ్ముకున్న ప్రజలు, నాయకులు అంతా నష్టపోతారు. నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి’ అని ధైర్యం చెప్పారు. ప్రతి అభిమానికీ, ప్రతి కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడిది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులకు ఓటమి తప్పలేదు. చివరకు ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పకుండా. మనం ధర్మం వైపే ఉన్నాం. విశ్వసనీయతతో రాజకీయాలు చేశాం. తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ప్రతి ఒక్కరూ అర్జునుడి మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు. పైన దేవుడున్నాడు. ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రజలను, దేవుడ్ని నమ్ముకున్నాం. ధైర్యంగా అడుగులు వేద్దాం’’ అంటూ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మేనిఫెస్టో అజెండాగా పాలన..ఈ రోజు నేను మీ అందరితో నా మనసు నుంచి వచ్చిన విషయాలను పంచుకుంటున్నా. ఈ ఎన్నికల్లో మీరంతా గట్టి పోరాటం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎప్పుడూ ఊహించని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, మనలో ప్రతి ఒక్కరూ తలెత్తుకునేలా పాలన చేశాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో హామీలను 99 శాతం అమలు చేశాం. ప్రతి ఇంటికీ మేనిఫెస్టోతో వెళ్లి ఆశీస్సులు తీసుకుని ఎన్నికలకు వెళ్లాం. ప్రతి గడపకూ తిరిగాం. రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఇంత సీరియస్గా ఎవరూ, ఎప్పుడూ తీసుకోలేదు. ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పి, పెద్ద పెద్ద పుస్తకాలు ముద్రించి ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులను మనం చూశాం. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకూ మేనిఫెస్టోలు పెట్టి అమలు చేశాం. ప్రతి డిపార్ట్మెంట్లో హెచ్ఓడీల కార్యాలయాల్లో మన మేనిఫెస్టో పెట్టి అదే అజెండాగా పాలన చేశాం. వారందరినీ మొట్ట మొదటి రోజు నుంచి సమాయాత్తం చేసి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాం.సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు..ఎప్పుడూ జరగని విధంగా పేదవాడిని ఆ పేదరికం నుంచి బయటకు తెస్తూ మన అడుగులు పడ్డాయి. క్వాలిటీ చదువుల వల్లే ఇది సాధ్యమని భావించి విద్యారంగంలో సమూల సంస్కరణలు తెచ్చాం. మూడో తరగతి పిల్లలకు టోఫెల్ పీరియడ్, ఇంగ్లీషు మీడియం బడులు, ఆరో తరగతి నుంచే ఐఎఫ్పీలు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు.. ఇలా ఎన్నో మార్పులు తెచ్చాం. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీ కింద ఏకంగా రూ.25 లక్షల వరకూ వైద్యం ఉచితంగా అందించాం. ఆరోగ్య ఆసరా నుంచి గ్రామ స్ధాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాం. ఏకంగా 54 వేలమంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించాం. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆర్బీకేల ద్వారా రైతన్నలకు తోడుగా నిలిచాం.గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం..విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మొట్టమొదటిసారిగా గ్రామ స్ధాయిలో ఎన్నో మార్పులతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేని పాలన కచ్చితంగా సాధ్యమేనని గత ఐదేళ్లలో నిరూపించాం. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. మహిళా సాధికారితకు ఏం చేయవచ్చో అన్నీ చేశాం. అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లే పరిస్ధితి కల్పించాం. దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకున్నాం. గ్రామంలోనే మహిళా పోలీసుల సేవలను తీసుకొచ్చాం.చేసిన మంచే శ్రీరామరక్ష..ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40 శాతం ఓటు షేర్తో మనం ప్రతిపక్షంలో ఉన్నాం. 2019లో మనకు 50 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి 10 శాతం ఓట్లు తగ్గాయి. ఇదే ప్రజలు మళ్లీ 2029 వచ్చేసరికి చంద్రబాబు మోసాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ మనల్ని తెచ్చుకుంటారు. ఇవ్వాళ్టికి కూడా మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఈరోజు కూడా ప్రతి గడపలోనూ మనం చేసిన మంచి కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికీ, ప్రతి ఇంటికీ మనం చేసిన మంచేమిటో తెలుసు. మనం చేసిన మంచే ఎప్పటికీ మనకు శ్రీరామరక్షే. విశ్వసనీయతకు మన పార్టీ చిరునామా. జగన్ మాట తప్పడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలన ఇచ్చాడని విశ్వసనీయతకు అర్ధం చెబుతూ మనం అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు. చంద్రబాబు సింగిల్ డిజిట్ చూస్తారు..ఈరోజుకీ జగన్ అబద్ధాలు చెప్పడు, మోసం చేయడని గర్వంగా చెబుతున్నా. చంద్రబాబు కన్నా మనం ఎక్కువ హామీలిచ్చి ఉంటే బాగుండేదని చాలా మందికి అనిపించవచ్చు కూడా! రాజకీయాల్లో జగన్ ఇంత నిజాయితీగా ఉండడం అవసరమా? అనుకునే వాళ్లూ ఉండొచ్చు! కానీ ఒక్కటే చెబుతున్నా... ఓడిపోయినా ఫర్వాలేదు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం.. ధర్మం, న్యాయం కాదనే జగన్ ఎప్పుడూ నమ్ముతాడు. 2014లో కూడా ఇదే నమ్మా. సాధ్యం కానిది సాధ్యం కాదనే చెప్పాను. చంద్రబాబు వ్యవసాయ రుణాల మాఫీ దగ్గర నుంచి అన్నీ చేస్తానని చెప్పి 2019 నాటికీ చేయకపోవడం వల్ల నాడు ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మనల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మనకు గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు. ప్రజలు మళ్లీ అదే చేస్తారు. ప్రజలు మనల్ని ఏ స్థాయిలో ఆశీర్వదిస్తారంటే.. చంద్రబాబు నాయుడికి సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితులు కూడా చూస్తాం. ఇది వాస్తవం.ప్రజలతో కలసి పోరాటాలు చేద్దాం..మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికీ పోలేదు. ఈ రోజు నేను చెబుతున్నా.. జగన్కు వయసుతోపాటు సత్తువ కూడా ఉంది. చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలసి చేసే పోరాటాల్లో వైఎస్సార్సీపీకి, జగన్కు ఎవరూ సాటిరారు. ప్రజలకు మళ్లీ దగ్గరయ్యే కార్యక్రమాలు, వారికి తోడుగా ఉంటూ వారి తరపున పోరాటం చేసే కార్యక్రమాలు జరుగుతాయి. మన సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో మనం చేయగలిగేది తక్కువే. స్పీకర్ పదవి చేపట్టనున్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలను మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒకరేమో జగన్ ఓడిపోయాడు కానీ.. చనిపోలేదు అని అంటారు. చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరు అంటారు. ఆ వ్యక్తిని ఇప్పుడు స్పీకర్ పదవిలోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. కానీ చంద్రబాబు పాపాలు పండేకొద్దీ ప్రజలతో కలిసి, ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా చంద్రబాబు నాయుడు పాపాలు వేగంగా పండుతున్నాయి. కులం, మతం, ప్రాంతం చూడకుండా, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడకుండా ప్రతి పథకాన్ని మనం డోర్ డెలివరీ చేశాం. కానీ ఇవాళ వారి పార్టీకి ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులపై దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటే శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయి. ప్రతి ఇంటికీ తలెత్తుకుని వెళ్లగలం..ఓడిపోయామన్న భావనను మీ మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఉంది. ప్రతి ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికీ మనం తలెత్తుకుని వెళ్లగలం. చెప్పినవన్నీ చేశాం కాబట్టి ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. చంద్రబాబు ప్రలోభాల వల్ల మోసపోయిన పరిస్ధితులతో మనకు అంతో ఇంతో అపజయం జరిగింది. ఆ మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై ప్రజాగ్రహం, మన పట్ల అభిమానం వ్యక్తం అవుతుంది. మనం మళ్లీ రికార్డు మెజార్టీలతో గెలుస్తాం.బాధ అనిపించింది..గతంలో ఎప్పుడూ ఇలాంటి మార్పులు జరగలేదు. ఇన్ని చేశాక వచ్చిన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇవేవీ చేయకపోయి ఉంటే... చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నామనే దానికి అర్ధం ఉండేది. ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత, ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ అనిపించింది. ఫలితాలు చూసిన తర్వాత శకుని, పాచికల కథ గుర్తుకొచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం.నాలుగేళ్లు అవిశ్వాసానికి ఆస్కారం లేదుస్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు భరోసా కల్పించాలన్న వైఎస్ జగన్మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరితో మాట్లాడి భరోసా ఇవ్వండి. వారిని బెదిరించే కార్యక్రమాలు, ప్రలోభాలు జోరుగా జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని వారిని బెదిరిస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి చెప్పండి. స్థానిక సంస్థలకు సంబంధించి వారిపై నాలుగేళ్ల వరకూ కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. చట్టం దీన్ని నిరోధిస్తుంది. ఆ చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే ఏమీ చేయలేరు. కోర్టులు దీనికి ఒప్పుకోవు. అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ మనవాళ్లకు విడమరచి చెప్పాలి. వారికి తోడుగా ఉన్నామనే ధీమా కల్పించాలి. అప్పుడు వారిలో భరోసా కలుగుతుంది. మీరంతా ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా చేయాలి.హోదా అడగకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి..కేంద్రంలో మెజారిటీ కోసం 272 స్థానాలు అవసరం కాగా బీజేపీ 240 దగ్గర ఆగిపోయింది. చంద్రబాబుకు 16 ఎంపీ స్థానాలున్నాయి. తాను ఎన్డీఏలో చక్రం తిప్పుతున్నట్టుగా ప్రధాని మోదీ పక్కన కూర్చుని కనిపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగకపోవడం, అడిగి సాధించుకునే దిశగా అడుగులు వేయకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి. అలా అడగలేని మనిషి రాష్ట్రానికి, యువతకు ఏం సమాధానం చెబుతాడు?హనీమూన్ ముగుస్తుంది..ఇవాళ వైఎస్సార్సీపీ పాలన, జగన్ ఉండి ఉంటే ఈపాటికే విద్యాదీవెన ఇచ్చేవాళ్లం. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన బటన్ నొక్కేవాళ్లం. ఇవి పెండింగ్లో ఉన్నాయి. రైతు భరోసా పెండింగ్, అమ్మ ఒడి పెండింగ్, చివరకు చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్లోనే పెట్టారు. ఒక్క జగన్ తప్పుకోవడంతో, వైఎస్సార్సీపీ పాలన లేకపోవడంతో ఏమీ రావడం లేదని ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో 4.12 కోట్ల మంది ఓటర్లున్నారు. దాదాపు సగానికిపైగా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. రూ.1,500 ప్రతి ఒక్కరికీ ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్లని పక్కనపెట్టినా మిగిలిన 1.8 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. రూ.20 వేల పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దాదాపు కోటి మంది పిల్లలు అమ్మ ఒడి కింద వచ్చే డబ్బులు కోసం నిరీక్షిస్తున్నారు. వీరి కోసం అడుగులు ఏవీ ముందుకు పడని పరిస్థితి నెలకొంది. కాలం గడుస్తున్న కొద్దీ హనీమూన్ పీరియడ్ ముగుస్తుంది.ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో?ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి తలెత్తుకుని సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా నేరుగా అందచేశాం. ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందే క్యాలెండర్ ప్రకటించి తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఇలా ఎప్పుడూ ఇలా జరగలేదు. మరి ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయి? అని ఒక్కోసారి అనిపిస్తుంది. మనం అధికారంలోకి రావడానికి రెండు నెలల ముందు వరకు పెన్షన్ కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చిన పరిస్థితి ఉంటే మనం ఏకంగా రూ.3 వేలకు పెంచాం. అప్పట్లో 39 లక్షల మంత్రి మాత్రమే పెన్షనర్లు ఉంటే మనం వచ్చాక ఏకంగా 66 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తూ పింఛన్లు ఇంటి వద్దే వారి చేతికే అందించాం. వాళ్ల ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఆ 66 లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మల ఆప్యాయతలు, ప్రేమలు ఏమయ్యాయి? 54 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి అందించాం. పిల్లలు గొప్పగా చదవాలి, వారికి మంచి భవిష్యత్ ఉండాలనే తపనతో అమ్మఒడి ఇచ్చాం. వాళ్ల ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు. ఏకంగా 53.58 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా ఇచ్చాం. వ్యవసాయ రంగంలో ఇవి ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు. మరి వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు. ఏకంగా 1.5 కోట్ల మందికి పైగా అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ ఇచ్చాం. 79 లక్షలమంది అక్క చెల్లెమ్మలు అప్పులతో కుదేలైన పరిస్థితుల్లో వారికి అండగా ఉంటూ ఆసరా ఇచ్చాం. 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇచ్చాం. 30 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన వారి తల్లులకే ఇచ్చాం. 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 3.60 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం, 4.96 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, 82 వేల మందికి నేతన్న నేస్తం, 2.76 లక్షల మందికి వాహనమిత్ర, 16 లక్షల మందిని తోడు కార్యక్రమం ద్వారా ఆదుకున్నాం. 3.38 లక్షల మందికి చేదోడు, 1.10 లక్షల మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా క్రమం తప్పకుండా ఇచ్చాం. కోవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితులున్నా సాకులు చెప్పకుండా మంచి చేశాం. -
నా కొ..ల్లారా.. నరుకుతా..
అనంతపురం క్రైం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. ‘నా కొ..ల్లారా.. ఒక్కొక్కరినీ నరుకుతా’ అంటూ బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే బండబూతులతో చెలరేగిపోయారు. రవాణా శాఖ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు తాడిపత్రి మునిసిపల్ అధికారులకు, పోలీసులకు, వైఎస్సార్సీపీ నేతలకు బహిరంగంగానే వారి్నంగ్ ఇచ్చారు. ప్రధానంగా గతంలో రవాణా శాఖ కమిషనర్గా చేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్, మహిళా అధికారిణి అత్తికానాజ్లను దుర్భాషలాడారు. ‘మీరెక్కడ దాక్కున్నా వదలను. గత ప్రభుత్వ హయాంలో నా బస్సులు, లారీలను అన్యాయంగా సీజ్ చేశారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించారు. నన్ను, నా కొడుకును జైలుకు పంపారు. నిబంధనల మేరకే మేము బీఎస్–4 వాహనాలు కొన్నాం. బీఎస్–4 వాహనాలు అమ్మిన వాళ్లదే తప్పు అని సుప్రీం కోర్టు చెప్పింది. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారు. అక్కడ రిజి్రస్టేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయి. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న మాపై కేసులు పెట్టారు. జైళ్లకు కూడా పంపారు. అందరిపై ప్రతీకారం తీర్చుకుంటా. సీజ్ చేసిన మా బస్సులు, లారీలన్నీ తుప్పు పట్టిపోయాయి. వాటిని మీరే (అధికారులే) రిపేరు చేయించి తిరిగి రోడ్డుపైకి తేవాలి. ఇందుకు పది రోజులు గడువిస్తున్నా. లేదంటే భార్య, పిల్లలతో కలసి డీటీసీ, ఎస్పీ కార్యాలయాల ముందు నిరాహార దీక్ష చేస్తా. తాడిపత్రి మునిసిపల్ ఆఫీసులో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. రేయ్.. కమిషనర్లూ మిమ్మల్ని వదలను. ‘నా కొ..ల్లారా నరికేస్తా. ఏమవుతుంది మీతో’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారులను దుర్భాషలాడారు. ‘నా ఫ్యామిలీకి 620 ఏళ్ల చరిత్ర ఉంది. నా గడ్డం ఎందుకు వదిలాననుకుంటున్నారు? చంద్రబాబు సీఎం కావాలని వదల్లేదు. ఒక్కో వెంట్రుకకు ఒక్కో కథ ఉంది. అత్తికానాజ్ ఆడదంట.. ఏమ్మా అన్నా వినలేదు. ఇంట్లో తను ఎలా ఉంటుందో తెలుసా?’ అంటూ రాయలేని భాషలో దూషించారు. వైఎస్సార్సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నానీలను కూడా దూషించారు. బస్సులు, లారీల వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత సమస్య అని, చంద్రబాబుకు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. తాను సొంతంగానే పరిష్కరించుకుంటానన్నారు. అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. తాను ఊ అంటే చాలు తనకున్న జనం మరెవరికీ లేరని అన్నారు. -
‘పోలవరం’ పనుల్లో సంక్షోభం.. బాబు తప్పిదం వల్లే..: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య అధి కారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదంవల్లే పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం చోటుచేసుకుందని.. పనుల జాప్యానికి ఆయనే కారణమని మాజీమంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సోమ వారం సీఎం చంద్రబాబు చెప్పిన మాటలన్నీ పూర్తి అవాస్తవాలు, పచ్చి అబద్ధాలన్నారు. పోలవరం పర్యటన సందర్భంగా ఆయన చేసిన తప్పులను గుర్తుచేసుకోకుండా.. వైఎస్ జగన్పై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయడానికి 2019–24 మధ్య వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేశారని.. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తిచేసి గోదావరి వరద ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారని గుర్తుచేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఒప్పుకుని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అంబటి చంద్రబాబుకు హితవు పలికారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వాస్తవాలు అవాస్తవాలు అవుతాయా..?ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజులకే సోమవారం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఆయనచేసిన తప్పులన్నీ వైఎస్ జగన్పై నెట్టేందుకు యత్నించారు. కానీ, పోలవరం పూర్తిచేయాలంటే ఇంకా నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారంటూ బాబు వెల్లడించారు. పోలవరంలో విధ్వంసానికి వైఎస్ జగనే కారణమని ఆయన పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి.. 2019కి ముందు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలే పోలవరం విషయంలో సంక్షోభం వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో బాబు వ్యూహాత్మక, చారిత్రక తప్పిదాలే ఈ పరిస్థితికి దారితీశాయి. ముందుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, తర్వాత ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టడమే దీనికి ప్రధాన కారణం. డయాఫ్రం వాల్తో పాటు ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ పనులు సమాంతరంగా చేపట్టారు. జర్మనీకి చెందిన బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్ను పూర్తిచేసి రూ.460 కోట్లు బిల్లులు తీసుకుంది. చివరకు కాఫర్ డ్యాంల మధ్య ఖాళీలు ఉంచేయడంతో వరదలకు డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. ఇదీ వాస్తవం. దీన్ని దాచిపెట్టి, కాంట్రాక్టర్ను మార్చడంవల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నట్లుగా చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారు. అంతేకాక.. ఇటు స్పిల్ వే, కాఫర్ డ్యాం పూర్తిచేయకపోడం, గోదావరి నదిని డైవర్షన్ చేయకపోవడంవల్ల 54 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొన్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వీటికి సమాధానం చెప్పకుండా మీరు చేసిన తప్పులను వైఎస్ జగన్ పైకి నెట్టేసి పబ్బం గడుపుకుందామనుకుంటున్నారా చంద్రబాబూ? పోలవరంలో జరిగిన అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు, మేధావులు, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్లు అర్థంచేసుకోవాలి.ఐదేళ్లలో పూర్తిచేస్తామని చెప్పలేకపోతున్నారు..నిజానికి.. చంద్రబాబువల్లే ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యానికి చంద్రబాబే కారణం. చివరకు.. ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చినా సరే ఐదేళ్లలో పూర్తిచేస్తామనే మాట చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. 2019కి ముందు చంద్రబాబు అశాస్త్రీయంగా ఆలోచించడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది.. అప్పట్లో సొంత తెలివితేటలు ఉపయోగించడంవల్ల ఆయన అనేక తప్పులు చేశారు. ఇవాళ వైఎస్ జగన్ మీద విరుచుకుపడడం అన్యాయం.శరవేగంగా పనులు చేసింది వైఎస్ జగనే..ఇక దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను ఏం చేయాలన్న దానిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికీ నిర్ధిష్టమైన నిర్ణయానికి రాలేదు. ప్రాజెక్టులో 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెబుతుండటం విడ్డూరం. ఎందుకంటే..– మేం కట్టిన పోలవరం స్పిల్వే మీద చంద్రబాబు ప్రయాణించారని తెలుసుకోవాలి. మేమే రెండు కాఫర్ డ్యాంలు పూర్తిచేశాం. – అలాగే, గోదావరి నదిని పూర్తిగా స్పిల్వే మీదుగా డైవర్షన్ చేశాం. – స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ కూడా పూర్తిచేశాం. – ఇవికాక క్రిటికల్ నిర్మాణాలు పూర్తిచేసి, గేట్లన్నీ పెట్టి ప్రస్తుతం ఎంత వరద వచ్చినా ఆపరేట్ చేసే పరిస్థితికి ప్రాజెక్టును తీసుకెళ్లాం. – కానీ, చంద్రబాబు మసిపూసి మారేడు కాయచేసే ప్రయత్నం చేస్తున్నాడు.జగన్ ఏ తప్పూ చేయలేదు..మరోవైపు.. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్తానంటున్నారు. వైఎస్ జగన్ను దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నారు. కాబట్టి దీన్ని కూలంకషంగా ప్రజలు అర్థంచేసుకోవాలి. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.. పోలవరం పనుల్లో జగన్ ఎలాంటి తప్పుచేయలేదు. శరవేగంగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలవల్లే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. నాలుగేళ్లకు పూర్తవుతుందా? ఐదేళ్లకు పూర్తవుతుందా? అనే అంశాన్ని అపర మేధావినని, చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం.. ఆయన ప్రభుత్వం చేసిన తప్పిదం తప్ప మరొకటి కాదు. బాబు హయాంలో జరిగిన విధ్వంసంవల్ల ప్రతి తెలుగువాడూ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పూ చేయలేదు. చంద్రబాబు తన తప్పులను ఒప్పుకోవాలి.‘హోదా’ తీసుకురాకపోతే ద్రోహిగా మిగిలిపోతారు..చంద్రబాబుకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. భగవంతుడు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కూటమిని గెలిపించారు. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇచ్చారు. కేంద్రంలో ప్రధాని మోదీ చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. చంద్రబాబు చాలా లక్కీ. ఆంధ్రప్రదేశ్కు కూడా లక్కీయే. ఇలాంటి పరిస్థితి రావాలని వైఎస్ జగన్ చాలాసార్లు కోరుకున్నారు. ఆయనకు రాని అవకాశం టీడీపీకి వచ్చింది. ఇప్పుడు ధర్మపోరాట దీక్షలు అవసరంలేదు. మీ చేతిలో పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదాను తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణం పోయండని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోలేకపోతే రాష్ట్రానికి చంద్రబాబులాంటి ద్రోహి ఎవరూ ఉండరని మనవి చేస్తున్నా. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం వంటివన్నీ వదిలేసి వైఎస్ జగన్ను రోజూ తిట్టుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు బాబూ? -
బ్యాలెట్టే బెటర్: వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలపై ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై మరోవైపు తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఫలితాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక మాధ్యమం(ఎక్స్) ఖాతాలో ఓ కీలక సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలు కాదు. దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. ఈవీఎంలను పక్కన పెట్టాలి. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనగలదు’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
ఏపీలో చంద్రన్న రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లేనా?
నేను ఫలానా వాళ్లను కొట్టబోతున్నాను.. లేదా చంపబోతున్నాను అని ఎవరైనా పెద్ద హోర్డింగ్ పెడితే ఏమవుతుంది. వెంటనే పోలీసులు చర్య తీసుకుని అలాంటి హోర్డింగ్ ను తొలగించడమే కాకుండా, అలా చేసినవారిని అదుపులోకి తీసుకుంటారు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగే ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. బహిరంగంగా హోర్డింగ్ లు పెట్టి రెడ్ బుక్ సిద్ధం అంటూ తమ నేత బొమ్మ వేసుకుని మరీ ప్రచారం చేసుకోవచ్చు. అయినా పోలీసులు స్పందించరు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందంగా చూస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం పట్టి, పట్టనట్లు వ్యవహరిస్తుంది. వారికి ఇష్టమైన మీడియా ఆహో, ఓహో అని భజన చేస్తాయి. ఇదో చిత్రమైన పరిస్థితి అని చెప్పాలి.⇒ ఏపీలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే ఇలాంటి దారుణమైన పోకడలు సాగుతున్నాయి. దీనిని అదుపు చేసే పరిస్థితి ఇప్పట్లో ఉండదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయాలలో వైరుధ్యాలు, వైషమ్యాలు ఉండవచ్చు. కోప, తాపాలు ఉండవచ్చు. లేదా ఎదుటివారు ఎదైనా తప్పు చేశారనుకుంటే చట్టపరంగా కేసులు పెట్టవచ్చు. ఇవేవి కాకుండా మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బోర్డులు పెడుతున్నారు. అదేదో గొప్ప పనిగా వారు చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన చర్యేనా అనే ప్రశ్న వస్తే, మైట్ ఈజ్ రైట్ అన్నట్లుగా, రౌడీలు, గూండాలు చెలరేగిపోయినా పట్టని కాలంలో మాత్రమే ఇలాంటివాటిని సమర్థించగలం.⇒ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటివి జరగకూడదు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నలభైఆరేళ్లుగా రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. దేశంలోనే ఆయన అంత అదృష్టవంతుడైన నేత లేరంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను, అంతకన్నా ఎక్కువకాలం ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. ఆయనకు నిబంధనలు, చట్టం, రాజ్యాంగం గురించి తెలియవని అనుకుంటే పొరపాటు. అయినా ఆయన ఏలుబడిలో ఇలాంటి దుశ్చర్యలు ఎలా కొనసాగుతున్నాయంటే ఏమి చెబుదాం. ఆయనలో ఇంకా కక్షపూరిత రాజకీయాలు పోలేదన్న అభిప్రాయానికి తావిస్తున్నారు.⇒ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే తీవ్రంగా స్పందించి, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇంకొకటని అరిచి ఘీ పెట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు తాము అధికారంలోకి రాగానే కొత్త రాజ్యాంగం సృష్టించుకున్నారని అనుకోవాలా? చంద్రన్న రాజ్యాంగం అమలులోకి వచ్చినట్లా? దీని ప్రకారం ఎవరినైనా తాము కొట్టవచ్చని, తిట్టవచ్చని, చంపవచ్చని, ఎవరూ మాట్లాడడానికి వీలు లేదని కొత్త నిబంధనలు తయారు చేశారా! పైగా వాటిని బహిరంగంగా హోర్డింగ్ ల ద్వారా ప్రజలందరికి తెలియచేసే కొత్త సంస్కృతికి తెరదీశారా? ఇదేనా చట్టబద్దమైన, రాజ్యాంగ పాలన అంటే!⇒ ప్రతిపక్షంలో ఉండగా, ఎవరు సలహా ఇచ్చారో కానీ లోకేష్ తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అంటూ పట్టుకు తిరిగారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న భావన కలిగితేనో, అధికారుల శైలి తమకు నచ్చకపోతేనో, లేక తాము చేసే అల్లర్లకు అడ్డుపడితేనో, కేసులు పెడితేనో, వారి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని, అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని బెదిరిస్తుండేవారు. తొలుత ఎవరూ దీనిని సీరియస్ గా తీసుకోలేదు.⇒ కొందరు సరదాగా తీసుకుంటే, పోలీసు అధికారులు సైతం పెద్దగా స్పందించలేదు. అయితే చంద్రబాబు, లోకేష్ లపై ఆయా స్కాములకు సంబంధించి కేసులు పెట్టిన సందర్భంలో అప్పటి సీఐడీ అధికారులు ఈ రెడ్ బుక్ వ్యవహారంపై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని కోర్టు ఇంకా తేల్చలేదు. ఈలోగానే వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో రెడ్ బుక్ కేసు ఏమవుతుందో కానీ, అధికారులు ఎవరూ దానిని పర్స్యూ చేసేపరిస్థితి ఉండదు. రెడ్ బుక్ అంటూ తిరిగిన వ్యక్తి లోకేష్ మంత్రి అయ్యారు. ఆ రెడ్ బుక్ ను విశాఖ సభలో ఆయన తన తండ్రి చంద్రబాబుకు అందచేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.⇒ ఆ రెడ్ బుక్ లో పలువురు అధికారుల పేర్లు, వైఎస్సార్సీపీ నేతల పేర్లు.. లేదా ఇంకొందరు తమను వ్యతిరేకించేవారి పేర్లు రాసుకుని ఉండవచ్చు. ఆయా సభలలో కొందరి పేర్లను లోకేష్ ప్రకటిస్తూ వచ్చారు కూడా. చిత్తూరులో ఒక ఎస్పీ పేరును ఇలానే అప్పట్లో ప్రకటించారు. అలా అధికారులను బెదిరించవచ్చా! నిజంగానే అధికారంలోకి వచ్చారు కనుక వారిపై చర్య తీసుకుంటామని బహిరంగంగా బోర్డులు పెట్టవచ్చా! గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయా! అసలే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హింసాకాండతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, అది చాలదన్నట్లు రెడ్ బుక్ సిద్దం అంటూ ప్రజలను భయభ్రాంతులను చేసే ప్రకటనలు ఏమిటో తెలియదు.⇒ టీడీపీ నేత బుద్దా వెంకన్న వంటివారు వారిని అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని రాజకీయ ప్రకటనలు చేస్తుంటే అదేదో మామూలేనని అనుకుంటాం. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, మరొక టీడీపీ నేత కూర్చుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ, చావలేదు.. అని అంటుంటే వీరి మనసులో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా? అన్న విషయం బహిర్గతం అయిపోతుంది. దానికి తగినట్లుగానే రెడ్ బుక్ హోర్డింగ్ లు పెడుతున్నారన్న అనుమానం ప్రజలలో ప్రబలుతుంది.⇒ పూర్వకాలంలో తమ అధికారానికి అడ్డు పడుతారనుకునే వారిని రాజులు, నియంతలు చంపించేసేవారట. ఉత్తర కొరియా వంటి దేశాలలో ఇప్పటికీ అలాంటి రాక్షస సంస్కృతి ఉంది. చైనాలో ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది కమ్యూనిజం ముసుగులో ఉన్న నియంత రాజ్యం కనుక. చైనాలో సాంస్కృతిక విప్లవం పేరుతో ఎన్ని ఘోరాలు జరిగాయో చరిత్ర చెబుతుంది. రష్యాలో పుతిన్ కు ఎదురుతిరిగినవారిని బతకనివ్వడం లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రజాస్వామ్యదేశంగా ఉన్న భారత్ లో అలాంటివి సాధ్యమేనా? అందులోను ఒక రాష్ట్రంలో ఇలా జరుగుతుందా? అది ఎల్లకాలం అయ్యే పనేనా? అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఉండేది ఐదేళ్ల కాలపరిమితే అన్న సంగతి మర్చిపోయి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే తర్వాత ప్రజలు వాటిని గుర్తుంచుకోరా?⇒ గొప్ప నేతగా పేరుపొందిన ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి పెట్టి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను జైళ్లపాలు చేసిన తర్వాత కొంతకాలం అధికారంలో ఉండగలిగారు కానీ, ఆ తర్వాత ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోలేదు. అయినా రాజకీయ నేతలు గుణపాఠాలు నేర్చుకోరు. పోలీసులు తమ చేతిలో ఉంటారు కనుక ఏమైనా చేయవచ్చని, ఇతర వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చన్న విశ్వాసంతో అరాచకాలకు పాల్పడుంటారు. కానీ ఆ తర్వాత వారు కూడా ఏదో నాడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తుందని మర్చిపోతారు.⇒ ఎంత పిల్లి అయినా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుందని సామెత. ఒకపక్క రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్న సమయంలోనే ఈ రెడ్ బుక్ ప్రకటనలు ఇంత బహిరంగంగా హోర్డింగ్ ల రూపంలో జనంలోకి వస్తే, గూండాలను, మాఫియాలను ఎంకరేజ్ చేసినట్లా? కాదా? అన్నది వారే ఆలోచించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి
సాక్షి, అమరావతి: పోలవరం సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలను గోదాట్లో కలిపేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దుతూ.. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తిచేసి 2021 జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కిమీల పొడవున వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేయకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్వాల్ నిర్మించడం ద్వారా చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని.. ఆ తప్పు జరిగి ఉండకపోతే 2022 నాటికే అప్పటి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు, అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు తొలిసారిగా పోలవరం పనులను సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చారిత్రక తప్పిదంతో కోతకు గురైన డయాఫ్రమ్ వాల్⇒ విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ⇒ ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్వే, కాఫర్ డ్యామ్లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. ⇒ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. ⇒ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యామ్లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి. ⇒ గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్ డ్యామ్లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్వాల్లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి. ⇒ వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. విధ్వంసం వల్లే పనుల్లో జాప్యంనాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జల్శక్తి శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో నవయుగకు అప్పగించిన రూ.2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని 2019 జూలైలో వైఎస్ జగన్ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తద్వారా ఖజానాకు రూ.783.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరక కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోన గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వేను 48 గేట్లు బిగించడంతో సహా ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ చానల్ను పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్వే మీదుగా 6.1 కి.మీ.ల పొడవున మళ్లించారు. దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి కావడంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడివేసి వరదల ఉద్ధృతి వల్ల ఏర్పడిన అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్త యథాస్థితికి తెచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి అనుసంధానం చేయాలా? అనే విషయాన్ని సీడబ్ల్యూసీ తేల్చలేదు. సాంకేతికపరమైన ఈ అంశాన్ని తేల్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి గత ప్రభుత్వం కేంద్ర జల్శక్తి శాఖ, సీడబ్ల్యూసీని కోరుత⇒ వచ్చింది. డయాఫ్రమ్ వాల్సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంతర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము కూడా ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని.. రెండు సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్ను ఆమోదించి పనులు చేయాలని సీడబ్ల్యూసీకి చెబుత⇒ వచ్చింది. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే విధ్వంసం జరిగేదే కాదని.. ఇప్పుడు పనుల్లో జాప్యానికి అదే కారణమవుతోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2029 నాటికే.. వరదల ప్రభావం వల్ల నవంబర్ వరక⇒ పోలవరం పనులు చేపట్టడానికి సాధ్యం కాదు. డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని సీడబ్ల్యూసీ తేల్చితే నాలుగు సీజన్లలో పోలవరాన్ని పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాటి టీడీపీ సర్కారు తప్పిదాలను వైఎస్ జగన్ చక్కదిద్దినప్పటికీ పోలవరాన్ని 2029 నాటికి గానీ పూర్తి చేయలేమని చంద్రబాబు అంగీకరించారని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాఫర్ డ్యామ్ల లీకేజీల పాపం బాబు సర్కార్దే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులు చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫరి్మయబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతువరక⇒ స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరక⇒ జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్లు రూపొందించింది. నవయుగ సంస్థ ఆ మేరకే జెట్ గ్రౌటింగ్ చేసి కాఫర్ డ్యామ్ల నిర్మాణం చేపట్టింది. జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యతి్నంచడం గమనార్హం. రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డు పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెపె్టంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోను మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉంది. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్కు ప్రతిపాదన పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. దీంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయలేదు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్తో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగునీటిరంగ నిపుణులు సూచిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ బౌన్స్ బ్యాక్ వెరీ సూన్!
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనూహ్యంగా ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేర్వేరుగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని, మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై చర్చిస్తున్నారు. తాను కచ్చితంగా ప్రజలలో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్ కు భరోసా ఇచ్చేది అవుతుంది.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలో తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాయుత ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. కొద్ది మంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీవారి ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. వారి కోసం ఇప్పటికే జిల్లా వారీగా లీగల్ టీమ్ లు ఏర్పాటుచేశారు. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని కోరారు. తదుపరి తానే స్వయంగా వెళ్లి పరామర్శించబోతున్నారు.ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి, టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా, మరణించినా చంద్రబాబు దానిని రాజకీయం చేసి, అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతుండేది. ఈ రకంగా ఐదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతేనేం అధికారం సంపాదించారు. టీడీపీ వారు దానిని సద్వినియోగం పరచుకోవడం మాని వైఎస్సార్సీపీ వారిపై కక్ష సాధింపునకు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యధేచ్చగా హింసాకాండకు పాల్పడడానికి చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ప్రోత్సహం ఇవ్వడం దురదృష్టకరం.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీవారిలో విశ్వాసం పెంపొందిచడానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీకు భవిష్యత్తు ఉందని ఆయన చెబుతూ ఆత్మ స్థైర్యం కోల్పోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989-94, 2004-2014, 2019-2024 టరమ్ లలో అధికారంలో లేదు. ప్రతిపక్షంగానే ఉంది. అయినా పార్టీ నిలబడింది. తిరిగి పవర్ లోకి వచ్చింది. అబద్ధాలతో వచ్చిందా? లేక కొందరు అనుమానిస్తున్నట్లు ఈవీఎం మోసాలతో వచ్చిందా? అనేది వేరే విషయం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలపాటు అధికారంలో లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి.అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా, నిత్యం ప్రజలతో మమేకమయి 2019లో ప్రభుత్వంలోకి వచ్చారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైఎస్సార్సీపీకి కూడా కొత్త కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్ కు కాస్త ధైర్యాన్ని ఇచ్చి ప్రజలలో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఉంటుంది. దానిని వినియోగించుకోగలగాలి.ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలను నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగా పేరొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ చాలా వరకు మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దానినే ఆయన ప్రస్తావించి మనపట్ల విశ్వసనీయత బతికే ఉందని అన్నారు. అర్హతే ప్రమాణికంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా స్కీములు అమలు చేసిన చరిత్ర తమది అయితే, కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో టీడీపీ వారు తెగబడి రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరి స్కీముల అమలులో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.అయితే అదే విశ్వసనీయత పాయింట్ ఆయనను దెబ్బతీసిందని చెప్పాలి. తన ప్రభుత్వం ఏడాదికి సుమారు డెబ్బైవేల కోట్ల రూపాయల మేర వివిధ స్కీములను అమలు చేస్తున్నందున అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్ లు నాలుగువేల రూపాయలు చేయలేమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. దానిని జనం పాజిటివ్ గా తీసుకోలేదని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి ఓటు వేసినట్లు కనబడుతుంది. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. "విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా! లేక కష్టాలు ఎదుర్కుంటూ హూందాగా నిలబడి ముందడుగు వేద్దామా?" అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు.తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మినా, వాటిని అమలు చేయడం కష్టం కనుక, 2014 టరమ్ లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం ఈసారి కూడా చతికిలపడుతుందని పలువురు భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిబ్బరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున చంద్రబాబు నాయుడు రకరకాల ప్రలోభాలు పెట్టడమో, లేక తప్పుడు కేసులు పెట్టించడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దానిని తట్టుకుని నిలబడాలని ఎమ్మెల్సీలను ఆయన కోరారు. దానికి ఎంతమంది కట్టుబడి ఉంటారన్నది కాలమే తేల్చుతుందని చెప్పాలి.ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పేవారు. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే, కేంద్రంలో ఏ కూటమికి తక్కువ సీట్లు వస్తే, దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడతానని అనేవారు. అప్పట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ప్లస్ పాయింట్. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దానిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా ఎక్స్ పోజ్ చేశారు. మరో మాట కూడా అన్నారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదారత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆశించనవసరం లేదు.1994లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఉమ్మడి ఏపీలో ఇరవైఆరు సీట్లే వచ్చాయి. దీని ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పట్లో కాంగ్రెస్ నేత పి. జనార్ధనరెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఆ హోదా ఇస్తారని అనుకోనవసరం లేదు. అయితే శాసనమండలిలో వైఎస్సార్సీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పార్టీలో పునరుత్తేజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్సీపీకు భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు!
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్పాట్ మీకు రోల్మోడల్గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్బుక్లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్క్ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది. ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్బుక్ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్ స్టేషన్లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్ నెంబర్వన్ బీజేపీ, ఛాంపియన్ నెంబర్ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్మెంట్ ఎకనామిక్స్ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్బుక్తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నిబ్బరంతో నిలబడదాం.. భవిత మనదే: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం హనీమూన్ కాలం నడుస్తోంది. వాళ్లకు కొంత సమయం ఇద్దాం. దాడులకు గురైన మన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి ఆత్మస్థైర్యంతో నిలబడదాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘శాసనసభలో ఇప్పుడు మన సంఖ్యా బలం పెద్దగా లేదు. ఆ సభలో గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. మనల్ని గొంతు విప్పనివ్వకపోవచ్చు. కానీ శాసన మండలిలో మనకు బలం ఉంది. ప్రజల పక్షాన మీ పాత్ర మీరు సమర్థంగా పోషించాలి’ అని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ‘రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం చేద్దాం. ప్రజల్లోనే ఉందాం. ప్రజలతో కలసి పోరాడే కార్యక్రమాలు చేపడదాం. గతంలో నేను ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశా. ఆ వయసు, సత్తువ నాకు ఈ రోజుకీ ఉన్నాయి’ అని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఫలితాలు చూసి నిబ్బరం కోల్పోవద్దుఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. గత ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99 శాతం వాగ్దానాలను అమలు చేశాం. రాష్ట్ర, దేశ చరిత్రలోగానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతల ఆశీస్సులు తీసుకుని అమలు జరిగాయా? లేదా? అని వారినే అడిగి మరీ టిక్ పెట్టించాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా ప్రజలకు నేరుగా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో ముందే ప్రకటించి ఏటా క్యాలెండర్ విడుదల చేసి మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు తెచ్చాం. ఇవన్నీ చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. కానీ.. ఎన్నికల్లో ఏమైందో తెలియదు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు వ్యక్తిత్వం.. విలువలు, విశ్వసనీయతే ముఖ్యం రాజకీయాల్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్. విలువలు, విశ్వసనీయతకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారంలో లేనప్పుడు ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? ఎలా ఉంటాడు? అన్నది కూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ హుందాగా నిలబడి ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలి. శిశుపాలుడి పాపాలు అప్పుడే మొదలయ్యాయి.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మహా అయితే ఇంకో నాలుగు కేసులు పెట్టగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏం చేయగలుగుతారు? చంద్రబాబు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్లముందే చంద్రబాబు పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూశాం. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది చూడకుండా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. అర్హతే ప్రామాణికంగా ప్రతి పథకాన్ని ఇంటికే అందించాం. అలాంటి పాలన మనదైతే.. ఈ రోజు వాళ్ల పార్టీకి ఓటు వేయకపోవడమే పాపం అన్నట్టుగా రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు. ఆస్తులకు నష్టం చేస్తున్నారు. అమానుషంగా దాడులకు దిగుతున్నారు. అవమానిస్తున్నారు. ఇవన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి. వారు చేసిన పాపాలు ఊరికే పోవు. హోదా అడక్కపోతే ఏ ఒక్క యువకుడూ క్షమించడు చంద్రబాబు రెండో పాపం కూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేవు. కేంద్రంలో బీజేపీ 240 సీట్లకే పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి ఎంపీ సీట్లు రావడంతో ఎన్డీఏలో కీలకంగా మారిన పరిస్ధితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడగకుంటే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడూ క్షమించడు. నైతిక విలువలు పాటిస్తారా? అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా అన్నది సందేహమే. తమకు ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో మనుషులు మీద దాడులు చేస్తూ.. ఆస్తులకు నష్టం చేకూర్చి అవమానిస్తున్న పరిస్థితుల్లో.. ప్రతిపక్షంగా ఉన్న ఒకే ఒక్క పార్టీకి ఆ హోదా ఇవ్వాలన్న కనీస నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే. అందుకే శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల పాత్ర కీలకం. గతంలో మాదిరిగా మళ్లీ పైకి లేస్తాం2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అదే మాదిరిగా 2024 నుంచి 2029 వరకు కూడా ఐదేళ్లు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎలా పైకి లేచామో మీ అందరికీ తెలిసిందే. మనం చేసిన మంచి ఇవాళ్టికీ ఉంది. ఇంటింటికీ మనం చేసిన మంచి బతికే ఉంది. మన పాలన మీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మన పట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది. గడప గడపకూ మనం చేసిన మంచి ఇంకా బతికే ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.పాపాలన్నీ పండేదాకా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు.. మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్ ప్రకారం అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా లాంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి. అవి ఇప్పుడు వస్తాయో, రావో తెలియని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయి. ఈ పాపాలన్నీ పండేదాకా.. మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం గట్టిగా నిలబడి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. నేను కేవలం గుర్తు చేస్తున్నాను. కష్టాలు రావడం సహజం. వాటిని ఎదుర్కొని నిలబడ్డం అన్నది మన చేతుల్లో అంశం. -
కొలువుదీరిన కొత్త మంత్రివర్గం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా మరో 24 మంది బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. గన్నవరం ఐటీ పార్కు వద్ద కేసరపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముందుగా చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ సహా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, రజనీకాంత్, చిరంజీవి సహా పలువురు సినీ స్టార్లు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు, చంద్రబాబు దంపతులు ఆశీనులయ్యారు. వేదికకు ఎడమ వైపు కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు కూర్చోగా, కుడివైపు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు కూర్చున్నారు. చంద్రబాబుతో ఉదయం 11.33 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం చంద్రబాబును వేదికపైనే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖుల వద్దకెళ్లి చంద్రబాబు నమస్కారం చేశారు. చంద్రబాబు తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. అనంతరం పవన్ ప్రధాని, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు తన సోదరుడు, మెగా స్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. ఆ తర్వాత వరుసగా నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి. బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబు సహా 24 మంది దైవ సాక్షిగా ప్రమాణం చేయగా, ఎన్ఎండీ ఫరూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పదాలను ఉచ్ఛరించడంలో ముగ్గురు మంత్రులు తడబడ్డారు. వాసంశెట్టి సుభాష్ తడబాటుకు లోనై కొన్ని పదాలు పలకలేకపోయారు. కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్థన్రెడ్డి కూడా తడబాటుకు లోనయ్యారు. ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు మంత్రివర్గ సభ్యులతో ప్రధాని మోదీ గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయన్ను ప్రత్యేకంగా సన్మానించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ వేదికపై తన సోదరుడు ఉన్నారని చెప్పగా ప్రధాని మోదీ చిరంజీవి వద్దకు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. మోదీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులను పైకి లేపి సభికులకు అభివాదం చేయడం విశేషం. చంద్రబాబు రజనీకాంత్ను చూపించగా మోదీ ఆయనకు నమస్కరించి పలకరించారు. వేదికపై ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర కేంద్ర మంత్రులకు మోదీ అభివాదం చేశారు. ప్రమాణం చేసిన తర్వాత పలువురు మంత్రులు తనకు పాదాభివందనం చేయబోతుండగా ప్రధాని వారించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన సమీపంలోని ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఒడిశాకు పయనమయ్యారు. హాజరైన ప్రముఖులు వీరే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జితన్ రామ్ మంజి, చిరాగ్ పాశ్వాన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రులు జయంత్ చౌదరి, అనుప్రియా పాటిల్, రామ్దాస్ అథవాలే, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తదితరులు కూడా హాజరయ్యారు. -
యథేచ్ఛగా హింసాకాండ.. ఇదేమి రాజ్యం?: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజు లుగా అరాచక శక్తులు సాగిస్తున్న హింసాకాండను చూస్తుంటే టీడీపీ కార్యకర్తలా? గూండాలా? అన్న ప్రశ్న తలెత్తుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడంతోపాటు ఇళ్లు, ఆస్తుల విధ్వంసాలకు పాల్ప డటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇలాంటి దారుణాలు జరిగాయంటే రాబోయే ఐదేళ్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు. టీడీపీ గూండాల దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్హెచ్ఆర్సీ కార్యాలయాల్లో బుధవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందచేసిన అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు, రఘునాధరెడ్డి, బాబూరావు, తనూజరాణి, గురుమూర్తిలతో కలిసి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మూకల దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..చంద్రబాబుది ఆటవిక పాలనటీడీపీ అధినేత చంద్రబాబుది ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. టీడీపీ గూండాల అకృత్యాలను రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో చట్టాలు, స్వేచ్ఛ, న్యాయ పాలన లేదు. అన్యాయం రాజ్యమేలుతోంది. కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా అధికారులు జంకడం చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో బోధపడుతుంది. ప్రమాణ స్వీకారం కంటే ముందే రాష్ట్రాన్ని అత్యంత భయానక వాతావరణంలోకి నెట్టారు. ఇప్పటి వరకూ ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి కానీ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు నాంది పలికింది చంద్రబాబే.ముందే దాడులకు పురిగొల్పి..ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి మొదలైన దాడులు ఫలితాల తర్వాత తీవ్రరూపం దాల్చాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల ప్రాణాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అంటేనే గూండాగిరీ అని రుజువు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే దాడులకు పురిగొల్పి చంద్రబాబు బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ వేశారు. వీటిని అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది. బాధితుల ఆక్రందనలు తమ కుటుంబ సభ్యులివిగానే భావించి ఈ రక్త చరిత్రను అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.మూడుసార్లూ బీజేపీతో అండతో పీఠం1999, 2014, 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడుసార్లూ బీజేపీ సహకారం వల్లే పీఠం దక్కించుకున్నారు. హింసాకాండకు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. భావితరాలకు హింసా సంస్కృతిని నేర్పడం ఎవరూ హర్షించరు. అధికారం అంటే బాధ్యత అని గుర్తుంచుకోవాలి. అధికారం అంటే రౌడీయిజం గూండాయిజం కాదు. బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదలపై టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ సభ్య సమాజం తలదించుకొనేలా ఉంది. యూనివర్సిటీలు, వీసీలపై దాడులు తగవు. అమానవీయ ఘటనలకు పాల్పడడమే కాకుండా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజ్కుమార్పై లోకేష్ మనుషులు చేసిన దాడిని సోషల్ మీడియాలో అందరూ చూశారు. బంగారం లాంటి రాష్టం తగలడుతుంటే బాధగా ఉంది. ఏపీలో ఘటనలకు కేంద్రం కూడా తలవంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మీడియాపైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. టీవీ 9, ఎన్టీవీ, సాక్షి తదితర చానెళ్లను ఎంఎస్వోల నుంచి తొలగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్న భావన కలుగుతోంది. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని మరోసారి నేరుగా కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తాం.రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంపార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి రాష్ట్రం, దేశ ప్రయోజనాలే పరమావధిగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ అదే రీతిలో బిల్లులకు మద్దతు ఇచ్చామని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉభయ సభల్లో టీడీపీకి 16 మంది ఎంపీలుండగా వైఎస్సార్ సీపీకి 15 మంది సభ్యులున్నారని చెప్పారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో వైఎస్సార్సీపీదే బలమెక్కువ అని తెలిపారు. ఎన్డీఏ కూటమా? ఇండియా కూటమా? అనేది కాకుండా రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా బిల్లులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఎన్డీఏ సంఖ్యాబలం ఆధారంగా కొద్ది మెజారిటీతోనైనా లోక్సభ స్పీకర్ ఎంపిక జరిగిపోతుందని చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫైడ్ సివిల్ కోడ్)కి తాము మద్దతు ఇవ్వబోమన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నికలపై తమ పార్టీ అధినేత సూచనలు తీసుకొని ముందుకెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపడతామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్.. ఇలా దేశంలో అన్ని పార్టీలతోనూ జత కట్టిన మహానాయకుడు చంద్రబాబు మినహా మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వానిదే బాధ్యత: ఎంపీ మిథున్రెడ్డి రాష్ట్రంలో కొద్ది రోజులుగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలకు నూతన ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేయడం సరికాదు. ప్రజాతీర్పును గౌరవిస్తూ హామీలను నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకోవాలి. వైఎస్సార్సీపీకి 40 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. కొత్త ప్రభుత్వం అందరినీ సమాన దృష్టితో చూడాలి.న్యాయ పోరాటం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యంపై రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ, ఎన్హెచ్ఆర్సీలకు ఫిర్యాదు చేశాం. తగిన స్పందన లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ గూండాయిజం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయి. కుట్రపూరితంగా ప్రమాణ స్వీకారం కంటే ముందే కార్యకర్తల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఉసిగొల్పారు. మా కార్యకర్తల్ని కాపాడుకుంటాం. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటాం. అల్లరి మూకలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నందున కేంద్రం తక్షణమే స్పందించి శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలను పార్లమెంట్ దృష్టికి తెస్తాం. -
బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక బాధ్యత అధిష్టానానికే..
సాక్షి, అమరావతి: బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎంపిక చేసే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ అధిష్టానానికి అప్పగించారు. బీజేపీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాసనసభా పక్ష నేత ఎంపికపై చర్చించారు. చివరకు శాసనసభా పక్ష నేత ఎంపికపై నిర్ణయం తీసుకునే అధికారం బీజేపీ అధిష్టానానికే అప్పగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. -
రాజధాని అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ: చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తామని, ప్రతి అడుగు ప్రజల కోసమే వేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజా వేదికలా కూల్చి వేతలు, మూడు రాజధానుల పేరుతో ఆటలు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో మంగళవారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్డీయే శానససభాపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పాజిటివ్ ప్రభుత్వం ఉంటుందని, అశాంతికి తావుండదని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, ఆ తీర్పును నిలబెట్టుకునే బాధ్యత ఎమ్మెల్యేలందరిపైనా ఉందన్నారు. ప్రమాదంలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని.. ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము ఓడింది కేవలం 11 సీట్లలో మాత్రమేనని, 93 శాతం స్ట్రైక్ రేట్తో 57 శాతం ఓట్లను కూటమి సాధించిందని తెలిపారు. ఇలాంటి విజయం, ఇంతటి సంతోషం ఎప్పుడూ లేదని, ఫలితాలతో ఏపీ ప్రతిష్ట, గౌరవం పెరిగిందని చెప్పారు. తనను జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును ఎప్పుడూ మరిచిపోనన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని గతంలో చెప్పారని, జైల్లో తనను కలిసిన అనంతరం పొత్తు ప్రకటించారని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని, మళ్లీ ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సహకారం కూడా అవసరమని, ఈ మేరకు కేంద్రం కూడా హామీ ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, దెబ్బతినని వర్గమంటూ లేదన్నారు. కక్షపూరిత రాజకీయాలు ఉండవురాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలీదని, ఎక్కడ నుండి తెచ్చారో తెలీదని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని చంద్రబాబు అన్నారు. సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని, వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో ఉందన్నారు. పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష పూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజయాలు పాటిద్దామని చెప్పారు. పోలవరం డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని, మళ్లీ కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని తెలిపారు.రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖఏపీకి రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ ఉంటుందని బాబు స్పష్టం చేశారు. న్యాయ రాజధాని కర్నూలు అంటూ మోసం చేశారని, రాయలసీమలో వన్ సైడ్గా ఎన్నికలు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషేనని, తాను సీఎంగా ఉన్నా, పవన్ కళ్యాణ్ ఏ పదవిలో ఉన్నా సామాన్యుల్లా ప్రజల్లో ఒకరిగానే ఉంటామని తెలిపారు. హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదన్నారు. తమ ప్రభుత్వంలో ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదని, స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళతామన్నారు. కేంద్రంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కిందన్నారు. పదేళ్ల మోదీ పాలన దేశ ప్రతిష్టను పెంచిందని, గతంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి వచ్చిందని తెలిపారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు బాధ్యత తీరిపోయిందనుకోకుండా నిత్యం తమను ఆశీర్వదించి ముందుకు నడపాలన్నారు. తప్పు చేస్తే ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, కలిసి ముందుకు సాగి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని కోరారు. తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ వన్గా ఉండాలనేది తన కల అని తెలిపారు. నిర్ధిష్ట సమయంలోనే ఏపీని నంబర్ వన్గా చేసుకుందామన్నారు.హామీలన్నీ నెరవేర్చేలా పాలన : పవన్ కళ్యాణ్జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఐదు కోట్ల మందికిపైగా ప్రజలు తమపై నమ్మకం పెట్టుకున్నారని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదన్నారు. అన్నింటా బలంగా నిలబడతామని చెప్పి అధికారంలోకి వచ్చామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. నాలుగు దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని, వివిధ దేశాధి నేతల దృష్టిని సైతం తెలుగు రాష్ట్రాల వైపు మళ్లించే సమర్ధత చంద్రబాబుకు ఉందన్నారు. చంద్రబాబు ఎంతో నలిగిపోయారని, జైల్లో ఆయన్ని చూశానని, మంచి రోజులు వస్తాయని చెప్పానని, వచ్చాయని తెలిపారు. ఆయన అద్భుతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. కలసికట్టుగా చేసిన కృషితో ఏన్డీయే కూటమి అద్భుత మెజారిటీతో 164 శాసన సభ స్థానాలు దక్కించుకుందన్నారు. ఒక్క ఓటు చీలకుండా అలయెన్స్ ఎలా ఉండాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలిసి కట్టుగా చూపించారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయం సాధించామన్నారు. ఈ విజయం నుంచి తాము కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో పని చేయాలని, మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమమని తెలిపారు.ఎన్డీయే సభాపక్ష నేతగా చంద్రబాబుఈ సమావేశంలో చంద్రబాబును ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తొలుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం పవన్ కళ్యాణ్, చంద్రబాబును ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపరిచారు. సమావేశం తర్వాత అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురందేశ్వరిలు రాజ్భవన్కు వెళ్లి 164 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెలిపి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం చంద్రబాబు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్తో బుధవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 30 నిముషాల పాటు సమావేశమయ్యారు. తనకు మద్దుతు ప్రకటించిన 163 మంది ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు సమర్పించారు. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబును లాంఛనంగా ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించనున్నారు. -
ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు మంగళవారం అర్ధరాత్రి దాటాక కొలిక్కి వచ్చింది. కేబినెట్లో చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అవకాశం దక్కగా.. ఈ జాబితాలో చంద్రబాబు తనయుడు లోకేశ్కు కూడా చాన్స్ ఇచ్చారు. జనసేనకు మొత్తం మూడు, బీజేపీకి ఒకటి చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. మంత్రుల జాబితాను గవర్నర్కు పంపారు. ఈ మంత్రులు కూడా నేడు చంద్రబాబుతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారికి చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే మంత్రివర్గంలో 8 బీసీ, 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. ఏపీ కేబినెట్ ఇదే.. 1. నారా చంద్రబాబు నాయుడు (కమ్మ) 2. కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన–కాపు) 3. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ) 4. కొల్లు రవీంద్ర (బీసీ) 5. నాదెండ్ల మనోహర్ (జనసేన–కమ్మ) 6. పి.నారాయణ (కాపు) 7. వంగలపూడి అనిత (ఎస్సీ) 8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ–బీసీ) 9. నిమ్మల రామానాయుడు (కాపు) 10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (మైనారీ్ట) 11. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి) 12. పయ్యావుల కేశవ్ (కమ్మ) 13. అనగాని సత్యప్రసాద్ (బీసీ) 14. కొలుసు పార్థసారధి (బీసీ 15. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ) 16. గొట్టిపాటి రవి (కమ్మ) 17. కందుల దుర్గేష్ (జనసేన–కాపు) 18. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) 19. బీసీ జనార్దన్ రెడ్డి (రెడ్డి) 20. టీజీ భరత్ (వైశ్య) 21. ఎస్.సవిత (బీసీ) 22. వాసంశెట్టి సుభాష్ (బీసీ) 23. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ) 24. మండిపల్లి రామ్ ప్రసాద్రెడ్డి (రెడ్డి) 25. నారా లోకేశ్ (కమ్మ) -
డిప్యూటీ సీఎంగా పవన్కళ్యాణ్..!
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా సభలో అడుగు పెడతామని చెప్పడంతో పలు ఊహాగానాలు సాగాయి. అయితే తాజాగా పవన్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చలో దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖలను నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనతోపాటు జనసేన నుంచి గెలిచిన మరో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని పవన్ కోరగా చంద్రబాబు అందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో ఒకటి నాదెండ్ల మనోహర్కి దక్కడం ఖాయమని చెబుతున్నారు. మిగిలిన పదవులకు కందుల దుర్గేష్, పంతం నానాజీ, అరణి శ్రీనివాసులు, వంశీకృష్ణ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.ఉమ్మడి జిల్లాల వారీగా పదవులు చంద్రబాబు ఉమ్మడి జిల్లాల వారీగానే మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్సీలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నారా లోకేష్ మంత్రివర్గంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి పదవుల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, కూన రవికుమార్, కొండ్రు మురళి రేసులో ఉన్నారు. అయితే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినందున అచ్చెన్నాయుడికి ఇవ్వటంపై సందిగ్దం నెలకొంది. విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు, సంధ్యారాణి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా నుంచి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేసులో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, పితాని సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర పేర్లను పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణల్లో ఒకరిద్దరికి అవకాశం లభించనుంది. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్, బాల వీరాంజనేయస్వామి పోటీలో ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, కిశోర్ కుమార్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా రేసులో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత ఉన్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి, పుట్టా సుధాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వర్రెడ్డిలో ఒకరిద్దరికి చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.నేడు టీడీపీ శాసన సభాపక్ష సమావేశంటీడీపీ శాసనసభాపక్ష సమావేశం మంగళవారం జరగనుంది. సమావేశంలో చంద్రబాబును తమ నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. -
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ గురించి చేసిన ట్వీట్ ఏ మాత్రం పద్ధతిగా ఉన్నట్లు అనిపించదు. వందల గ్రామాలు, పట్టణాలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చెలరేగి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తుంటే ఖండించకపోతే మానే, పరోక్షంగా వాటిని సమర్థిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.కౌంటింగ్ జరుగుతున్న రోజే వైఎస్సార్సీపీ ఓడిపోతోందని తెలిసిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. గత నాలుగు రోజులుగా కత్తులు, కర్రలతో యథేచ్ఛగా తిరుగుతుంటే, ఎక్కడో ఒకటి, అరచోట తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాలలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. హింసాకాండకు ఎవరూ పాల్పడవద్దని చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ఏమని అంటున్నారో చూడండి. "రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు.ఎక్కడైనా ఓడిపోయినవారు కవ్వింపు చర్యలకు దిగే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఎక్కడైనా జరిగితే వెంటనే టీడీపీ మీడియా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి ఉండేది కాదా! ఒకపక్క అంతగా టీడీపీ వారు చెలరేగిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలు అనడం ఏమిటి? ఆ పేరుతో దాడులు చేసుకోండని చెప్పినట్లు శ్రేణులు అర్థం చేసుకోవా! ఈ నెల పన్నెండున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పదకుండు రాత్రివరకు ఇలాంటి దాడులు జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఈలోగా అనూహ్యంగా ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూశారు కనుక ఈ దాడులను ఏమైనా ఆపుతారేమో చూడాలి.టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం అంటే, వారు దాడులు చేసినప్పుడు వైఎస్సార్సీపీవారు ఏమైనా ప్రతిదాడికి దిగుతారేమో జాగ్రత్త అని చెప్పినట్లు అనిపిస్తుంది తప్ప శాంతిభద్రతలను కాపాడాలని కోరుకున్నట్లుగా లేదు. వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలర్ట్ గా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలి అని ఆయన అన్నారు. దీనిని బట్టి టీడీపీ నేతలు ఏమి చేయాలో అర్థం చేసుకోవాలన్నమాట. వైఎస్సార్సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి అని ఆయన సూచించారు. అంతే తప్ప టీడీపీ కార్యకర్తలు దాడులు చేయవద్దని అనడానికి ఇష్టపడడం లేదనుకోవాలి. పోలీసులు సైతం ఇంతవరకు జరిగిన హింసాకాండను వైఎస్సార్సీపీ వారి చర్యగానే చూడాలి తప్ప, టీడీపీ దాడులుగా చూడకూడదని అనుకునే అవకాశం కనిపించడం లేదా?వందల చోట్ల ఈ దాడులు జరిగితే పోలీసులు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇదేనా రాజ్యాంగం, చట్టబద్ధపాలన అంటే! పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ముక్తాయింపుగా చివరిలో ఒక మాట అన్నారు. అసలు ఇది ట్విటర్ లో చెప్పవలసిన విషయమా! పోలీసు డీజీపీ తదితర ఉన్నతాధికారులను పిలిచి సమీక్షించి, లేదా వారికి ఫోన్ చేసి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఏపీకి చెడ్డపేరు రాకుండా చూడాలని చెప్పవలసిన చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వచ్చే రోజులు ఇంకెంత భయానకంగా ఉంటాయో అనే సందేహం వస్తుంది.అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు హింసాయుత చర్యలకు దిగినా తప్పే. గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలపై దాడులు చేస్తే అది వైఎస్సార్సీపీ మూకల చర్యలు అని అనుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది పనుల శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైఎస్సార్సీపీవారి పనేనని టీడీపీ చెప్పేలా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశి, కొడాలి నాని, తదితరుల ఇళ్లపైకి దాడి చేసింది వైఎస్సార్సీపీ మూకలని చెప్పదలిచారా? ఒక పక్క టీడీపీ జెండాలతో కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు, అసాంఘీక శక్తులు స్వైర విహారం చేస్తుంటే, వైఎస్సార్సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డా సంయమనంగా ఉండాలని టీడీపీ వారిని కోరుతున్నానని చంద్రబాబు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. రాజ్యాంగ విధులను కాలరాయడమే.గతంలో ఏ ఒక్క చిన్న ఘటన జరిగినా నానా హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ఒక కామెంట్ ను అది కూడా ట్విటర్ లో చేసి ఊరుకున్నారు. ఇది సమంజసమేనా? కానీ దీని గురించి ఆయనను అడిగేదెవ్వరు. ప్రశ్నిస్తానని చెబుతూ రాజకీయాలలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందంలో ఇలాంటివాటిపై కనీసం స్పందించలేకపోతున్నారు. జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను కూడా ఆయన నిరోధించడం లేదు. ఈ నేపధ్యంలోనే టీడీపీ నేత వర్మ కారుపై జనసేన కార్యకర్తలు చేసిన దాడిని కూడా ఆయన ఖండించినట్లు అనిపించడం లేదు. ఇక లోకేష్ ఎర్రబుక్ సిద్ధం అంటూ ఆయా చోట్ల టీడీపీ వారు ప్లెక్సీలు పెడుతున్నారని కొందరు చెబుతున్నారు. అది మరింత రెచ్చగొట్టే చర్య అవుతుంది. అధికారంలోకి వచ్చాక కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తే విపరిణామాలు ఎదురవుతాయి.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు దాదాపు జరగలేదు. అయినా హింసాకాండ అంటూ తమకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించారు. ఇప్పుడు ఆ మీడియాలో ప్రస్తుత హింసకు సంబంధించి కథనాలేవీ ప్రముఖంగా రావడం లేదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన పార్టీ నేతలతో జిల్లాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే యత్నం చేస్తున్నారు. బహుశా ఆయన కూడా కొద్ది రోజులలో టీడీపీ దాడులవల్ల తీవ్రంగా గాయపడిన, ఆస్తులు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పవచ్చు.కొద్ది మంది ఈ దాడులలో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ఓటమి భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఉండవలసిన సమయం ఇది. ఏ పార్టీకి అయినా గెలుపు, ఓటములు ఉంటాయి. జగన్ అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం కొలువు తీరకముందే ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చారనిపిస్తుంది. చంద్రబాబు కక్షలకు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని ఆయన అన్నారు. చివరికి యూనివర్సిటీలలో కూడా టీడీపీ శక్తులు అరాచకం సృష్టిస్తుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయితే ఎవరికి చెప్పుకోవాలి.ప్రధానమంత్రి మోదీ కూడా ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా మాట్లాడే ప్రధాని ఏపీని మాత్రం విస్మరించడం బాధాకరం. ఈ హింసాకాండలో బాధితులైన కార్యకర్తలకు అండగా ఉంటానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కచ్చితంగా బాధితులకు ధైర్యం చెప్పవలసిన సమయం ఇది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి బయటకు వచ్చి ఆయా ప్రదేశాలకు వెళ్లి పరిశీలన చేస్తే వైఎస్సార్సీపీ క్యాడర్ కు నైతికబలం వస్తుంది. అలాగే రెచ్చిపోయే టీడీపీ మద్దతుదారులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోకపోతే ఆయన మళ్లీ 2014నాటి పాలనను పునరావృతం చేయడానికే సిద్ధపడుతున్నారన్న సంకేతాలు వెళతాయని అర్థం చేసుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నేనే మంత్రి..!?
సార్వత్రిక పోరు ముగిసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే కూటమి నేతగా నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందనే చర్చ కర్నూలు, నంద్యాల జిల్లాలో మొదలైంది. 2004 తర్వాత అత్యధిక స్థానాల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడంతో మంత్రి పదవి ఆశించేవారి సంఖ్య కూడా పెరిగింది.నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లాకో మంత్రి పదవి ఇస్తారా? లేదా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఒకే మంత్రి పదవి ఇస్తారా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. సీనియర్ నేతలకు మంత్రి పదవి దక్కుతుందని అధిక శాతం నేతలు భావిస్తున్నా, సామాజిక సమీకరణల నేపథ్యంలో తమకూ అవకాశం దక్కుతుందని తొలిసారి అసెంబ్లీకి వెళ్లే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రెండు ఎంపీలతో పాటు 12 అసెంబ్లీలు కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి పార్థసారథి ఎమ్మెల్యేగా గెలుపొందితే, తక్కిన 11 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆలూరు, మంత్రాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా విరూపాక్షి, బాలనాగిరెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థుల్లో మంత్రి వర్గంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.సార్వత్రిక పోరులో ప్రకాశ్రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మ టిక్కెట్లు ఆశించారు. అయితే ఆమెకు టిక్కెట్ ఇవ్వలేమని, డోన్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని.. గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారనే చర్చ కోట్ల వర్గంలో నడుస్తోంది. దీంతో ప్రకాశ్రెడ్డికి కచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే ఆశాభావం ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది. కోట్ల అసెంబ్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో ఆదోని నుంచి పోటీ చేసి మీనాక్షినాయుడు చేతిలో ఓడిపోయారు. అయితే కర్నూలు ఎంపీగా ఆయన పలుసార్లు ప్రాతినిథ్యం వహించారు. కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.నంద్యాల జిల్లా నుంచి రేసులో ముగ్గురు..నంద్యాల జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. 2014లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన బీసీ, 2019లో ఓటమి చెందారు. తిరిగి 2024లో విజయం సాధించారు. నంద్యాల జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ కూడా కేబినెట్ బెర్త్పై ఆశపెట్టుకున్నారు. ఇదే జిల్లాలో భూమా అఖిలప్రియ కూడా మంత్రివర్గంలో చోటుపై ధీమాగా ఉన్నారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన అఖిలప్రియ ఆపై తన తండ్రి భూమా నాగిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.నాగిరెడ్డి మృతి తర్వాత అఖిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పర్యాటక శాఖ మంత్రిగా చేసిన అఖిల ఈ దఫా కూడా మహిళల కోటాలో తనకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. అలాగే నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ కూడా మంత్రి వర్గంలో చోటుపై ఆశలపల్లకిలో ఉన్నారు. 1999లో మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. మైనార్టీ నేత కావడం, రాయలసీమలో మదనపల్లి, నంద్యాల మాత్రమే మైనారీ్టలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరూ గెలుపొందినా వీరిలో ఫరూక్ సీనియర్ కావడంతో మైనార్టీ కోటాలో కచ్చితంగా చోటు దక్కుతుందనే ఆశతో ఉన్నారు.పార్థసారథిని అదృష్టం వరించేనా? కర్నూలు జిల్లాలో తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఆదోని నుంచి పార్థసారథి గెలుపొందారు. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈయనకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. కర్నూలు, అనంతపురంలో బలమైన సామాజికవర్గంగా వాల్మీకులు, కురబలు ఉన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, గుంతకల్లులో కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం ఉన్నారు. వీరిద్దరికీ మంత్రి పదవుల అనుభవం ఉంది. అయితే అనంతపురం జిల్లాలో పోటీ ఎక్కువగా ఉంది.కురబ, వాల్మీకులకు చెరో మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవితకు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాలవ, గుమ్మనూరు, పార్థసారథిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఒక బీసీకి అనంతపురంలో ఇస్తే, మరో బీసీకి ఇచ్చే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఈక్రమంలో వాల్మీకి వర్గం నుంచి పార్థసారథిని మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.పైగా ఇతను బీజేపీ నేత కావడంతో.. ఆ పారీ్టకి కూడా కనీసం 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండటంతో పార్థసారథికి అదృష్టం వరించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా కర్నూలు, నంద్యాల జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమి అభ్యర్థుల్లో దాదాపు సగం మంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరికి అమాత్యయోగం ఉందో వేచిచూడాలి.టీజీ, కేఈలు కూడా మంత్రివర్గంపై ఆశలు..సీనియర్ నేతలతో పాటు తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్న కర్నూలు, పత్తికొండ ఎమ్మెల్యేలు టీజీ భరత్, కేఈ శ్యాంబాబు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. టీజీ భరత్ ఆర్యవైశ్యుల కోటాలో తనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా తనను గెలిపించాలని, ఈ దఫా తాను మంత్రిని కాబోతున్నానని పలువురు ప్రముఖులతో బాహాటంగానే చెప్పారు.భరత్ గెలుపొందిన తర్వాత టీజీ వర్గం కూడా కేబినెట్ బెర్త్ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. అలాగే కేఈ శ్యాంబాబు కూడా కేబినెట్పై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతీ కేబినెట్లోనూ కేఈ కుటుంబం ఉంది. కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి మంత్రులుగా చేశారు. 2014లో డిప్యూటీ సీఎంగా కూడా కేఈ కృష్ణమూర్తి కొనసాగారు. బీసీ కోటాలో తనకు చోటు దక్కుతుందని శ్యాంబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇవి చదవండి: ఏపీ కొత్త సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్ -
మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని, గత ఐదేళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు కచ్చితంగా బేరీజు వేసుకుంటారని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైఎస్సార్ సీపీకి ప్రజల మనసులో ఎప్పటికీ చోటు ఉంటుందని, పార్టీ పునర్ వైభవానికి ఇదే గట్టి పునాది అని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు ఎమ్మెల్సీలు, నేతలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఫలితాలపై ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ⇒ మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ⇒ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేయడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందేలా వైఎస్ జగన్ చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశాం. ప్రతి గడపకూ మంచి చేశాం. పార్టీ కచ్చితంగా పునర్ వైభవం సాధిస్తుందని మాకు గట్టి విశ్వాసం ఉంది. ⇒ రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్మెంట్పై అనుమానాలు, పోలింగ్ బూత్ల వద్ద మన ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గినా వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఉంది. గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మేమంతా నిస్సంకోచంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలుస్తాయి. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు తీరుపై కచ్చితంగా ప్రజలు దృష్టి సారిస్తారు. ఎన్నికల తీరుపై అనుమానాలుఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు జగన్ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో సైతం ఓట్లు రాకపోవడం సందేహించాల్సిన అంశమని, ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డాయన్నారు. ఈసీ ఒత్తిళ్లకు లొంగిపోయి హడావుడిగా పోలీసు అధికారులను బదిలీ చేసి కూటమికి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.పార్టీ శ్రేణులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకలు ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నాయని, పలుచోట్ల దాడులకు తెగబడుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నాయన్నారు. దీనిపై వెంటనే స్పందించిన వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలని నాయకులను ఆదేశించారు. పార్టీ తరపున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ ఘటనలను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తెచ్చి పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైస్ ఛైర్మన్ జకియా ఖానమ్, నూతనంగా గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎంపీలు మద్దిల గురుమూర్తి, తనూజ రాణి తదితరులున్నారు. ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్కుమార్, రూహుల్లా, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, విడదల రజని, పేర్ని నాని, ఉషా శ్రీచరణ్, కె.నాగేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్ కుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, మాజీ ఎంపీ కేశినేని నాని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యథేచ్ఛగా టీడీపీ, జనసేన నాయకుల హింసాకాండ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారం చేపట్టక ముందే టీడీపీ, జనసేన నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న హింసాకాండపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైఎస్సార్ సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్కు విన్నవించారు. ఈమేరకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎంపీ తనూజ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్రెడ్డి, మాజీ ఎంపీ కేశినేని నాని, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డితో కలిసి గవర్నర్కు గురువారం వినతిపత్రం అందచేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు అనంతరం బిహార్ తరహాలో రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు చెప్పారు. టీడీపీ మూకలు ఎన్నికల రోజు మధ్యాహ్నం నుంచే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లపై దాడులకు తెగబడి పలు చోట్ల గృహ దహనాలు, ఆస్తులను ధ్వంసం చేశాయన్నారు. మహిళలు, పిల్లలను సైతం హింసించి భయ భ్రాంతులకు గురి చేశాయని తెలిపారు. టీడీపీ, జనసేన విధ్వంస కాండకు సంబంధించి వీడియో, ఫొటో ఆధారాలను పరిశీలించి విస్తుపోయిన గవర్నర్.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశి్నంచారన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కళ్ల ముందే దాడి జరిగినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు వెల్లడించారు. నూజివీడులో కౌన్సిలర్పై పోలీసుల సమక్షంలోనే కత్తులతో దాడి జరగటాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు. ఈ ఘటనలపై డీజీపీతో చర్చించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. పర్యవసానాలు తప్పవు వైఎస్సార్సీపీ జెండా పట్టుకున్న వారిపై దాడులు చేసేందుకే అధికారంలోకి వచ్చారా? అని టీడీపీ నేతలను పేర్ని నాని ప్రశ్నించారు. ఎర్ర పుస్తకం పేరుతో హింసకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కూటమి నాయకులకు సూచించారు. చంద్రబాబు ఒత్తిడితో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. దాడులను ఆపకుంటే పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు కమిటీలు, లీగల్ టీమ్స్ రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను కాపాడుకునేందుకు 26 జిల్లాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేక కమిటీలను వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసినట్లు పేర్ని నాని వెల్లడించారు. బాధితులను పరామర్శించడంతో పాటు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ హింసాకాండను మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. 26 జిల్లాలో ఏర్పాటైన లీగల్ టీమ్లు బాధితులకు అండగా నిలుస్తాయని, శుక్రవారం నుంచి చురుగ్గా పని చేస్తాయని తెలిపారు. కింది స్థాయి పోలీసులు కేసులు నమోదు చేయకుంటే ఎస్పీలను కలిసి న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు. -
సీఎం పీఠం ఎక్కనేలేదు.. ఈలోపే మరీ ఇంతలానా?
ఆంధ్రప్రదేశ్ లో ఎంతలో ఎంత మార్పు చూడండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టకముందే ఆ పార్టీకి చెందిన కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి మరీ కత్తులతో నరకడం, వైఎస్సార్సీపీ జెండానే కనిపించకూడదని బెదిరించడం ఇవన్నీ ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తాయి. ప్రజాస్వామ్యంతో సంబంధం లేదని, తాము అనుకున్నది చేస్తామని అనుకుంటే అది మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత సడన్ గా నిర్వీర్యం అయిందో అర్థం కావడం లేదు. కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపైకి దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అసలు ఈ ఎన్నిక ఫలితాలు ఇలా ఉన్నాయేమిటి? ఏమైనా గోల్ మాల్ జరిగిందా అనే అనుమానాలు ఒక వైపు వ్యక్తం అవుతుంటే, మరో వైపు టీడీపీ, జనసేనలకు చెందినవారు చేస్తున్న అరాచకాలతో అట్టుడికే పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ ఒక్కసారి కూడా ఇలాంటివాటిని ఖండించినట్లు కనబడలేదు. దాంతో వారు కూడా ఇలాంటి గొడవలను ప్రోత్సహిస్తున్నారని జనం అనుకునే అవకాశం ఉంటుంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఘటన ఏమైనా జరిగినా, వ్యక్తిగత కారణాలతో ఘర్షణలు జరిగినా, వైఎస్సార్సీపీకి పులిమి నానా హడావుడి చేసిన టీడీపీ మద్దతు మీడియా ఇప్పుడు ఎక్కడా నోరుమెదపుతున్నట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ వారి దృష్టిలో ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా జరుగుతున్నదని అనుకుంటున్నారేమో తెలియదు. టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి రకరకాల రూపాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నాలు సాగాయి. కాస్త గట్టిగా ఉండే అధికారులను మార్చేయడం, టీడీపీ వైపు నుంచి జరిగే ఘర్షణలను పట్టించుకోకపోవడం, వైఎస్సార్సీపీ నుంచి ఏమి జరిగినా వెంటనే స్పందించడం, తీవ్రమైన చర్యలు తీసుకోవడం కనిపించింది. కొన్ని ఏరియాలలో టీడీపీ రిగ్గింగ్ అవకాశం ఉన్నచోట్ల పోలీసులను చాలా తక్కువ సంఖ్యలో పెట్టారట. తద్వారా యథేచ్చగా రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారన్నమాట. అదే వైఎస్సార్సీపీ వారు రిగ్గింగు చేసే చాన్స్ ఉందని అనుకున్నచోట మొత్తం బలగాలన్నిటినీ కేంద్రీకరించారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. పోలింగ్ మరుసటి రోజు మాచర్ల, తాడిపత్రి, తిరుపతి మొదలైన చోట్ల టీడీపీ వారు దాడులు చేసి గందరగోళాలు సృష్టించారు. విచిత్రం ఏమిటంటే పోలీసులే తాడిపత్రి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి సిసిటీవీని, కెమెరాలను పగులకొట్టి విద్వంసానికి పాల్పడడం, అయినా వారిపై ఏమి చర్య తీసుకున్నది తెలియదు.వీటిలో అత్యధికం తెలుగుదేశం గూండాలు చేసినవేనని వైఎస్సార్సీపీ చెబుతోంది. అది నిజమే అని దృవీకరించే విధంగా కౌంటింగ్ తర్వాత రచ్చ సాగుతోంది. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విజయవాడలో ఒక హోటల్ లో టిఫిన్ చేస్తుంటే వచ్చి దాడి చేశారు. లోకేష్ ను విమర్శించే స్థాయి నీదా అని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. పలువురు వైఎస్సార్సీపీ నేతలకు, వారిని సమర్ధించినవారికి ఫోన్ లు చేసి టీడీపీ మద్దతుదారులు బూతులు తిడుతున్నారు. అసభ్యకర మెస్సేజ్ లు పెడుతున్నారు. టీడీపీ వేధింపులకు తాళలేక ఏలూరు సమీపంలోని విజయరాయి వద్ద ప్రవీణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుకు చెందిన కళ్యాణ మండపంపై దాడి చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ ఆఫీస్ లో విధ్వంసం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు తదితర చోట్ల వైఎస్సార్సీపీ వారి ఇళ్లపై కర్రలు, కత్తులతో దాడి చేశారు. వైఎస్సార్సీపీవారు ఊళ్లలో ఉండడానికి వీలు లేదని హెచ్చరికలు జారీ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పల్నాడులో ఒక యూట్యూబ్ చానల్ నడిపే వైఎస్సార్సీపీ అభిమాని ఇంటిపైకి వెళ్లి కత్తితో దాడిచేస్తే, అతని వృద్ద తల్లిదండ్రులు తల్లడిల్లుతూ ఏడుస్తున్న వీడియో వైరల్ అయింది.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీస్ పై దాడులు చేశారు. ఈ గొడవలలో టీడీపీతో పాటు, బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద రాళ్లతో వీరంగం సృష్టించారు. రాయచోటి మండలం యండపల్లి అనేచోట మాజీ ఎంపీ పోల సుబ్బారెడ్డి ఇంటిపై పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. గుంటూరులో ఒక హాస్టల్ పేరు చివరలో రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానితో కాళ్లు పట్టించుకున్నారట. కళ్యాణ దుర్గంలో వైఎస్సార్సీపీ నేత ఉమామహేశ్వరనాయుడు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి కారు, ప్రచార రథం ధ్వంసం చేశారు.ఇలా వివిధ జిల్లాలలో సాగుతున్న ఈ అరాచకాలను పోలీసులు ఎప్పటికి అరికడతారో తెలియదు కానీ, దీనివల్ల సమాజంలో మరింత అన్ రెస్ట్ పెరిగిపోతుంది. ఈ దాడులకు ప్రతిగా వైఎస్సార్సీపీవారు కూడా ఏదో రకంగా తిప్పికొట్టడానికి యత్నించే అవకాశం ఉంటుంది. దానిని నివారించడం చాలా అవసరం. అధికారం వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా ఉంటామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అనేప్పటికీ, పోలీసులకు ఈ ఘర్షణలపై గట్టి చర్యలు తీసుకోవాలని ఎందుకు సూచించలేదో తెలియదు. లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటామని అనేమాటలను జనం గుర్తు చేసుకుంటున్నారు. దానికి తగినట్లే ప్రస్తుతం దాడులు సాగుతున్నాయి.గతంలో ఏవో జరిగాయని ప్రతీకారంతో రగిలిపోతున్నారని, అందుకే ఇలా చేస్తున్నారని టీడీపీకి మద్దతు ఇచ్చేవారు, వారి మీడియా ప్రచారం చేయవచ్చు. అందులో ఎంత నిజం ఉందన్నది వేరే విషయం. అధికారంలోకి వచ్చినవారు అన్నిటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతేకానీ కక్షపూరితంగా మరింత రెచ్చగూడదని చెప్పక తప్పదు. కానీ అప్పట్లో అరాచక పాలన అని ప్రచారం చేసినవారు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి జరుగుతున్న అరాచకాలను ఎలా సమర్ధిస్తారు? ఈ దౌర్జన్యాలు, దాడుల ద్వారా టీడీపీ కూటమి ఇకపై ఇంకెంత అరాచకానికి పాల్పడుతుందో అని జనం భయపడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మేం ఎన్డీఏతోనే ఉన్నాం: చంద్రబాబు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. కూటమి నేతలు, కార్యకర్తల సమష్టి కృషి వల్లే ఈ విజయం దక్కిందన్నారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చింది అధికారం మాత్రమే కాదని, ఒక ఉన్నతమైన బాధ్యత అప్పగించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ వైఎస్ జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. భూమి మీద ఎవరూ శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలే శాశ్వతమన్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో అందరికీ స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇంత చరిత్రాత్మక ఎన్నికలను తన జీవితంలో చూడలేదని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉండే వ్యక్తులు రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓటు వేశారన్నారు. టీడీపీ, ఏపీ చరిత్రలో ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదన్నారు. టీడీపీని స్థాపించినప్పుడు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 200 సీట్లు వచ్చాయని, 1994లో ప్రతిపక్షానికి కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని, వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు ఇంత విజయం చేకూరడానికి ప్రజలు అనుభవించిన బాధలే కారణమన్నారు. గతంలో కుప్పం, సిద్ధిపేట పోటాపోటీఈ ఎన్నికల్లో కూటమికి 55.38 శాతం ఓట్లు లభించగా ఇందులో టీడీపీకి 45.60 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్సీపీకి 39.37 శాతం ఓట్లు దక్కాయన్నారు. గతంలో కుప్పం, సిద్ధిపేట మెజారిటీల్లో పోటీ పడేవని, ఇప్పుడు గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేల మెజారిటీలు దాటాయన్నారు. పాలకులు కాదు సేవకులం తాము పాలకులం అని కాకుండా సేవకులం అనే నినాదానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. సూపర్ 6, ప్రజాగళం మేనిఫెస్టో అంశాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమికి బీజం వేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. అసెంబ్లీలో తనను, తన కుటుంబ సభ్యులను అవమానించారని, కౌరవసభలో ఉండబోనని నాడు చెప్పానన్నారు. గౌరవ సభగా మార్చిన తర్వాతే మళ్లీ సభకు వస్తానని చెప్పానని, తన ప్రతిజ్ఞను ప్రజలు నిజం చేశారని తెలిపారు.బలమైన తీర్పుఅహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనాన్ని ప్రజలు క్షమించరనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. పాలకుడు ఎలా ఉండకూడదో... ఎలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడో జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ అని విమర్శించారు. ప్రజలు చాలా సందర్భాల్లో చాలా మందిని ఓడించారని, జగన్ విషయంలో ఇక నువ్వు వద్దే వద్దు అని బలమైన తీర్పు ఇచ్చారన్నారు. తాము జాతీయ స్థాయిలో ఎన్డీయేతోనే ఉన్నామని, ఉంటామన్నారు. ఏమైనా మార్పు ఉంటే చెబుతానన్నారు. -
ఒకేసారి రెండు పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం?
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కొందరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం, చాలామంది సీనియర్లు గెలుపొందడం, బీజేపీ, జనసేనకు అవకాశం ఇవ్వాల్సినందున మంత్రివర్గ కూర్పు కత్తిమీద సాములా మారనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం సాగుతుండగా బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించుకుంటే మంత్రివర్గంలో జనసేన చేరడం కుదరదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ తన పార్టీకి చెందిన వారికి మంత్రి పదవులు ఇప్పించాలనుకున్నా సాంకేతికంగా అది సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎలా ముందుకు వెళతారనే అంశం ఆసక్తికరంగా మారింది. జనసేన మంత్రివర్గంలో చేరితే నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే విషయంపై వెనక్కి తగ్గితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి అసెంబ్లీకి గెలిచిన వారిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. సత్యకుమార్, విష్ణుకుమార్రాజుకు కూడా అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.పాతవారికే పెద్దపీటటీడీపీలో మంత్రి పదవుల ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. 135 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలుపొందడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోననే చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ ప్రాతిపదికన పలువురు నేతలు తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా కొంత కసరత్తు చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకు కచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెబుతున్నారు. -
పేదల గొంతుకై నిలుస్తాం: వైఎస్ జగన్
ఏం జరిగిందో తెలియదు కానీ, ఏం చేసినా, ఎంత చేసినా ఇంకా 40 శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. కచ్చితంగా గుండె ధైర్యంతో నిలబడి మళ్లీ ఇక్కడి నుంచి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండటం కొత్తకాదు. పోరాటాలు చేయడం అంతకన్నా కొత్తకాదు. ఈ ఐదు సంవత్సరాలు తప్ప నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిపాను. రాజకీయ జీవితంలో ఎవ్వరూ చూడని కష్టాలు అనుభవించాను. ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కొంటాం. ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు.. అని అనొచ్చు. కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాను. మంచి చేయడానికి మాత్రం కచ్చితంగా ప్రజలకు తోడుగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతుంది. పెద్దపెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది. ఈ కూటమిలో ఉన్న బీజేపీ, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, అందరికీ కూడా వాళ్ల గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా, నా ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన ప్రతి నాయకుడికీ, ప్రతి కార్యకర్తకూ, ప్రతి వలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని సంక్షేమ పథకాలు, ఎక్కడా ఏ పేదవాడికీ దక్కని ప్రయోజనాలు.. అవినీతికి తావు లేకుండా, నేరుగా వారి గుమ్మం వద్దకే తీసుకువెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకిలా జరిగిందో తెలియడం లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరుగుతుందని, ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. పిల్లలు బాగుండాలని, వాళ్ల చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ.. అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. వారికి మంచి చేయాలనే తపనతో అడుగులు వేశాం. 31 లక్షల ఇంటి పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చాం. వాటిలో 22 లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం. మరి ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు’ అన్నారు. ‘66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే సంక్షేమాన్ని పంపించే వ్యవస్థను సైతం తీసుకువచ్చాం. గతంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తున్న చాలీచాలని పెన్షన్ నుంచి.. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దాదాపు కోటీ 5 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాటా తప్పకుండా అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉంటూ.. ఆసరా, చేయూతతో తోడున్నాం. సున్నా వడ్డీతో సైతం అండగా నిలిచాం. మరి ఆ కోటీ ఐదు లక్షల అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్కచెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలియదు’ అని అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పిల్లల చదువుల కోసం పరితపించాం ‘పిల్లల చదువుల కోసం ఏ తల్లీ, తండ్రీ ఇబ్బంది పడకూడదని మొట్టమొదటి సారిగా పూర్తి ఫీజు ఇస్తూ అండగా నిలవడం ద్వారా చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఏటా దాదాపుæ 12 లక్షల మందికి మంచి చేశాం. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమయ్యిందో తెలియదు. 54 లక్షల మంది రైతలన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయం అందించే కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది. అంతగా రైతన్నకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం గానీ, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత ఇన్సూ్యరెన్స్, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేశాం. మరి ఆ అరకోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు. ఆటోలు, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లు ఇబ్బంది పడకూడదని వారికి అండగా నిలుస్తూ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాం. పుట్పాత్ల మీద చిన్న చిన్న ఇడ్లీ దుకాణాలు, వ్యాపారాలు చేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాపడుతూ వాళ్లకు తోడుగా నిలిచాం. నా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు అండగా ఉంటూ చేదోడు ఇచ్చాం. ఇన్ని కోట్ల మందికి మంచి చేసి, ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అంటే చెత్త బుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మొట్టమెదటి రోజు నుంచీ భావిస్తూ.. ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అక్కచెల్లెమ్మల ఇళ్లకు తీసుకెళ్లి చూపించి మీరే టిక్ పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పని చేశాం. ఇంటి వద్దకే సేవలు ఎప్పుడూ జరగని విధంగా, పేదరికం పోవాలంటే.. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లతో సైతం యుద్ధం చేసి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం తీసుకురావడమే కాకుండా, ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రను కూడా మార్చాలని టోఫెల్, ఐబీ లాంటి కలలు కన్నాం. ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయం, వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి.. వివక్ష, కరప్షన్ లేకుండా ప్రతి ఇంటికీ సేవలందించాం. దాదాపు రూ.2.70 లక్షల కోట్లు ఇంటి వద్దకే అందించగలిగాం. ఎప్పుడూ చూడని మార్పులను తీసుకు రావడమే కాకుండా విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని, ఊహించని మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. మహిళా సాధికారత అంటే ఇదీ అని, సామాజిక న్యాయం అంటే ఇదీ అని ప్రపంచానికి చూపించగలిగాం. ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి చేసిన తర్వాత ఆ అభిమానం ఏమయ్యిందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదు’ అంటూ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ తన స్పందనను ముగించారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు. -
లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కా
సాక్షి, అమరావతి: పేదలకు, పెత్తందారులకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరుగా దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం ఖాయమని... ఏ లెక్కన చూసుకున్నా మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం పక్కా అని అధిక శాతం జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఇవన్నీ స్పష్టం చేశాయి. దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్కు చెందిన టైమ్స్నౌ–ఈటీజీ రీసెర్చ్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 14 లోక్సభ స్థానాలను చేజిక్కించుకుంటుందని.. ఎన్డీఏ కూటమి 48 శాతం ఓట్లతో 11 లోక్సభ స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా తరహాలోనే దేశ వ్యాప్తంగా విస్తృత యంత్రాంగం ఉన్న దైనిక్ భాస్కర్ గ్రూప్... రాష్ట్రంలో 15–17 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. ఎన్డీఏ కూటమి 8–9 లోక్సభ స్థానాలకు పరిమితం అవుతుందని తన ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేల్చిచెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 వంటి మీడియా సంస్థలు, సెఫాలజిస్టులు, ఆరా వంటి ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థలు నిర్వహించిన 32 ఎగ్జిట్ పోల్స్లో 24 ఎగ్జిట్ పోల్స్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమయింది. బీజేపీ భజన చేసే జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ తద్భిన్నం.. బీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, జీన్యూస్.. ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న నెట్వర్క్లోని సీఎన్ఎన్ న్యూస్–18 వంటి రెండు మూడు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తేల్చడం గమనార్హం. రాజధాని అంశంతోపాటు స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్టు చేయడంపై ప్రజల్లో సానుభూతి వచి్చందని.. అదే ఎన్డీఏ కూటమి విజయానికి బాటలు వేసిందని ఆ సంస్థలు విశ్లేషించాయి. కానీ వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఇటు వైఎస్సార్సీపీగానీ అటు ఎన్డీఏగానీ రాజధాని అంశాన్ని ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. ఇక స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా చిన్నపాటి బంద్లు గానీ, ర్యాలీలు గానీ, నిరసనలు గానీ జరగనేలేదు. తప్పు చేశాడు కనక అరెస్టయ్యాడనే రీతిలో జనం స్పందించారు. దీంతో హైదరాబాద్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూపన్లు ఇచ్చి మరీ ‘ఐటీ ఉద్యోగుల’ పేరిట స్థానికంగా ఒక ఈవెంట్లా నిరసన కార్యక్రమం చేశారు. అలాంటిది ఈ రెండు అంశాలూ ప్రభావం చూపిస్తున్నాయని, అందుకే కూటమి గెలుస్తోందని ఈ జాతీయ ఛానెళ్లు చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్లూ తప్పవుతుందని రాష్ట్ర వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోని ఎగ్జిట్ పోల్స్ను నమ్మేదెలా? విచిత్రమేంటంటే ‘ఇండియా టుడే– మై యాక్సిస్’ సంస్థ శనివారంనాడు దేశవ్యాప్త ఎగ్జిట్పోల్స్ను వెలువరించింది. దీన్లో బీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని చేర్చటమే లక్ష్యంగా ఒకో రాష్ట్రంలో స్వీప్ అంటూ ముందుకు వెళ్లిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. పైపెచ్చు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి 2 నుంచి 4 లోక్సభ స్థానాలు వస్తాయని మాత్రమే చెప్పిన ఇండియా టుడే సంస్థ... ఆ సందర్భంగా వైఎస్సార్ సీపీ గుర్తును కూడా ఆప్ గుర్తయిన చీపురుగా చూపించింది. విశేషమేంటంటే దీన్నే తెలుగుదేశం పార్టీ తన ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసుకుంది. మరి పార్టీ గుర్తు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్ను నమ్మేదెలా? ఇక కొన్ని రాష్ట్రాల విషయంలోనైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అక్కడ వాస్తవంగా ఉన్న మొత్తం స్థానాలకన్నా ఎక్కువ స్థానాలు ఎన్డీఏ గెలుస్తుందని చూపించటాన్ని ఇప్పటికే ట్విటర్లో పలువురు ట్రోల్ చేస్తున్నారు కూడా. ఇదే ఇండియాటుడే– మై యాక్సిస్ సంస్థ 2021లో బెంగాల్లో చేసిన ఎగ్జిట్పోల్స్, 2023లో ఛత్తీస్గడ్, రాజస్థాన్లలో చేసిన ఎగ్జిట్పోల్స్ పూర్తిగా రివర్సయ్యాయనేది ఇక్కడ గమనార్హం. నిజానికి ఈ సర్వేను ప్రసారం చేస్తున్నపుడు ‘ఇండియాటుడే’ ఛానెల్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ సర్వే ఫలితాలతో విభేదించారు కూడా. తాను ఆంధ్రప్రదేశ్లో క్షేత్ర స్థాయిలో పర్యటించానని, సర్వేలో చెప్పినట్లుగా పరిస్థితులు అక్కడ లేవని పేర్కొన్నారు. గ్రామీణ, మహిళా ఓటర్లు పూర్తిగా వైఎస్సార్ సీపీవైపే ఉన్నారని, అది తన పర్యటనలో కనిపించిందని సర్దేశాయ్ చెప్పగా... చంద్రబాబు నాయుడి అరెస్టు పట్ల జనంలో సానుభూతి పెల్లుబుకిందని, అదే కూటమి విజయానికి కారణమవుతోందని ఎగ్జిట్పోల్స్ నిర్వహించిన ప్రదీప్ గుప్తా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు. తాజాగా బీజేపీ కూటమికి దేశంలో అత్యంత భారీగా స్థానాలు వస్తాయని పేర్కొన్న జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్లో చిత్రవిచిత్రమైన తప్పులు కనిపించాయి. ఇండియాటుడే గ్రూప్లోని ఆజ్ తక్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో తమిళనాడులో కాంగ్రెస్ 9 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే.. అక్కడ 13–15 లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చడంతో చర్చలో పాల్గొన్న వారే విస్తుపోయారు. రాజస్థాన్లో ఉన్నదే 25 లోక్సభ స్థానాలైతే.. ఆ రాష్ట్రంలో 33 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్లో టుడేస్ చాణక్య వెల్లడించడం గమనార్హం. జార్ఖండ్లో సీపీఐ (ఎంఎల్) ఒక స్థానంలో పోటీ చేస్తే.. రెండు నుంచి మూడు స్థానాల్లో ఆపార్టీ విజయం సాధిస్తుందని ఆజ్తక్ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించింది. హర్యానాలో ఉన్నదే 10 లోక్సభ స్థానాలైతే 16–19 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని జీన్యూస్ ఎగ్జిట్ పోల్స్లో తేల్చడం విస్మయకరమే. ఇక హిమాచల్ప్రదేశ్లో ఉన్నవే నాలుగు లోక్సభ స్థానాలైతే.. అక్కడ ఎన్డీఏ 6–8 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీన్యూస్ తేల్చింది. విశేషమేంటంటే ఈ సంస్థలన్నీ రాష్ట్రంలో కూటమికే మెజారిటీ లోక్సభ స్థానాలు దక్కుతున్నాయని చెప్పాయి. లోతుగా పరిశీలించినట్లయితే ఈ జాతీయ మీడియా సంస్థలకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి యంత్రాంగమూ లేదు. వీటిలో చాలావరకూ ప్రజల అభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుని.. వాటినే ఎగ్జిట్ పోల్స్గా వెల్లడించాయి. గ్రామీణ ఓటర్లు, మహిళలు, వైఎస్సార్ సీపీకి ఎప్పుడూ అండగా ఉండే బలహీనవర్గాలు ఇలాంటి సర్వేల్లో పాల్గొనే అవకాశం తక్కువ. దీన్ని బట్టి చూస్తే.. ఈ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్... జూన్ 4న పూర్తి స్థాయిలో తిరగబడతాయని స్పష్టంగానే చెప్పొచ్చు. వైఎస్సార్సీపీ ఓడిపోయే అవకాశమే లేదు..రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరిశ్రమలను తెస్తూ... గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ... ఐదేళ్లుగా కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలను జనం పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ‘సిద్ధం’ సభలతో రుజువయింది. అర్హతే ప్రమాణికంగా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల్లో 60 శాతానికి పైగా వైఎస్సార్సీపీకి దన్నుగా నిలుస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు.. మహిళల్లో వైఎస్సార్సీపీకి అత్యంత ఆదరణ ఉందని.. ఇదే ఆపార్టీ విజయానికి బాటలు వేస్తుందని ఇవే జాతీయ మీడియా సంస్థలు గతంలో విశ్లేషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓట్లు పోల్ కావడం.. మహిళలు ఎన్డీఏ కూటమి కంటే వైఎస్సార్సీపీకి 12 శాతం అధికంగా వేశారని.. ఇది ఆపార్టీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని ఆరా మస్తాన్, చాణక్య పార్ధదాస్లు కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే తాము ఓడిపోయే అవకాశమే లేదని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కౌంటింగ్ నాడు అక్రమాలకు తెగబడటానికే! రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వస్తుండటంతో పలువురు సెఫాలజిస్టులను చంద్రబాబు నాయుడు, లోకేశ్ బెదిరించినట్లు వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సర్వే సంస్థ లోకేశ్ బెదిరింపులను తట్టుకోలేక... ఫలితాలను అట్నుంచి ఇటు మార్చి కూటమి గెలుస్తున్నట్లుగా ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ రెండ్రోజుల్లో తేలే ఫలితాల కోసం చినబాబు– చంద్రబాబు ఎందుకు ఇంతలా బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశాన్ని నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. తామే గెలుస్తున్నామనే భ్రమలు కల్పించటం ద్వారా వైఎస్సార్ సీపీ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపి... కౌంటింగ్ రోజున అవసరమైతే వారిని ప్రలోభపెట్టో, బెదిరించో తమ పబ్బం గడుపుకోవాలనేది తండ్రీ కొడుకుల ఆలోచనగా చెబుతున్నారు. ఈసీ ఎలాగూ తమకే సహకరిస్తుంది కనక ఎలాంటి దారుణాలకైనా వెనకాడకూడదన్నది వీళ్ల ఆలోచనగా చెబుతున్నారు. అయితే పురిట్లోనే సంధికొట్టినట్లు చాలామంది సెఫాలజిస్టులు వీరి బెదిరింపులకు లొంగకుండా వైఎస్సార్సీపీ గెలుస్తున్నదని చెప్పటం ‘బాబు’లిద్దరికీ మింగుడుపడటం లేదు. -
ఎగ్జిట్ పోల్స్లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
సాక్షి, అమరావతి: ఎగ్జిట్ పోల్స్లో వైఎస్సార్ సీపీ పట్ల పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జూన్ 4న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళా ఓటర్లు తమవైపే నిలిచారనే విషయం ఎగ్జిట్ పోల్స్లో తేలిందన్నారు. శనివారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళలను సమాజంలో ఆత్మగౌరవంతో నిలబెట్టారని, సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు కుటుంబాన్ని నడిపించగల శక్తిని అందించారన్నారు. సీఎం జగన్ వల్లే తమకు మేలు జరుగుతుందనే విశ్వాసంతో మహిళలు వారి కుటుంబాలు పోలింగ్కు పెద్ద ఎత్తున తరలి వచ్చాయన్నారు. ఐదేళ్లలో తమ కుటుంబాల స్థితిగతుల్లో వచ్చిన మార్పులను గమనించడంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్నారు. ఎక్కువ సైలెంట్ ఓటింగ్ జరగడంతో కొన్ని సర్వే సంస్థలకు వైఎస్సార్ సీపీపై క్షేత్ర స్థాయిలో ఉన్న సానుకూలత కనిపించలేదన్నారు. పాజిటివ్ అజెండా పని చేసింది.. వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం మొత్తం పాజిటివ్ కోణంలో నిర్వహించాం. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగాం. చంద్రబాబు మరోసారి అసాధ్యమైన హామీలను గుప్పిస్తూ 2014లో మాదిరిగా మోసం చేసేందుకు వస్తున్నాడని గుర్తు చేశాం. టీడీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడారు. సీఎం జగన్ అంతు చూస్తామని, అధికారంలోకి వచ్చేశామంటూ విర్రవీగారు. సొంతంగా పోటీ చేయలేక కూటమి కట్టారు. మా నాయకుడు మాత్రం పాజిటివ్ అజెండాతో ప్రజలను ఓట్లు అడిగారు. పాజిటివ్ అజెండా పని చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈసీ ఒత్తిడికి తలొగ్గితే ఎలా? ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. గతంలో చంద్రబాబు ఏపీ సీఈవోపైకి దండయాత్రలా వెళ్లి బెదిరించలేదా? ఆ తర్వాత ఈవీఎంలు మోసం చేశాయంటూ దు్రష్పచారం నడిపారు. అలాంటి పార్టీకి చెందిన వాళ్లు ఈ రోజు మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పోస్టల్ బ్యాలెట్ విషయలో టీడీపీ గందరగోళం సృష్టించాలని యత్నించింది. ఏ రూల్స్ అవసరం లేకుండా నేరుగా పోస్టల్ బ్యాలెట్లు తీసుకోవాలన్న టీడీపీ ఒత్తిడికి తలొగ్గి ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మేం కోర్టుకెళ్లాం. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మా ఏజెంట్లకు చెప్పాం. తిరస్కరించాల్సిన ఓటును చెల్లుబాటయ్యేలా టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని చెప్పాం. దీనికే నాపై కేసులు మోపడం హాస్యాస్పదం. సుప్రీం కోర్టుకు వెళ్తాం.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం. జూలై 2023లో ఈసీ స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. అందులో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు, తిరస్కరణ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీల్ లేకుంటే కనీసం హోదా వివరాలైనా రాయాలని ఉంది. పోలింగ్ అయ్యాక అది అవసరం లేదని ఈసీ చెప్పడం అనైతికం. వాళ్లిచ్చిన నిబంధనలను వాళ్లే తుంగలో తొక్కితే ఎలా? చంద్రబాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు. అందుకే చంద్రబాబు కుట్రలు.. గత ఐదేళ్లలో పౌర సేవలు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ప్రజలపై ఉండదనుకుంటే అది భ్రమే. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్ సీపీకి వస్తాయనే భయంతో పవన్, బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. లోపాయికారీగా కాంగ్రెస్తోనూ కలసి ఎన్నికలకు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చి లాభపడాలని నానా గడ్డి కరిచి విష ప్రచారం చేశారు. ఆయన ఇన్ని చేసినా మాపట్ల ప్రజల్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. ఇటీవల ఎన్నికల రిగ్గింగ్ మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ కూడా రిగ్గింగ్ జరుగుతున్నట్టుంది. బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు బాగా తగ్గుతుండటంతో దక్షిణాదిలో పెరుగుతున్నట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వారికి నచ్చిన లెక్కలేసి చెబుతున్నారు. మాకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వైఎస్సార్ సీపీకి కచ్చితంగా అనుకూలించింది. ఐదేళ్లలో మేం ప్రజలకు మంచి చేశాం. టీడీపీకి ఎందుకు అనుకూలంగా సర్వేలు వచ్చాయో వాళ్లు చెప్పగలరా? మరో రెండు రోజులు వారికి నచ్చిన అంకెలు చెప్పుకుంటూ ఆనందం పొందాలంటే పొందొచ్చు. -
కుట్రపూరితం! పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్ అధికారి హోదా వివరాలు, సీల్ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటీషన్ వేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
‘‘మేము ఏకగ్రీవంగా చెబుతున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో.. దానికి సరిగ్గా ఆపోజిట్గా మరొక వేదిక ఏర్పాటు చేసి, అదే రోజు నారా లోకేశ్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్.’’ఈ డిమాండ్ చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కాదు! ఇటీవల చంద్రబాబు కటౌట్ను రక్తంతో కడిగిన ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న!! నాయకుడు అధినాయకుడిని డిమాండ్ చేయటం ఏంటి? పైగా లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్ చేయటం ఏంటి? అందునా.. ఏక కాలంలో ఎదురెదురుగా రెండు వేదికలను ఏర్పాటు చేసి – ఈ వేదికపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎదురు వేదికపై చినబాబు పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగాలని కోరటం ఏమిటి? ఎందుకు ‘బుద్ధన్న’ అలా అన్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?లోకేశ్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన్నిప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్ధా వెంకన్న డిమాండ్. అంటే.. ఇండైరెక్టుగా లోకేశ్ను సీఎంను చేయాలని సూచించటమా? లేక చినబాబుకు దగ్గర కావాలన్న వ్యూహమా? లేదంటే, చంద్రబాబు సూచన మేరకే అలా డిమాండ్ చేసి ఉంటారా? ఇవేవీ కాదంటే.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఆయన అలా ఏమైనా అన్నారా? ఏదేమైనా టీడీపీలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఆసక్తికరమైన పరిణామం... బుద్ధా వెంకన్న డిమాండ్.టీడీపీ అధికారంలోకి వస్తుందా, రాదా అన్నది అటుంచి.. అసలు బుద్ధన్న ఇలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు అని ఆ పార్టీలోని నాయకులే అయోమయంగా ముఖాలు చూసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏదైనా గందరగోళం మొదలైందా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆలోచిస్తున్నది లోకేశ్ బాబు అధ్యక్షుడు అవుతాడా కాడా అని కాదు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అని. ఓటమి అంటే చంద్రబాబుకు భయం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయరు. పొత్తు కోసం చూస్తారు. పొత్తు కుదరకపోతే కొత్త ఎత్తులు ఏవైనా వేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమిని కట్టారు కనుక... ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలా అని ఆయన ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కొత్తగా ఏర్పడే జగన్ ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటానికి రామోజీ తో కలసి ఏదైనా వ్యూహాన్ని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేం. గెలుపు కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరు. ఓడిపోయినా కూడా... ఏమైనా చేయించగలరు!ఈ నేపథ్యంలో గత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన స్వయంకృతాపరాధాలు, ఆయన్ని గెలిపించిన ఎత్తులు, పొత్తులు; గెలుపు వంటి ఓటములు, ఓటమి వంటి గెలుపుల గురించి చూడటం అవసరం.చంద్రబాబుకు మొదటి అతి పెద్ద ఓటమి 2004లో ఎదురైంది. అంతకు ముందు 1999లో జరిగిన ఎన్నికలు ఆయన్ని పార్టీలో తిరుగులేని నేతగా నిలబెట్టాయి. అక్కడి ఉంచి నేరుగా, మళ్లీ లేవలేనంతగా 2004లో కిందికి పడేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనంలో సైకిల్ కొట్టుకుపోయింది. స్కూల్ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయటం మాత్రమే కాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు. జన్మభూమి కార్యక్రమాలకు తమను ఉపయోగించుకోవటం వారికి ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వోద్యోగుల పని విధి విధానాలలో కొత్తగా తెచ్చిన మార్పులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభావం చూపెట్టాయి.ఇంతకన్నా ముఖ్యం.. విద్యుత్ చార్జీలు, నీటి చార్జీల పెంపు. దీనిపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తే... హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన ధర్నాలో నిరసనకారులైన రైతులపై చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించారు. పోలీస్ కాల్పులలో రామకృష్ణ, విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. బాబు పాలనలో మాయని మచ్చగా మిగిలిన ఉదంతం అది. ఇక 1995–2004 మధ్య రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం, అప్పుడే వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర! 2004 ఎన్నికల్లో ఆ రెండూ తమదైన ప్రభావం చూపి, బాబు ఓటమికి కారణం అయ్యాయి.ఇవికాక, మరికొన్ని కారణాలు కూడా ఆనాటి చంద్రబాబు ఘోర పరాజయానికి ఆజ్యం పోశాయి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు కనిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్ –2020 కలలు బెడిసికొట్టాయి. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి ఆయన ఆ కలలు కన్నారు. అవి సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్యవేత్తలను ఆకట్టుకుని ఉంటే ఉండొచ్చు. కానీ కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు భ్రమ పడ్డారు. గెలుపై ధీమాగా ఉన్నారు. చివరికి బోర్లా పడ్డారు. వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, పేదరికం నిర్మూలనపైనా ఆయన దృష్టి సారించకపోవటం కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.అంతకు ముందు 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన మాట నిజమే అయినా అది ఏమాత్రం చంద్రబాబు ఘనత కాదు. కార్గిల్ యుద్ధ ప్రభావం గెలుపునకు దోహదపడింది. పాకిస్థాన్తో కార్గిల్ యుద్ధంలో గెలిచిన అనంతరం.. సాధారణ సమయానికి భిన్నంగా, కొన్ని నెలల ఆలస్యంగా సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది సెప్టెంబరులో జరిగాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో టై–అప్ అయ్యారు. తాము గెలిస్తే, కేంద్రంలో బీజేపీకి బయటి నుండి మద్ధతు ఇస్తామన్న హామీతో ఆయన ఆ ఎన్నికలకు వెళ్లారు.కార్గిల్ యుద్ధంలో గెలుపు వాజ్పేయిని గొప్ప నాయకుడిగా నిలబడితే ఆ నాయకుడితో చేయి కలపడం చంద్రబాబుకు గొప్పగా కలిసొచ్చింది. మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 సీట్లకు, బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తే తెలుగు దేశం 180 సీట్లలో గెలిచింది. అయినప్పటికి మునుపటి కన్నా 36 సీట్లు తగ్గాయి. బీజేపీకి మాత్రం అంతకుముందు కన్నా 9 సీట్లు పెరిగాయి. అంటే.. వాజ్పేయి ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ బీజేపీ ప్రభావంతోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించింది తప్ప అది చంద్రబాబు చరిష్మా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం కార్గిల్ ప్రభావం.2004 ఎన్నికల తర్వాత వరుసగా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకు కారణంగా చంద్రబాబు ఎలాంటి సాకులు చెప్పినా.. అసలు కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విశ్లేషణలో కనిపిస్తుంది.‘‘2009లో మా పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం పీఆర్పీ పార్టీ, లోక్సత్తా పార్టీలు కొత్తగా రావటం. దాంతో యాంటీ కాంగ్రెస్ ఓటు చీలటం జరిగింది. రెండవది – టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఈ హైదరాబాద్లో గానీ, రంగారెడ్డి జిల్లాలో గానీ మాకు ఏం సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్లు, రాష్ట్రం సపరేట్ కాకూడదని ఎక్కువమంది జనం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒకే ఒక్క సీటు రావటం జరిగింది. అందువల్ల మేము ఘోరంగా ఓడిపోవటం జరిగింది. యాంటీ కాంగ్రెస్ ఓటు చిరంజీవి, జయప్రకాష్ నారాయణ్ చీల్చుకోవటం కూడా మా ఓటమి కారణం. అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంకు దాదాపు 13 శాతం తగ్గింది. 2004లో 51 శాతం ఉన్న ఓట్ బ్యాంకు వాళ్లకు 38 శాతం అయింది. మేము 37 శాతంతో ఓడిపోయాం. ఒక్క పర్సెంట్ ఓట్ల తేడాతోనే మేము 2009 ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయాం. 92 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్ 155 మాత్రమే గెలిచింది. వాళ్లకు 35 సీట్లు తగ్గినయ్. మాకు దాదాపు 45 సీట్లు పెరిగాయి. రాజశేఖర రెడ్డి విజృంభించి ప్రచారం చేయటం కూడా జనంలో కొంత భయం కల్పించింది’’ అన్నారు ముద్దు కృష్ణమ నాయుడు.2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. వారి పొత్తు ఫలించి తెలుగుదేశానికి 25 సీట్లు, బీజేపీకి 7 సీట్లు పెరిగినప్పటికీ, వైఎస్సార్సీపీ ప్రభావంతో తెలుగు దేశం పార్టీ 117 సీట్లుకు మించి సాధించలేకపోయింది. ఆ మాత్రమైనా మోదీ హవాతో కొట్టకొచ్చిన సీట్లు, ఓట్లు మాత్రమే అవి.2019 గురించి ఇక చెప్పేదేముంది? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 175కి 151 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, స్పెషల్ స్టేటస్పై యు–టర్న్, అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా మెల్లిగా నడిపించటం, కాపు ఓట్లు చీలుస్తాడని అనుకున్న పవన్ కల్యాణ్ హీరో ఫ్యాక్టర్ పని చేయకపోవటం, అవినీతి.. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి అందవలసిన నిధుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించి ఎన్.డి.ఎ. నుంచి బయటికి రావటం కూడా టీడీపీని దెబ్బకొట్టేసింది. దానికి మించి పార్టీలో చంద్రబాబు ‘వన్ మ్యాన్ షో’ పార్టీని ఒంటరిని చేసింది.ఈ అనుభవం రీత్యా మళ్లీ ఈ తాజా ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు ఫలిస్తుందా, మొదటికే మోసం తెస్తుందా అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతలో, ఆయన్ని బలపరుస్తుండే మీడియాలో కలవరం రేకెత్తిస్తోంది. అందుకే ఎన్నికలు ముగిసి, ఫలితాలు ఇంకా రాకముందే తెలుగు దేశం నాయకులు, రామోజీ రావు.. ‘గెలుపు కూటమిదే’ అని నినదిస్తున్నాయి. ఒకటి గమనించారా? ‘గెలుపు తెలుగుదేశానిదే’ వారు అనటం లేదు. – మాధవ్ శింగరాజు -
ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న తన పదవీకాలం ఐదేళ్లు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నందుకు ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2014లో ఎన్నికయ్యాక ఐదేళ్లు పాలన చేసినట్లే అయినా, సాంకేతికంగా చూస్తే ఆయన ఎనిమిది రోజులు ముందుగానే పదవి కోల్పోయారు. ఎందుకంటే చంద్రబాబు 2014 జూన్ 8న పదవీ చేపట్టగా, ఎన్నికల్లో ఓడిపోయి 2019 మే 30 కంటే ముందే సీఎం పదవిని వదలిపెట్టవలసి వచ్చింది. కానీ వైస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఆ ఇబ్బంది రాలేదు. చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీఆర్ను కూలదోసి సీఎంగా అధికారం చేపట్టారు. 1999 అక్టోబర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చినా, 2003లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి కారణంగా 2004 మే నెలలోనే పదవిని కోల్పోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిన సీఎంల కన్నా విభిన్నమైన రాజకీయవేత్త అని చెప్పాలి. వైఎస్సార్సీపీను స్థాపించడం, ఆ తర్వాత ఆయన అనేక కష్ట, నష్టాలు ఎదుర్కోవడం అంతా ప్రజలు గమనించారు. అక్రమ కేసులలో ఆయన జైలులో ఉన్నప్పుడు, ఆయన కోసం రాజీనామా చేసిన వారి నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ సంచలనాత్మకమైన రీతిలో గెలుపొందడం కూడా విశేషమే.2014 సాధారణ ఎన్నికలలో YSRCP అధికారంలోకి రాలేకపోయినా, గౌరవనీయ సంఖ్యలో విజయాలు సాధించింది. విపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పోరాట పటిమ తగ్గలేదు. తదుపరి సైతం అనేక పోరాటాలు చేయవలసి రావడం వంటి ఘట్టాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో చరిత్రాత్మకమైన రీతిలో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎవరికి సాధ్యం కానీ రీతిలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలగడం ఒక రికార్డు. ఉమ్మడి ఏపీలో NTR, KCR, YS జగన్మోహన్ రెడ్డిలే సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. తెలుగు రాష్ట్రాలలో తండ్రులు ముఖ్యమంత్రులు అయ్యాక, వారి కుమారులు పలువురు రాజకీయాలలోకి వచ్చి మంత్రులు కాగలిగారు తప్ప, ముఖ్యమంత్రి అయింది మాత్రం YS జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో 2009 లోనే ఎంపీగా గెలుపొందిన మాట నిజమే. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఒకరకంగా చెప్పాలంటే గందరగోళంలో పడింది. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరించి అవకాశం ఇవ్వలేదు. అదే ఆయనకు ఛాలెంజ్గా మారింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, తనదైనా పంథాలో ముందుకు సాగారు, గెలిచినా, ఓడినా సొంత రాజకీయం సాగించారు. సోనియాగాంధీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నందున కేసులు పెడుతుందన్న భయంతో వైఎస్ సన్నిహితులు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి భయపడినా, తాను మాత్రం తిరుగుబాటు వీరుడుగానే జనంలోకి వెళ్లి వారి హృదయాలను గెలుచుకున్నారు.మామ ఎన్టీఆర్నే కుట్ర పూరితంగా సీఎం పదవిని లాగిపడేసిన వ్యక్తి చంద్రబాబు. ఎప్పుడు ఎవరితో అవసరమైతే వారితో పొత్తు పెట్టుకోగల వ్యక్తి, ఆచరణ సాద్యం కానీ హామీలు ఇచ్చే వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు వంటి నేతను ఢీకొట్టడం అంటే తేలిక కాదని చాలామంది భావిస్తారు. కుట్ర రాజకీయాలలో ఘనాపాటిగా పేరొందిన చంద్రబాబును ఓడించడం ద్వారా రాజకీయాలలో విశ్వసనీయతకు ప్రాధాన్యం ఉందని మొదటిసారిగా రుజువు చేసిన నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అనైతిక రాజకీయాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు తాను ఏమి చెప్పానో, అవి చేయాల్సిందే అనే పట్టుదలతో కృషి చేసిన ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు.చంద్రబాబు 2014 లో తాను ఇచ్చిన మానిఫెస్టోని మాయం చేస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో తాను ప్రకటించిన మానిఫెస్టోని మంత్రులు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చి అమలు చేయాల్సిందేనని చెప్పి కొత్త సంస్కృతికి నాంది పలికారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేతంగా సంక్షేమ పథకాలు చేయలేదని చెప్పాలి. అంతేకాదు... తన టరమ్ పూర్తి అవుతున్న తరుణంలో మానిఫెస్టో కాపీలతో పాటు, ఏ కుటుంబానికి ఎంత మేలు చేసింది వివరిస్తూ ప్రతి ఇంటికి అభివృద్ది నివేదికలను తన ఎమ్మెల్యేల ద్వారా అందించి కొత్త ట్రెండ్ సృష్టించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. మనిషిని చూస్తే ఈయన నిజంగానే ఇన్ని చేశారా అనిపిస్తుంది. ఇంతమంది ఆయనపై కక్ష కడితే వారందరిని ఒంటి చేత్తో ఎదుర్కున్నారా? అనే భావన వస్తుంది. బక్కపలచగా ఉండి, సింపుల్ డ్రెస్లో కనిపించే ఈయన ఏపీలో ఇన్ని వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల ముందుకు పరిపాలనను తెచ్చి రాష్ట్రాన్ని సరికొత్తగా మార్చగలరని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.ప్రభుత్వంలోని దాదాపు అన్నీ రంగాలలో తనదైన మార్కును వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించగలిగారు. పేదలు vs పెత్తందార్లు అనే నినాదాన్ని చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యవస్థలను ఆయన తెచ్చారంటే అతిశయోక్తి కాదు. కరోనా సంక్షోభ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, వ్యాధి పాలిట పడిన వారికి అందించిన వైద్యసేవలు మొదలైనవి ప్రశంసనార్హం. ఆ టైమ్లో సైతం స్కీములను అమలు చేసి ఆదుకున్న నేతగా ప్రజల గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆశ్చర్యం కాదు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన రోల్ మోడల్ ప్రభుత్వాన్ని నడిపారు. దేశంలోనే ఎవరూ చేయని సరికొత్త ప్రయోగాలు చేశారని చెప్పాలి. అందులో అనేకం కీలకంగా ఉన్నాయి.వలంటీర్ల వ్యవస్థను పెడతానని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినప్పుడు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ప్రభుత్వంలోకి రాగానే వలంటీర్లను పెడుతుంటే వీరంతా ఏమి చేస్తారో అనే అభిప్రాయం ఉండేది. రెండున్నర లక్షల మంది స్వచ్చంద సైన్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేశారన్న సంగతి ఆ తర్వాత కానీ జనానికి అర్దం కాలేదు. వలంటీర్లు ఇళ్లకు వచ్చి కుశల సమాచారం అడగడం కాదు.. వారి పరిపాలనకు సంబంధించిన అవసరాలను తీర్చే వ్యవస్థగా మారారు. ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు. ప్రభుత్వమే ప్రతి ఒక్కరి గడప వద్దకు వెళ్లి సేవలందించడం అని పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చి అమలు చేయడం అతి పెద్ద విజయం అనిపిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు అవసరమైన పనులన్ని జరిగిపోవడం కొత్త అనుభూతి. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్టు కావాలన్నా, వేరే ఏ పని ఉన్నా, మండల ఆఫీస్ల చుట్టూనో, ఆ పైన ఉండే అదికారుల చుట్టూనో తిరిగే పరిస్థితిని తప్పించి తమ ఇళ్లకే అవన్ని చేరే ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభినందనీయుడు.ఈ సచివాలయాల కోసం ఏకంగా లక్షన్నర ఉద్యోగాలను ఒకే ఏడాదిలో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం తమ చెప్పులను ఆయా షాపుల వద్ద, ప్రభుత్వ గౌడౌన్ల వద్ద క్యూలో పెట్టవలసి వచ్చేది. ఇప్పటికి తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదిలాబాద్లో జరిగిన రైతుల ఆందోళన ఇందుకు ఉదాహరణ. ఏపీలో ఆ ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. రైతులు తమ గ్రామంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలనుంచి అన్నీ సేవలు పొందగలుగుతున్నారు. అందువల్లే ఈ ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రైతు ఆందోళన చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు అమలు చేస్తామని చెబుతూ అంతా వచ్చి దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడు బారీ క్యూలు తెలంగాణ వ్యాప్తంగా కనిపించాయి. అదే ఏపీలో ఆ అవసరమే లేదు. వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అర్హత ఉంటే వారే నమోదు చేసుకుని స్కీమ్ అమలు చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే.ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన మార్పులు ఒక విప్లవం అని చెప్పాలి. స్కూళ్లు బాగు చేయడం మొదలు, ఆంగ్ల మీడియం, వారికి మంచి ఆహారం, డ్రెస్, పుస్తకాలు మొదలైనవి స్కూల్ తెరిచిన మొదటి రోజుల్లోనే ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఆంగ్ల మీడియం, ఐబీ సిలబస్, టోఫెల్ మొదలైన వినూత్న మార్పులు జరిగింది ఏపీలో మాత్రమే. వైద్య రంగంలోకూడా గణనీయమైన మార్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను మార్చారు. ప్రజల వద్దకే డాక్టర్లను పంపించే విధానం తెచ్చారు. ఊళ్లలో ఆరోగ్య శిబిరాలు పెట్టారు. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంచారు. తను చెప్పిన సంక్షేమ స్కీములను యధాతధంగా అర్హులైన వారందరికి అమలు చేసి చూపించారు. ప్రాంతం చూడలేదు. కులం చూడలేదు. మతం చూడలేదు. పార్టీ చూడలేదు. ఇది చాలామందికి నమ్మశక్యం కానీ విషయమే.అంతకుముందు టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల అవినీతి తతంగాలు చూసినవారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ మార్పు ఆశ్చర్యాలను కలిగించింది. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం.. ఇలా ఒకటేమిటి సుమారు ముప్పైకి పైగా స్కీములను ఒక్క రూపాయి అవినీతి లేకుండా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా డిబిటి పద్దతి అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. పేదలకు 31లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక సంచలనం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విపక్ష టీడీపీ తొలుత వీటన్నిటిని విమర్శించినా, తదుపరి తామూ అమలు చేస్తామని చెప్పడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ను తెలియచేస్తుంది. అభివృద్ది వైపు చూస్తే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేయడం అన్నిటికన్నా పెద్ద ప్రగతి అని వేరే చెప్పనవసరం లేదు. తీర ప్రాంతంలో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిషరీస్ యూనివర్శిటీ, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, 700 కోట్లతో 800 గ్రామాలకు నీటి స్కీము, పదిహేడు మెడికల్ కాలేజీలు, పలు కొత్త పరిశ్రమలు, పార్మాహభ్, రెండున్నర లక్షల కోట్ల విలువైన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, నలభై వేల కోట్ల విలువైన సోలార్ పానెల్ పరిశ్రమ.. బద్వేలు వద్ద సెంచరీ ప్లైవుడ్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ.. ఇలా అనేకం టేక్ ఆఫ్ అయ్యాయి. విశాఖ నగరాన్ని ఒక సూపర్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టారు. ఆదాని డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ తదితర కంపెనీలు రావడం.. ఇలా ఒకటేమిటి వివిధ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకునేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇదేదో పొగడడానికి చెప్పడం లేదు. అలా అని విమర్శలు లేవని కాదు. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఒక్క మద్య నిషేధం హామీని అమలు చేయలేకపోయామని పార్టీనే అధికారికంగా చెప్పింది.శాంతి భద్రతలు ఐదేళ్లుగా పూర్తి అదుపులో ఉన్నా, ప్రతిపక్షం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దారుణమైన అబద్దాలు ప్రచారం చేశాయి. వీటిని ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పెద్ద సవాల్ అయింది. ఒకేసారి వివిధ రంగాలలో సంస్కరణలు చేపట్టడం, ఆయా వర్గాలలోని పెత్తందార్లకు ఆగ్రహం తెప్పించింది. ఉదాహరణకు ప్రభుత్వ స్కూళ్లు బాగు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు నచ్చలేదు. ప్రభుత్వ సేవలన్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడం, తద్వారా తమ ప్రాధాన్యత తగ్గిందన్న భావన, ముడుపులు దక్కకుండా పోతున్నాయన్న ఆక్రోశం అందరిలో కాకపోయినా కొంతమంది ఉద్యోగులలో ఏర్పడిందని అంటారు. ప్రభుత్వ స్కూళ్లు బాగు చేసి టైమ్కు టీచర్లను రావాలని చెబితే వారిలో కొందరికి కోపం వచ్చిందని చెబుతారు. ఏపీలో సినిమా షూటింగ్లు చేయాలని, ఇతరత్రా పేదలకు ధరలు అందుబాటులో ఉంచాలని, దానిని బట్టి టిక్కెట్ల రేట్లు నిర్ధారిస్తామని చెప్పడం బడా సినిమా పెట్టుబడిదారులకు నచ్చలేదు.ఆస్పత్రులను బాగు చేసి, డాక్టర్లను పేదల ఇళ్లకు పంపడం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అంతగా ఇష్టం ఉండదు. భూముల రీసర్వే, ఈ స్టాంప్ విధానం, లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు తగ్గించడం, బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారికి అసంతృప్తి కలిగించింది. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు పచ్చి అబద్దాలను ప్రచారం చేశారు. ఆయా వ్యవస్థలను చంద్రబాబు బాగా ప్రభావితం చేస్తూ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అందులో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు బాగా తలనొప్పి తెప్పించారని చెప్పవచ్చు. మూడు రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి రానీవ్వకుండా విపక్షం వ్యవస్థల ద్వారా అడ్డుపడింది.ఇన్ని జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పెత్తందార్ల ప్రతినిధిగా ఉండడానికి ఇష్టపడలేదు. పాదయాత్రలో సామాన్యుల కష్టాలు ఎలా తెలుసుకున్నారో, ఆ విధంగానే పేదల ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు. అదే శ్రీరామరక్ష అవుతుందని ఆయన నమ్మారు. అందుకే ధైర్యంగా తను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు. ఇలా చేసిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఎంత ఆత్మ విశ్వాసం లేకుంటే ఆయన ఆ మాట చెప్పగలుగుతారు! అదే ఆత్మ స్థైర్యంతో, ప్రత్యర్ధులు ఎంతగా వేధించినా తొణకకుండా, బెణకకుండా ఐదేళ్లు పూర్తి చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సగర్వంగా ప్రజల ముందు నిలబడ్డారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు విజయానికి సంకేతంగా కనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్షాప్, జూమ్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సందేహాల నివృత్తికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి ఓటూ విలువైనదేనని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని, దానికి సంబంధించి ఆదేశాలు రాగానే తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నందున, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన వారికి విశ్రాంత ఆర్డీవో ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి, శాసన మండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.పోస్టల్ బ్యాలెట్ లెక్కించే విధానం⇒ ఎన్నికల అధికారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట విధిగా పోస్టల్ బ్యాలెట్లని లెక్కించాలి⇒ మొదటి కవరు–బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రెస్సు, ఓటరు సంతకం ఉండాలి. (ఓటరు సంతకం తప్పనిసరికాదు).⇒ మొదటి కవరు–బి (ఫారం – 13సి) తెరిచి చూసినప్పుడు అందులో 13 – ఏ డిక్లరేషన్, ఫారం 13–బి (కవరు – ఏ) విడివిడిగా ఉండాలి. లేకపోతే అది చెల్లుబాబు కాదు. అందులో కవరు – ఏ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమ సంఖ్య నమోదు చేయకపోయినా, నమోదు చేసినట్లయితే అది 13–బి (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్యతో సరిపోలక పోయినా, 13 – ఏ డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి హోదా తెలియజేసే స్టాంప్ లేదా హోదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణించాలి.⇒ 13– ఏ డిక్లరేషన్లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13 – బి పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న కవరు(కవరు – ఏ)ను పరిశీలించాలి. 13– ఏ డిక్లరేషన్లో పేర్కొన్న బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, 13 – బి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న క్రమసంఖ్య ఒకటి కాకపోయినా, ఓటరు ఎవ్వరికీ ఓటు వేయకపోయినా, ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి వేసినా, బ్యాలెట్ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినా, ఓటరు ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఓటరు తనే ఓటు వేసినట్లుగా గుర్తించినప్పుడు (ఉదాహరణకు ఓటరు పేరు రాసినా, సంతకం చేసినా) దానిని చెల్లని ఓటుగా పరిగణించాలి. ప్రతి బ్యాలెట్ పేపర్లో నమోదు చేసిన అంశాలను పోటీ చేసే అభ్యర్థుల ప్రతినిధిగా ఉన్న ఏజెంట్/అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాలెట్ పేపరు లెక్కించిన తరువాత రిజల్ట్ షీట్ (ఫారం–20)లో నమోదు చేయాలి. -
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు సీఎం వైఎస్ జగన్ నాంది పలికి నేటికి సరిగ్గా ఐదేళ్లు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచి్చన హామీల్లో 95 శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అమలుచేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలు అమలుచేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సువర్ణాక్షరాలతో లిఖించేలా గత ఐదేళ్లుగా సంస్కరణలు, వికేంద్రీకరణ, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సీఎం జగన్ సుపరిపాలన అందించారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు ఎక్కడాలేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ఇంటిగుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు.మంచి చేసిన ప్రభుత్వానికి దన్నుగా..ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ.. ఏటా అమ్మఒడి పథకం కింద ఇస్తున్న సొమ్మును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని.. రైతుభరోసా కింద ఇస్తున్న రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామంటూ కొత్తగా హామీలిచ్చిన సీఎం జగన్.. మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలని ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ వినతికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు.. రాష్ట్రం రూపురేఖలను మరింతగా గొప్పగా మార్చేందుకు వైఎస్సార్సీపీకి ప్రజలు దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు చేజిక్కించుకుని వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. -
పిన్నెల్లిపై పచ్చ కుట్రలు.. విర్రవీగితే నష్టం తప్పదు..
ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో ఏమి జరుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ కొద్దిమంది పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం ఏమిటి? ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి ఆ పోలీసులపై పెత్తనం చెలాయించడం ఏమిటి? గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పాలి. ఎన్నికల సమయంలో ఎవరిపైన అయినా నిర్దిష్ట ఆరోపణలు వస్తే ఆ పోలీసు అధికారులను బదిలీ చేయడం సహజమే. ఇదేమి కొత్త విషయం కాదు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వేరే అధికారులను నియమిస్తుంది. ఇక్కడే ఈసీ పెద్ద తప్పు చేసింది. ఏపీలో తెలుగుదేశం కూటమికి సాయం చేయడానికి నడుం కట్టినట్లు ఉంది. వెంటనే కూటమి నేతలు కొరుకున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను, కింది స్థాయి పోలీసు అధికారులకు కొత్తగా పోస్టింగులు ఇచ్చేసింది. దాని ఫలితమే మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి మొదలైన చోట్ల హింసాయుత ఘటనలకు అవకాశం ఏర్పడింది. చివరికి ఈసీ తాను నియమించిన కొందరు అధికారులనే సస్పెండ్ చేయవలసి వచ్చింది.దాంతో ఈసీకి అప్రతిష్ట వచ్చింది. అయినా కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు మారినట్లు లేదు. ఇప్పటికీ టీడీపీ ట్రాప్లోనే కొనసాగుతూ వైఎస్సార్సీపీని ఇబ్బందిపెట్టాలని ఆ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైకోర్టులో వెల్లడైన అంశాలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను కిందపడేశారనో లేక ద్వంసం చేశారన్న కేసులో బెయిల్ పొందగానే, అంతకు ముందు జరిగిన ఘటనలలో పనికట్టుకుని ఈయనపై కేసులు పెట్టారట. అందులో సీఐపై దాడి వంటి కేసులు కూడా ఉన్నాయి. ఘటనలు జరిగి పది రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేపై కేసు పెట్టడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఏపీలో ఆ పోలీసు అధికారులకు మాత్రం ఆ ప్రశ్న రాలేదు.ఎలాగైనా పిన్నెల్లిని ఏదో ఒక కేసులో అరెస్టు చేసి ఆయనను కౌంటింగ్ వద్దకు రాకుండా చేయాలన్నది వారి కుట్ర అట. లేకుంటే డీజీపీ హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పిన్నెల్లిపై ఈ నెల 22 న కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిన్నెల్లి న్యాయవాదులు కింది కోర్టులో ఉన్న సంబంధిత డాక్యుమెంట్లు తీసుకు వచ్చి ఈ నెల 23న అంటే ఈవీఎం కేసులో ముందస్తు బెయిల్ రాగానే కొత్త కేసులు పెట్టారని హైకోర్టుకు చూపించారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి కేసులో బెయిల్ పొందారు. ఇక్కడ అందుకు బిన్నంగా పోలీసులే తప్పుడు సమాచారం ఇచ్చి ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్టు చేయాలని తలపెట్టారు. ఇది సిగ్గు చేటైన విషయం. ఇదంతా పిన్నెల్లిపై కక్షతో ఉద్దేశపూరితంగానే తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.ఒక సీఐ స్థాయి అధికారి ప్రైవేటు లాయర్ను పెట్టుకోవడం ఏమిటో తెలియదు. నిజానికి ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడుల కేసులలో ప్రభుత్వమే లాయర్లను పెడుతుంది. లేదా నిర్దిష్ట అనుమతి తీసుకుని వ్యక్తిగత లాయర్లను నియమించుకోవచ్చు. అలాకాకుండా నేరుగా ఇలా చేశారంటే ఆ సీఐని ఏమనుకోవాలి. ఆయన వెనుక మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చిత్రమేమిటంటే ప్రతిపక్ష టీడీపీ కూటమి ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన ఈసీ, అధికార వైఎస్సార్సీపీ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. చివరికి ఒక సీఐ స్థాయి అధికారి తప్పుడు కేసులు పెడుతుంటే వైఎస్సార్సీపీ నిస్సహాయంగా మిగిలిపోవడం. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సంఘం రిఫరీ మాదిరిగా కాకుండా, కూటమిలో బాగస్వామిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి.పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో అత్యంత నిష్పక్షపాతంగా ఉండాలి. అలా కాకుండా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది. 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎస్.ఎస్.పి యాదవ్ అనే అధికారి డీజీపీగా ఉన్నారు. ఆయనపై విపక్షం ఆరోపణలు చేస్తే ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత ఎ.కె మహంతి అనే సీనియర్ అధికారిని డీజీపీగా నియమించింది. ఆయన నిజాయితీగా తన సేవలు అందించారు. దాంతో ఏ పార్టీ కూడా ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈసీ తీరే అభ్యంతరకరంగా ఉంటే, ఈసీ నియమించిన తాత్కాలిక అధికారులు మరింత చెలరేగిపోతున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి వస్తే తమ పరిస్థితి ఏమిటన్నది ఆలోచించకుండా కొద్ది మంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారి తెంపరితనాన్ని సూచిస్తుంది.డీజీపీగా వచ్చిన హరీష్ గుప్తపై తొలుత ఆరోపణలు రాలేదు. కానీ ఎవరి ఒత్తిడికి లొంగారో కానీ పిన్నెల్లిని అరెస్టు చేయడం కోసం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే ఇలా చేసిన పోలీసులకు ఇక్కట్లు తప్పవు. 2009 లో ఏ అధికారిని మార్చినా వైస్ రాజశేఖరరెడ్డి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే మాదిరి వ్యవహరిస్తూ ఏ అధికారిని మార్చి, ఎవరిని పెట్టుకున్నా ప్రత్యేకించి స్పందించకపోవడం విశేషం.గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత రచ్చ చేసింది అందరికి తెలుసు. కేవలం టీడీపీ కూటమికి సాయపడడం కోసం ఈ అధికారులు తమ కెరీర్ ను దెబ్బతీసుకుంటున్నారనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంను కింద పడేసిన ఘటనకు సంబంధించి ఈసీ స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఎడిట్ అయి టీడీపీ నేత లోకేష్ వద్దకు చేరడం, దానిని ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టడం, కేవలం దానిపై ఆధారపడి ఈసీ పిన్నెల్లిపై కేసు పెట్టాలని నిర్ణయించడం వివాదాస్పదం అయింది. అదే టైమ్ లో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ నుంచి టీడీపీ వారు బయటకు తోసేసి దౌర్జన్యం చేసిన వీడియోలను వైఎస్సార్సీపీవారు ఈసీకి పంపినా ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది.మరో సంగతి చెప్పాలి. టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డి, ప్రభాకరరెడ్డిలు వేర్వేరు కేసుల్లో చిక్కి పోలీసులకు దొరకకుండా పారిపోతే కనీసం ఒక్క ముక్క రాయని ఎల్లో మీడియా, పిన్నెల్లిపై మాత్రం కక్ష కట్టి పరార్ అంటూ పెద్ద, పెద్ద కథనాలు వండి వార్చింది. అంతేకాదు. తమకు అనుకూలంగా ఉండరని భావించిన అధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఈసీ వారిని బదిలీ చేయడం కూడా తప్పే అని చెప్పాలి. ఈనాడు వంటి పత్రికలు మరీ అథమ స్థాయికి దిగజారి డీజీపీని బదిలీ చేసినా, ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదంటూ పెద్ద, పెద్ద స్టోరీలు అల్లింది. అంటే ఈయనను కూడా తొలగిస్తే కౌంటింగ్ సమయంలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చన్నది టీడీపీ, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి భావన కావచ్చు.రాధాకృష్ణ తీరు మరీ విడ్డూరం. ఆయనేమో రాజకీయ రొచ్చులో, అవినీతి బురదలో నిండా మునిగి ఉంటారు. జవహర్ రెడ్డి వంటి అధికారులపై మరకలు పూస్తున్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారట. జగన్ దగ్గరకు వచ్చాకే పాడయ్యారట. ఇంత చెత్తగా వార్తలు రాసే ఆంద్రజ్యోతిని ఎవరైనా నమ్ముతారా? కౌంటింగ్ సమయంలో జవహర్ను తప్పించి తమకు కావల్సిన అధికారిని ఎవరినైనా పెట్టించుకుని అవకతవకలకు పాల్పడాలన్న లక్ష్యంతో ఉన్నారేమో తెలియదు కానీ, చెత్త వార్తలు రాయడానికి పోటీపడుతున్నారు. జవహర్ రెడ్డి బదిలీ ఒక్క విషయాన్ని మాత్రం ఈసీ ఇంకా అంగీకరించలేదు. దాంతో ఈనాడు, ఇతర ఎల్లో మీడియా జవహర్ రెడ్డి పై కక్ష కట్టి చోటా, మోటా నేతలతో ఆయన మీద ఆరోపణలు చేయించి, వాటిని తమ మీడియాలో పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నాయి. బహుశా గతంలో ఇంత నీచమైన రాజకీయం, జర్నలిజం చూడలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకే మాదిరి ఉండవు. ఆ సంగతి మరిచి విర్రవీగితే వారికే నష్టం.మరో సంగతి చెప్పాలి. పోస్టల్ బాలెట్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దేశం అంతటికి ఇచ్చిన గైడ్ లైన్స్ ను కాదని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి మీనా కొత్త ఆదేశం ఇవ్వడం వివాదం అయింది. మీనా తప్పును సరిచేసుకోకపోతే ఆయనపై కూడా సందేహాలు వస్తాయి. గతంలో 2009లో ఎన్నికలు ఫలితాలు వచ్చి మరోసారి ప్రభుత్వం రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగి ఎస్.ఎస్.పీ యాదవ్ ను డీజీపీగా నియమించారు. ఇప్పుడు కూడా తనపై ద్వేషంతో టీడీపీ కూటమి బదిలీ చేయించిన అధికారులందరిని తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే మళ్లీ పదవులలోకి తీసుకుంటారన్నది కూడా నిజం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్కు అంత సీను లేదబ్బా!
తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక ఘటనకు విశేష ప్రచారం వచ్చింది. అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంను కిందపడేసినట్లు చెబుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సహజంగానే వైరల్ అవుతుంది. అలాంటి వాటిని ఎవరూ సమర్థించరు. కానీ అదే సమయంలో అక్కడ జరిగిన ఇతర గొడవలు, టీడీపీవారి దౌర్జన్యాలను కప్పిపుచ్చుతూ ఈ వీడియో మాత్రమే లీక్ అయిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిన్నెల్లి తప్పు చేశారో, లేదో కానీ, దానితో పోల్చితే ఎన్నికల సంఘం చేసిన తప్పే పెద్దదిగా కనిపిస్తుంది.ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండవలసిన వెబ్ కాస్ట్ వీడియో ఫుటేజీ బయటకు వచ్చిన వైనం, అది కూడా టీడీపీ నేత లోకేష్ కు దగ్గరకు చేరడం, దానిని ఆయన ఎడిట్ చేసి తమకు అనుకూలమైన మేర ఎన్నికల కమిషన్ కు పంపడం, వెంటనే కమిషన్ స్పందించడం.. ఇవన్ని చూస్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏదో పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం వస్తుంది. లోకేష్ వద్దకు ఆ వీడియో ఎలా వెళ్లిందో తెలియదని సీఈఓ మీనా చెప్పడాన్ని బట్టే ఇందులో కుట్ర స్వభావం కనిపిస్తుంది. దీనిపై లోకేష్ ను విచారిస్తారా? లేదా? అనేది చూడాలి.మే పదమూడో తేదీన జరిగిన ఈ ఘటన వీడియో ఎనిమిది రోజుల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఒక ప్రశ్న. అలా అనధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వీడియోలు లీక్ కావచ్చా? అది నిజమైన వీడియోనా? కాదా? అనే దానిని దృవీకకరించుకోకుండా ఎన్నికల సంఘం చర్యకు ఉపక్రమించవచ్చా? వీడియో లీక్ పై విచారణ జరగదా? సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రజలకు అనుమానాలు రావా? ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీలు జత కట్టాక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదని, కూటమి నేతలు ఏది కోరితే అది చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగినట్లే ఇలా రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లితే కౌంటింగ్ అయినా సజావుగా జరుగుతుందా? లేక కూటమికి ఉపయోగపడేలా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందా? అనే సందేహాలు వచ్చే అవకాశం ఉంది.ఈవీఎంలను కిందపడేసి పాడు చేసే యత్నాలకు సంబంధించి అనే ఈ వీడియోలను ఈసీ అధికారికంగా విడుదల చేసి ఉండవచ్చు. అప్పుడు ఎమ్మెల్యే అయినా, మరొకరు అయినా తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. అలాకాకుండా సెలెక్టివ్ గా వీడియో లీక్ కావడంలో ఆంత్యర్యం ఏమిటి? దానిని ఎవరైనా ఈసీ వర్గాల నుంచి తస్కరించి బయటపెట్టారా? లేక అధికారులు ఎవరైనా లీక్ చేశారా? లేదా పిన్నెల్లి లాయర్ అనుమానించినట్లు అదేమైనా ఫేక్ వీడియోనా? అనేది తేలాలి.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబందిత పాల్వాయి గ్రామం వద్ద టీడీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు శ్రద్ద చూపలేదట. ఈసీకి ఫిర్యాదు చేసినా వారు సీరియస్గా చర్య తీసుకోలేదు. అక్కడ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ను కూడా తరిమేసి దొంగ ఓట్లను వేయించుకోవడం, బలహీనవర్గాలవారిని ఓటింగ్ కు రాకుండా భయపెట్టడం వంటి సంఘటనలు ఏమి చెబుతాయి! ఆ సమాచారం తెలిసిన పిన్నెల్లి అక్కడకు వెళ్లి ఆవేశపడి ఉండవచ్చు. కానీ దానివల్ల ఈవీఎం. ఏమీ పాడుకాలేదు. అక్కడ రీపోలింగ్ కూడా అధికారులు పెట్టలేదు. అలాంటటప్పుడు ఈవీఎం ద్వంసం అని ప్రచారం చేయడం అర్దరహితం. టీడీపీ వారు కూడా ఇలాగే మరో ఆరేడు, చోట్ల పల్నాడు ప్రాంతంలో ఈవీఎంలను పాడు చేయడానికి యత్నించారు. అక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు.ఆ ఘటనలలో కొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. అయినా టీడీపీ వారు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపై మాత్రం విపరీత ద్వేషపూరిత ప్రచారం చేస్తోంది. ఈసీ ఈవీఎంలను ద్వంసం చేయడానికి జరిగే ప్రయత్నాల వీడియోలన్నిటిని బహిరంగపరచి ఉండాల్సింది. అలాగే పాల్వాయి వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్ ను కొట్టి బయటకు లాగడం, తదితర దృశ్యాలను కూడా విడుదల చేయాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఈసీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి.తాజాగా గుంటూరు ఐజీ త్రిపాఠి కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన కథనం సంచలనంగా ఉంది. ఇదంతా చూస్తే ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ, అధికారం మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చెలాయిస్తున్నదన్న అభిప్రాయం వస్తుంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసీ పై ఆరోపణలు చేస్తూ సిఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేశారు. తన మనిషిగా భావించి ఇంటెలెజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడానికి వీలు లేదని నానా రచ్చ చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఫలానా అధికారి కావాలని కానీ, ఫలానా అధికారులను ఎందుకు బదిలీ చేశారని కానీ ఈసీని ప్రశ్నించలేదు.చంద్రబాబు మాదిరి గొడవలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా ఏదైనా అవసరం వస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఉన్న తేడాను గమనించవచ్చు. అంతేకాక జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎందుకు అంటకాగడానికి విశ్వయత్నం చేసింది అందరికి అర్ధం అయిపోతోంది. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పుకోవాలి. ఓటుకు నోటు కేసు సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో అరెస్టు అయ్యారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మనవాళ్లు భ్రీఫ్ డ్ మి అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో బయటకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు వాదన ఏమిటంటే తన ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించేవారు. పైగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏపీలో ఎదురు కేసులు రిజిస్టర్ చేయించారు. ఆ కేసులో ముప్పైసార్లు చార్జీషీట్ లో చంద్రబాబు పేరు వచ్చినా, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. దానిని అంతటిని కుట్రగా ప్రచారం చేశారే కానీ, జరిగింది తప్పు అని చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.అదే కాదు. కొద్ది నెలల క్రితం పుంగనూరు, అంగళ్లు వద్ద జరిగిన గొడవలలో చంద్రబాబు స్వయంగా తన కార్యకర్తలను రెచ్చగొడుతూ తన్నండి.. కొట్టండి.. అంటూ దూషణలకు దిగారు. దానిపై కేసు అయితే, అదంతా పోలీసుల తప్పు గా ఈనాడు, జ్యోతి ప్రచారం చేశాయి. పుంగనూరులో అయితే చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చేయడం, రాళ్లు విసరడం చేస్తే ఒక పోలీస్ కానీస్టేబుల్ కు కన్ను కూడా పోయింది. అయినా ఈనాడు మీడియా పోలీసులదే తప్పన్నట్లు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం అక్రమం అనేట్లుగా దారుణ ప్రచారం చేసింది.ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా వ్యవహరిస్తున్నదనడానికి ఇవన్ని ఉదాహరణలే. అలాగే ఇతర చోట్ల ఈవీఎం లను కింద పడేస్తే టీడీపీ వారిపై పెట్టిన కేసులకు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై పెట్టిన కేసుల సెక్షన్లకు చాలా తేడా ఉందట. ఎమ్మెల్యేపై అతి కఠినమైన సెక్షన్లు పెట్టడం కూడా కుట్రగానే చూస్తున్నారు. హైకోర్టు ఈ కేసులో తాత్కాలిక స్టే ఇచ్చింది. అది వేరే విషయం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడకపోలేదు. ఉదాహరణకు గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే బాంబుల శివారెడ్డిగా పేరొందారు. వేరేప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో బూత్ల వద్ద బాంబులు విసిరారు. మరో టీడీపీ ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లి బాక్స్లలో నీళ్లు పోశారు. ఈవీఎం లకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన మద్దతుదారుడు ఒకరు ఏకంగా ఒక ఈవీఎం నే అపహరించుకుని వచ్చారన్న కేసు నమోదు అయింది.గతంలో 1999 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రముఖ నేత కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణిస్తే, ఆయనపై కేసు విచారణే జరగకుండా చంద్రబాబు అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వాని ద్వారా మేనేజ్ చేయగలిగారు అప్పుడు ఆ కేసును బీజేపీ సహకారంతో కప్పిపుచ్చగలిగారు. ఇప్పుడు బీజేపీ సహకారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చికాకు సృష్టిస్తున్నారు. తమకు కావల్సిన పోలీసు అదికారులను ఈసీ ద్వారా పోస్టు చేయించుకుని గందరగోళం చేస్తున్నారు. ఈసీ ఇంతగా దిగజారిపోవడం ఇటీవలికాలంలో ఇదే అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో అనేకం జరిగినా, బలహీనవర్గాలవారు ఓట్లు వేయకుండా పోలీసు అధికారులే ఇప్పుడు అడ్డుకున్నా అదంతా ప్రజాస్వామ్యమని ఈనాడు రామోజీరావు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాత్రం ఘోర అపచారానికి పాల్పడినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. టీడీపీ వారు ఏమి చేసినా భుజాన వేసుకోవడం, అదే ఎదుటివారిది చిన్న తప్పు అయినా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేయడం ఈ మీడియాకు అలవాటు అయింది.దీనికి తోడు ఈనాడు రామోజీరావు రాజ్యాంగానికి ఏదో జరిగిపోయిందంటూ దిక్కుమాలిన సంపాదకీయం రాసి మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా మంచిదికాదని చెప్పవలసిన ఈ పెద్ద మనిషి టీడీపీ నేతల తప్పులను మాత్రం ఎంతదూరం అయినా వెళ్లి కాస్తున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్ధిపై పలు కేసులు ఉన్న విషయాన్ని కప్పిపుచ్చే యత్నం జరుగుతోంది. ఎన్నికల రోజున ఆయన ఆధ్వర్యంలో కొన్ని బూత్ల వద్ద జరిగిన అల్లర్లపై పలు వార్తలు వచ్చాయి. వాటి మీద ఏ చర్యలు తీసుకుంది తెలియదు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు జరిపిన విధ్వంసంపై ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకుందీ కూడా తెలియరాలేదు. పల్నాడుతో సహా వివిధ ప్రాంతాలలో సిట్ ఏర్పడిందే ప్రధానంగా టీడీపీవారి అరాచకాలపైన అనే సంగతి మర్చిపోకూడదు. దారుణాలకు పాల్పడి బలహీనవర్గాలవారిని ఓట్లు వేయనీయకుండా టీడీపీకి చెందినవారు చేసిన ప్రయత్నాలకు ఈనాడు కొమ్ముకాస్తున్న తీరు పెత్తందారులకు ఎలా వత్తాసు పలుకుతోంది అర్దం చేసుకోవచ్చు.పిన్నెల్లి పరార్ అనే బ్యానర్ కథనాలు రాసే ఈ పెద్దలు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఎస్ గా ఉన్న వ్యక్తి విచారణకు హాజరుకాకుండా అమెరికాకు పరారైతే మాత్రం సమర్థిస్తూ వార్తలు ఇస్తారు. చంద్రబాబుపై అవినీతి కేసు వస్తే నిర్లజ్జగా అది అక్రమ కేసు అని డబాయించడానికి రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం చూశాక, వారు ఇంతేలే అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం. ఆ రోజుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తారా అని గగ్గోలు పెట్టిన ఈనాడు అర్జంట్ గా పిన్నెల్లిని తీసుకువెళ్లి జైలులో పెట్టాలని, ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని వీరే తీర్పు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు దొంగ మెడికల్ సర్టిఫికెట్లతో బెయిల్ పొందేవరకు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తప్పుడు వార్తలు రాసిన ఈనాడు రామోజీరావు నుంచి ఇంతకన్నా ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని ఆశించడం తప్పే అనుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న అక్కసుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్కు దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్కు పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్ తరువాత సైతం బడుగు, బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడులను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్సార్సీపీ నేతలు వాపోతున్నారు. పోలింగ్ రోజు, తరువాత పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగింది. ఓటేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీలపై దాడి రెంటచింతల మండలం తుమృకోటలో మే 13న ఓటు వేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలపై టీడీపీలోని అగ్రకుల నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే క్యూలైన్లలో ఉన్న మహిళల్ని కొట్టడంతోపాటు వారిని బయటకు తరిమేసిన టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. పోలింగ్ బూత్లో ఏజెంట్లను బయటకు గెంటేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తున్న మహిళల తలలు పగులగొట్టారు. దీంతో బాధిత మహిళలు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఆ ఒక్క కులమే గ్రామంలో బతకాలా.. దళితులకు ఓటు వేసే హక్కులేదా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్య నాయక్, కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావు నాయక్, నాగేశ్వరరావు నాయక్లపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. పాలువాయిగేటు బూత్లలో అరాచకం పాలువాయిగేటు గ్రామంలో టీడీపీ గూండాలు ఈ నెల 13న ఉదయం 6.30 గంటల సమయంలో ప్రవేశించి గ్రామంలోని 201, 202 పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీకి చెందిన వారిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరిరావు బరితెగించి ఓటర్లపై దౌర్జన్యానికి దిగారు. 202 బూత్లోకి వెళ్లి ఓటర్లను భయాందోళనకు గురిచేసి రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్కు, నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి, ఎస్పీ బిందుమాధవ్, జేసీ శ్యామ్ప్రసాద్ తదితర ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ సమయంలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో వచ్చి వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, శ్రీను, మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా టీడీపీ వర్గీయులు పిన్నెల్లి కాన్వాయ్లోని వాహనాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు నంబూరి శేషగిరిరావు. అతనిపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని రక్షించాడంటూ చంద్రబాబు ఫోన్లో పరామర్శించడంపై పాలువాయిగేటు గ్రామ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పోలింగ్ ముగిశాక బుడగ జంగాలపైనా దాడి కారంపూడి మండలం పేటసన్నెగండ్ల శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్ ముగిశాక వారి ఇళ్లపై దాడి చేశారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ఇళ్లలోని సామాన్లు, చివరకు ఫ్యాన్లు, బల్బులను కూడా పగులగొట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో కారును ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో పోతురాజుగుట్టలోని వారంతా ప్రాణభయంతో పారిపోయి వేరేచోట తలదాచుకున్నారు. ‘ఏరా.. టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఊరొదిలి పారిపోయిన బడుగు జీవులు గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్ల వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ రౌడీలు, గూండాలను తీసుకొచ్చి పోలింగ్ రోజు రాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులకు పాల్పడి ధ్వంసరచన సాగించారు. బైక్లు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామగ్రితోపాటు టీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని వైఎస్సార్సీపీ నేతలు పొలాల్లోకి పారిపోయి అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు, మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారని తెలిసి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. పోలీసులకు విషయం తెలిసినా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన బాధితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్కుమార్, కాసు మహేష్రెడ్డిపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయంటే వారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నాయకుల్ని గ్రామాలు దాటించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా చొరబడ్డారు. మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని పురుషులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ముస్లిం వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. కంభంపాడులో విధ్వంసకాండ పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్ రోజున వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలపైనా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య), సతీమణి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు అంజిమ్మ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడ్డారు. పలుమార్లు ఎస్సీ, బీసీ కాలనీలకు టీడీపీ రౌడీ మూక వెళ్లి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఎస్సీలపై దాష్టీకం చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా మే 13వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీకి ఎస్సీలు ఓటు వేశారన్న అక్కసుతో వారిపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి కాలనీకి చెందిన ఎస్సీలు గ్రామంలోని ప్లాంట్నుంచి మంచినీరు తీసుకువెళ్లకుండా టీడీపీ నేతలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. ఓటేయకుండా అడ్డుకున్నారు ఓటేద్దామని పోలింగ్ బూత్కు వెళితే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో ఇంటికి పారిపోయా. అధికారులకు చెప్పినా చూస్తూ నిలబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడం మేలని ఓటేయకుండా తిరిగొచ్చేశా. –కర్రా ఏసుపాదం, ఎస్సీ మహిళ, తుమృకోట ఓటు వేయలేకపోయా ఓటు వేయాలని రెండుసార్లు పోలింగ్ బూత్కు వెళ్లాను. అక్కడ యుద్ధ వాతావరణం చూసి భయపడి ఇంటికి వచ్చేశా. టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తూ బడుగులను భయపెట్టి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. – నందిగం పున్నమ్మ, ఎస్సీ మహిళ, తుమృకోట నా భర్తను కొట్టారు ఓటు వేయడానికి వెళ్లిన నా భర్త దీపావత్ స్వామినాయక్ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టారు. నన్ను కూడా ఓటు వేయకుండా బెదిరించారు. పోలింగ్ బూత్ల వద్ద దాడులు చేయడంతో మా కాలనీలో ఎవరూ ఓటు వేయలేదు. అధికారులు మాకు రక్షణ కలి్పంచలేకపోవడం వల్ల ప్రాణ భయంతో ఓటు వేయడానికి వెళ్లలేదు. – దీపావత్ రమణ, ఎస్టీ మహిళ, తుమృకోట ప్రాణభయంతో పరుగులు పెట్టా ఓటు వేయవద్దని.. వేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు బెదిరించారు. గ్రామస్తులు లెక్కచేయకపోవడంతో రిగ్గింగ్ చేయాలనే తలంపుతో దళితులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టా. – కత్తి భూలక్ష్మి, ఎస్సీ మహిళ, పాలువాయిగేటు, రెంటచింతల మండలం వైఎస్సార్ సీపీకి ఓటు వేశామని దాడి టీడీపీ నేతలు పోలింగ్ రోజు మా ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్టు కొట్టారు. మా ఆస్తులను ధ్వంసం చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. నాతో మరో నలుగురిని కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. బీభత్సం చేశారు. – గొర్ల సైదులు, జంగాల కాలనీ, పేటసన్నెగండ్ల , కారంపూడి -
ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ
సాక్షి, అమరావతి: ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని.. తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదని.. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులనూ ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టంచేసింది. అంతేకాక.. ఆయా కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయడంగానీ.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడంగానీ చేయరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదన్న హైకోర్టు, ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.అరెస్టుకు అవకాశం ఉంది.. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి..ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టుచేసే అవకాశముందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు టి. నిరంజన్రెడ్డి, పి.వీరారెడ్డి, ఓ.మనోహర్రెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎస్.రామలక్ష్మణరెడ్డి, చుక్కపల్లి భానుప్రకాశ్.. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి తమ తమ వాదనలను వినిపించారు.సుప్రీంకోర్టుకన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది..పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులని, అందువల్ల వారికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్రెడ్డి తెలిపారు. అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టుచేయడానికి వీల్లేదన్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. వాస్తవాలు విచారించకుండా ఇలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయన్నారు. తాము కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నామని సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు అరెస్టుచేస్తే కౌంటింగ్ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమయంలో పీపీ నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. మధ్యంతర బెయిల్ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి ఘటనలు జరిగినా వారినే బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించారు.ఆ పిటిషన్ల విచారణ 30కి వాయిదా..ఇదిలా ఉంటే, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
కూటమి సేవలో 'ఘనాపాఠి'
సాక్షి, అమరావతి: సర్వ శ్రేష్ఠుడు అంటే అందరికంటే సమర్థుడు అని అర్థం. కానీ ఆ సమర్థత విధి నిర్వహణలో కాకుండా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలకడంలో చూపించిన ఘనాపాఠి గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి! ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ మూకలు బరితెగించి సాగించిన విధ్వంసకాండకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు ఓటింగ్లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గూండాలకు పోలీసు లాఠీని అందించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్లలో లేకుండా దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలకు ఈ ఖాకీ కొమ్ము కాశారు. పోలింగ్ అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీమూకలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నా వారిని అరెస్ట్ చేయకుండా పోలీసు యంత్రాంగం చేతులు కట్టేశారు. ఓట్ల లెక్కింపు రోజు టీడీపీ గూండాలు మరోసారి అరాచకం సృష్టించేందుకు రంగం సిద్ధం చేయిస్తున్నారు. ఎన్నికల అక్రమాలకు సహకారం అందించేందుకు చంద్రబాబు, పురందేశ్వరి పక్కా పన్నాగంతో పల్నాడులో ప్రవేశపెట్టిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారిద్దరి నమ్మకాన్ని వమ్ము చేయలేదనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థ రాజకీయ బురద పులుముకుంటే ప్రజాస్వామ్యానికి ఎంత చేటు కలుగుతుందో చెప్పేందుకు ఈ ‘పచ్చ’ ఖాకీ కథే నిదర్శనం!పోలింగ్కు ముందు పల్నాడులో పచ్చ జట్టు పల్నాడులో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉందని గుర్తించిన చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కుట్రకు తెరతీశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని పావులు కదిపారు. గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ శివశంకర్రెడ్డితోపాటు క్షేత్రస్థాయిలో కీలకమైన డీఎస్పీలు, సీఐలపై అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదులు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా కథ నడిపించారు. టీడీపీ ఆరోపణలు చేసిన పోలీసు అధికారులపైనే ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు.. ఆ అధికారుల స్థానాల్లో ఎవర్ని నియమించాలో సూచిస్తూ ఆమె ఏకంగా జాబితా సమర్పించడం గమనార్హం. అంటే ఈసీ అధికార పరిధిలో పురందేశ్వరి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ, బీజేపీ ఒత్తిడికి ఈసీ తలొగ్గినట్టు అనంతరం పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డిని ఈసీ ఆకస్మికంగా బదిలీ చేసింది. వారి స్థానాల్లో టీడీపీ అనుకూలురైన పోలీసు అధికారులు నియమితులయ్యారు. గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు.జాబితా పంపిన నిమ్మగడ్డ, వర్లచంద్రబాబుకు నమ్మిన బంటు అయిన వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అత్యంత సన్నిహితుడు. ఎస్పీగా నియమించిన గరికపాటి బిందు మాధవ్ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులుకు బంధువు. ఐజీగా రాగానే త్రిపాఠి టీడీపీ కుట్రలను అమలు చేశారు. పోలింగ్కు కేవలం రెండు రోజుల ముందు మాచర్ల టౌన్ సీఐ పి.శరత్బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, గురజాల సీఐ పల్లపురాజు, ఎస్సై ఎం.రామాంజనేయులును బదిలీ చేయడం గమనార్హం. వారి స్థానాల్లో నియమించాల్సిన అధికారుల జాబితాను సైతం ఆయనే పంపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఇచ్చిన జాబితాలనే ఆయన పంపడం గమనార్హం. టీడీపీకి అనుకూలురైన కోటేశ్వరరావు మాచర్ల టౌన్ సీఐగా, కారంపూడి సీఐగా నారాయణస్వామి నియమితులయ్యారు. రెంటచింతల మండలానికి చెందిన నారాయణస్వామి టీడీపీ గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకు సన్నిహితుడు.పోలీసులను కట్టడి చేసి..పల్నాడు అంతా టీడీపీ అనుకూల పోలీసు అధికారుల ద్వారా తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన రెండో దశ కుట్రను అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, పేద వర్గాలకు చెందిన ఓటర్లను బెంబేలెత్తించి వారు ఓట్లు వేయకుండా అడ్డుకోవాలన్న పచ్చ పన్నాగానికి ఐజీ త్రిపాఠి కొమ్ము కాశారు. జిల్లాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తనకు చెప్పకుండా కాలు కదపటానికి వీల్లేదని ఆదేశించారు. ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం అందినా సరే తాను అనుమతిస్తేనే వెళ్లాలని స్పష్టం చేశారు. టీడీపీ మూకలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ప్రాంతాల వైపు పోలీసులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకే త్రిపాఠి ఇలా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.అరాచకాలకు అండదండలు⇒ పోలింగ్కు మూడు రోజుల ముందు మాచర్ల వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి, మాజీ ఎంపీపీ వెల్దుర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై, కానిస్టేబుళ్లపై కూడా పచ్చమూకలు దాడి చేయడం గమనార్హం. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడికి పాల్పడిన వారిని కనీసం స్టేషన్కు పిలిచి కూడా మాట్లాడలేదు.⇒ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యా సంస్థలకు చెందిన బస్సులో టీడీపీ కార్యకర్తలు హోలోగ్రామ్లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులు, డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో వాటిని జప్తు చేయకుండా వదిలేశారు. ⇒ పోలింగ్కు రెండు రోజుల ముందు అంటే మే 11న రెంటచింతలలో టీడీపీ వర్గీయులతో సమావేశమైన సీఐ నారాయణస్వామి.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా తాము పట్టించుకోబోమని భరోసానిచ్చారు. అదే రోజు కారంపూడి మండల వైఎస్సార్సీపీ జేసీఎస్ కన్వీనర్ వెంకటేశ్వరరెడ్డిని ఆయన కాలితో తన్నారు. వెంకటపల్లిలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసినట్లు సమాచారం అందినా ఒక్క కానిస్టేబుల్ను అక్కడకు పంపారు. అనంతరం ఆయనే ఆ గ్రామానికి వెళ్లి బాధితుడైన మహేశ్ను ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ⇒ మే 12న సీఐ నారాయణస్వామి టీడీపీ వర్గీయులతో కలసి రెంటచింతల వెళ్లారు. దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీకి చెందిన మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, ఆయన అనుచరులపై దాడికి తెగబడ్డా నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో ఉదాశీనంగా వ్యవహరించారు. తద్వారా దాడులకు తెగబడ్డా, ఓటర్లను బెదిరించినా పట్టించుకోబోమని టీడీపీ శ్రేణులకు సంకేతాలిచ్చారు.కుట్రలకు సహకారం..కీలకమైన పోలింగ్ రోజు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తానో పోలీస్ ఉన్నతాధికారిననే విషయాన్ని విస్మరించి టీడీపీ కార్యకర్త తరహాలో చెలరేగిపోయారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాల్సిన ఆయన ఓ వర్గానికి వత్తాసు పలికారు. స్వయంగా పల్నాడులో తిష్ట వేసి మరీ టీడీపీ రిగ్గింగ్కు కొమ్ము కాయడం విభ్రాంతి కలిగిస్తోంది. మాచర్లలోని కేసీపీ సిమెంట్స్ గెస్ట్ హౌస్, జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా టీడీపీ కుట్రలకు సంపూర్ణ సహకారం అందించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంటతోపాటు పరిసర గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లను ఐజీ త్రిపాఠీనే నియమించడం గమనార్హం. అంతేకాదు.. ఆయనతోపాటు ఎస్పీ బిందుమాధవ్ ఆ గ్రామాల్లోనే ఉన్నారు. ఒక అదనపు ఎస్పీ, ఒక ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీ, ఇద్దరు సీఐలను అక్కడ నియమించారు. అదే త్రిపాఠీకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం వెల్దుర్తిలో అన్ని పార్టీల ఏజెంట్లు ఉన్నారో లేదో చూడాలని కూడా అనిపించలేదు.రిగ్గింగ్ నిరోధించాలని పిన్నెల్లి మొర పెట్టుకున్నా.. టీడీపీ వర్గీయులు కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు, రెంటాల, జెట్టిపాలెం, పాల్వాయి గేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి, ఒప్పిచర్ల, పేట సన్నెగండ్ల, చింతపల్లి, ముటుకూరు, అడిగొప్పుల, పోలేపల్లి, వెల్దుర్తి, లోయపల్లి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట గ్రామాల్లో రిగ్గింగ్కు కుట్ర చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ 20 గ్రామాల్లో సక్రమంగా పోలింగ్ జరిగేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కాపీని ఐజీ త్రిపాఠీకి అందచేసి టీడీపీ రిగ్గింగ్కు పాల్పడకుండా కట్టడి చేయాలని కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వెల్దుర్తితోపాటు ఆ 20 గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడి చేసి చితకబాది బూత్ల నుంచి వెళ్లగొట్టినా స్పందించలేదు. టీడీపీ రౌడీమూకలు ఆరు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశాయి. దీనిపై సమాచారం అందినా ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు ఒక డీఎస్పీని కూడా పంపలేదు. త్రిపాఠి ఆ పోలింగ్ కేంద్రాలను కనీసం సందర్శించ లేదు.పదేపదే ఫోన్లు చేసినా..పల్నాడు అంతటా టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా పట్టించుకోవద్దని సంకేతాలిచ్చి ఐజీ త్రిపాఠి పోలీసుల చేతులు కట్టేశారు. అదే అదనుగా అల్లరి మూకలు కర్రలు, కత్తులు, రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తుండి పోయింది. పోలింగ్ రోజు ఉదయం 9 గంటలలోపే యథేచ్చగా రిగ్గింగ్ పాల్పడాలన్న టీడీపీ కుట్రకు త్రిపాఠి కొమ్ము కాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాలు అత్యధికంగా ఉన్న పోలింగ్ బూత్ల వద్ద టీడీపీ విధ్వంసకాండ సృష్టించింది. మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు... ఇలా పల్నాడు అంతటా పచ్చ ముఠాలు బరితెగించి అక్రమాలకు పాల్పడ్డాయి. పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు వెళ్లగొట్టినా, ఓటర్లను బెదిరించి పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నా, టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నా పోలీసులు మౌనముద్ర దాల్చారు. దీనిపై ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్లకు వైఎస్సార్సీపీ నేతలు పదేపదే ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల కమిషన్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేయడంతో ఉదయం 9 గంటల తరువాత వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను అనుమతించారు.కౌంటింగ్ రోజు అక్రమాలకు అభయం!ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దన్నుతో పల్నాడులో భయానక వాతావరణం సృష్టించిన పచ్చ ముఠాలు ఓట్ల లెక్కింపు రోజైన జూన్ 4న మరోసారి దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు లేకుండా చేసి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలని పన్నాగం వేశాయి. దీనిపై నిఘా వర్గాలు స్పష్టమైన నివేదిక ఇచ్చినా ఐజీ త్రిపాఠి నిర్లిప్తంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్ సందర్భంగా దాడులకు పాల్పడిన రౌడీమూకలను ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలో 581 మంది దాడుల్లో పాల్గొన్నట్టు నిర్థారించగా ఇప్పటివరకు 274 మందినే గుర్తించారు. మరో 307 మందిని ఇంతవరకు గుర్తించలేదు. వీరిలో అత్యధికంగా మాచర్ల నియోజకవర్గానికి చెందినవారే 245 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గానికి చెందినవారు 62 మంది ఉన్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో కేవలం 19 మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా గురజాల నియోజకవర్గానికి చెందినవారే. మాచర్ల, నరసరావుపేట నియోకజవర్గాల్లో పోలింగ్ రోజు దాడులకు పాల్పడ్డ వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదంటే ఐజీ త్రిపాఠి నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఎంత చేష్టలుడిగి చూస్తోందో అర్థమవుతోంది. టీడీపీ గూండాల దాడులపై వీడియోలతో స్పష్టమైన ఆధారాలున్నా అరెస్ట్ చేయకపోవడం వెనుక టీడీపీ ఒత్తిళ్లు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఓట్ల లెక్కింపు రోజు వరకూ ఆ నిందితులను అదుపులోకి తీసుకోకూడదన్నది పోలీసుల ఉద్దేశంగా ఉంది. తద్వారా మరోసారి దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితి సృష్టించేందుకు పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
మళ్లీ అధికారం వైఎస్సార్సీపీదే.. అంచనాలు ఇవే
రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఏభైఎనిమిది శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాలలో ఈ స్టడీ చేశారట. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్ గా పరిశీలన చేశారు.⇒ ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానుల భావన కావచ్చు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు కానీ, దాదాపు అదే తరహాలో జరిగిన స్టడీలలో అత్యధిక భాగం వైఎస్సార్సీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. అందులో అంకెలు కొంచెం అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, గెలుపుపై తేడా ఉండడం లేదు.⇒ ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ అంశం. ఉదాహరణకు హిందుస్తాన్ టైమ్స్ లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ సంగతి తెలిసిన ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏదీ ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఒక తెలుగు వార్తా చానల్ ఇచ్చిందంటూ ఇలాగే టీడీపీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తే, అది కూడా వాస్తవం కాదని వెల్లడైంది.వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలలో అత్యధిక భాగం కాస్త, కూస్తో అందరికి తెలిసిన సంస్థలవే కావడం విశేషం.⇒ ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైఎస్సార్సీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది.⇒ అలాగే మరో సీనియర్ పాత్రికేయుడు ఇండియా టుడే లో ఒక వ్యాసం రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా ప్రభావితం చేస్తున్నాయని, అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని అభిప్రాయపడ్డారు. పివిఎన్ శర్మ అనే సీనియర్ జర్నలిస్టు డిల్లీ నుంచి ఒక పోస్టు పెడుతూ వలంటీర్ల వ్యవస్థ వైఎస్సార్సీపీకి బాగా ఉపకరించిందని పేర్కొన్నారు. టీడీపీ సృష్టించిన వివాదంతో రాజీనామా చేసిన వేలాది మంది వలంటీర్లు తమ పరిధులలోని వివిధ వర్గాల ప్రజలను ఉదయం, సాయంత్రం ఓటింగ్ నిమిత్తం సమీకరించారని తెలిపారు. సాయంత్రం వేళ పోలింగ్ పెరగడానికి వారే కారణమని ఆయనతో పాటు మరికొందరు విశ్లేషించారు.⇒ వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చిన టీడీపీ మద్దతుదారుల హడావుడిని గమనించిన మీదట అప్పటి వరకు ఓటు వేయకుండా వేచి ఉన్న మహిళలు, పేదవర్గాల వారు సాయంత్రం పోలింగ్ బూత్లకు వెళ్లి ఓట్లు వేశారని, దానివల్లే ఓట్ల పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన పోలింగ్ శాతం పన్నెండు శాతం వరకు ఉండవచ్చట. ఇది కూడా నిర్ణయాత్మకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీనవర్గాలు అధికంగా ఉండడం వైఎస్సార్సీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.⇒ కాగా కొన్నిచోట్ల పోలింగ్ అధికారులలో కొంతమంది వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలని పోలింగ్ను ఆలస్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దు పోయేవరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. ఉదాహరణకు తెనాలి నియోజకవర్గంలో గుదిబండివారి పాలెంలో అర్ధరాత్రి అయినా ఒక్కరు కూడ కదలకుండా ఓట్లు వేసి మరీ వెళ్లారని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఇక బెట్టింగ్ల వారిది మరో కథ. వారు కావాలని పందాలకు పలువురిని ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేశారని సమాచారం వస్తోంది. ఉదాహరణకు కొద్ది నెలల క్రితం ఈ బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్సీపీకి ఏభైమూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తే, అది నిజమేనని నమ్మి టీడీపీకి చెందినవారు పందాలు కాయడానికి ఉత్సాహపడ్డారట. ⇒ ఆ తర్వాత క్రమేపి ఆ సంఖ్యను మార్చుతూ వైఎస్సార్సీపీకి 86-88 సీట్లు వస్తాయని వారు పేర్కొన్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. వైఎస్సార్సీపీకి అధికారం వస్తుందని చెప్పడమే కదా! కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంకు చెందిన మిత్రుడు ఒకరు కొద్ది రోజుల క్రితం కలిశారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని ప్రచారం జరిగింది. అక్కడ పరిస్థితి ఏమిటని అడిగితే అతను జవాబిస్తూ చాలా చోట్ల ఇలాగే ప్రచారం జరుగుతోందని, ఇదంతా బెట్టింగ్ రాయళ్ల పని అని అన్నారు.⇒ తమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇరవైవేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, కానీ టైట్ అని ప్రచారం చేస్తే రెండు పార్టీలకు చెందినవారు పందాలు కాస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అది నిజమేనని అనిపించింది. ఎందుకంటే ఏపీలో పలు నియోజకవర్గాలపై ఇలాంటి పందాలు సాగుతున్నాయి. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా అన్నదానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజికవర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అబిప్రాయపడ్డారు.⇒ జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ పడేశారని బాధ పడుతున్నవారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్సార్సీపీవారు అడుగుతున్నారు. అంతేకాదు టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలియదు.⇒ ఇంతవరకు సుమారు ముప్పైకి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండ వాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014 లో మరో వర్గం, 2019 లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.⇒ ఏది ఏమైనా ప్రజాభిప్రాయం వైఎస్సార్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అనుకూలంగా ఉందన్నది ఎక్కువమంది నమ్మకం. బలహీనవర్గాలు, మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఓటు బ్యాంకు అయ్యారని వారు చెబుతున్నారు. ఎక్జిట్ పోల్ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ సిక్స్ కు జనం కొంతైనా ఆకర్షితులు అయి ఉంటారని, అంతేకాక తాము లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్దపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా? వద్దా? అనే దానిపైనే జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి vs చంద్రబాబు కాదని ఆయనే అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఈ ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్సార్సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఆ వీడియో ఫేకా? ఒరిజినలా?: మంత్రి అంబటి
సత్తెనపల్లి: ‘పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో దారుణాలు జరిగాయి. అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ మూకలు పేట్రేగిపోయాయి. బూత్ క్యాప్చరింగ్ చేశారు. దొంగ ఓట్లు వేసుకున్నారు. ఈవీఎంలను పగులగొట్టేందుకు యత్నించారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనుకున్న ఓటర్లను అడ్డుకున్నారు. కొట్టి బయటకు పంపించారు. వీటన్నింటిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు అధికారులకు, ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి స్పందనా లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉన్నట్లుండి చిత్రంగా ఒక వీడియో రిలీజ్ అయ్యింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం పగలకొడుతున్నట్లు అందులో ఉంది. దీన్ని ఎవరు లీక్ చేశారు? ఇది ఫేకా, ఒరిజినలా తేల్చాలి’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో అర్థం కావడం లేదన్నారు. వాస్తవంగా ఇలాంటిదేదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలని చెప్పారు. ‘దీన్ని లోకేశ్ ఎక్స్ (ట్విటర్)లో పెట్టారంట! ఎలా చేరింది లోకేశ్ ట్విటర్లోకి? ఈ వీడియో ఫేకా? ఒరిజినలా? కన్క్లూజన్ ఎవిడెన్సా.. కాదా.. ఆలోచించాలి కదా.. కలెక్టర్ అన్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన వారన్నా రిలీజ్ చేయాలి. వీరెవరూ కాకుండా ఇది డైరెక్ట్గా తెలుగుదేశ«ం అధినేత కొడుకైన లోకేశ్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్లింది?’ అని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అధికారులు, ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలగటం సహజం అని స్పష్టం చేశారు. ఒక వేళ అది నిజంగా జరిగి ఉంటే, సంబంధిత అధికారులు విడుదల చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకునేదన్నారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్ అనిపిస్తోందని చెప్పారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలి‘పాల్వాయిగేట్ బూత్లో టీడీపీ మూకలు ఎంత దారుణంగా వ్యవహరించారో పిన్నెలి రామకృష్ణారెడ్డి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అది నేను కూడా మీకు చూపిస్తా (వీడియో ప్రదర్శించారు). వైఎస్సార్సీపీకి చెందిన వారని భావిస్తున్న ఓటర్లు ఆ బూత్లోకి వెళ్లి స్వేచ్ఛగా ఓటు వేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి. బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిపోర్టు చేశారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీకీ అనుకూలమైనటువంటి బూత్ల దగ్గర గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి. ఇది వాస్తవం. చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా నియోజకవర్గంలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి టీడీపీ వాళ్లు ఓట్లు వేసుకున్నారు. వెట్ క్యామ్ ఓపెన్ చేయండి అంటే పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలూ లేవు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టారని ప్రచారంలో ఉన్న వీడియో ఫేక్ వీడియోనా? కరెక్ట్ వీడియోనా? కరెక్ట్ వీడియో అయితే లోకేశ్ దగ్గర ఎలా రిలీజ్ అయ్యింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంది? నేరం చేసినట్టుగా భావించేలా అలా ఫేక్గా చేయడం తప్పు. నిజంగా నేరం చేసిన వారిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేం ఆందోళన చెందుతున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ను ఎలక్షన్ కమిషన్ బయట పెట్టాలి. ఒక చోట కాదు.. అనేక చోట్ల మేం ఫిర్యాదు కూడా చేశాం. ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలి’ అని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలపై తాము ఈసీకి అనేక రకాలుగా ముందస్తుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తుదకు ఆ అక్రమాలను అందరూ కళ్లారా చూడటంతో కొందరు అధికారులను సస్పెండ్ చేశారని, మరికొందరిని మార్చారని చెప్పారు. తద్వారా తప్పు జరిగిందనే భావన సర్వత్రా వ్యాపించిందన్నారు.రీ పోలింగ్ పిటిషన్పై నేడు విచారణపల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడ్డారు. వెబ్ కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్ జరపాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో రీ పోలింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. -
‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
సాక్షి, నరసరావుపేట / రెంటచింతల: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్ బూత్లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడులు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసీకి మొర పెట్టుకున్నా... పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్కే విధులు కేటాయించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది.. పాల్వాయి గేట్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్ ‘ఎక్స్’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. 202 పోలింగ్ బూత్లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. ఈసీ డేటా భద్రమేనా?సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్ వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్ ఎక్స్ ఖాతా, టీడీపీ సోషల్ మీడియా గ్రూప్లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 53 గ్రామాల్లో దాడులుసాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట: పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి, పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు. వీడియోను మొబైల్లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు.. ఆ వీడియో వెనుక అసలు నిజాలు..⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. ⇒ పాల్వాయి గేట్లోని అన్ని బూత్లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్కు పాల్పడ్డాయి. ⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు. ⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు. ⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చెప్పారు. ⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?⇒ నారా లోకేష్ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.దాడి చేసి.. రిగ్గింగ్202 పోలింగ్ బూత్లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్ బూత్ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. –చింతా సుబ్బారావు, ఇన్చార్జి సర్పంచి,వైఎస్సార్సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..⇒ మాచర్ల రూరల్ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు ⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు ⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి ⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి ⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట ⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు. ⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. ⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. ⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. ⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. ⇒ చిలకలూరిపేట: అప్పాపురం -
చంద్రబాబు పాలనలో ప్రశాంతత ఎక్కడిది?
ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి రంగం సిద్దమైంది. ఒక రకంగా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిమోహన్ రెడ్డికి మళ్లీ ఓటు వేయవలసిన అవసరం ఉందా? లేదా? అన్నదే కీలకమైన చర్చ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లు చేసిన కార్యక్రమాలు, విపక్ష నేతగా చంద్రబాబు అనుసరించిన విధానాలు, ఇద్దరి మధ్య ఉన్న వత్యాసాలు, ప్రజల పట్ల వీరికి ఉండే నిబద్దత, చెప్పిన మాటపై నిలబడే తత్వం మొదలైనవన్నీ ప్రజల ముందుకు పరీక్షకు వస్తాయి. వీటన్నిటిని ఆలోచించి ఓటర్లు ఒక నిర్ణయానికి వస్తే సముచితంగా ఉంటుంది.⇒ బహుశా ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి చర్చించుకుంటున్నారు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుల మధ్య ఉన్న తేడా గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విశ్వసనీయతకు నిలువుటద్దంగా కనిపిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అన్న పదమే తన నిఘంటువులో లేనట్లు ప్రజల ముందు నిలబడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అబద్దాలు చెప్పడం చాతకాదు.. చంద్రబాబుకు నిజాలు చెప్పడం చాతకాదు అంటే ఆశ్చర్యం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన మనిషి అయితే చంద్రబాబు నాయుడు మానిప్యులేషన్స్, మానేజ్మెంట్ నైపుణ్యం ద్వారా ఎదిగిన వ్యక్తి.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పేదల పట్ల అపారమైన అనురక్తి ఉందని పలుమార్లు రుజువైంది. తన పాదయాత్రలో కానీ, ముఖ్యమంత్రి అయ్యాక తన టూర్లలో కానీ ఆయన పేదలు, వృద్దులు, అనారోగ్యానికి గురైనవారిని దగ్గరకు తీసుకునే తీరు ఇందుకు అద్దం పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు అయితే పెత్తందార్లకు ప్రతినిధిగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత పేదలకు ఇవ్వరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ఎప్పుడూ, ఎక్కడా అనుచితంగా వ్యవహరించలేదు. వ్యాఖ్యలు చేయలేదు. పైగా వారందరిని నా.. నా.. నా.. అని పిలుచుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నించారు.⇒ నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే పవిత్ర ఆలయంలోకి వచ్చి ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. మత్స్యకారుల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాగ్దానం ఇస్తే నిలబెట్టుకోవడానికి తాపత్రయపడతారు. చంద్రబాబు అయితే ఎన్నికల తర్వాత అసలు ఆ వాగ్దానం తానెప్పుడు చేశానన్నట్లు మాట్లాడతారు. అవసరమైతే అన్ని హామీలు ఎక్కడ అమలు చేస్తామని ప్రశ్నిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను మంచి చేశానని అనుకుంటే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలకు పిలుపు ఇస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్లను బెదిరించి ఓటు అడుగుతారు. తాను వేసిన రోడ్డు మీద నడుస్తారు.. తాను ఇచ్చిన టాయిలెట్ వాడతారు.. ఇంకొకరికి ఎలా ఓటు వేస్తారు? అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరుస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఉన్న రాజధాని 29 గ్రామాలలోని తన వర్గం వాళ్లకు, తన పార్టీ వారికి ఎలా ఉపయోగపడాలా? అని ఆలోచిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిది రియల్ డెవలప్ మెంట్ విజన్ అయితే చంద్రబాబుది రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ విజన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒక్క లక్షలమందికి ఇళ్ళ స్థలాలు, ఇరవై లక్షల ఇళ్లునిర్మించడం ద్వారా సుమారు పది లక్షల కోట్ల సంపదను పేదవారికి సృష్టిస్తే, చంద్రబాబు అమరావతిలో కొద్దివేల మందికి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా కోట్ల రూపాయల సంపద సృష్టించి, అదంతా ఏపీకోసమే అని బుకాయిస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత' రాష్ట్రం కష్టాలలో ఉంది.. నేను అది చేయలేను.. ఇది చేయలేను.. నేను చాలా కష్టపడుతున్నాను.." అంటూ ఇలాంటి సానుభూతి మాటలు చెప్పలేదు. తాను చేయగలిగింది చేసుకుంటూ ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. అదే చంద్రబాబు విభజిత ఏపీలో తన ఐదేళ్ల పాలనలో నిత్యం రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉంది.. తాను ఇరవైనాలుగు గంటలు శ్రమిస్తున్నాను.. ప్రజలు సహకరించాలి.. విరాళాలు ఇవ్వాలి. రాజధానికి ఇటుకలు కొనాలి.. అంటూ ఎప్పుడూ ఆయన ఏడుపుకొట్టు మాటలు మాట్లాడి ప్రజలను విసిగించేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అభివృద్ది ద్వారా మూడు ప్రాంతాలు వికసించాలని చెబుతారు. చంద్రబాబు ఒక్క అమరావతి గ్రామాలలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అంటారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా రాజధానులపై తన అభిప్రాయాన్ని ఒకే రకంగా చెబుతారు. అదే చంద్రబాబు అయితే ఒక్కోచోట ఒకరకంగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కలల రాజధాని అమరావతిని రక్షించడానికే వచ్చారని చంద్రబాబు విజయవాడ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. విశాఖ, తిరుపతి ప్రాంతాలలో మాత్రం అమరావతి ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలంటీర్ల వ్యవస్థను తెచ్చి దానిపైనే కట్టుబడి ఉండి ప్రజలందరికి ఇళ్ల వద్దే సేవలు అందించారు. చంద్రబాబు వలంటీర్లపైన నీచమైన విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని అంటారు. పైగా పదివేల రూపాయల వేతనం ఇస్తానని మభ్య పెట్టే యత్నం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఎంత వ్యయం అవుతుందో స్పష్టంగా వివరించారు. చంద్రబాబు పొరపాటున కూడా తన హామీలకు ఎంత వ్యయం అయ్యేది చెప్పకుండా జనాన్ని మాయ చేయాలని చూస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తారు. ఎన్నికల సమయం వచ్చేసరికి తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినదానికన్నా మూడు రెట్లు అదనంగా ఇస్తానని ప్రజలను నమ్మించాలని చూస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2019 మానిఫెస్టో, కొత్త మానిఫెస్టో చూపించి తాను ఏమి చేసింది వివరించుతారు. చంద్రబాబు ఎప్పుడూ 2014 నాటి మానిఫెస్టో ఊసే ఎత్తరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని దూషించరు. ఉదాహరణకు చంద్రబాబుతో కుమ్మక్కై సోనియాగాంధీ దారుణమైన అక్రమ కేసులు పెట్టించినా ఎన్నడూ ఆమెను ఒక్క మాట అనలేదు. అలాగే ప్రధాని మోదీతో కూడా సత్సంబంధాలే కోరుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అని అంటారు. చంద్రబాబు మాత్రం తాను జాతీయ నాయకుడనని భ్రమపడుతుంటారు.⇒ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక విమానాలలో తిరిగి మోదీకి పోటీగా కాంగ్రెస్ తో కలిసి కూటమి కడతారు. కూటమి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ను గాలికి వదలివేస్తారు. మోదీని టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఎలుతాడని అంటారు. విదేశాలలో సైతం మోదీ వల్ల పరువు పోయిందని చెపబుతారు. కానీ మోదీనే మళ్లీ ప్రధాని అయ్యేసరికి యుటర్న్ తీసుకుని కాళ్లావేళ్లపడి ఆయనతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు మోదీ విశ్వగురు అయ్యారని పొగుడుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన అభివృద్దిని పూర్తి స్థాయిలో చెప్పుకోరు. ఉదాహరణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ తయారి ప్లాంట్, బద్వేల్ లో సెంచరీ ప్లై వుడ్ ప్లాంట్, విశాఖలో అదానీ డేటా సెంటర్.. ఇలా అనేక పరిశ్రమలు వచ్చినా ఆయన రోజూ ప్రచారం చేసుకోరు. కానీ చంద్రబాబు మాత్రం అసలు పరిశ్రమలే రాలేదని, అభివృద్ది లేదని డబాయించి ప్రచారం చేస్తుంటారు.⇒ ఆయన టైమ్లో వచ్చిన ఒక్క కియా ప్లాంట్నే ఎల్లవేళలా ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు టైమ్ లో ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే యత్నం జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆస్పత్రి, నిపుణుల నియామకం, పరిశోధనతో పాటు 700 కోట్లతో శుద్ది చేసిన సురక్షిత నీరు సరఫరా స్కీమ్ అమలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానిచ్చిన వాగ్దానాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలు ఇస్తే, చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. అందులో కూడా అత్యధికం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీములనే కొనసాగించి అదనంగా మరింత ఇస్తానని చెబుతారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల విద్యకు, ప్రభుత్వ స్కూళ్ల బాగుచేతకు ప్రాధాన్యం ఇస్తుంటే, చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెబుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దితే, చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. విద్య, వైద్యం ప్రైవేటు రంగానికి అప్పగించి వారికి లాభాలు సమకూర్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినన్ని స్కీములు, కొత్త వ్యవస్థలు మరే ముఖ్యమంత్రి తీసుకు రాలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శిబిరాలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం వంటివి తీసుకువస్తే చంద్రబాబు ఎన్నడూ ఆ దిశగా యోచించలేదు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అంత విజన్ ఉంది.. ఇంత విజన్ ఉంది అని గొప్పలు చెప్పుకోకపోయినా, అనేక వ్యవస్థలను సృష్టించి తన విజన్ ఏమిటో ప్రజలకు తెలియచేశారు. చంద్రబాబు తనకు 2020 విజన్, 2037 విజన్ అంటూ ఆయా చోట్ల కాపీ కొట్టిన విషయాలను తనవిగా ప్రచారం చేసుకుంటూ తాను చాలా గొప్పవాడినని భ్రమపడుతుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకు వచ్చిన స్కీములన్నిటిని ఆయనే చెప్పలేరు. ఎందుకంటే ఆ స్థాయిలో, అంత సంఖ్యలో పథకాలు తెచ్చి అమలు చేసి తన సమర్థత ఏమిటో ఏపీ ప్రజలకు చూపించారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, తదితర స్కీముల ప్రస్తావన వస్తే ఠక్కున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారు. కానీ చంద్రబాబు తనది ఫలానా స్కీము అని చెప్పుకునే పరిస్థితి లేదు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లపాటు ప్రశాంతంగా పాలన సాగితే, చంద్రబాబు కక్షపూరిత పాలన అని, విధ్వంసం అని, వినాశనం అని దుర్మార్గ ప్రచారం చేస్తుంటారు. తన టైమ్లో అమరావతి పేరుతో ముప్పై ఐదు వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని విధ్వంసం చేస్తే మాత్రం అది గొప్ప విషయం అని ఊదర గొడుతుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరకంగా స్వయం ప్రకాశం అయితే చంద్రబాబు ఎవరో ఒకరిపై ఆధారపడి పదవిలోకి వస్తుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాలు, నష్టాలకు ఓర్చి, పెద్ద, పెద్ద రాజకీయ తిమింగలాలను ఎదుర్కుని నిలబడితే, చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, కూటమి ఎత్తులు, జిత్తులపై ఆధారపడి రాజకీయం చేస్తుంటారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కష్ట జీవి అయితే, చంద్రబాబు కష్టపడుతున్నట్లు నటించే జీవి అని చెప్పాలి. అబద్దాలు ఆడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడరు. చంద్రబాబు అలవోకగా అబద్దాలు ఆడగలరు. అసత్యాలను సృష్టించగలరు. అందుకు ఉదాహరణే లాండ్ టైటిలింగ్ చట్టంపై లేనిపోని ఒక మోసపూరిత కల్పిత వదంతులను సృష్టించి జనంలోకి వదిలారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులను కూడా దూషించరు. చంద్రబాబు ప్రతి చోట తన ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను నోటికి వచ్చినట్లు దూషిస్తుంటారు. అదే టైమ్లో తనను ఎవరైనా ఏదైనా అంటే ప్రజల కోసం పడతానంటూ కొత్త డ్రామా ఆడుతారు. రాజకీయ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎవరితో నైనా కలవడానికి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానకి సిగ్గుపడరు. అంతకు ముందు బండబూతులు తిట్టుకున్నా, ఏ మాత్రం ఫీల్ కారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు, లేదా వ్యక్తుల మేనేజ్మెంట్ తెలియని వ్యక్తి అయితే, చంద్రబాబు అచ్చంగా వ్యవస్థలు, మీడియాను మేనేజ్ చేసే నిపుణుడుగా పేరొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి.. చంద్రబాబు మీడియాపై ఆధారపడే మనిషి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఓడించలేమని భయపడే చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీలతో పొత్తుపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ధైర్యంగా తన పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని జనంతోనే తన పొత్తు అని ధైర్యంగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య వయస్కుడైతే, చంద్రబాబు 75 ఏళ్ల వృద్దుడు. ప్రజలు తమకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మీ ఓటు.. విశ్వసనీయతకా? మోసానికా?
వైఎస్సార్సీపీ 2019 మేనిఫెస్టో..హామీ: వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కలి్పంచి.. రైతులకు దన్నుగా నిలుస్తాం. అమలు: రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నీతి ఆయోగ్ అత్యుత్తమ పథకంగా ప్రశంసించింది. ఐదేళ్లలో పంటలు దెబ్బతిన్న 54.76 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని అందించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి.. మార్కెట్లో ధరలేని పంటల ఉత్పత్తులు 21.73 లక్షల టన్నులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రూ.7,796 కోట్లను వెచ్చించి, రైతులకు అండగా నిలిచారు. తుఫాన్లు, అధిక వర్షాల వల్ల తడిచిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. పంట నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.3,261.61 కోట్లు అందించారు.హామీ: వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. చికిత్సల అనంతరం విశ్రాంతి సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా కింద ఆర్థిక సహాయం అందిస్తాం. అమలు: ఆరోగ్యశ్రీ కింద చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సల కోసం రూ.13,421 కోట్లు ఖర్చు చేశారు. విశ్రాంతి సమయంలో రోగులకు ఆరోగ్య ఆసరా కింద 24.59 లక్షల మందికి రూ.1,465 కోట్లను అందించారు. ఈ రెండు పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ మరో అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షల వరకూ పెంచారు. గతంలో ఇది రూ.5 లక్షల వరకే ఉండేది.హామీ: పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు అందిస్తాం. అమలు:ఇచ్చిన మాట మేరకు జగనన్న విద్యా దీవెన పథకం 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లను ఫీజురీయింబర్స్మెంట్గా చెల్లించారు. 2017–19 మధ్య చంద్రబాబు 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లను సీఎం జగన్ చెల్లించారు. జగనన్న వసతి దీవెన కింద 25.17 లక్షల మంది విద్యార్థులకు రూ.4,275.76 కోట్లను అందించారు. 2022–23 విద్యా సంవత్సరంలో గరిష్టంగా 1.80 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువు పూర్తిచేసుకున్న వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.హామీ: వైఎస్సార్ ఆసరా పథకం కింద ఎన్నికల రోజు వరకూ అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే అందిస్తాం. మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. అమలు: 2019, ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల మహిళలు 78.94 లక్షల మందికి ఉన్న రూ.25,570.90 కోట్లను నాలుగు విడతల్లో నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల మహిళలకు రూ.4,969.04 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.హామీ: జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి కలను నిజం చేస్తాం. అమలు: కరోనా మహమ్మారి ప్రభావం వల్ల లాక్డౌన్తో రెండేళ్లు పనులు చేయలేని పరిస్థితి. మిగతా మూడేళ్లలో రూ.35,268.05 కోట్లతో ఆరు ప్రాజెక్టులు (సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, లక్కవరం ఎత్తిపోతల, అవుకు సొరంగం, కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు–తొలి దశ) పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్.. డయాఫ్రమ్ వాల్తో మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి బ్రహ్మంసాగర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. పోలవరంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేసి.. గోదావరి వరదను మళ్లించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్పై కేంద్రం నిర్ణయం వెల్లడించడమే తరువాయి.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కోటి ఎకరాలకు నీళ్లందించి రైతుల సాగునీటి కలను నిజం చేశారు.హామీ: ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఆ స్థలాలను అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం. అమలు: ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మందికిపైగా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసి.. వాటిపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరుతోనే రిజి్రస్టేషన్ చేసి ఇచ్చారు. ఈ స్థలాల మార్కెట్ విలువ రూ.76 వేల కోట్లకుపైగానే పలుకుతోంది. అంతే కాకుండా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి.. ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతోపాటు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణంగా అందించారు. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేసి.. ఒక్కో లబి్ధదారుకు రూ.55 వేల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో లబ్ధిదారుకు రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ స్థిరాస్థితిని సమకూర్చారు.హామీ: బీసీల అభ్యున్నతికి ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వైఎస్సార్ చేయూత ద్వారా ఎంత అవసరమైతే అన్ని నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కలి్పస్తూ చట్టం తెస్తాం. బీసీ జనగణన చేసి.. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కలి్పంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. అమలు: బీసీల అభ్యున్నతికి చెప్పిన దాని కంటే అధికంగా నిధులు ఖర్చు చేశారు. డీబీటీ రూపంలో రూ.1.28 లక్షల కోట్లను బీసీ లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా జమా చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.52 వేల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్డీబీటీ కలిపి మొత్తం రూ.1.80 లక్షల కోట్లను బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేశారు. బీసీల్లోని ఉప కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆ వర్గాల వారినే చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారు. నామినేటెడ్ పనుల్లో, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చారు. బీసీ జనగణన చేయించి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతోపాటు ఇదే అంశంపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. శాశ్వత బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించారు. వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దుతానంటూ ఆ వర్గాలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు.హామీ: షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ.పది వేలు ఆర్థిక సహాయం చేసి తోడుగా ఉంటాం. అమలు: చెప్పిన మాట మేరకు ఐదేళ్లలో 3.37 లక్షల మందికి జగనన్న చేదోడు పథకం కింద రూ.1,260.17 కోట్లను సహాయంగా అందించి, తోడుగా నిలిచారు.హామీ: మగ్గం ఉన్న చేనేత కారి్మకుల కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలను ప్రోత్సాహకంగా ఇస్తాం. అమలు: వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 82,130 మంది మగ్గం ఉన్న చేనేత కారి్మకులకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.982.98 కోట్లను ప్రోత్సాహకంగా అందించారు.హామీ: కులవృత్తిదారులు, చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రూ.పది వేలు ఇస్తాం. అమలు: జగనన్న తోడు పథకం కింద 15.87 లక్షల మందికి సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చారు. సున్నా వడ్డీ కింద వారికి రూ.88.33 కోట్లు ఇచ్చారు.హామీ: వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తాం. అమలు: చెప్పిన మాట మేరకు 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు 33.15 లక్షల మందికి రూ.19,189.59 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. ఆదాయం పొందుతూ ఆర్థిక సాధికారత సాధిస్తూ సొంత కాళ్లపై నిలబడే దిశగా అడుగులు వేస్తున్నారు.హామీ: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా ఇస్తున్న రాయితీల (భూమి, పన్ను, విద్యుత్)తోపాటు ఏపీఐడీసీని పునరుద్ధరించి.. నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. అమలు: అధికారం చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్గా నిలుపుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏటా సగటున రూ.14,896 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీఐడీసీని పునరుద్ధరించారు. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) 1.9 లక్షల నుంచి ఏడు లక్షలకు చేరుకున్నాయి. 22.07 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల స్థాపనతో గత 59 నెలల్లోనే కొత్తగా 28.92 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అన్నీ కలిపి ఏకంగా 6,48,087 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది. హామీ ఇవ్వకున్నా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, పది ఇండ్రస్టియల్ నోడ్స్ నిర్మాణంతో పారిశ్రామికాభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు.హామీ: పార్లమెంటు నియోజకవర్గం యూనిట్గా ఒక జిల్లాను ఏర్పాటు చేసి.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తా. అమలు: 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిరి్మస్తున్నారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు.హామీ: ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి.. అదే ఊరిలోని పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అమలు: రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. సగటున 50 నుంచి 75 ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి.. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించి.. గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. వివిధ శాఖల్లో 2.31 లక్షల ఉద్యోగులను నియమించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. ఈ 59 నెలల్లోనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్ఎంఈలు, స్వయం ఉపాధితో కలిపి 58.22 లక్షల మందికిపైగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు.హామీ: ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తాం. విద్యా ప్రమాణాలు పెంచుతాం. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతాం. పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతాం. అమలు: నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేసే పనులను రెండు దశల్లో చేపట్టారు. తొలి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకున్నా సరే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే జగనన్న విద్యాకానుక పథకం కింద పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు సాక్స్లు అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం కింద మధ్యాహ్నం నాణ్యమైన భోజనంతోపాటు చిక్కీ ఇస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టనున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పిల్లలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), వైట్హౌస్ వేదికలపై రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానం, సంస్కరణలపై అనర్గళంగా ప్రసంగించడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. హామీ: వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 అందిస్తాం. అమలు: మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే అధికంగా.. ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఐదేళ్లలో రూ.67,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఈ పథకం కింద ఐదేళ్లలో 53,58,366 మంది రైతులకు రూ.34,378.16 కోట్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.హామీ: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.4 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంక్ల ద్వారా డీజిల్ పట్టుకునేటప్పుడు వారి చేతికి అందేటట్టు అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా చెల్లిస్తాం. అమలు: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.పది వేలకు పెంచారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఐదేళ్లలో 2.43 లక్షల మందికి రూ.538.06 కోట్లను అందించారు. డీజిల్ సబ్సిడీని అమలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా అందిస్తున్నారు.హామీ: అవ్వాతాతలకు పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి.. పెన్షన్ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూపోతాం. అమలు: ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధాప్య పెన్షన్ను రూ.2,000 నుంచి రూ.2,250కు పెంచే ఫైలుపై 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ తొలి సంతకం చేశారు. దశలవారీగా పెన్షన్ను రూ.3 వేలకు పెంచి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష చూపకుండా 66.34 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత 59 నెలల్లో పెన్షన్ రూపంలో రూ.90,590.6 కోట్లను పంపిణీ చేశారు.టీడీపీ కూటమి 2014 మేనిఫెస్టో..హామీ: అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తా. అమలు: రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేయకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2014, జూన్ 8న చంద్రబాబు మోసం చేశారు. వ్యవసాయ రుణాల మాఫీపై కోటయ్య కమిటీని వేసి.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో కోతలు పెట్టి రూ.15,297 కోట్లను మాత్రమే మాఫీ చేశారు. మిగతా రూ.72,315 కోట్లు మాఫీ చేయకుండా రైతులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. అమలు: టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల మహిళలు బకాయిపడ్డారు. ఆ రుణాల్లో ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు వంచించారు.హామీ: ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తా. అమలు: 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ కేవలం 32 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. రాష్ట్రంలోని కోటికిపైగా ఇళ్ల(కుటుంబాలు)కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కింద పైసా కూడా ఇవ్వలేదు. ఒక్కో ఇంటికి నెలకు రూ.2 వేల చొప్పున 60 నెలలకు రూ.1.20 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టి చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తా. అమలు: ఐదేళ్లలో పుట్టిన ఒక్క ఆడబిడ్డ పేరుతో ఒక్క పైసా కూడా డిపాజిట్ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు.హామీ: అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి.. పక్కా ఇళ్లు కట్టిస్తాం. అమలు: మూడు సెంట్లు స్థలం మాట దేవుడెరుగు.. కనీసం ఏ ఒక్కరికీ సెంటు స్థలం కూడా ఇవ్వకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఏటా రూ.పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ను అమలు చేస్తా. అమలు: ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను బీసీ సబ్ ప్లాన్ కింద ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. కానీ.. ఐదేళ్లలో రూ.36 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసి, అందులోనూ అవినీతికి పాల్పడి బీసీలను మోసం చేశారు.హామీ: చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ చేస్తా. అమలు: ఒక్క రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయకుండా చేనేత, పవర్లూమ్స్ కారి్మకులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: సింగపూర్ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతి నగరంలో, జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ నిర్మిస్తా. అమలు: సింగపూర్ను మించి అభివృద్ధి మాటేమోగానీ అడ్డగోలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. జిల్లా కేంద్రాల మాట దేవుడెరుగు కనీసం ఏ ఒక్క నగరంలో కూడా హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదిరాయి కూడా వేసిన పాపాన పోలేదు.హామీ: మహిళల భద్రతకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తా. ఆపదలో ఉన్న మహిళలకు సెలఫోన్ల ద్వారా 5 నిమిషాలలో సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటుచేస్తా. అమలు: ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ మహిళల మానప్రాణాలతో చెలగాటమాడటం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇసుక దోపిడీకి అడ్డుతగిలిన తహసీల్దార్ వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని లాగి, దాడిచేసినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.హామీ: పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తెస్తా. అమలు: విద్యా విధానంలో మార్పుల మాట దేవుడెరుగు కనీసం ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు ఇవ్వకుండా మోసం చేశారు. ఫీజు ఎంత ఉన్నారూ.35 వేలు మాత్రమే ఫీజురీయింబర్స్మెంట్ కింద ఇవ్వడం వల్ల విద్యార్థుల తల్లితండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడింది.హామీ: ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తా. అమలు: ఆరోగ్యశ్రీ పేరును ఎనీ్టఆర్ వైద్య సేవగా మార్చిన చంద్రబాబు.. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి యాజమాన్యాలు నిరాకరించాయి. దాంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు. ఆరోగ్యశ్రీ కింద చంద్రబాబు పెట్టిన రూ.600 కోట్ల బకాయిలను సీఎం జగన్ చెల్లించారు.హామీ: రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్ట నివారణకు రైతుల వారీగా బీమా సౌకర్యం కలి్పస్తా. అమలు: ధరల స్థిరీకరణ నిధి కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గిట్టుబాటు ధరలు దక్కక ధాన్యం, అపరాలు, ఉల్లి, టమాటా, మామిడి, బత్తాయి తదితర రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేశారు.హామీ: ప్రతి జిల్లాకూ, పట్టణానికి, మండలానికి, గ్రామానికి ఒక దార్శనిక పత్రం (విజన్ డాక్యుమెంట్)ను తయారుచేసి అభివృద్ధి చేస్తాం. అమలు: ప్రతి జిల్లా, పట్టణం, మండలం, గ్రామం అభివృద్ధి మాటేమోగానీ.. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు బ్యాచ్ అధోగతిపాలు చేశాయి.హామీ: అవినీతిరహిత సుపరిపాలన, పాలనలో పారదర్శకత తెస్తా. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా. అమలు: అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ను అవినీతిలోనూ చంద్రబాబు అగ్రగామిగా నిలిపారు. చంద్రబాబు మానసపుత్రిక అయిన జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు లంచాల కోసం ప్రజలను పీడించాయి.హామీ: కొత్తగా కళింగపట్నం, నరసాపురం ఓడరేవు, నిజాంపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులను నిరి్మంచి, పాత పోర్టులతో అనుసంధానం చేస్తూ ఇండ్రస్టియల్ క్లస్టర్స్ను అభివృద్ధి చేస్తా. అమలు: ఐదేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పోర్టు నిర్మాణ పనలు కూడా చంద్రబాబు ప్రారంభించలేదు. ఇండ్రస్టియల్ క్లస్టర్స్ను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.హామీ: వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్స్ (ర్యాపిడ్ రైల్వే ట్రాన్స్పోర్టు వ్యవస్థ)ను ప్రవేశపెడతాం. అమలు: బుల్లెట్ ట్రైన్స్ పేరుతో ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఎన్నడూ ఆ మాట ఎత్తడానికి కూడా సాహసించలేదు.హామీ: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తా. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేస్తాం. అమలు: కమీషన్ల కక్కుర్తితో జాతీయ పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019, ఏప్రిల్ 1న రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున నిధులు దోచేశారు. దాంతో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు.హామీ: కేంద్రం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టింది. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధానిగా ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తా. అమలు: ప్రపంచస్థాయి నగరం మాటేమోగానీ.. ఆ ముసుగులో ఓత్ ఆఫ్ సీక్రసీని తుంగలో తొక్కి.. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి అంతర్జాతీయ స్థాయి భూ కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారు. అమరావతిలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని నిరి్మంచలేకపోయారు. కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కలి్పంచలేకపోయారు. -
'విద్యావంతుడినంటావ్'..! ఇదేనా తెలివి.. శ్రీభరత్!!
సాక్షి, విశాఖపట్నం: విద్యావంతుడినంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్.. ఎన్నికల్లో గెలవలేనని తెలిసి రోజురోజుకీ దిగజారిపోతున్నారు. అక్రమాలకు కేరాఫ్గా మారిన దివంగత తాత అడుగు జాడల్లోనే నడుస్తూ.. తన సొంత వర్సిటీ కోసం దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు కేంద్రంగా మారిన ఏయూలో ఈవీఎంలు భద్రపరచొద్దంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈవీఎంల రక్షణ వలయం గురించి తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతనే తప్పుపడుతున్న ఆయన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏయూపై ఈసీకి లేఖతో కలకలం!తాజాగా రిటర్నింగ్ అధికారికి రాసిన ఒక లేఖ భరత్ బేలతనాన్ని, అవివేకాన్ని, తేటతెల్లం చేస్తుంది. భారత ఎన్నికల సంఘంపై కానీ, భారతదేశ ఎన్నికల ప్రక్రియపై కానీ భరత్కు ఎలాంటి నమ్మకం, విశ్వాసం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిస్తే వాటిని ట్యాంపరింగ్ చేస్తారని, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఈవీఎంలను మార్పు చేసేస్తారంటూ ఏకంగా రిటర్నింగ్ అధికారికి లేఖ రాయడం కలకలం రేపుతోంది.ఈ విషయం తెలుసా? అసలు పూర్వాపరాలేవీ తెలియకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం భరత్కు వారసత్వంగా వచ్చినట్లుందని అందరూ నవ్వుతున్నారు. వాస్తవానికి ఈనెల 13న జరిగే ఎన్నికల తరువాత ఈవీఎంలను ఏయూలో భద్రపరచాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఏయూ ప్రాంగణాన్ని వారు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఈవీఎంల భద్రపరిచే భవనంలోకి ఈగ కూడా చొరబడే వీలు లేకుండా అవసరమైన అన్ని చర్యలను దాదాపు నెల రోజుల నుంచి ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు.ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు ఏయూలోనే భద్రపరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అక్కడే సజావుగా నిర్వహిస్తున్నారు. ఇన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఏ ఒక్క ఓటు గానీ, ఈవీఎం, బ్యాలెట్ బాక్సు కానీ ట్యాంపరింగ్ జరగలేదు. అందుకే ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఏయూనే ఎంపిక చేస్తుందన్న విషయం తెలియకుండా చేసిన ఆరోపణలతో భరత్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈసీపై విశ్వాసం లేదా..?ఎన్నికల సంఘాన్ని దాని విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా శ్రీ భరత్ లేఖ రాశారు. ఈవీఎంల భద్రతకు పటిష్టమైన రక్షణ వలయంలో చుట్టూ సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కానీ, రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధీనంలో కానీ ఉండవు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరుస్తారు.వీటి జోలికి వెళ్లడం గానీ, వాటిని చూడడం కానీ, వాటిని ముట్టుకోవడం కానీ, వాటిని ట్యాంపరింగ్ చేయడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా.. ఎంపీ బరిలో రెండో సారి ఎలా పోటీ చేస్తున్నారంటూ విశాఖ వాసులు, విద్యావంతులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే తమ ఓటు వృథాగా మారినట్లేనని భావిస్తున్నారు. భరత్ రాసిన లేఖపై టీడీపీ నాయకులే మండిపడుతున్నారు.టీచర్లనీ మార్చేయ్యాలంట.?ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్ని మారిస్తే సరిపోదు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని కూడా మార్చేయాలి అని భరత్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లందరినీ కించపరిచేవిధంగా మాట్లాడటం కూడా భరత్ దిగజారుడు తనానికి నిదర్శమని చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే.. గీతం విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఆచార్యులను భరత్ బలవంతంగా భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో పాఠాలు చెప్పుకునే మమ్మల్ని ఇలా ప్రచారానికి తిప్పడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇవి చదవండి: ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ములాఖత్.. బండారం బద్దలైంది -
అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
తెలుగుదేశం కూటమి డబుల్ గేమ్ అనాలా? లేక దొంగ నాటకాలని అనలా? అమరావతి రాజధాని అంటే ఇతర ప్రాంతాల ప్రజలలో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా? బుధవారం నాడు తెలుగుదేశం కూటమి వివిధ పత్రికలలో ప్రచార ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ, కలికిరి రాక సందర్భంలో ఈ అడ్వైర్టైజ్ మెంట్ ఇచ్చారు. కేవలం విజయవాడ ప్రాంత ఎడిషన్లలో మాత్రం అమరావతి రాజధాని అని ప్రస్తావించి, ఇతర ప్రాంత ఎడిషన్లలో మాత్రం రాష్ట్ర వికాసానికి అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? అమరావతి రాజధాని అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలలో ప్రజలలో వ్యతిరేకత బహిర్గతమై, ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుందని భయపడడమే కదా!విజయవాడ పత్రికలలో ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది. 'మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి' అని ఉంది. అదే విశాఖపట్నం ఏరియాలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం అందుకు భిన్నంగా 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ...' అని రాశారు. అంటే విజయవాడకు మోదీ వస్తున్నది కేవలం అమరావతి గురించేనని అనుకోవాలా? రాష్ట్ర వికాసం కోసం కాదా? విశాఖకు అమరావతి కలల రాజధాని కాదని చెప్పడమే కదా! ఒకపక్క అమరావతితోనే అభివృద్ది అంటూ సొల్లు పురాణం చెప్పే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నారంటే వారికి తమపై తమకే నమ్మకం లేదనే కదా?ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా స్పష్టంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, తద్వారా వికేంద్రీకరణ జరిగి అభివృద్దికి బాటలు వేస్తుందని చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని ఆయన మానిఫెస్టోలో కూడా చెప్పారు. విశాఖ ఎక్జిక్యూటివ్ కాపిటల్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.విశేషం ఏమిటంటే ప్రముఖ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖ రాజధాని అయితే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. శ్రీభరత్ విశాఖ నుంచి టీడీపీ పక్షాన పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. ఆయన అమరావతి ఇప్పటికిప్పుడు అభివృద్ది కాదని, ఇరవై ఏళ్లయినా పడుతుందని, విశాఖ అయితే ఆ ఇబ్బంది ఉండదని అన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అభ్యర్ధులు ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రచారం చేస్తున్నారని తేలిపోతోంది. నిజానికి అమరావతి రాజధాని అని గతంలో హడావుడి చేసినా తెలుగుదేశంను ప్రజలు ఓడించారు. చివరికి అమరావతి గ్రామాలు ఉన్న తాడికొండ నియోజకవర్గంలోను, మంగళగిరి నియోజకవర్గంలోను టీడీపీ ఓడిపోయింది.స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓటమిపాలయ్యారు. దానికి కారణం అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు జరిపిన భూదందానే. ఈ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టింది. ఇదంతా ఒక కులం వారికోసం, ముందస్తు సమాచారం ఆధారంగా భూములు కొని లాభపడ్డవారి కోసమేనని ఇక్కడి ప్రజలు కూడా అనుమానించారు. దాంతో అమరావతి రాజధాని అన్న కాన్సెప్ట్కు ప్రజామోదం లేకుండా పోయింది. అయినా 2019 తర్వాత కూడా రాజధాని రైతుల పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అండతో కల్పిత ఉద్యమాలను టీడీపీ నడిపింది. అయినా ఇప్పుడు అమరావతి అంటే జనం నమ్మడం లేదని గ్రహించి ఈ రకంగా డబుల్ గేమ్ ఆరంభించారని భావించాలి.అమరావతికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రచారం చేసేవారు. బీజేపీతో చెడ్డాక ప్రధాని మోదీ అమరావతికి ఏమీ ఇవ్వలేదని, చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారని కూడా ఆయన విమర్శించేవారు. అలాంటిది ఇప్పుడు కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి గాను ప్రజలు మోదీ రోడ్షో కు రావాలని కోరారు. గతంలో బీజేపీ నేతలు కూడా అమరావతి భూ స్కామ్ చాలా పెద్దదని విమర్శించేవారు. ఇప్పుడు మోదీ అమరావతికి ఏమైనా లక్ష కోట్ల నిధులు ఇస్తానని కూటమి నేతలకు హామీ ఇచ్చారా? అసలు ఏపీలో ఫలానా అభివృద్ది చేస్తానని మోదీ గ్యారంటీ ఇవ్వడం లేదు. అయినా వీరు మాత్రం ప్రజలను రకరకాలుగా మోసం చేయడానికి యత్నిస్తున్నారు.రాజమండ్రి, అనకాపల్లిలలో జరిగిన ప్రధాని సభలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయనపై నేరుగా అనివీతి ఆరోపణలు చేయలేదు. కాకపోతే జనరల్గా ఏవో కొన్ని విమర్శలు చేయాలి కాబట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతి అంటూ ఇంతకాలం టీడీపీ ఏమి ఆరోపిస్తుందో వాటినే ఆయన కూడా చెప్పి వెళ్లారు. విశేషం ఏమిటంటే మోదీ కానీ, అమిత్ షా కానీ చంద్రబాబు ఉపన్యాసం వినకుండానే నిష్క్రమించడం. బహుశా చంద్రబాబు మాటల మీద వీరికి నమ్మకం పోయిందేమో తెలియదు. మోదీని ఏపీకి తీసుకు రావడం ద్వారా తమకు పలుకుబడి ఉందని, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను సహేతుక కారణాలు చూపకుండానే బదిలీ చేయడం, నాలుగేళ్లుగా అమలు అవుతున్న స్కీముల ద్వారా లబ్ది దారులకు డబ్బు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వడం, వలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయడం, చంద్రబాబు ఎంత నీచంగా ఉపన్యాసాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో రాలేదు. అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా రాయబేరాలు సాగించి కాళ్లా, వేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవడానికే అని అర్దం అవుతుంది.తమపై ఉన్న కేసులు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు జాగ్రత్తపడడానికే అని ప్రజలంతా భావిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలోనే కాదు. పలు విషయాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల అంతా వినాశనమేనని గతంలో ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దారుణమైన ఆరోపణలు ఆ చిన్నస్థాయి వలంటీర్లపై గుప్పించారు. తదుపరి ఎన్నికల సమయానికి తాము కూడా వలంటీర్లను కొనసాగిస్తామని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తామని ప్రకటించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంక అవుతోందని చంద్రబాబు, పవన్ లు విమర్శించేవారు. కానీ వారి ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికన్నా మూడు రెట్ల వ్యయంతో సంక్షేమ స్కీములు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ మాత్రం అదేదో ప్రమాదకరమైనదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ చట్టం గురించి మోదీ, అమిత్ షా సభలలో మాత్రం నోరు విప్పరు.ఇన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్న, అబద్దాలు చెబుతున్న టీడీపీ కూటమికి ఎవరైనా ఓటు వేస్తే, వారి అబద్దాలకు ఆమోద ముద్ర వేసినట్లే అవుతుంది. చివరిగా ఒక మాట. పవన్ కల్యాణ్ పెద్ద కవి మాదిరిగా పర్వతం ఎవరికి తలవంచదు. సముద్రం ఎవరి కాళ్ల వద్దకు వెళ్లదు.. అంటూ సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ మోదీ పాల్గొన్న సభలో ఈయన వంగి, వంగి ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని విస్తుపరిచింది. ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ ఉన్నారని ప్రజలకు క్లారిటీ వచ్చింది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బాబు–మోదీ ఇద్దరూ తోడు దొంగలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని స్పష్టమైంది. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో టీడీపీ, బీజేపీలు జట్టుకట్టి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. హోదాను అటకెక్కించారు. హోదా వస్తే రాయలసీమ భవిత బంగారం అవుతుందనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త రాగం అందుకున్న చంద్రబాబు హోదాను మోదీకి తాకట్టు పెట్టారు. 2019 ఎన్నికల ముందు కేంద్రం మోసం చేసిందంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు.ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిగా జట్టుకట్టిన ఆ రెండు పారీ్టలు మళ్లీ రాయలసీమ ప్రజల్ని మోసగిస్తున్నాయి. ప్రధాని బుధవారం రాయలసీమలో ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ప్రత్యేక హోదాపై, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీపై మోదీని చంద్రబాబు కనీసం ప్రశ్నించలేదు. హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని అప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీతో కలిసి ప్రచారానికి ఎలా వచ్చారని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. గుండెకాయ లాంటి రాజధాని పోయింది. హైదరాబాద్ను కోల్పోవడంతో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపన వేగం పుంజుకుని రాష్ట్రం గాడిన పడుతుందని రాష్ట్ర ప్రజలు భావించారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయంపై మొరపెట్టుకుంటే ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీనిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే.. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే రాష్ట్ర ప్రజల ఆశల్ని చంద్రబాబు.. కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తన స్వార్థం చూసుకున్నాడు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించారు. ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది. అంతకంటే ప్యాకేజీతోనే మేలు.. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు’ అని 2017లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.2014లో కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అంతా ఆశపడ్డారు. ఆ సమయంలో కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు పూర్తిగా కేంద్రానికి లొంగిపోయారు. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజితో అంతకంటే మేలు చేస్తుందని కొత్తపల్లవి ఆలపించారు. ఆ ప్రకటనతో ఏపీ ప్రజలు అవాక్కయ్యారు. అతన్ని వ్యతిరేకించిన వారిని జైల్లో పెడతానని బెదిరించారు.సీమకు తీరని అన్యాయం.. రాయలసీమలో 69 శాతం భూమి సాగు ప్రాంతం కాగా.. మిగతా 31 శాతం భూమి పరిశ్రమలు స్థాపనకు అనుకూలం.1. పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు అందుబాటులో ఉన్నాయి. 2. సమీపంలో బెంగళూరు, కర్నూలు, కడప, తిరుపతి ఎయిర్పోర్టులు ఉన్నాయి. 3. ఎగుమతులు, దిగుమతులకు చెన్నై, గోవా, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులో ఉన్నాయి. 4. కృష్ణా, తుంగభద్ర నదుల్లో పుష్కలంగా నీరు ఉంది. హంద్రీ–నీవాతో వైఎస్సార్ రిజర్వాయర్లు నిర్మించారు.పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ‘హోదా’ వచ్చుంటే ‘సీమ’ రూపరేఖలే మారిపోయేవి. ‘సీమ’ అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేవి. నిజానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు, గరుడ స్టీల్స్, కియా మినహా పరిశ్రమల జాడ లేదు. ఇవి మినహా 2019 వరకూ వెయ్యి మంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ప్రస్తుత ప్రభుత్వం చొరవతో గ్రీన్కో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటు నిర్మిస్తోంది. దీంతో 25 వేల ఉద్యోగాలు రానున్నాయి.ప్రత్యేక హోదా వచ్చుంటే..1. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల్లో పూర్తి మినహాయింపు ఇస్తారు. 2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్80(సి) కింద కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. కేంద్రం కూడా 25–30 శాతం రాయితీ ఇస్తుంది. 3. పరిశ్రమల కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 4. 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్చార్జీలపై 50 శా>తం రాయితీ ఇస్తారు. 5. పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభిస్తుంది. ముడిసరుకు తీసుకెళ్లేందుకు, తయారీ వస్తువుల ఎగుమతి ఖర్చును కేంద్రం భరిస్తుంది.పరిశ్రమల ప్లాంట్లు, యంత్రాలపై పెట్టుబడిలో 30 శాతం రాయితీ వస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పాత పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. పరిశ్రమలు స్థాపించినవారికి 25–55 శాతం వెసులుబాటు ప్రత్యేక హోదాతో లభిస్తుంది. ఇలాంటి అవకాశాలతోనే ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. హోదా ప్రకటిస్తే భూములు, పారిశ్రామికీకరణకు యోగ్యంగా ఉన్న ‘‘సీమ’లో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడతాయి. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందేవి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలోనూ మోసమే.. విభజన చట్టంలో రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని విభజన చట్టంలో 46(ఏ), 46(బి)లో పేర్కొన్నారు. ఈ లెక్కన రూ.22,400 కోట్లు ఈ ప్రాంతాలకు 2014–2019లో మంజూరు చేయాలి. సెక్షన్ 46లో బుందేల్ఖండ్ అనే మాట తీసేసి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి పేరుతో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మనకు హక్కుగా రావల్సిన బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తే ప్రత్యేక ప్యాకేజితో పనిలేకుండా సీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టేవి. ఈ విషయంలో కూడా చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. అపారమైన ఖనిజం ‘సీమ’ సొంతం!రాయలసీమలో డోలమైట్, ఐరన్ఓర్, గ్రానైట్, యురేనియం, సిలికా, బైరెటీసీ, లైమ్స్టోన్, క్వారŠట్జ్తో పాటు ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. రామగిరి, జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్, వజ్రకరూరల్, తుగ్గలి మండలాల్లో వజ్ర నిక్షేపాలున్నాయి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే సీమలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటయ్యేవి. తాడిపత్రి, బేతంచెర్ల, కొలిమిగుండ్లలో నాపరాయి గనులు ఉండడంతో సిమెంట్ పరిశ్రమల స్థాపన పెరిగేది. హోదాతో వ్యవసాయాధారిత పరిశ్రమలకూ ఊతం..‘సీమ’కు హంద్రీ–నీవాతో ఏటా 40 టీఎంసీల జలాలు వస్తాయి. దీంతో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎక్కువ స్థాపించే అవకాశం ఉంది. వేరుశెనగ, పత్తి, పొద్దుతిరుగుడుతో పాటు హారి్టకల్చర్ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఆపిల్ మినహా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. దీంతో ప్రాసెసింగ్ ప్లాంటు, కాటన్ పరిశ్రమలు, చీనీ జ్యూస్ తయారీ పరిశ్రమ, వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు వ్యవసాయ, ఉద్యానపంటల ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా స్థాపించే అవకాశం ఉంది. దీంతో రైతులు పండించే పంట సులభంగా మార్కెట్కు చేరుతుంది. ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, నగరి, ఎమ్మిగనూరు, ఉరవకొండ, మాధవరం ప్రాంతాల్లో నేత కారి్మకులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కులు నిరి్మస్తే, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోదా వస్తే సంబంధిత పరిశ్రమలకు ఎక్కువగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మానవ వనరులు పుష్కలం!రాయలసీమలో జేఎన్టీయూతో పాటు ఎస్కేయూ, ఎస్వీ, రాయలసీమ, యోగి వేమన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ ఉంది. ఈ వర్సిటీల ద్వారా ఏటా వేలాదిమంది విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. వీరికి వృతినైపుణ్య శిక్షణ ఇస్తే పరిశ్రమలకు అవసరమైన మానవవనరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.రాయలసీమకు బాబు ద్రోహం!2014–19 మధ్య కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఆ ఐదేళ్లలో ప్రత్యేక హోదా వాణి విని్పంచలేదు. చంద్రబాబు ఏం చెబితే దానికి సీమకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తలూపారు. ‘సీమ’ భవిష్యత్తును బలిపెట్టారు. హోదా వస్తే పరిశ్రమలు స్థాపించిన వారికి మేలు జరుగుతుంది, నిధుల స్వాహాకు అవకాశం తక్కువ! ప్యాకేజీ వస్తే అంతా స్వాహా చేయొచ్చు! ఇదే సూత్రాన్ని చంద్రబాబు నమ్మి హోదాను కేంద్రం ముందు తాకట్టుపెట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. -
మహిళలంటే పవన్కు గౌరవం లేదు..
‘మహిళల్ని అన్ని విధాలుగా దోచుకోవడం... పై నుంచి కిందివరకూ అన్ని స్థాయిల్లో ప్యాకేజీలు తీసుకోవడం... తెలుగుదేశం పార్టీని గెలిపించడం తప్ప మరో సిద్ధాంతాలేవీ జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్కు లేవు. ఆ పార్టీలో ఎంతో ఉన్నతాశయంతో చేరిన నేను ఎంతగానో నష్టపోయా. అందులో పనిచేశాక ఆయన మనస్తత్వం తెలుసుకుని ఇక ఉండలేక బయటకు వచ్చేశా.’ అని ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరిన ఎన్ఆర్ఐ చిట్టె సుభాషిణి అన్నారు. జనసేన వల్ల తాను ఏవిధంగా నష్టపోయిందీ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...అమెరికా నుంచి వచ్చి అగచాట్లు..తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు దగ్గర సింగవరం గ్రామం మాది. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆయన ఉద్యోగరీత్యా 2011లో అమెరికా వెళ్లాం. నా భర్తకు మొదటి నుంచీ పవన్కల్యాణ్ అంటే పిచ్చి. ఆయన గురించి గొప్పగా ప్రచారం చేసే కొన్ని చానళ్లు, కొన్ని వీడియోలు నాకూ చూపించేవారు. నెమ్మదిగా నేను కూడా ఆయన అభిమానిగా మారాను. ఆ పిచ్చితోనే ఉద్యోగం సహా అన్నీ వదిలేసుకుని ఇండియా వచ్చేసి జనసేన పార్టీలో చేరిపోయాను.పేరుకే జనసేన... టీడీపీ గెలుపే దాని లక్ష్యం!తూర్పు గోదావరి జిల్లాలోని ముఖ్య నియోజకవర్గమైన గోపాలపురం వేదికగా జనసేన పార్టీతో నా అనుబంధం మొదలైంది. నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ తరపున ప్రచారం చేశాను. ఆ క్రమంలోనే నాకు ఆ పార్టీలో పరిస్థితులు అర్థమయ్యాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీడీపీ కోవర్టు. అతడే కాదు జనసేన ముఖ్యనాయకులందరూ అంతే. నాలా జనసేన కోసం నిస్వార్థంగా, చిత్తశుద్ధితో పనిచేసే వారిని అడ్డుకోవడమే వారి ధ్యేయం. ఐదేళ్లు పార్టీకోసం నిరంతరం పనిచేసినా ఏ చిన్న పదవి కూడా నాకివ్వలేదు.దళితులంటే చిన్నచూపు..ఆ పార్టీలో ప్రతి ఒక్కడూ నాయకుడే అన్నట్టు ప్రవర్తించేవారు. నేను పవన్తో ఫొటో దిగాలంటే రూ.2 లక్షలు డొనేషన్ అడిగారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీలో దళితుల్ని ఎదగనీయకుండా చేయడమే వారి ఆలోచన. అందుకే నా లాంటి దళిత మహిళ అభ్యర్థి ని ప్రోత్సహించాలనే ఆలోచన చేయ లేదు.వీర అంటూనే... వేధిస్తారు!వీరమహిళ అనే గొప్ప పేర్లు పెడతారు. కానీ అదంతా మోసం. అయినా వీర మహిళలమేమిటి? ఇలాంటి పైపై మెరుగులు ఆపాదిస్తే ఏమీ ఆశించకుండా అలా పడి ఉంటారనీ, మొగుళ్లని ఇళ్లను వదిలేసి తమ వెనుక తిరుగుతారని భ్రమలు కల్పిస్తారు. అంతేగాదు పవన్కి ఎంత మహిళాదరణ ఉందో అంటూ అందరూ అనుకోవాలని మాత్రమే తప్ప మహిళలకి ఎటువంటి ఆదరణ లేదు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేని మహిళకి అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. నన్ను ఎన్నో రకాలుగా వేధించారు. శారీరకంగా, ఆరి్థకంగా దోచుకో వాలని చూశారు.రియల్ లీడర్ వైఎస్ జగన్..అమాయకుల అభిమానాన్ని అడ్డం పెట్టు కుని పవన్లా పావలా.. పరకా పోగేసుకోవడం నాయకత్వం అనిపించుకోదు. నాయకుడు అంటే సామాన్యులను కూడా నాయకులుగా మార్చాలి. ఆ సత్తా వైఎస్ జగన్కు మాత్రమే ఉంది. చిన్న చిన్న వారిని కూడా ఆయన గెలిపించుకున్నారు. అప్పట్లో నేను చేసిన తప్పు ఏమిటంటే వైఎస్సార్సీపీని అసలు గమనించలేనంతగా జనసేన పిచ్చిలో కూరుకుపోవడం. వీరుడైనా, శూరుడైనా ప్రజానాయకుడు అన్నా జగన్కు మాత్రమే నప్పుతుంది. ఆయన నాయకత్వంలోనే మహిళలకు మంచి జరుగుతుంది.కుటుంబాన్ని వదిలేసి పార్టీకోసం పాటుపడ్డా..నా సొంత ఖర్చులు పెట్టుకుని పిలల్ని, భర్తని హైదరాబాద్లో వదిలేసి తూర్పు గోదావరి జిల్లాలో కాళ్లరిగిపోయేలా తిరిగాను. అవసరమైన సమయంలో పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల వారికి మాటలు కూడా సరిగా రాలేదు. గుండె పగిలిపోయేంత ఆవేదనతో చెబుతున్నా. నా ఉసురు తప్పకుండా పవన్కి తగులుతుంది. రూ.కోటిన్నరకి పైగా డబ్బు కోల్పోయాను. అయినా పవన్ పిచ్చి వదలని నా భర్తతో కూడా గొడవలు పడాల్సి వచ్చింది. జనసేన పార్టీలో నేనెన్ని అవమానాలు భరిస్తున్నానో విడమరిచి చెప్పాను. ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు. -
Modi-CBN: దొందూ దొందే!
సాక్షి, అమరావతి: అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఇదీ చంద్రబాబు నైజం.. అయిదేళ్ల కిందట ప్రధాని మోదీని ఇష్టానుసారం తిట్టారు... ఆయన కుటుంబం గురించీ వ్యక్తిగత విమర్శలు చేశారు.. ప్రధాని మోదీ సైతం చంద్రబాబు వైఖరికి భిన్నం కాదని ఇప్పుడు నిరూపించుకున్నారు.. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని రాజమండ్రిలో తన హావభావ విన్యాసాలతో కాస్త వ్యంగాన్ని జోడించి నాడు ఎగతాళి చేశారు.. ఎద్దేవా చేశారు.. చంద్రబాబు అక్రమాలకు అంతులేదన్నారు. చంద్రబాబు అవినీతిని మోదీ దుమ్మెత్తి పోస్తే.. మోదీపై టెర్రరిస్టు ముద్ర వేసి, అలాంటి వ్యక్తిని ఇంకా అరెస్టు చేయకుండా ఎందుకు వదిలేశారని... చంద్రబాబు గతంలో తెగ రంకెలేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నికల సమయం.. వీరిద్దరూ కలిసిపోయారు.. గతాన్ని మరిచిపోయారు.. లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారు కాబోలు. చంద్రబాబు స్క్రిప్టులో ఓ ముక్కను మోదీ నోట పలికిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే కారణమని తెలిసినా.. అదే రాజమండ్రి వేదికగా జనం నవ్వుకునేలా ఆ నెపాన్ని ప్రధాని మోదీ జగన్ ప్రభుత్వంపై వేయడం హాస్యాస్పదం. ఐదేళ్ల వెనక్కి వెళ్తే.. రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ప్రధాని మోదీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న కాలంలో అమరావతి నుంచి పోలవరం వరకు ఆయా కార్యక్రమాలను కేవలం తన ఆస్తులు పెంచుకోవడానికి కోసం ప్రయతి్నంచారని బాబును మోదీ దుమ్మెత్తిపోశారు.... ప్రతిగా చంద్రబాబు సైతం మోదీపై ఇప్పటి దాకా దేశంలో మరే రాజకీయ పార్టీ సైతం చేయనంతగా వ్యక్తిగత స్థాయిలో విమర్శలకు దిగారు.2018లో చంద్రబాబు ఏన్డీఏ నుంచి ని్రష్కమించాక ప్రధాని మోదీ అప్పట్లో రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండీ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నల్ల చొక్కాలు వేయించి, గో బ్యాక్ నినాదాలు చేయించారు. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ అప్పట్లో టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు.ఆ సందర్భంగానే మోదీ చంద్రబాబును ఉద్దేశించి చేసిన ప్రసంగాల వీడియోలు సోషల్మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ వారిద్దరి ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తున్నాయి. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారనీ అప్పట్లో ప్రధాని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను తమకు కావాల్సినప్పుడు డబ్బులు డ్రా చేసిపెట్టే ఏటీఎం లాగానే చంద్రబాబు ఉపయోగించుకున్నారని ప్రధాని ఆరోపించారు.ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబుపై చేసిన విమర్శలు, ఆరోపణలు.. ‘లోకేష్ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదని అన్నారు. అవును నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయతి్నస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి (చంద్రబాబును ఉద్దేశించి) వాస్తవాలను వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్ధం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్ధం...’‘ప్రజలారా మీరే చెప్పండి.. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకున్నాయన (చంద్రబాబును ఉద్దేశించి) ఎన్టీఆర్ కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా...? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని హామీ ఇచ్చారా లేదా?.. ఈ రోజు ఆయన ఎన్టీఆర్కు గౌరవమిస్తున్నారా?... సోదర సోదరీమణులారా మీకు ఈ విషయం అర్ధమవుతుంది. ఆయనలాంటి(బాబు) సీనియర్ నాయకుడికి ఎందుకు అర్ధం కావడం లేదు. పార్టీ చరిత్రనే ఆయన మరిచిపోయేంతటి ఒత్తిడి ఏం వచి్చంది. ఇదంతా యువత తెలుసుకోవాల్సిన అవసరముంది.. ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అందువల్లే తెలుగుదేశం అవిర్భవించింది. ఈ రోజు ఆ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కోవాల్సిన తెలుగుదేశం అధినేత అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్ను దుష్టకాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అదే కాంగ్రెస్తో దోస్తీ కట్టారు...’2019 ఫిబ్రవరి 10... గుంటూరు సభలో ప్రధాని మోదీ..‘చంద్రబాబుకు ఏమైంది. ఆయన నా కంటే చాలా సీనియర్నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది. మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు.. అవును మీరు సీనియర్ కూటములు మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో.. ఈ రోజు ఎవరినీ తిడతారో.. రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో.. నేనైతే ఈ విషయాల్లో సీనియర్ను కానే కాదు...’‘కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై.. చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం...’2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీని ఉద్దేశించి వివిధ సందర్భాల్లో చేసిన తీవ్ర విమర్శలు... –మార్చి 29, 2018న అసెంబ్లీలో చంద్రబాబుబీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవి.. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్డీఏ నుండి బయటకు వస్తే.. అది రాజకీయ ప్రయోజనాల కోసం అని మాట్లాడుతున్నారు. నిజంగా నేను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే.. ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి...’ఫిబ్రవరి 8, 2019 తన ట్విట్టర్లో చంద్రబాబు‘దేశ రక్షణ రంగంలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ. 59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటుంటే, దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలను తెలియజేస్తుంది. మోదీజీ... మీరు దేశాన్ని మోసం చేస్తే ఆ సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు...’ –2019 ఫిబ్రవరి 2న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు..‘మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లే నయం. కాటన్ దొర ఇచి్చన నీళ్లయినా తాగుతున్నాం. మేము మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిరి్మస్తారా ? నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నానంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్షా రాకీయాల్లో వచ్చారు. నేను 1978లోనే నేను ఎమ్మెల్యేనయ్యా. ప్రధాని మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోతారా?..’‘రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకుని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి...’ –2018 జూన్ 9న నెల్లూరులో సభలో చంద్రబాబు‘బీజేపీకి ఒకటే చెబుతున్నా, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఖబడ్డార్.. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయోమో... ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాగవు...’ –2018లో శృంగవరపుకోటలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు‘నేను ఎవరికీ భయపడేది లేదు, నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని బలహీన పరచడానికి, ఇష్టమొచి్చనట్లు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను. ఎప్పుడూ భయపడలేదు. భయమనేది నా జీవితంలేదు. –2018లో మార్చి 6 న విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు...’2019 మార్చి 2వ తేదీన విశాఖపట్నం సభలో ప్రధాని మోదీ..‘దేశం కోసం మేం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెటువంటి బెరుకూ లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వెనుక ఎవరైనా వచ్చి మా ఫైళ్లు తెరుస్తారనో, అవినీతి ఆరోపణలు చేస్తారనో భయం నాకే మాత్రం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు (చంద్రబాబును ఉద్దేశించి) భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికి తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు...’ఏప్రిల్ 1, 2019న రాజమండ్రిలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో మోదీ..‘కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ టీడీపీ ప్రభుత్వానికి లేదు. ఎప్పుటికప్పుడు పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంచనాలను పెంచుతూ, ఎక్కువ డబ్బు పొందుతూ చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు ఒక ఏటీఎంలా మారింది. అందులో నుంచి డబ్బులు తీసేసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూ టర్న్ బాబు అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర రైతుల క్షేమం కాదు, ఎవరి క్షేమం కోసం ఆయన ఆలోచిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ అర్ధం చేసుకోగలరు.’ ‘యూ టర్న్ బాబు (చంద్రబాబును ఉద్దేశించి) పరిస్థితి ఎలా ఉందంటే బాహుబలి సినిమాలో రాజు భల్లాలదేవుడి పాత్ర మాదిరే. తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని తిరిగి దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారైతే.. ఇక్కడి యూ టర్న్ బాబు మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాస్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్నదైతే... యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు...’పోలవరం ఆలస్యానికి బాబే కారణం..పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణం ముమ్మాటికీ నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబే. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు మ్యాన్యువల్ను తుంగలో తొక్కి.. వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండానే– ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను నిరి్మంచారు. గోదావరికి 2019, 2020లలో వచి్చన భారీ వరదలు.. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది.ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. పోలవరాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ గత ఎన్నికల ప్రచారంలో 2019, ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం సభలో ప్రధాని నరేంద్ర మోదీ కన్నెర్ర చేయడం అప్పట్లో సంచలనం రేపింది. పోలవరం జాప్యానికి చంద్రబాబు తప్పిదమే కారణమని ఫిబ్రవరి 6న రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు.వాస్తవాలు ఇలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం పనులు ఆగిపోయాయంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరంలో నిర్వహించిన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. సోమవారం రాజమహేంద్రవరం సభలో ప్రధాని నరేంద్ర మోదీ అదే మాటను వల్లె వేయడం గమనార్హం. అయితే డయాఫ్రమ్వాల్పై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్ చేయకుండా ఇలా ఆరోపణలు తగవని నీటిపారుదల రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.‘విభజన హామీలను నాలుగు బడ్జెట్లలోనూ పట్టించుకోలేదు. చివరి బడ్జెట్లోనూ ఏపీ పేరు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రం ఒకటి ఉందన్న ఆలోచన లేదా? ఏం ప్రధాని ఓ గంట సమయం ఇవ్వలేరా? మిత్రపక్షంగా రండి. కూర్చుందాం అని అన్నారా...? మీరొక్కరే దేశాన్ని కాపాడతారా. ఏం మీకొక్కరికే దేశభక్తి ఉందా?..’ –2018 మార్చి 7న ఓ సమావేశంలో చంద్రబాబు..‘భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు?....’ – అసెంబ్లీలో చంద్రబాబు తన ప్రసంగంలో..‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు...’ – 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం నాయకుల సమావేశంలో చంద్రబాబు -
తోడేళ్ళను తరిమే రోజు!
ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. గోబెల్స్ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చార్మినార్కు కూడా సేల్ డీడ్ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్బుక్ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్బుక్పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్ టైట్లింగ్ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్లో విలేజ్ సెక్రటేరియట్లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్మోహన్రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
'పవర్'లెస్.. భ'జనసేన' మాకొద్దు!!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తాను ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదని మొన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలెం, సామర్లకోట సభల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా వల్లె వేశారు. తాను కులాలకు అతీతమంటూనే కాపులకు ప్రాధాన్యమేదని ప్రశ్నిస్తారు. రాష్ట్రమంతా జల్లెడ పట్టి ఆ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇతర కులాల పట్ల విద్వేష పూరితంగా మాట్లాడతారు. గతంలో టీడీపీని పలుమార్లు తూర్పారబట్టిన పవన్.. ఇప్పుడు అదే పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ తన ఫ్యాన్స్ నుంచే ప్యాకేజీ స్టార్గా గుర్తింపు పొందారు. బీజేపీని తీవ్రంగా నిందించిన ఆ నోటితోనే అత్యద్భుతమని పొగుడుతారు. మాటలో నిజాయితీ, వ్యవహారంలో స్థిత ప్రజ్ఞత, మనిíÙలో స్థిరత్వం మచ్చుకైనా కనిపించని పవన్ నాయకత్వంలోని భ‘జనసేన’లో ఇక కొనసాగలేమని పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.నేను ప్రశ్నిస్తాను.. నిలదీస్తాను.. ఎదిరిస్తాను.. అంతు తేలుస్తాను.. ప్రజల పక్షాన నిలుస్తాను... అంటూ నిత్యం ఊగిపోతూ డాంబికాలు పలికే జనసేనాని పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ నాయకులు, క్యాడర్ ప్రశ్నలకు కనీస స్థాయిలో సమాధానం చెప్పుకునే స్థితిలో లేరనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల నుంచి తమకు ఎదురవుతున్న తీవ్ర అవమానాలు, అసహనాలు, ఈసడింపులు, ఛీత్కారాలను తట్టుకోలేకపోతున్నామని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు.జనసేనాని తీరుతోనూ వరుసగా పార్టీని వీడిపోయే వారే తప్ప కొత్తగా వచ్చి చేరేవారు మచ్చుకు ఒక్కరూ కనిపించడం లేదంటున్నారు. జనసేన ఆవిర్భావ సమయంలో ఏదో సాధించేస్తారనే అంచనాలతో పవన్ పక్కన చేరిన మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, సీనియర్ నాయకులకు ఆయన తత్వం త్వరగానే బోధపడి తమ దారి చూసుకున్నారు.రాజకీయాలపై ఆసక్తితో, ఏదో ఒకటి చేయకపోతారా, పార్టీని ముందుకు తీసుకెళ్లకపోతారా, మంచి రోజులు రాకపోతాయా? అనే ఆశతో ఇటీవలి వరకు కొనసాగిన వారికి మాత్రం తమ దింపుడు కల్లం ఆశలు ఆవిరై జనసేనకు జెల్లకొట్టి ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. కొందరేమో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటన్న భావనతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ తాజా పరిస్థితులను గమనిస్తున్నారు. ఇంకొందరు పదవులపై ఆశలు వదులుకుని రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.కూటమిలో సీట్ల సర్దు‘పాట్ల’ను చూసిన తర్వాత దాదాపు రోజూ జనసేనలో రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి హోదా కలిగిన నాయకులు ‘పవన్.. నీకో నమస్కారం..’ అంటూ గుడ్ బై చెబుతూనే ఉన్నారు. చివరకు తోక పార్టీగా మారి సైకిల్ వెనుక తిరిగేలా, టీడీపీకి సేవ చేసుకునే ‘సేన’లా జనసేనాని చేసేశారని, కనీస గౌరవ మర్యాదలూ దక్కడం లేదని జనసేన శ్రేణులు మధన పడుతున్నాయని ఆ పార్టీని వీడిన వారు వివరిస్తున్నారు. ప్రతి అడుగులోనూ తొట్రుపాటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామనే అంచనాలతో కొణిదెల చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. కాలక్రమంలో జెండా ఎత్తేసి కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పదవిని అనుభవించారు. అన్నకు తోడుగా ప్రజారాజ్యంలో యువరాజ్యం చీఫ్గా చలామణీ అయిన పవన్ కళ్యాణ్.. 2014 ఎన్నికలకు ముందు ‘జనసేన’ను స్థాపించినప్పటికీ ప్రతి అడుగులోనూ తొట్రుపాటే కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల మాట.పార్టీ ఆవిర్భావంలో టీడీపీ, బీజేపీలతో జత కట్టిన పవన్, ఏ ఎండకా గొడుగు అన్నట్లు ఎక్కడి మాటలు అక్కడ మాట్లాడుతూ తన అవసరాలు కానిచ్చేసుకుంటూ వచ్చారు. 2019 నాటికి టీడీపీకి మేలు చేసేలా ‘రహస్య ఒప్పందాలు’తో తన జనసేనే ప్రత్యామ్నాయమనే రీతిలో ఎన్నికల బరిలోకి దిగి.. గాజువాక, భీమవరంలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టిన పవన్.. చంద్రబాబు కోసం నానా ప్రయాసలకు లోనవుతూ తన నటనానుభవాన్ని రంగరించారు.చివరకు 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలకు అంగీకరించి ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడాలనుకున్న అనేక మంది ఆశావహులపై నీళ్లు చల్లారు. పిఠాపురం నుంచి స్థానికేతరుడిగా బరిలో నిలిచి .. స్థానికురాలు, విద్యావంతురాలు, సీనియర్ రాజకీయవేత్త అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతతో పోటీ పడటానికి కిందామీదా పడుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మేధావి వర్గం ముందే మేల్కొని.. తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆర్.ఆర్.రామ్మోహన్రావు, సీబీఐ మాజీ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి జె.డి.లక్ష్మీనారాయణ, ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాదాసు గంగాధరం, ముత్తంశెట్టి కృష్ణారావు, రాఘవయ్య, బైరా దిలీప్, ఆకుల చంద్రశేఖర్ లాంటి వారెందరో పవన్ రాజకీయ పరిజ్ఞానాన్ని, వ్యవహార శైలిని పసిగట్టి పక్కకు తప్పుకున్నారు.రాజకీయాలపై ఆశలున్న వారు పలువురు పార్టీలోకి అడుగిడి రూ.కోట్లు, లక్షలు పోగొట్టుకున్న తర్వాత మేల్కొని దూరమయ్యారు. తాము ఏ విధంగా మోసపోయిందీ ఏకరువు పెట్టారు కూడా. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ ఓడిపోయినా, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. çపలు నియోజకవర్గాల్లో గౌరవప్రదమైన ఓట్లను పొందిన జనసేన అభ్యర్థులకు తాజా ఎన్నికల్లో కూటమి తరఫున సీట్లు సాధించుకోవడంలోనూ పవన్ పూర్తిగా విఫలమయ్యారు.విజయవాడ వెస్ట్లో బీసీ వర్గానికి చెందిన పోతిన మహేష్ ఉమ్మడి కృష్ణాలో బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లాలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, అప్పారావు, నేరెళ్ల సురేష్ దర్శికి చెందిన ఎన్ఆర్ఐ వెంకట్, తూర్పుగోదావరికి చెందిన తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పాతంశెట్టి సూర్యచంద్ర తదితరులు జనసేన బాధిత వర్గంగా మిగిలిపోయారు. అవనిగడ్డ సీటు ఆశించిన వారిదీ అధోగతేనని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.కొన్ని జిల్లాలకే పరిమితం..రాష్ట్ర స్థాయి పార్టీగా ఆవిర్భవించిన జనసేనను పవన్ కళ్యాణ్ తన అపరిపక్వతతో అతి తక్కువ సీట్లతో కొన్ని జిల్లాలకే పరిమితం చేశారని పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. ఆ సీట్లు కూడా చాలా మంది టీడీపీ నేతలకే ఇచ్చారు. జనసేన ఆవిర్భవించి దశాబ్ద కాలమైనా సంస్థాగతంగా కనీస స్థాయిలో బలపడలేదు. చివరకు పార్టీ గుర్తునూ సక్రమంగా దక్కించుకోలేని స్థితిలోకి జనసేన దిగజారింది. ‘జనసేన అధినేత పవన్కళ్యాణ్ మాటలను, ఆయన బంధం వ్యవహారాలను అంచనా వేసుకోలేక అమెరికా నుంచి కుటుంబం మొత్తం వచ్చి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయాం.కోట్ల రూపాయలు పోగొట్టుకుని నష్టపోయాం. సీటు ఇస్తామంటూ మోసం చేశారు’ అని దళిత మహిళ సి.సుభాషిణి ఆవేదనలో జనసేన చేతిలో దెబ్బతిన్న వారందరి గుండె ఘోష వినిపిస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలు తమ వెంట నడవడానికి, వేదికను పంచుకోవడానికి కూడా పలువురు టీడీపీ నాయకులు అంగీకరించడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదని జనసేన నేతలు వాపోతున్నారు. పవర్ లెస్!పిఠాపురంలో పని చేయని పవన్ మానియా అందుకే మెగా ఫ్యామిలీని దింపుతున్నారని చర్చ పలువురు బుల్లితెర నటులు సైతం ప్రచారం ఇంత మంది వస్తే గానీ నెగ్గలేనని అనుమానం! తానొక్కడిని గెలిస్తే చాలనుకుంటున్న వైనంజనసేన అభ్యర్థుల గెలుపుసంగతేమోగానీ, పిఠాపురంలో తాను గెలిస్తే చాలనే స్థితికి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నాయకుడిగా తాను నిలబెట్టిన వారి గెలుపు సంగతి పక్కనబెట్టి, అధిక సమయం తన కోసమే కేటాయించుకున్నారని ఆ పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తానొక్కడే గెలిచి అసెంబ్లీకి వెళితే చాలన్నట్టుగా ఉంది ఆయన శైలి అని జనసేన శ్రేణులు వాపోతున్నాయి.పవన్ అన్న నాగబాబు నెల రోజులుగా పిఠాపురంలోనే తిష్ట వేశారు. నాగబాబు తనయుడు వరుణ్తేజ్ ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేశారు. నాగబాబు భార్య సైతం మరిది కోసం ప్రచారంలో పాలు పంచుకున్నారు. పవన్ మేనల్లుడు వైష్ణవ తేజ్ కూడా పిఠాపురంలో తిరగాల్సిన పరిస్థితి. వీరికితోడు జబర్దస్త్ టీం మొత్తం ఇక్కడ వాలిపోయింది. అయినప్పటికీ పిఠాపురంలో ప్రచారం సరిపోదనుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్లే మెగాస్టార్ చిరంజీవిని పిఠాపురంలో ప్రచారానికి రప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.పదుల సంఖ్యలో తారలు దిగి వస్తున్న తీరు చూస్తుంటే పిఠాపురంలో తన గెలుపుపై పవన్కు నమ్మకం లేదనేది స్పష్టమవుతోందంటున్నారు. ప్రచార ఆర్భాటం, మద్యం, డబ్బు లేని ఎన్నికలు రావాలని తెగ గొప్పలు చెప్పిన పవన్.. ఇప్పుడు రూ.కోట్లు వెదజల్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దఫా ఎమ్మెల్యే కాకపోతే ఇక తన రాజకీయ జీవితం ముగిసినట్టే అని అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలనే నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందులో మెగా హీరోలు, జబర్దస్త్ ఆరి్టస్టుల స్పెషల్ ఫ్లైట్ చార్జీలు, ఇతర ఏర్పాట్లకు అవుతున్న ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు.ఒక పాన్ ఇండియా సినిమా బడ్జెట్ అంత ఖర్చుకు సిద్ధమయ్యారని ఇక్కడి ఏర్పాట్లు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. ఇంత ఖర్చు పెడుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను ఎదుర్కోవడం కష్టంగా ఉందని జనసేన నేతలు ఒప్పుకుంటున్నారు. కాగా, పిఠాపురంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకుంటున్న టీడీపీ నేత ఖర్చే భారీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకే రోజూ పెద్ద మొత్తంలో చెల్లించుకుంటున్నారని జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు. -
మనిషి బీజేపీ.. మనసు టీడీపీ : ముత్యాలనాయుడు
నర్సీపట్నం: సీఎం రమేష్ను జిల్లా ప్రజలు ఎలాగూ నమ్మరని.. మనిషి బీజేపీ, మనసు టీడీపీ కావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు సైతం ఆయనను విశ్వసించడం లేదని డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్తో కలిసి గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రమేష్లా తాను బ్యాంకులను మోసం చేయలేదన్నారు. దోపిడీలు చేయటం తనకు చేతకాదన్నారు.అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు అనుమతితో ఆయన బీజేపీలో చేరారని, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా ఏనాడూ స్టీల్ప్లాంట్ గురించి నోరు మెదపలేదన్నారు. స్థానికులకే ఎంపీ టికెట్ కేటాయించాలని తొలుత గట్టిగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడు డబ్బుల కోసం సీఎం రమేష్కు సాగిలపడ్డారని విమర్శించారు.ఇక్కడి ప్రజలు విజ్ఞత కలిగినవారని, స్థానికేతర్లకు ఇక్కడ ప్రజలు పట్టం కట్టిన దాఖలాలు లేవన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి డబ్బు సంచులతో దిగిన సీఎం రమేష్ ఓటర్లను కొనేయాలనుకుంటే.. ఆయన ఆటలు చెల్లవన్నారు. టీడీపీ నాయకులు అమ్ముడు పోతారేమో కాని ఓటర్లు మాత్రం డబ్బులకు లొంగిపోయే వారు కాదన్నారు.ప్రజల కలలకు వాస్తవ రూపం..సీఎం రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.ఆచరణ సాధ్యం కాని హామీలతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతన్నకు మంచి చేసే ఆలోచనతో జగనన్న ఉంటే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడే ఏ పథకమైనా తీసుకోచ్చారా అని ప్రశ్నించారు. నేడు రైతు భరోసా, రైతులకు రుణాలు, కౌలు రైతుల చట్టం తదితర పథకాలను జగనన్న అమలు చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు ఆసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల యర్రాపాత్రుడు పాల్గొన్నారు.ఇవి చదవండి: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి -
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
చిత్తూరు: చంద్రబాబు బూటకపు హామీలను ప్రజలు నమ్మరని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని వనదుర్గాపురం, తొట్టికండ్రిగ, కృష్ణజమ్మపురం, శ్రీకావేరిరాజుపురం, పాలసముద్రం పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటి సీఎం మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 99.5 శాతం అమలు చేశారన్నారు. సచివాలయాల ద్వారా 1.35 లక్షల మందికి ఉద్యోగావకాశం కల్పించారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టుల భర్తీ, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్తో కలసి ఐదేళ్లలోమొత్తం 6.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రజలకు మేలు చేశామనే పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమని భావించే చంద్రబాబు జనసేన, బీజేపీతోపాటు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని హీనంగా తిట్టిన చంద్రబాబు కేసుల భయంతో బీజేపీకి సాష్టాంగం పడ్డారని విమర్శించారు.అధికారం కోసం కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించామని, ఈ ఎన్నికల్లో తన కుమార్తె కృపాలక్ష్మిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికే పీసీసీ అధ్యక్షులు షరి్మల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడి ప్రజలు తిరస్కరించడంతో ఏపీకి వలస వచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనామళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాష్ రాజు, సింగిల్విండో చైర్మన్ గాలి జ్యోతి, వైస్ ఎంపీపీ శేఖర్ యాద్, పార్టీ మండల కన్వీనర్ తులసియాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు అన్భళగన్, సినీ నిర్మాత షణ్ముగం, ఆర్బీకే చైర్మన్ పోలయ్య, పుత్తూరు మార్కెట్ డైరెక్టర్ రమాదేవి, కో–ఆప్షన్ మెంబర్ వేలు, సర్పంచ్ గాలి మహేష్ బాబు, అయ్యప్ప, నరసింహరాజు, భాష్కర్రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, పుత్తూరు కేశవరెడ్డి, మురళి, నరసింహన్, ప్రేమ్కుమార్, ఆనందన్, ప్రకాశ్, కుమార్, చంద్రశేఖర్రాజు, షణ్ముగరెడ్డి, వరదరాజు, చిన్నవరదరాజు, సిద్దమందడి, శరవణన్, కుట్టి, చిన్నపయ్యన్, లక్ష్మణన్, రాజామణి, అరుల్, బాబు, మనోహర్, దనంజయన్, వాసురాజు, కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షణ్ముగం పాల్గొన్నారు. -
బాబుకు ఓటు అడిగే అర్హతే లేదు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసే చంద్రబాబుకు కనీసం ఓటు అడిగే అర్హత కూడా లేదని మంత్రి, వైఎస్సార్సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని కొత్తయిండ్లు, కొత్తపేట, ఎల్ఐసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మంత్రి మాట్లాడుతూ బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి చచ్చిన పాములాంటివాడని, ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసి, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారని కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను తీసుకెళ్లి సేవలు అందించామని తెలిపారు.వలంటీర్లు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు సైతం భయపడినా, జగనన్న వలంటీర్లు మాత్రం ధైర్యంగా రోగులకు సేవలు అందించారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామని వివరించారు. జగన్మోహన్రెడ్డి చేసేవి మాత్రమే చెబుతారని , వాటినే మేనిఫెస్టోగా విడుదల చేశారన్నారు. ఐదేళ్లలో 98 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన వైఎస్సార్సీపీకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓటు అడిగే అర్హత ఉందని వెల్లడించారు.చంద్రబాబు , పవన్కల్యాణ విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉందని, దీన్ని బట్టే అది ఎంత మోసకారి మేనిఫెస్టోనో అర్థమవుతోందని తెలిపారు. బారు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఈనెల 13న జరిగే పోలింగ్ రోజున ప్రతి ఒక్కకూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జి ఫకృదీ్ధన్షరీఫ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ జిల్లా అమ్ము పాల్గొన్నారు. -
పచ్చ చిలుకలుగా ఆ మేధావులు.. కళ్లకు గంతలు కట్టిన చంద్రబాబు
ఈ మధ్య కాలంలో తెలుగుదేశం బాకా మీడియా ఈనాడు కొత్త పుంతలు తొక్కి ఏపీ జనాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మేధావుల పేరుతో కొందరిని తీసుకు వచ్చి, ఇంటర్వ్యూలు అంటూ ఒక తంతు నడిపి, వారితో తమకు కావల్సినవి చెప్పించుకుని ప్రజలను మోసం చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మేధావులుగా ముద్ర వేసుకున్న కొంతమంది భ్రష్టు పట్టిపోతున్నారు. ఈనాడు రామోజీ పైత్యాన్ని ఈ మేధావుల నోట్లో పెట్టి పచ్చి అబద్ధాలను చెప్పిస్తున్నారు. ఆ మేధావులైనా నిస్సిగ్గుగా ఒక పార్టీ కోసం పనిచేయడం ఏమిటో అర్దం కాదు.ఏ అంశానికైన రెండు కోణాలు ఉంటాయి. వాటిలో ఒకదానివైపే చూసి, రెండో కోణాన్ని వదలివేసి మాట్లాడితే ఆ వ్యక్తి ఎలా మేధావి అవుతారో అర్దం కాదు. ఈనాడు మీడియా నిర్లజ్జగా బట్టలు ఊడదీసుకుని తిరుగుతోంది కాబట్టి, మేధావుల ముసుగులో మరికొందరిని కూడా అలాగే చేస్తోంది. ఇప్పటికే మాజీ ఐఎఎస్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్, జయప్రకాష్ నారాయణ, పీవీ రమేష్ వంటివారిని తమ ప్రయోజనాలకు వాడుకున్న ఈనాడు మీడియా కొద్ది రోజుల క్రితం ఆర్దిక వేత్త పేరుతో మహేంద్రదేవ్ను తెరపైకి తెచ్చి ఆయనతో కొన్ని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయించి బానర్గా తన పత్రికలో అచ్చేసింది. అది చదివితే వీరు నిజంగా మేధావులా, లేక తెలుగుదేశం కోసం రామోజీ చెప్పినట్లు, కోరినట్లు మాట్లాడే మేతావులా అన్నది తెలుసుకోవడం కష్టం కాదు.లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కొంతకాలం క్రితం వరకు ఏపీలో విద్య, వైద్య రంగాలలో సంస్కరణలు, అమలు అవుతున్న స్కీములు చాలా బాగున్నాయని మెచ్చుకునేవారు. కానీ ఎన్నికల సమయానికి ఆయనపై రామోజీ ఒత్తిడి బాగానే పనిచేసినట్లుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి జేపీ కూడా యుటర్న్ తీసుకుని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించి ఎన్డీఏ కి అనుకూలంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం ఆరంభించారన్నమాట. జేపీ ఇంతగా దిగజారి పోయి చివరికి కుల ముద్ర వేయించుకునే దుస్థితికి వస్తారని నేనైతే ఊహించలేదు.ఈనాడు మీడియా కోసం ప్రచారం చేస్తున్న ఈ మేధావులలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉండడాన్ని అంతా గమనిస్తున్నారు. దీనివల్ల చంద్రబాబుకే నష్టం తప్ప ఇంకొకటి కాదు. తాము చేస్తున్నది ఏమిటో వారికి తెలియడం లేదు. తాజాగా మహేంద్రదేవ్ అనే మరో మేధావిని ఈనాడు ముగ్గులోకి దింపి ఆయనను కూడ గబ్బు లేపింది. ఆయన తండ్రి సంజీవదేవ్ చాలా గౌరవమైన వ్యక్తి. ఈయన కూడా పద్ధతిగానే ఉంటారు. కానీ రామోజీ ట్రాప్లో పడి తన ప్రతిష్టను తానే దెబ్బతీసుకున్నారనిపిస్తుంది.ఇంతకాలం టీడీపీ కోసం పనిచేసిన సోకాల్డ్ మాజీ ఐఏఎస్లు చెప్పేదానిని జనం నమ్మడం లేదని మహేంద్రదేవ్ ను ప్రవేశపెట్టినట్లు అనిపిస్తుంది. ఆయనను ఇంటర్వ్యూ చేయడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ ప్రశ్నలు అడిగిన తీరు, ఆయననుంచి జవాబులు రప్పించుకున్న వైనం చూస్తే, కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కడానికి, ఏపీ ప్రజలను మోసం చేయడానికే ఈ ఇంటర్వ్యూని వాడుకున్నారని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోందట. ఇది ఒక ప్రశ్న. దానిపై ఆయన అవునంటూ దిక్కుమాలిన సమాధానం. దేశవ్యాప్తంగా ఈ సమస్య లేదా! ఆ మాటకు వస్తే అమెరికా వంటి అగ్రదేశంలో కూడా నిరుద్యోగం ఉంది. అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరానికి వచ్చి చూస్తే అడ్డాలపై పనులు లేని కూలీలు, వందలు, వేల సంఖ్యలో కనిపిస్తారు. ఉద్యోగం కోసం తిరిగే వేలాది మంది యువకులు కనిపిస్తారు. వారిని మోసం చేసి డబ్బులు వసూలు చేసుకునే కంపెనీలకు తక్కువేమీ లేదు. కానీ రామోజీ దిక్కుమాలిన ఆలోచన ఏమిటంటే ఏపీలో మాత్రమే నిరుద్యోగ సమస్య ఉన్నట్లు జనాన్ని నమ్మించాలనే.పోనీ ఆ మాటకు వస్తే 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడలేదు! ఆయన పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా! అప్పుడు ఎందుకు తేలేకపోయారో చెప్పాలి కదా! పరిశ్రమలకు ఆయువుపట్టుగా భావించే ప్రత్యేక హోదాను వద్దన్న చంద్రబాబు నిర్వాకం మాట ఏమిటి? ఇది ఒక అంశం అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా సమస్య ఉన్నప్పటికీ, మూడేళ్లలో ఆయన టైమ్లో వచ్చిన పరిశ్రమలు, ఓడరేవులు, మెడికల్ కాలేజీలు మొదలైనవాటి గురించి ఈ మేధావులు పట్టించుకోరు.చంద్రబాబు టైమ్ లో వచ్చిన కియా కార్ల ప్లాంట్ వచ్చింది. అది తమ ఘనత అని బీజేపీ నాయకులు చెబుతారు. అది వేరే విషయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్లో అనేక పరిశ్రమలు వచ్చాయి. వాటిని పట్టించుకోరు. పైగా పరిశ్రమలు తరలిపోతున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరంభించిన ఒక్కో పోర్టు వల్ల రెండువేల మందికి ఉపాధికి కల్పిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలు మొదలైనవాటిని ప్రోత్సహించడం, స్వయం ఉపాధి కింద లక్షల యూనిట్లు వచ్చిన వైనాన్ని జనం మర్చిపోవాలన్నది ఈనాడు మీడియా కోరిక. దానికి ఈ మేధావులు బాజా వాయించడం దురదృష్టకరం.ఏపీకి పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా అడ్డుకోవాలా అని అడ్డగోలు కథనాల గురించి ఈ మేధావులకు తెలియదు. ప్రభుత్వపరంగా చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా రెండున్నర లక్షల మందికి ఐదువేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వీటన్నిటిని ఉపాధి కింద పరిగణనలోకి తీసుకోకుండా కుహానా మేధావులు చెబుతున్నారు. సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా అని మహేంద్రదేవ్ బాధ పడ్డారు. బాగానే ఉంది.2014లో చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తానంటే లక్ష కోట్ల రూపాయల రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని వాగ్ధానం చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఎందుకు బాండ్ కొట్టింది. అప్పుడు ఏ సంపద సృష్టించి రుణాలను మాఫీ చేస్తానని అన్నారు. పోనీ ఫలానా రకంగా సంపద సృష్టించానని చెప్పగలరా! కేవలం అమరావతి రాజధాని పేరుతో 29 గ్రామాలలో తన వాళ్లతో భూములు కొనిపించి రేట్లు పెంచడమే సంపద సృష్టించడం అవుతుందా? ఆఆ గ్రామాలలో వేల ఎకరాల భూములలో పంటలను ఎండబెట్టి విధ్వంసానికి పాల్పడితే అది గొప్ప విషయం అని రాస్తారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి చేశారు. రాష్ట్రం అంతటా పేదలకు సంపద పెరగాలని ఆయన తలపెట్టారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తద్వారా ఒక్కొక్కరికి ఐదు నుంచి పది లక్షల రూపాయల ఆస్తి లేదా సంపద సమకూరింది. దీనిని సంపదగా ఈ మేధావులు పరిగణిచరా? రాష్ట్ర రుణాలు పద్నాలుగు లక్షల కోట్లు దాటిపోయాయని ఈయనకు ఎవరు చెప్పారు. ఈనాడు వాళ్లు చెప్పిన అబద్ధాలను ప్రచారం చేయడం కోసం ఈయన పరువు తీసుకోవాలా? అసలు ఎప్ఆర్బీఎం పరిధిలో లేకుండా రాష్ట్రాలు ఆ స్థాయిలో రుణాలు చేయగలుగుతాయా? జీఎస్ డీపీ వృద్ధిలో ఏపీ అగ్ర భాగాన ఉందన్న సంగతి ఈ మేధావులకు తెలియదా? తెలియకపోతే తప్పు ఏపీ ప్రజలదా!కరోనా సంక్షోభంలో ఏపీ ప్రభుత్వం ఎంత చక్కగా విధులు నిర్వర్తించింది వీరికి తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీరు రామోజీ, చంద్రబాబు వంటి పెత్తందారుల తరపున పని చేస్తున్నారు కనుక. ప్రత్యక్ష నగదు బదిలీ తాత్కాలికమేనని అంటున్నారు. బాగానే ఉంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీముల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారనే కదా! అది తప్పని మీరు నమ్మితే ఏమి చెప్పాలి. ఎవరు అలాంటి స్కీములు అమలు చేసినా మంచిది కాదని అనాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే ఒప్పు అన్న చందంగా మాట్లాడి మీ మేధావి మస్తిష్కానికి దరిద్రపు రాజకీయం అంటిందన్న అభిప్రాయం కలిగించడం లేదా?వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీముల ద్వారా ఏటా సుమారు ఏభైవేల కోట్ల రూపాయల నగదు పంపిణీ చేశారు. దాంతో ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఇదే బాబు, పవన్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నదానికంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా నగదు పంచుతామని చెబుతున్నారు. అంటే ఏటా లక్షన్నర కోట్లు పంచుతామని అంటున్నారన్నమాట. దీనిని మేధావి మహేంద్రదేవ్ తప్పు పడతారా? లేక సమర్థిస్తారా? చంద్రబాబు ఏమి చేసినా ఈయనకు కూడా బాగానే ఉంటుందని అనుకోవాలా! ఇంత చిన్న లాజిక్ ను మహేంద్రదేవ్ వంటివారు కూడా విస్మరిస్తే సమాజానికి ఎలాంటి సంకేతం ఇస్తుంది?పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కేంద్రం తగు రీతిలో నిధులు ఇవ్వకపోవడం కారణమని వీరికి తెలియదా! విద్యా రంగంలో వచ్చిన మార్పుల గురించి ముందుగా మహేంద్రదేవ్ వంటివారు స్వయంగా ఏపీకి వెళ్లి పరిశీలించి చూసిన తర్వాత ఏవైనా విమర్శలు లేదా సలహాలు ఇవ్వవచ్చు. అలాకాకుండా రామోజీ కళ్లలో ఆనందం చూడడానికి వీరు ఏమి చెబితే అది చెప్పడానికి అయితే మహేంద్రదేవ్ వంటివారి మేధావితనం ఎవరికి పనికి వచ్చినట్లు. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలియకుండా ఇలాంటి మేధావులు మాట్లాడడం ఎంత దారుణం.ఏడాదికి రెండు లక్షల మంది ఇంజనీరింగ్ చదవుతున్నారట. వారిలో కొందరికి కూడా రాష్ట్రంలో ఉద్యోగాలు రావడం లేదట. మరి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమి చేసినట్లు? ఆ ప్రశ్న అసలు ఈ మేధావులకు రాదా? ఈనాడు వాళ్లు చెత్త ప్రశ్నలు వేస్తే, మహాద్భాగ్యమన్నట్లు వీరు వారికి కావల్సిన సమాధానాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమలు వేటిని వీరు గుర్తించరా! వాటన్నిటి జాబితా చాంతాడు అవుతుంది.ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు చేయాలన్నది రామోజీ విధానం అయితే ఆయన ఉద్యోగం కోసం అప్పట్లోనే ఢిల్లీ ఎందుకు వెళ్లారు? హైదరాబాద్లో ఎందుకు కంపెనీలు పెట్టారు? చంద్రబాబు నాయుడు ఏపీలో కాకుండా హైదరాబాద్, తెలంగాణలో తన యూనిట్లు ఎందుకు నెలకొల్పారు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పని దిక్కుమాలిన ధీరిలు చెబుతున్నారు. అదే అమెరికా వెళితే అంతా తన ఘనత అని డబ్బా వాయించుకుంటారు. ఉపాధి లేకపోతే డ్రగ్స్ వంటి వ్యసనాలు వస్తాయట.అదే కరెక్టు అయితే హైదరాబాద్, బెంగుళూరు, గుజరాత్ తదితర ప్రాంతాలలో డ్రగ్స్ ఎందుకు విస్తారంగా ఉన్నాయి? హైదరాబాద్ లోనే అత్యధికంగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్న సంగతి వీరికి తెలియదా! బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రగ్స్ తెప్పించింది ఎవరన్నది ఇంతవరకు ఎందుకు తేల్చలేదు? మేధావులు కేవలం ఎవరి రాజకీయ స్వార్థం కోసమో ఇంటర్వ్యూలు ఇచ్చి వారి పరువు పోగొట్టుకోకూడదు.నిజానికి మహేంద్ర దేవ్ వంటివారికి వాస్తవాలు తెలియనివి కావు. ఏకపక్షంగా మాట్లాడడం పద్ధతి కాదని కూడా తెలుసు. కానీ మరి వారిపై ఎలాంటి ఒత్తిడి ఉందో ఏమో కానీ, రామోజీ కోరుకున్న అబద్ధాలు చెప్పి అనవసరంగా భ్రష్టు పడుతున్నారు. మేధావులు వాస్తవ పరిస్థితి తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పాలి. ఎన్నికల సమయంలోనే వీరు మాటలను టీడీపీ మీడియా ప్రచారం చేయడంలోనే కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. ఆ విషయాన్ని టీడీపీ తరపున మాట్లాడే మేధావులు తెలుసుకుంటే మంచిది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Pawan Kalyan: దిగజారిన రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్..
పిచ్చోడి గురించి వినడమే కాని, ఇంతవరకు చూడలేదు.. ఇప్పుడే చూస్తున్నా.. అని ఒక సినమా డైలాగు ఉంది. ఈ మధ్య కొందరు నేతల ప్రసంగాలు గమనిస్తే అలాగే అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను పిచ్చోడని మనం అనజాలం కానీ, ఆయన స్పీచ్ల తీరు మాత్రం రాజకీయ అజ్ఞానాన్ని, ఆయన ప్రస్టేషన్ను స్పష్టంగా తెలియచేస్తుంది. మొత్తం మీద తన గెలుపు మీద తనకే అపనమ్మకం ఏర్పడిందో, లేక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై అవిశ్వాసం ఏర్పడిందో కానీ, తన కుటుంబ సభ్యులందరిని ఎన్నికల ప్రచారంలోకి దించారు. అలాగే జబర్దస్త్ టీమ్ పై నమ్మకం పెట్టుకున్నట్లున్నారు.అఫ్ కోర్స్.. ఆయన సతీమణి అన్నాలెజోవా కనిపించడం లేదనుకోండి. ఆయన ప్రచారం ఆయన ఇష్టం. ఎందుకంటే పిఠాపురంలో తనను గెలిపించాలని వర్మను వేడుకున్న పవన్ కల్యాణ్ ఇతర నియోజకవర్గాలలో కూటమి అభ్యర్దులను గెలిపిస్తానని తిరుగుతున్నారు. పిఠాపురానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఏమి చేస్తానో చెప్పకుండా ఊదరకొట్టుకుంటూ తిరిగుతున్న పవన్ను ఎవరైనా ఎందుకు నమ్ముతారు. సినిమా నటుడు కనుక కాసేపు వినోదం కోసం ఆయనను చూడడానికి వచ్చి, ఆయన పిచ్చి గంతులు, చిందులు చూసి, పనికిమాలిన డైలాగులు విని ఏదో సినిమా చూశాంలే అని జనం సరిపెట్టుకుంటున్నారు. గతంలో గాజువాక, భీమవరంలలో జరిగింది అదే.మరో చిత్రం ఏమిటంటే ఆయన కాకినాడ సిటీలో చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్లో కన్నబాబుల అంతు చూడడానికే పిఠాపురంలో పోటీ చేస్తున్నారట. ఆయనే ఈ సంగతి చెప్పారు. నిజంగా వీరి అంతు చూడాలనుకుంటే ఆ నియోజకవర్గాలలో కదా ఆయన పోటీ చేయాల్సింది. అక్కడికి చంద్రశేఖరరెడ్డి ఒకటికి, రెండుసార్లు సవాల్ కూడా విసిరారు కదా? అయినా కాకినాడలో పోటీచేయకుండా పిఠాపురం ఎందుకు పవన్ కళ్యాణ్ చిత్తగించారు.రాజకీయాలలో కాస్త పద్దతిగా మాట్లాడాలి. అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయా చోట్ల పోటీ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దులను పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతే పట్టరాని కోపంతో ఊగిపోతూ శాపనార్ధాలు పెడుతున్నారు. ఆయన వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రిని అధఃపాతాళానికి తొక్కేస్తారట. ఇది ఆయన సినిమాలో నటించడమనుకుంటున్నారు కానీ, ప్రజాసేవ అనుకోవడం లేదు. అందుకే ఇలాంటి పిచ్చి మాటలు వస్తున్నాయి.2019 లో రెండు చోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడించి ఆయన భాషలో చెప్పాలంటే పాతాళానికి తొక్కారు. ఇప్పుడు ఎన్నికలకు ముందుగానే పవన్ను చంద్రబాబు అధఃపాతాళానికి తొక్కేశారు. పవన్ కళ్యాణ్ గెలిచినా, ఓడినా పెద్ద తేడా లేకుండా చేసేశారు. ఒకప్పుడు తాను సీఎంను అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్ను ఆ ఊసే ఎత్తనివ్వకుండా చంద్రబాబు తన పెరటి మనిషిగా మార్చుకున్నారు. జనసేనను రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థానాలలో పోటీచేయనివ్వకుండా, ఓ ఇరవైఒక్క సీట్లు ఇచ్చి, అందులో డజను సీట్లలో టీడీపీ వాళ్లనే పెట్టి పవన్ను కేవలం తన కాళ్ల వద్ద పడి ఉండేలా చంద్రబాబు చేసుకోగలిగారు.చంద్రబాబు వద్ద ఊడిగం చేయడానికే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని భావించిన పలువురు జనసేన నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ సంగతి అర్ధం కాకో, లేక అర్దం అయినా, చంద్రబాబుకు సరెండర్ అయినందువల్లో నోరు మెదపకుండా ఆయన చెప్పినట్లు పవన్ చేస్తున్నారు. జనసేనను రాష్ట్ర వ్యాప్త పార్టీగా లేకుండా చేసి, కేవలం రెండు, మూడు జిల్లాలకే పరిమితం చేసి పవన్ స్థానం ఏమిటో చంద్రబాబు తెలివిగా చూపెట్టారు. ఇక ఎప్పటికీ జనసేన అధఃపాతాళంలోనే ఉండేలా చంద్రబాబు చేస్తే, ఈయనేమో ఎవరినో తొక్కుతానని ప్రగల్బాలు పలుకుతూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం టీడీపీ పిఠాపురం నేత వర్మ కూడా ఈయన ధోరణితో విసిగి చిరాకు పడుతున్నారట. ఆయన పవన్కు ఆశించిన రీతిలో సహకరించకపోతే ఇంతే సంగతులు అన్న పరిస్థితి పిఠాపురంలో ఏర్పడిందని చెబుతున్నారు. చంద్రబాబు కన్నా ఘోరంగా అబద్ధాలు చెబుతూ, ఒక్కోచోట ఒక్కో మాట చెబుతూ ప్రజలను, ముఖ్యంగా అభిమానులను బురిడి కొట్టించాలనుకుంటున్న పవన్ లీలలన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి. తాను ఇంటర్ చదివానని, అందులో కూడా ఆయా చోట్ల ఒక్కో గ్రూప్ చదివినట్లు చెప్పడం, తీరా చూస్తే ఆయన ఎస్ఎస్ఎల్సి అని బ్రాకెట్ లో 10 వ క్లాస్ అని పెట్టడంతో ఈయన ఏమిటో అర్దం అయింది.ఆస్తుల కొనుగోలు లావాదేవీలలో కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయ జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా ఇంత మోసపూరితంగా ఉంటారా అన్న విమర్శకు అవకాశం ఇచ్చారు. పవన్ ఎక్కడా తమ కూటమి అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పడం లేదు. ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. కొన్ని ఉదాహరణలు చూడండి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల సొంత ఇళ్లను కూడా తాకట్టు పెట్టేస్తారట. ప్రజలను రోడ్డుపైకి లాగేస్తారట.. బుర్ర, బుద్ది ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి పిచ్చి విమర్శలు చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా అలా చేయగలుగుతుందా? మరి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అంత వెర్రివాళ్లు, వాళ్లకు ఏమి తెలియదని, ఈయన ఏమి చెబితే దానిని చెవిలో పువ్వు పెట్టుకుని వింటారని అనుకుంటున్నారా? ఆ జిల్లా ప్రజలు బాగా తెలివైన వాళ్లన్న సంగతి పవన్ కు తెలియదు.రేషన్ బియ్యం విక్రయాలలో 20 వేల కోట్ల కుంభకోణం చేశారట. అసలు ప్రభుత్వం ఇస్తున్నదే ఉచిత రేషన్ బియ్యం. అందులో స్కామ్ ఏమిటి? ఇంత అజ్ఞానమా? రీ సర్వే పేరుతో ప్రజల భూములను కంప్యూటరైజ్ చేస్తున్నారట. తద్వారా దోచేస్తారట. ఇది కేంద్రం తీసుకు వచ్చిన చట్టం అని తెలియకుండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే తప్పుడు వార్తలను పట్టుకుని పిచ్చి ఉపన్యాసాలు చేస్తే ఏమి ప్రయోజనం. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటీకరణ జరుగుతుంటే, భూముల వివరాలు కంప్యూటర్లలో ఎక్కించకూడదట. మరి భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచో అంటే చంద్రబాబు పాలన సమయం నుంచి కంప్యూటరైజ్ అవుతున్నాయి కదా? దాని వల్ల ఏ ప్రమాదం వచ్చిందో పవన్ చెప్పాలి కదా? అసలు ఇంతవరకు ఆ చట్టమే అమలులోకి రాలేదు. అయినా ఇలా వక్రీకరిస్తున్నారు.ఇక రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి కారణం పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించడానికి మిధున్ ప్రత్యేక శ్రద్ద పెట్టడమే. రాజకీయాలలో ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా పవన్ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో చంద్రబాబుతో కలిసి తిరుగుతూ, వారిని ఓడిస్తా.. వీరిని ఓడిస్తా.. అని చెబుతుండే పవన్ తను పోటీచేసే నియోజకవర్గానికి వేరే పార్టీవారు వచ్చి బాధ్యత తీసుకోకూడదట. దీనిని బట్టే మిధున్ రెడ్డి అంటే పవన్ ఎంత భయపడుతున్నది అర్ధం చేసుకోవచ్చు.మాజీ మంత్రి కన్నబాబుకు చిరంజీవి రాజకీయ భిక్షపెట్టారట. అయినా చిరంజీవిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవమానిస్తే స్పందించలేదట. చివరికి తన అన్న విషయంలో కూడా అబద్ధాలు చెప్పడమేనా! చిరంజీవిని అంత చక్కగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకుంటే, చంద్రబాబు చెప్పమన్నాడని, పవన్ కళ్యాణ్ ఈ రకంగా అసత్యాలు చెబుతున్నారు. కన్నబాబు వైఎస్సార్సీపీలో ఉంటే ఈయనకు వచ్చిన బాధ ఏమిటి? మరి చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్లో ఎందుకు కలిపారు? పవన్ కల్యాణ్ కొంతకాలం బీజేపీ, టీడీపీలతో, మరికొంతకాలం బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో ఎందుకుపొత్తు పెట్టుకున్నారు. మళ్లీ తాను గతంలో బండ బూతులు తిట్టిన టీడీపీ, బీజేపీల పంచన ఎందుకు చేరారు? ఏదైనా మాట్లాడే ముందు అర్ధం ఉండాలి.మిధున్ రెడ్డి ఏదో మద్యం వ్యాపారి అట. ఈయనేదో పవిత్రుడు మాదిరి కబుర్లు. ఒక పక్క అక్రమ సారా వ్యాపారం చేసి రాజకీయాలలోకి వచ్చిన సీ.ఎమ్.రమేష్ ను గెలిపించాలని చిరంజీవి, పవన్ కళ్యాణ్ కోరుతూ మరో పక్క మిధున్పై విమర్శలు చేయడం అంటే ఈయన సారా పైత్యం ఏమిటో తెలుస్తూనే ఉంది. ఒకపారి కాపులైనా తనకు ఓటు వేయాలని, మరోసారి తనకు కులం ఏమిటని, ఇలా రకరకాలుగా మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు శాసనసభ ఎన్నికలలో తన దత్తతండ్రి కళ్లలో ఆనందం చూడాలని తిరుగుతున్నారు. అందుకే ఆయనకు ప్రత్యర్థులు ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టారు.పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఇంతగా దిగజారి చంద్రబాబుకు తెగ భజన చేస్తున్న తీరు మాత్రం సినీ నటుడుగా ఆయనకు ఏర్పడిన అభిమానులు సైతం భరించలేకపోతున్నారు. జనసేన మొత్తం దివాళా తీసినా పర్వాలేదు.. తాను ఒక్కడినైనా గెలవాలన్న వాంఛతో పిఠాపురంలో తంటాలు పడుతున్నారు. కోట్లు సంపాదించుకుంటూ రోడ్లపైకి ఎందుకు వచ్చానో ప్రజలు ఆలోచించాలి అని పవన్ అన్నారు. అవును!ప్రజలు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ప్రస్తుతం రోడ్లపై ఈయన తిరుగుతాడు. ఆ తర్వాత తనను కలవడానికి వచ్చేవారిని రోడ్డుపై నిలబెడతారు! అంతకు మించి ఈయన గెలిచినా, ఓడినా ప్రజలకు చేసే సేవ ఏమీ ఉండదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
టీడీపీ తొండాట.. బాబు అండ్ కోకు మామూలే!
గతంలో ఒక జోక్ ఉండేది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మాచ్ జరుగుతుంటే మా వైపు ధోని వంటి మంచి క్రికెటర్లు ఉన్నారని భారత క్రికెటర్లు చెబితే, తమ వైపు ఎంపైర్ అంటే రిఫరీ ఉన్నారులే అని పాక్ క్రికెటర్లు అన్నారని జోక్గా చెప్పుకునేవారు. సరిగ్గా ఏపీలో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే, ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో పొత్తు కట్టి తిరిగి అధికారంలోకి రావాలని సంకల్పించారు. కానీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం జనసేన, బీజేపీ లతో పాటు ఎల్లో మీడియాతో నేరుగాను, కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలతో పరోక్ష కూటమి కడుతున్నారు. తాజాగా ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డారా అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి.నిష్పక్షపాతంగా ఉంటోన్న ఈసీపై కూటమి నేతలు బీజేపీ ద్వారా ఒత్తిడి తెస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తత్ఫలితంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి టీడీపీ కూటమి నేతలకు అవకాశం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రత్యర్థులు అనుసరిస్తున్న ఇలాంటి అనైతిక వ్యూహాలను ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్రెడ్డికు కొత్తకాదని చెప్పాలి.వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితం.. పొలిటికల్ కెరియర్ చెప్పాలంటే.. మరీ పెద్దదేం కాదు. ఆయన 2009 నుంచే రాజకీయాలలో ఉన్నట్లు లెక్క. అంటే 15 ఏళ్ల రాజకీయ జీవితం అన్న మాట. కానీ ఆయన ఎదుర్కున్నన్ని సమస్యలు, సవాళ్లు దేశంలోనే మరే నేతకు ఎదురు అయి ఉండకపోవచ్చు. ప్రత్యేకించి ఆయా వ్యవస్థలు పగబట్టినట్లుగా ఆయనపై పడ్డ తీరు తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక పెద్ద టీవీ సిరియల్ అవుతుంది. సినిమా తీస్తే ఒక సంచలన కథ అవుతుంది.తాజాగా 2024 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అదే తరహా దాడి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఒంటరిగా ఎదుర్కోలేమన్న భయంతో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలు అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డట్టు అనిపిస్తుంది. ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం ఉద్దేశం కానప్పటికీ, జరిగిన పరిణామాలు విశ్లేషించినప్పుడు అలాంటి భావన కలుగుతోంది. లేకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి దాడి, హత్యాయత్నం జరిగితే ఆ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని ఎన్నికల సంఘం సహేతుక కారణం లేకుండా బదిలీ చేయడం, నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఇంటిలెజెన్స్ హెడ్ను మార్చడం తాజా ఉదాహరణలుగా నిలుస్తాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఇలా వ్యవస్థలనుంచి చికాకులు రావడం కొత్తకాదు. చిన్న వయసులోనే అనేక కష్టాలు పడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండె ధైర్యం మాత్రం మెచ్చుకోదగింది. అదే సాహస యాత్రను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న ఫలితంగా సోనియాగాంధీ, చంద్రబాబు వంటివారు కుమ్మక్కై అక్రమ కేసులుపెట్టినా చలించలేదు. పదహారు నెలలు జైలులోపెట్టినా బెదరలేదు. ఇన్ని అడ్డంకులు అధిగమించి, 2014లో తనపార్టీకి ఓటమి ఎదురైనా నిబ్బరంగా రాజకీయాలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి 3800 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల ఆదరణ చూరగొని రికార్డు స్థాయిలో 2019లో 151 సీట్లను గెలుచుకున్నారు. అది రాజకీయ ప్రత్యర్దులకు కంటగింపుగా మారింది.ముఖ్యంగా తనకంటే పాతికేళ్ల చిన్నవాడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ స్థాయిలో ప్రజల మన్నన పొందడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం నచ్చలేదు. ఆయనకే కాదు. తన మీడియా బలంతో రాజకీయాలను శాసించాలని అనుకునే రామోజీరావు వంటివారికి అసలు గిట్టలేదు. దాంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాడన్నమాటే కానీ, మళ్లీ అవే సమస్యలు. మళ్లీ అవే ఆటంకాలు. మళ్లీ ఆయా వ్యవస్థల నుంచి ఇబ్బందులు. పార్టీ పెట్టిన కొత్తలో సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఆయనను వెంటబడి వేధించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరికొన్ని వ్యవస్థలు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ నుంచి పదే, పదే వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడన్న చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు కొందరితో వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఇబ్బంది పెట్టడానికి ఎన్ని సమస్యలు పెట్టాలో అన్నీ సృష్టించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ స్కీమును ఆరంభించినా, ఏ సంస్కరణను తీసుకు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో లిటిగేషన్ తీసుకురావడం, వాటిని న్యాయ వ్యవస్థలో కొందరు ఎంటర్ టెయిన్ చేయడం వంటివి ప్రజలలో అనేక డౌట్లకు కారణం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్ను అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఇబ్బంది పెట్టాలని టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తున్నట్లు కనిపిస్తుంది.తెలుగుదేశం వారు రాసిచ్చిన ఒక ఫిర్యాదుపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంతకం పెట్టి ఎన్నికల సంఘానికి పంపారు. అందులో ఏకంగా 22 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులు చేయడం ఒక ఎత్తు అయితే, తమకు ఫలానా అధికారులు కావాలని, వారికి తాము కోరిన రీతిలో పోస్టింగ్లు ఇవ్వాలని కోరడం ఒక సంచలనం. అలాంటి ఫిర్యాదు చేసిన పురందేశ్వరిని మందలించవలసిన ఎన్నికల సంఘం, అలా చేయకపోగా, వారు కోరిన రీతిలో స్పందించారు. అంటే బీజేపీతో టిడిపి ఎందుకు పొత్తు పెట్టుకున్నదో అర్థం చేసుకోవచ్చన్నమాట.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అని అనడమే కాకుండా, అనేక రకాలుగా దూషణలు చేసినా, ఓటమి తర్వాత మళ్లీ కాళ్లా, వేళ్లాపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తనపై ఉన్న కేసుల భయంతోనే చంద్రబాబు ఇలా చేశారులే అనుకున్నారు. కానీ అదొక్కటే కాదని, వ్యవస్థను మేనేజ్ చేయడానికి కూడా ఈ పొత్తు అవసరమని ఆయన లెక్కగట్టుకున్నారని అర్దం అయింది. పురందేశ్వరి ఫిర్యాదు తర్వాత కొందరు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అయినా టీడీపీ కూటమికి సంతృప్తి కలగలేదు. మరికొందరిని కూడా తప్పించాలని తలపెట్టారు. గతంలో ఇంటెలెజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టారు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో కీలక భూమిక పోషించారని ఆరోపణలు వచ్చాయి.గత ఎన్నికల సమయంలో ఆయనపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. అప్పట్లో ఏబీపై నిర్దిష్ట అభియోగాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇంటలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులుపై అలాంటి ఆరోపణలు లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు రాసిన కథనాలలో కూడా సీతారామాంజనేయులపై స్పష్లంగా ఫలానా ఆరోపణ అని చెప్పలేకపోయాయి. కాకపోతే ఆయన ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో ప్రవర్తిస్తున్నారన్నట్లుగా రాశాయి. ఆ ఇబ్బంది ఏమిటో తెలియలేదు. అంటే విపక్ష కూటమికి చెందినవారు డబ్బు రవాణా చేసినా, మద్యం సీసాలు సరఫరా చేసినా, దౌర్జన్యాలు చేసినా ఈ అధికారులు పట్టించుకోరాదన్నది వారి ఉద్దేశంగా ఉంది. పోనీ వీరు అధికార పార్టీ వారికి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే కేసులు పెట్టడం లేదా? అంటే అదేమీ లేదు. తెలుగుదేశం పత్రిక ఈనాడులోనే వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెట్టిన ఉదంతాలను ఇచ్చింది.ఇక విజయవాడ కమిషనర్ కాంతీలాల్ రాణా బదిలీ అయితే మరీ ఘోరం అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్నప్పుడు ఒక దుండగుడు రాయి విసిరాడు. ఫలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గాయపడ్డారు. ఆ కేసు రాణా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. దానిని ఆయన విజయవంతంగా పరిశోధిస్తూ, సాంకేతికతను వాడి నిందితుడిని పట్టుకున్నారు. ఆ నిందితుడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని బయటకు వినవస్తోంది. అంతే! రాణాపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించి ఎన్నికల సంఘం ఆయనను బదిలీ చేసి ప్రజలను ఆశ్చర్యపరచింది. ఈయన బదిలీకి ఏ కారణం ఉందో చెప్పరు. వీరంతా వైఎస్సార్సీపీకి అనుకూలమని ఒక ముద్రవేసి వారిపై చర్య తీసుకోవాలని కోరారు.గతంలో ఏబీని పక్కన పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల సంఘం తీరును తప్పు పడుతూ ఏకంగా ముఖ్య ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి ధర్నా చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు అలా చేయడం లేదు. ఎవరు బదిలీ అయినా, ఎవరిని కొత్తగా నియమించినా ఆయన పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుపోతూ ప్రజలలో తిరుగుతున్నారు. ఒక వైపు ప్రధాని మోదీ ముస్లింలపై, కాంగ్రెస్పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, వాటిపై పదిహేడువేల మంది ఫిర్యాదు చేసినా, స్పందించని ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం చిన్న, చిన్నవాటిపై మాత్రం సీరియస్గా స్పందిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిపై దాడి కేసులో విచారణ చేస్తున్న అధికారులను బదిలీ చేస్తోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తమ్ముడే అనుకుంటే.. అన్నయ్య కూడా అంతేనా..!?
ఎవరైనా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటారు. అందులోను సమాజంలో ప్రముఖులుగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అప్రతిష్టపాలవుతారు. కానీ ఆర్దిక, రాజకీయ సంబంధాలు పెనవేసుకుపోయినప్పుడు కొందరు సెలబ్రిటీలు సైతం తమ వ్యక్తిత్వాన్ని వదలుకుని దిగజారడం సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురించే చెబుతున్నది. ఆయన అంటే అందరికి గౌరవమే. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. కానీ అందుకు విరుద్దంగా ఆయన ప్రవర్తిస్తే అభిమానగణం అప్సెట్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి అలాగే వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పలుమార్లు చెప్పిన చిరంజీవి సడన్గా మాట మార్చి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారు. పోనీ అదేదో ఏదైనా రాజకీయ పార్టీలో పోటీచేసిన సామాన్యులకు మద్దతు ఇస్తే ఆయనకు పేరే వచ్చేది. ఏ పార్టీలో ఉన్న పేదలకైనా తన అండ ఉంటుందని చెబితే ఆయనకు కీర్తి వచ్చేది. కానీ ఆయన ఒక పెద్ద పెత్తందారీకి, ఆర్దిక నేరాభియోగాలు ఉన్న వ్యక్తికి సహకారం అందిస్తున్నట్లు ప్రకటించితే జనం ఏమని అనుకుంటారు. ఆయనకు ఈపాటి ఆలోచన రాకపోయిందా! అవును! కొన్ని సబంధాల ముందు అవేవి కనపించకపోవచ్చు. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షాలు కలిసి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీకి చెందిన సీ.ఎం. రమేష్ వ్యూహాత్మకంగా బీజేపీలోకి వెళ్లి, ఇప్పుడు అనకాపల్లిలో లోక్ సభ సీటుకు కూడా పోటీచేస్తున్నారు. బహుశా చిరంజీవి, రమేష్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అదేదో ఢిల్లీ స్థాయిలో కనుక ఎవరి దృష్టికి రాలేదు. కానీ ఎన్నికల నేపథ్యంలో సీ.ఎం. రమేష్ కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లడం, అక్కడ సంప్రదింపులు జరిపి చిరంజీవి తనకు మద్దతు ప్రకటించేలా చేసుకున్నారు. సీ.ఎం. రమేష్ పలు ఆర్ధిక నేరాభియాలు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఒక సినీ నటుడు వేణు ఈయనపై 450 కోట్ల రూపాయల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన రమేష్ గురించి చిరంజీవికి ఏమీ తెలియకుండా సంఘీభావం ప్రకటించి ఉంటారా? అన్న సందేహం రావచ్చు. తన సోదరుడు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత బీజేపీని కూడా కలుపుకున్నారు. ఈ పొత్తులో పవన్ కల్యాణ్ ధోరణి చూసి పలువురు జనసేన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అది వేరే కథ. పవన్ కల్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు కోసం పనిచేసినా చిరంజీవి వారితో కలవలేదు. అప్పట్లో ఈయన కాంగ్రెస్ నేతగా ఉండేవారు. చంద్రబాబును విమర్శిస్తూ కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ప్రత్యేకించి హిందుపూర్ లో ముస్లిం అభ్యర్ధికి కాకుండా బాలకృష్ణకు సీటు ఇవ్వడాన్ని చిరంజీవి తప్పు పట్టారు. ఆ తర్వాత రోజుల్లో రాజకీయాలకు దూరం అయి సినిమాలపైనే దృష్టి పెడతామని ప్రకటించారు. అలాగే ఉంటారులే అనుకుంటే సడన్గా ఇప్పుడు కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా తాను కూడా పెత్తందారులలో భాగమేనని చిరంజీవి రుజువు చేసుకున్నారు. ఈయన నటించిన పలు సినిమాలు చూసి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. ఆ సినిమాల వల్ల స్పూర్తిపొంది చిరంజీవి అంటే అంత గొప్పవాడు.. ఇంత గొప్పవాడు అని భావిస్తుంటారు. ఆయన ఠాగూర్ సినిమాలో నటిస్తే, ఈయన అంత గొప్ప నిజాయితీపరుడు అని అభిమానులు అంతా సంతోషించారు. రుద్రవీణ వంటి ప్రోగ్రెసివ్ సినిమాలో హీరోగా నటించి ఆదర్శవాది అనిపించుకున్నారు. పేదల తరపున పనిచేసే నేతగా, మద్యపానాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. తీరా వాస్తవ ప్రపంచంలోకి చూస్తే చిరంజీవి అందుకు భిన్నంగా కనిపించడం ఆయన అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది. సీ.ఎం.రమేష్ సారా వ్యాపారంతో జీవితాన్ని మొదలుపెట్టి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి, రాజకీయాలలోకి వచ్చి వేల కోట్లకు అధిపతి అయ్యారు. రమేష్ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంతంగా విమానం కొని ఆయా పార్టీలవారిని అందులో తిప్పే స్థాయికి ఎదిగారు. అది చట్టబద్దంగా, న్యాయబద్దంగా చేస్తే మంచిదే. కానీ సీ.ఎం. రమేష్ నడిపిన లావాదేవీల గురించి చిరంజీవికి తెలియవని అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ ఏదో ఆతీత సంబంధం ఏర్పడి ఉండాలి. అందుకే రమేష్కు అనుకూలంగా చిరంజీవి ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. దీంతో చిరంజీవి తన పరువు తానే పొగొట్టుకున్నారు. ప్రజల దృష్టిలో పలచన అయ్యారు. చిరంజీవి ఎన్నికలలో పోటీచేస్తున్న ఒక టిప్పర్ డ్రైవర్కు అనుకూలంగా మాట్లాడితే శభాష్ అనిపపించుకునేవారు. ఒక ఉపాధి హామీ కూలి ఈ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఆయనకు సంఘీభావం చెప్పి ఉంటే అంతా మెచ్చుకునేవారు. కానీ ఆర్ధిక నేరారోపణలు ఉన్న బీజేపీ అభ్యర్ధులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం అంటే ఆయన మాటలకు, చేతలకు ఉన్న తేడా తెలియచేస్తుంది. అసలు చిరంజీవి కాంగ్రెస్కు రాజీనామా చేశారా? ఆ పార్టీ నేతలు కొందరు ఈయన కాంగ్రెస్కు ప్రచారం చేస్తారని చెప్పారు.. కానీ ఈయనేమో బీజేపీ కూటమి అభ్యర్ధికి భజన చేస్తున్నారు. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే చిరంజీవి సినిమాల సంగతి ఎలా ఉన్నా, రాజకీయాలలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి ఎక్కడకు వెళ్లినా వేలు, లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చేవారు. దానిని చూసి ఆయన రాజకీయాలలోకి రావాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటే అదో రకంగా ఉండేది. కానీ రాజకీయాలలోకి వచ్చేది, రానిది చెప్పకుండా దాగుడుమూతలు ఆడేవారు.ఏదో వేరు పేరుతో సంస్థ పెట్టి కార్యకలాపాలు నిర్వహించి, తన బావమరిది అరవింద్ను ముందు పెట్టి కథ నడిపారు. ఆయా పార్టీలలోని నేతలు, ముఖ్యంగా తన సామాజికవర్గంవారు అంతా చిరంజీవి రాజకీయాలలోకి రావాలని కోరుతున్నట్లు ప్రకటనలు చేసేవారు. వారంతా కోరితే వస్తున్నట్లు కనిపించాలన్నది ఈయన ఉద్దేశం కావచ్చు. కానీ ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చిరంజీవి గురించి, ఆయన పెట్టబోయే పక్షం గురించి వ్యతిరేక ప్రచారం చేసేశాయి. దాంతో ఆదిలోనే హంసపాదు మాదిరి ఆయన పార్టీకి విఘ్నాలు ఎదురయ్యేయి. ఆయన ఎట్టకేలకు చిరంజీవి తిరుపతిలో ఒక భారీ సభ పెట్టి ప్రజారాజ్యం పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీ అయితే పెట్టారు కానీ, దానికి తగ్గ వ్యూహాలు, ఎజండాను సిద్ధం చేసుకోలేకపోయారు. తొలి రోజుల్లో ఈ పార్టీ వల్ల కాంగ్రెస్కు దెబ్బతగులుందని అనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆయనకు బాగానే ప్రచారం చేశాయి. కానీ దానివల్ల తెలుగుదేశంకు నష్టం వాటిల్లుతోందని అంచనాకు వచ్చిన ఆ మీడియా వెంటనే ప్లేట్ ఫిరాయించి ప్రజారాజ్యాన్ని, చిరంజీవిని గబ్బు పట్టించేవి. ఇది కేవలం కాపుల పార్టీ అన్న ముద్రవేశారు. దానిని ఎదుర్కునే సత్తా ప్రజారాజ్యానికి లేకుండా పోయింది. తన బావమరిది అల్లు అరవింద్కు ప్రాధాన్యం ఇవ్వడం, ఆర్దిక విషయాలలో కొన్ని విమర్శలు వచ్చేలా చిరంజీవి వ్యవహరించారని అంటారు. టీడీపీ అయితే చిరంజీవి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేసేది. టిక్కెట్లు రాని కొందరు అదే తరహా ఆరోపణలు చేసేవారు. చంద్రబాబు నాయుడు తన కోవర్టులను కొందరిని ముందుగానే ప్రజారాజ్యంలో ప్రవేశపెట్టి, తర్వాత వారిని బయటకు తీసుకు వచ్చి తిట్టించేవారు. ఇదే చిరంజీవికి పెద్ద సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి పొత్తు పెట్టుకోవాలని చిరంజీవి ఆలోచన చేశారు. కానీ దానిని పడనివ్వకుండా వామపక్ష జాతీయ నేతలను చంద్రబాబు మేనేజ్ చేయగలిగారు. టిక్కెట్ల కేటాయింపులో అవకతవకలు తదితర కారణాల వల్ల ప్రజారాజ్యం ఎన్నికలకు ముందే చతికిలపడింది. చివరికి ఉమ్మడి ఏపీలో పద్దెనిమిది సీట్లకే పరిమితం అవడం కాకుండా, చిరంజీవే రెండు చోట్ల పోటీచేసి ఒక చోట ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ నడపడంలో తడబడ్డారు. ఆ దశలో జెండా పీకేద్దాం అని చిరంజీవి భావిస్తున్నారని ఈనాడు మీడియా ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది. అది చూసి చిరంజీవి చాలా బాధపడ్డారు. తదుపరి అప్పట్లో జరిగిన వివిధ పరిణామాలలో కాంగ్రెస్కు దగ్గరయ్యారు. అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను తనకు అనుకకూలంగా మలచుకోవడంలో విఫలం అయిన ఈయన తనపార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, రాజ్యసభకు వెళ్లి కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి పొంది సంతృప్తి చెందారు. కానీ 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి మళ్లీ సినిమాలపైనే దృస్టి పెడతామని అన్నారు. ఇంతలో తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేనను ప్రకటించినా ఈయన పట్టించుకోలేదు. ఎవరి రాజకీయాలు వారివే అన్నట్లు వ్యవహరించారు. 2019లో పవన్ కల్యాణ్ సొంతంగా ఒక కూటమి పెట్టుకుని రెండు నియోజకవర్గాలలో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు కూడా చిరంజీవి పెద్దగా స్పందించలేదు. వైఎస్సార్సీపీ గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి సత్సంబంధాలు కొనసాగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆయనకు విశేష గౌరవాన్ని ఇచ్చారు. సినిమా సమస్యలపై చర్చలు జరపడానికి ఒక బృందాన్ని తీసుకువెళ్లారు. ఆ సందర్భంలో చిరంజీవిని అవమానించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు వ్యాఖ్యానించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్ని చూసినవారు ఇక చిరంజీవి రాజీకీయాల జోలికి రారని అనుకుంటే పవన్ కల్యాణ్కు ఐదు కోట్ల చెక్ ఇచ్చి దానికి ప్రచారం కల్పించారు. బహుశా పవన్ వైపు నుంచి ఏదో ఒత్తిడి వచ్చి ఉండాలి. ఆ తర్వాత సీ.ఎం. రమేష్ ఉదంతంతో చిరంజీవి తన ప్రతిష్టను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఠాగూర్, రుద్రవీణ వంటి సినిమాలలో చిరంజీవి చేసింది నటనేనని, రియల్ జీవితంలో ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని అభిమానులంతా అనుకునే పరిస్థితి తెచ్చారు. కాపు సామాజికవర్గం ఒకసారి చిరంజీవిని నమ్మి, తదుపరి పవన్ కల్యాణ్ను నమ్మి మోసపోయిందన్న అభిప్రాయం ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటికీ వారిని మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పూర్తిగా సరెండర్ అయి జనసేన ఉనికినే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్కు చిరంజీవి మద్దతు ఇచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్కు రాజీనామా చేయకుండా బీజేపీకి ఎందుకు సంఘీభావం ప్రకటించారని ఆలోచిస్తే కొందరు ఇది పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినదానికి ప్రతిఫలం అని అంటున్నారు. మరి కొందరు అదే కారణం అయితే కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీలో నేరుగా చేరి ఉండేవారన్నది మరికొందరి భావన. కేవలం సీ.ఎం. రమేష్ను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కోసం వీడియో చేయడం కేవలం వ్యక్తిగత కారణాలే అయి ఉండవచ్చన్నది మరికొందరి భావన. ఏది ఏమైనా చిరంజీవి చేసింది తప్పు. అనైతికం, పరువు కోల్పోయే విషయం అని అంతా ఒప్పుకుంటున్నారు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సీఎం జగన్ హత్యకు పెద్ద కుట్ర.. ‘ఎల్లో బ్యాచ్’పై అనుమానాలెన్నో!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగినప్పుడు తెలుగుదేశం స్పందన, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పిచ్చి రాతలు, నిందితులను పోలీసులు ట్రేస్ చేయడంతో టీడీపీకానీ, వారి మీడియా కానీ మాటలు మార్చిన వైనం చూస్తే కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతా ఒక మాట మీద ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడరాదు. నిందితులకు మద్దతుగా సానుభూతి వచనాలు చెప్పడానికి యత్నించకూడదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక పదునైన రాయి ద్వారా హత్యాయత్నం నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నిటిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎక్కువగా కంగారు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఖండన తప్ప ఇతరత్రా స్పందించనవసరం లేని వాటిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలుత ఖండన చేసినట్లు కనిపించినా, ఆ తర్వాత నాటకం అంటూ ఆరోపించడం ఆరంభించారు. కానీ పోలీసులు కచ్చితంగా ఇది హత్యాయత్నమేనని తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అజిత్ సింగ్ నగర్ వద్ద జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ట్రాక్ రికార్డు అంత సవ్యంగా లేదు. ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి తగినట్లే ఆయన అనుచరులే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఇప్పుడు పోలీసుల రిమాండ్లోని అంశాలను బట్టి అర్థం అవుతుంది. ఈ రిపోర్టులో ఇంకా కుట్రదారులదాకా వెళ్లలేదు కానీ, భవిష్యత్తులో ఈ కేసులో కుట్రకు పాల్పడింది ఎవరు అన్న దర్యాప్తు జరుగుతుంది. అప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుతానికి ఒక నిందితుడు వేముల సతీష్ను పోలీసులు పట్టుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అజిత్ సింగ్ నగర్ వద్ద ఒక స్కూల్కు, ఒక దేవాలయానికి మధ్య ఉన్న చెట్ల వద్ద ఎవరికి కనబడకుండా ఈ దాడి చేశారు. పొరపాటున ఆ రాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంటికి తగిలి ఉంటే ఏమిటి పరిస్థితి! అంతేకాదు, నవరగంత వద్ద ఆ పదునైన రాయి తగిలి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేది. అంత పెద్ద గాయం కంటిపైన తగిలితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా అది కేవలం గులకరాయి దాడిగా అభివర్ణించడం నీచంగా ఉంది. పవన్ కల్యాణ్ వంటి రాజకీయ అజ్ఞాని ముఖ్యమంత్రికి వేసిన దండలో వచ్చిన రాయి కావచ్చని పిచ్చి వాదన తెచ్చారు. లోకేష్ వంటి పరిణితిలేని వ్యక్తి ఈ రాయిని తాడేపల్లి పాలెస్ నుంచి వచ్చిందని అహంకారపూరిత, కనీసం ఇంగితం లేని వ్యాఖ్య చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా తొలుత అయితే ఇదంతా పోలీసుల వైఫల్యంగా తేల్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసురుతున్నప్పుడు పోలీసులు ఏమి చేస్తున్నారని, వారు ఎందుకు ఆపలేకపోయారని నిలదీస్తూ వార్తలు రాశారు. అప్పటికి వీరికి ఒక నమ్మకం ఉండి ఉండాలి. ఈ రాయి విసిరిన వ్యక్తులను విజయవాడ పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని భావించి ఉండాలి. అందుకే అంత ధైర్యంగా పోలీసులదే వైఫల్యం అన్నట్లు ప్రొజెక్టు చేసే యత్నం చేశారు. చంద్రబాబు తన సహజ శైలిలో దీనిపై కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడి తన లక్షణాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారు. ఇక్కడ కీలకమైన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలుత ఈ దాడి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కలిసి ఆడిన డ్రామా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అనుమానితులను, నిందితులను పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయన్న సమాచారం రాగానే మాట మార్చి, అదేదో కావాలని చేసింది కాకపోవచ్చన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు అన్నా క్యాంటిన్ ఎత్తివేశారని కోపంతో, తన తల్లికి రోడ్షోకు వచ్చినందుకు ఇస్తానన్న 200 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో రాయి విసిరి ఉండవచ్చని బొండా అన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ కేసులో కనుక తనను కూడా ఇరికించాలని చూస్తే జూన్ నాలుగు తర్వాత ఆ పోలీసుల సంగతి చూస్తానని బెదిరించారు. ఇది అచ్చం చంద్రబాబు, లోకేష్ల నుంచి తర్ఫీదు పొందినట్లే మాట్లాడారు. వారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా, అధికారులను ,ముఖ్యంగా పోలీసులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ స్వరం మార్చింది. బీసీ వర్గానికి చెందినవారిని కేసులో పెడతారా అని అచ్చెన్నాయుడు విమర్శించారు. హత్యాయత్నం ఘటనలలో కులం చూసి కేసు పెట్టాలని కొత్త రాజ్యాంగాన్ని వీరు చెబుతున్నారు. అలాగైతే చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగినప్పుడు కూడా కులం చూసే కేసులు పెట్టారా? ఇక చంద్రబాబు అయితే ఈ కేసులో బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు కేసు దర్యాప్తే ఒక దశకు రాకుండానే చంద్రబాబుకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? అంటే ఈ హత్యాయత్నం ఎలా జరిగింది? అందులో ఎవరు ఉన్నారు? ఎవరికి సంబంధించినవారో ముందే తెలుసునని అనుకోవాలి. పోలీసు రిమాండ్ రిపోర్టులో వేముల సతీష్ అనే వ్యక్తి పదునైన రాయి విసిరితే, అందుకు ప్రేరేపించింది మరో వ్యక్తి అని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలపలేదు. ఈ రెండో నిందితుడు బొండా ఉమా అనుచరులలో ఒక ముఖ్యుడన్న ప్రచారం జరుగుతోంది. లేదా బొండా తన పేరును నిందితులు చెబుతారన్న భయం ఏమైనా ఏర్పడిందా?ఇప్పటికే సతీష్ తాను నేరానికి పాల్పడ్డానని అంగీకరించారు. ఆ తర్వాత అందుకు ఎవరు ప్రోద్బలం చేసింది కూడా చెప్పి ఉంటారు. తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం వీరికి పట్టుకుంది. దాంతో వెంటనే పోలీసులను విమర్శించడం ఆరంభించారు. అందుకు ఈనాడు, జ్యోతి వంటి అనైతికంగా మారిన మీడియాను వాడుకున్నారు. ఒక ముఖ్యమంత్రిపై అంత దాడి జరిగితే, సానుభూతి చూపకపోతే మానే, ఏకంగా నిందితులకు మద్దతు ఇచ్చేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వారు మాట్లాడుతున్నారు. నిజానికి టీడీపీలో ఎవరికి సంబంధం లేకపోతే, అసలు ఈ అంశం గురించి వారు ప్రస్తావించవలసిన పనే లేదు. కానీ అందుకు భిన్నంగా అతిగా వ్యవహరించి తెలుగుదేశం నేతలు వారికివారే ఆత్మరక్షణలో పడ్డారనిపిస్తుంది. ఈనాడు మీడియా నిందితులు ఉన్న వడ్డెర కాలనీకి వెళ్లి నిందితుల కుటుంబాలు చాలా బాధలో ఉన్నట్లు, వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నట్లు వార్తలు ప్రచారం చేశారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు వైఫల్యం అని రాసిన ఈ మీడియా ఇప్పుడు పోలీసులు నిందితులను పట్టుకోవడాన్ని తప్పు పడుతోంది. నిందితుడు రాళ్ళు విసరడంలో నేర్పరి అయి ఉండాలి. లేకుంటే ముఖ్యమంత్రి కంటిపై భాగానికి తగిలేలా ఎలా వేయగలుగుతారు? ఇతనికి సహకరించినవారిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తన పేరు ఎక్కడ వస్తుందోనని బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్లినటట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీసులను బెదిరించారు. నిందితుడు సతీష్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా అతనికి అనుకూలంగా వాదించడానికి లాయర్లు వచ్చారు. రోజుకు 250 రూపాయలు సంపాదించుకునే కుటుంబానికి ఇంత పెద్ద లాయర్లను పెట్టుకునే శక్తి ఎక్కడ నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఇక్కడ కూడా సరిగ్గా చంద్రబాబు పై వచ్చిన కేసుల్లో వాదించిన రీతిలోనే ఈ లాయర్లు వాదన చేసినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబుకు ఐటి నోటీసులు వస్తే, ఫలానా ఆఫీస్కు జ్యురిస్ డిక్షన్ లేదని సమాధానం ఇచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదించారు. ఇప్పుడు వేముల సతీష్ మైనర్ అని చెప్పడానికి ఆయన లాయర్లు యత్నించారు. కానీ పోలీసులు పకడ్బందిగా అతనికి పందొమ్మిదేళ్లని నిరూపించారు. తదుపరి సతీష్ రాయి వేయలేదన్న వాదనకు వెళ్లారు. సీఎంకు వేసిన దండ కర్ర గీసుకుని ఉండవచ్చని వాదించినట్లు అతని తరపు లాయర్ చెప్పారు. జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా గాయం అయిన సంగతిని విస్మరించారేమో తెలియదు. దండ కర్ర గీసుకుంటే ఒకరికే గాయం అవుతుంది కానీ, ఇద్దరికి అవ్వదు కదా! ఈ లాజిక్ మిస్ అయి మాట్లాడినట్లు అనిపిస్తుంది. మరో సంగతి చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకుడు అప్రూవర్గా మారడంతోనే అతనికి బెయిల్ వచ్చేసింది. కానీ ఆ కేసు కుట్రదారులన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి మాత్రం నెలల తరబడి బెయిల్ రావడం లేదు. ఈ కేసుతో ముఖ్యమంత్రి పై జరిగిన హత్యాయత్నం కేసును పోల్చి చూస్తే, రాయి విసిరిన వ్యక్తి సంగతి ఎలా ఉన్నా, వెనుక ఉన్న కుట్రదారులకు కీలక పాత్ర ఉంటుందన్నమాట. కుట్రదారులను పట్టుకుని జైలులో పెట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రముఖ నేతలపై జరిగిన హత్యాయత్నం, దాడుల కేసుల్లో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు సుముఖంగా ఉండేవారు కారు. కానీ ఇక్కడ సతీష్ రిమాండ్ సమయంలోనే లాయర్లు రావడం విశేషం. మామూలుగా అయితే పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగానే రిపోర్టు చూసుకుని న్యాయమూర్తి రిమాండ్కు పంపిస్తుంటారు. కానీ అతని తరపు లాయర్లు రావడంతో వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామం చూసిన తర్వాత, అతని ఆర్దిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, నిందితుడిని కాపాడడానికి పెద్దప్రయత్నమే జరుగుతోందన్న అనుమానం వస్తోంది. దీనికి కారణం ఆ నిందితుడు విచారణలో తమ పేర్లు చెబితే అది సమస్య అవుతుందన్న భయం కావచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత తెలుగుదేశం నేతలుకానీ, ఎల్లో మీడియా కానీ వ్యవహరించిన వైనం అనుమానాస్పదంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. వారు అతిగా స్పందించడం, గులకరాయి దాడి అని పనికిమాలిన రాతలు రాయడం, నిందితుడిని రక్షించే యత్నం చేయడం ఇవన్నీ గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు కనిపించడం లేదూ! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబూ.. డైలాగులు చెబితే సరిపోదు!
రాష్ట్రాన్ని కాపాడుకోవాలి... ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం... ప్రజలంతా ఫ్రస్టేషన్లో ఉన్నారు... ఇవన్నీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న డైలాగులు. ఇవన్నీ పాత డైలాగులే అయినా, కొత్తగా చెబుతున్నట్లు కనిపిస్తుంటారు. వీటిలో ఏ ఒక్కటైనా నిజమేనా అన్నదానికి సమాధానం దొరకదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం అంటే ఏమిటి? ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పనులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయనే కదా.. చంద్రబాబు సొదగా నిత్యం చెప్పేది. ఇక్కడే ఆయనలో బహురూపి కనిపిస్తాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసే పనులన్నీ తాను చేస్తానని అంటారు. కావాలంటే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తానని చెబుతారు. మరి అది రాష్ట్రాన్ని నాశనం చేయడం అవ్వదా అంటే జవాబు దొరకదు. అదేమంటే తాము సంపద సృష్టించి ఖర్చు చేస్తామని చంద్రబాబు ఒక పిచ్చి డైలాగు చెబుతారు. అదెలాగో మాత్రం వివరించరు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడితే ఈ నాలుగేళ్లు పూర్తిగా వ్యతిరేకించారు. అనేక నిందలు మోపారు. దానివల్ల రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేశారు. వలంటీర్లు అంటే ఏమిటి? వారు చేసేది ఏమిటి? మూటలు మోసే ఉద్యోగం. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారు! అని చంద్రబాబు విమర్శించేసేవారు. ఈయన దత్తపుత్రుడుగా పేరొందిన పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లు ఆడవాళ్లను ట్రాఫికింగ్ చేస్తున్నారని దారుణమైన నీచమైన ఆరోపణ చేశారు. ఇవి విన్నవారికి ఏమినిపిస్తుంది. ఓహో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలన్నీ తొలగిస్తారు కాబోలు అనుకుంటే, అందరిని ఆశ్చర్యపరచే విధంగా ప్రకటన చేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం ఐదువేల రూపాయలను పదివేల రూపాయలు చేస్తామని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదువేలు ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్న చంద్రబాబు ఇప్పుడు రెట్టింపు వేతనం ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడతానంటే జనం ఎవరైనా నమ్ముతారా! గతంలో 2014లో లక్ష కోట్ల రుణాల మాఫీ చేస్తానని అంటే చంద్రబాబును నమ్మి ఓటేసిన వారిని ఎలా నట్టేట ముంచింది తెలిసిన వారంతా ఆయన ఏదో ఒకటి ఇలాగే చెబుతారులే అని సరిపెట్టుకుంటున్నారు. అసలు విశ్వసనీయతతో నిమిత్తం లేకుండా మాట్లాడడం అంటే ఇది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్దాప్య పెన్షన్లను రెండువేల నుంచి మూడువేల రూపాయలకు పెంచితే రాష్ట్రం నాశనం అయినట్లు కదా! ఆ మాట నేరుగా చెప్పకపోయినా, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే కదా చంద్రబాబు చెబుతూ వస్తోంది. మరి తాను అధికారంలోకి వస్తే నాలుగువేల రూపాయల పెన్షన్ ఇస్తానని అంటున్నారు. అది బొంకడమా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాంటి హామీనే ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే చంద్రబాబు కూడా పొరపాటున అధికారంలోకి వస్తే అలాగే చేస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయం ఉండదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు చేయూత స్కీమ్ కింద ఏడాదికి 18750 రూపాయలు ఇస్తుంటే రాష్ట్రం పాడైపోతోందని చంద్రబాబు బృందం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఆయన మీడియా ప్రచారం చేసింది. చిత్రంగా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన వాగ్ధానాలలో ప్రతి మహిళకు 1500 ఇస్తానని అంటున్నారు. అప్పుడు రాష్ట్రం పాడవదా? అంటే సమాధానం ఉండదు. అమ్మ ఒడి కింద స్కూల్కు వెళ్లే పిల్లల కోసం పదిహేను వేలు ఇస్తానంటే డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని పరోక్షంగా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు అదే స్కీమ్కు తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అక్కడితో ఆగలేదు. సంసారాలు చేసుకునేవారంతా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఒక దిక్కుమాలిన సలహా ఇస్తున్నారు. రైతు భరోసా కింద వైఎస్ జగన్మోహన్రెడ్డి 13500 ఇస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నది వీరి మనసులో మాట. కానీ 2024 ఎన్నికలలో రైతులను మోసం చేయడానికి ఏకంగా ఇరవైవేల చొప్పున ఇస్తానని అంటున్నారు. గతంలో రుణమాఫీ చేస్తానని చెప్పి జనాన్ని ఆ తర్వాత ఆశపోతులన్నట్లుగా ఇప్పుడు మాత్రం దూషించరని గ్యారంటీ ఏమైనా ఉందా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా అనేది ఆయనే.వలంటీర్ల సేవలను నిమ్మగడ్డ ద్వారా నిలుపుదల చేయించిన తర్వాత లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు కదా! అని చెప్పింది చంద్రబాబే! ఇవన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కదా ఇచ్చింది. ఇంతకీ ఏ రకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరికి అర్దం కాదు. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేసింది చెప్పరు. తాను ఇన్ని పోర్టులు నిర్మింప చేశానని చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు పోర్టులను నిర్మిస్తున్న ఘనత పొందారు. అవే కాదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ లాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే కదా! అయినా రాష్ట్రం నాశనం అయిందని అంటారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని నిర్మించడం, 800 గ్రామాలకు వాటర్ స్కీమ్ అమలు చేయడం రాష్ట్రాన్ని పాడు చేయడమా? లేక తన పద్నాలుగేళ్ల పాలనలో ఆ ఆస్పత్రి నిర్మించని చంద్రబాబు రాష్ట్రాన్ని పాడు చేసినట్లా? రాజధాని అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను సమీకరించి పంటలు లేకుండా చేసిన చంద్రబాబు విధ్వంసానికి పాల్పడినట్లా? కాదా! అన్ని హంగులు ఉన్న విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా లక్ష కోట్లు ఆదా చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేసినట్లా!ప్రతిదానికి ఒక సినిమా డైలాగు మాదిరి చెప్పి జనాన్ని తప్పుదారి పట్టించాలని అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్లు కాదు. విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాల్ను నిర్మించడం ద్వారా వేలాది మందిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తే రాష్ట్రం ఏ రకంగా నాశనం అవుతుంది? మరి అదే పని చంద్రబాబు తన పాలనలో ఎందుకు చేయలేకపోయారు? బడులకు రంగులేస్తే సరిపోతుందా అని అంటారు. మరి తన హయాంలో వాటిని బాగు చేయడానికి ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పరు. ఆస్పత్రులను వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగు చేస్తే రాష్ట్రం పాడైందట. చంద్రబాబు పట్టించుకోకుండా ఉంటే అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగం జరిగినట్లా? ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక స్థాయిలో అవసరం లేదని అంటారు. అలాంటప్పుడు తన కొడుకును, మనుమడిని ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదంటే మాత్రం నోరు పెగలదు. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు. ప్రభుత్వ స్కూళ్లలో ఉంటే తప్పని చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కాపాడతారట. ముప్పైఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే రాష్ట్రం పాడైపోయినట్లు.. తన హయాంలో ఒక్క ఇల్లు కట్టకుండా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేసినట్లా? పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి నిర్మాణాలు చేస్తుంటే రాష్ట్రం ఎలా నాశనం అవుతుందో తెలియదు. చంద్రబాబు టరమ్లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాకపోయినా, రాష్ట్రాన్ని బాగా అభివృద్ది చేసినట్లు! ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి అడ్డగోలు మీడియాను అడ్డం పెట్టుకుని పడికట్టు డైలాగులు చెబితే సరిపోదు. స్పష్టంగా ఏ రకంగా రాష్ట్రం నష్టపోతోంది చెప్పి, ఆ తర్వాత తాను ఏమి చేస్తానో చెప్పగలిగితే ఆలోచించవచ్చు. కేవలం ప్రజలను భ్రమలలో పెట్టాలన్న దృష్టితోనే ఇలాంటి మాటలు చెబితే ప్రజలు ఎవరు అభివృద్ది చేసేది, ఎవరు చేయనిది అర్ధం చేసుకోగలరు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘‘రాళ్లతో కొట్టండి.. మసి చేయండి!’’.. ఇంత జరిగినా మారని బాబు తీరు
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఏమన్నారో గమనించారా! తనకు ప్రత్యర్ధిగా ఉన్న వేరే పార్టీ నేతను రాళ్లతో కొట్టండి అని చెబుతున్నారు. పైగా ఆ నేతను ఉద్దేశించి దున్నపోతు అని కూడా సంబోధిస్తున్నారు. మరో సందర్భంలో ఏమన్నారంటే తమ్ముళ్లూ మనం కొట్టే దెబ్బకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మసి అయిపోవాలి.. తెలుగుదేశం కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. టీడీపీ కార్యకర్తలు ప్రత్యర్దులపై రాళ్లతో దాడి చేయాలనే చెప్పడమే కదా! వైఎస్ జగన్మోహన్రెడ్డిను పట్టుకుని అంతమాట అన్నారంటే మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది కదా! ఈ వీడియోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు చూపించారు. ఇవి విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది. చంద్రబాబు మాటలకు రెచ్చిపోయిన ఎవరో టీడీపీ దుండగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసిరారని వైఎస్సార్సీపీ వారు అనుకోవడంలో తప్పు ఏమి ఉంటుంది? ఆ అనుమానం నిజమా? కాదా? అన్నది పోలీసులు నిర్ధారిస్తారు. ప్రాథమికంగా చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికు రాజకీయంగా ఉన్న ప్రధాన ప్రత్యర్ధి పార్టీపైనే సందేహాలు వస్తాయి. దానికి తగినట్లుగానే ఈ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు స్పందించిన తీరు కూడా పలు సంశయాలు కలిగిస్తుంది. చంద్రబాబేమో కొంత తెలివిగా దాడిని ఖండిస్తూ నిష్పాక్షిక విచారణ చేయించి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు. అంటే దాని అర్దం ఏమిటి? ఇది దుండగులు చేసిన పని అయినా, అధికారులను తప్పు పట్టే రీతిలో ఆయన మాట్లాడారు. ఓకే! అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరడం తప్పుకాదు. కానీ అందులో కూడా అంతర్లీనంగా మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, రాయి వేసిన వారిని కాపాడాలన్న భావన ఆయనలో ఉన్నట్లు అనిపించదా! మరుసటి రోజుకు మాట మార్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వచ్చి పడింది గులకరాయి అని నీచ ప్రచారం ఆరంభించారు. చంద్రబాబు అలా మాట్లాడితే అధికారిక ఎక్స్లో తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్య దారుణంగా ఉంది. "కమలాసన్" అంటూ ఎద్దేవ చేస్తూ ఇదంతా డ్రామా అన్నట్లుగా వ్యాఖ్యానించింది. దీనికి ,చంద్రబాబుకు సంబంధం ఉండదా? అంటే.. కచ్చితంగా ఉంటుంది. ప్రతి దానిలోను ఆయన డబుల్ గేమ్ ఆడుతుంటారు. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం అయినా, వలంటీర్ల సంగతి అయినా, మోదీ, సోనియాలపై వ్యాఖ్యలు అయినా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడి యుటర్న్ తీసుకోవడం ఆయనకు సర్వసాధారణం. చంద్రబాబు దాదాపు పద్నాలుగేళ్లపాటు సీఎంగా ఉన్నారు. పదిహేనేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంత సీనియర్ ఎంత మర్యాదగా, ఎంత హుందాగా ఉండాలి! కానీ తన రాజకీయ స్వార్దం ముందు ఆయనకు అవేవి అక్కర్లేదు. అదే తనను ఎవరైనా పొరపాటున ఏమైన అంటే మాత్రం అమ్మో.. నన్ను అన్నారు.. నేను ప్రజల కోసం పడతాను అంటూ డ్రామా రక్తి కట్టిస్తారు. ఆయనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా అంతా తబలా వాయిస్తాయి. ఆయన మాత్రం ఎదుటి వ్యక్తిని ఎంత మాట పడితే అంత అనేస్తారు. కొన్నిసార్లు అసలు ఈయన మతి ఉండి మాట్లాడుతున్నారా అన్న సంశయం కూడా వస్తుంది. టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణిస్తూ ప్రకటనలు చేశారు. కోడికత్తి-2 అంటూ వ్యంగ్య వ్యాఖ్యనాలు చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏకంగా ఆ రాయి తాడేపల్లి పాలస్ నుంచి వచ్చిందంటూ ఒక పిచ్చి వ్యాఖ్య చేసి తన రాజకీయ అపరిపక్వతను, పిల్ల చేష్టను తెలియచేసుకున్నారు. జనసేన నేత నాగబాబు మాత్రం తొలుత అభ్యంతర వ్యాఖ్య చేసి తదుపరి దానిని తీసివేసి పద్దతిగా ఖండించారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.. ఏ నాయకుడి మీద ఎలాంటి దాడి జరిగినా, ముందుగా అంతా ఖండించాలి. తమ పార్టీపై ఏదైనా ఆరోపణ వస్తే అది నిజం కాకపోతే అంతవరకు చెప్పవచ్చు. మరి అధికార పార్టీ తమపై ఆరోపణ చేయవచ్చా అని ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు వైఎస్సార్సీపీ బాధిత స్థానంలో ఉంది. తన అనుమానాన్ని వెల్లడించింది. అందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. పోలీసుల దర్యాప్తులో ఇలాంటివన్నీ తేలే అవకాశం ఉంటుంది. అంతెందుకు! ఏపీలో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డా, వారిలో ఒకరిని వైఎస్సార్సీపీ పార్టీ అని పులిమి ఈనాడు మీడియా ప్రచారం చేయడం లేదా? రాష్ట్రంలో జరిగే చిన్న నేరమైనా, పెద్ద నేరమైనా, దానిని వైఎస్సార్సీపీకి అంటకట్టే విధంగా అది వైఎస్సార్సీపీ నేతల పనే అనుకుంటున్నారని ఈనాడు మీడియా ఎందుకు నిర్లజ్జగా రాస్తోంది. దానిని తప్పు అని తెలుగుదేశం వారు అనడం లేదే! పైగా ఈనాడు మీడియా వాగడం, టీడీపీ ప్రచారానికి పెట్టడం, రాష్ట్రంలో ఏదో అయిపోయిందన్న తప్పుడు భావన కలిగించే యత్నం చేయడం నిత్యకృత్యం అయిందే. అందువల్ల వైఎస్సార్సీపీ నేతలు తమకు ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి ఆధారంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వంటివారు తన ప్రసంగాలలో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియోలను చూపిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు వైఎస్సార్సీపీవారిని బట్టలూడదీసి కొడతాం అని ఎన్నిసార్లు అన్నారో గుర్తు చేసుకోండి. అందువల్లే టీడీపీ అభిమాని లేదా, కార్యకర్త, లేదా మూర్ఖుడు ఎవరైనా మానసికంగా పర్వర్ట్ గా మారి ఇలా దాడి చేశారు అన్న అభిప్రాయం కలగదా! గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా విజయవాడ నగర వీధులలో వేలాది జనం తండోపతండాలుగా తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ప్రకటిస్తుంటే చూసి ఓర్వలేనివారు ఇలాంటి ఘాతుకానికి పాల్పడినట్లు అర్థం అవడం లేదా!రాయలసీమలో ఆరంభం అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్ యాత్ర మొదటి నుంచి ఒక రికార్డు స్థాయిలో జనాదరణ పొందుతోంది. రాయలసీమ ఆయనకు బాగా పట్టుఉన్న ప్రాంతం కనుక వచ్చారులే అనుకుంటే గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో అదే స్థాయిలో జనం రావడం టీడీపీ వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దాంతో వారికి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతవరకు తమకు కూడా విజయావకాశాలు ఉంటాయని ఆశతో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి నిరాశ ఆవరించే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి బలహీనవర్గాలవారు, మహిళలు, పిల్లలు వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్ యాత్రలో పాల్గొని ఆయనకు సంఘీబావం ప్రకటిస్తున్న వైనం వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఐదేళ్ల పాలన తర్వాత ఈ స్థాయిలో ఇలాంటి జన స్పందన రాలేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనం వీదులలోకి వచ్చి స్వాగతం చెప్పారు. కానీ ఏడేళ్ల పాలన తర్వాత ఎన్టీఆర్ జనంలోకి వెళితే స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. ఆయన 1989లో తొలుత ఉమ్మడి ఏపీలో మేడ్చల్ వద్ద సభ పెడితే కేవలం కొద్ది వందల మంది మాత్రమే సభకు వచ్చారు. అప్పుడే టీడీపీ ఆ ఎన్నికలలో ఓడిపోతుందని అర్దం అయింది. చివరికి ఎన్టీఆర్ సైతం కల్వకుర్తిలో ఓటమి చెందారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయం చూస్తే ఆయనేమీ సినీ నటుడు కాదు. పెద్ద అందగాడు కాదు. గొప్ప వక్త అని కూడా చెప్పలేం. కానీ తాను చెప్పదలచుకున్నది ప్రజలకు అర్దం అయ్యేలా స్పష్టంగా చెబుతూ, ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ స్పీచ్ ఇస్తుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో తీసుకువచ్చినన్ని సంస్కరణలు మరే సీఎం తీసుకురాలేదన్నది పచ్చి నిజం. అలాగే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఈయనే. ఇన్ని అభివృద్ది పనులు చేపట్టింది కూడా జగనే. వీటన్నిటి ఫలితమే ఐదేళ్ల పాలన తర్వాత స్వచ్ఛందంగా ప్రజలు ఆయనను చూడడానికి తరలివస్తున్నారు. దీనిని గమనించే చంద్రబాబు నాయుడు తాను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరే చేస్తానని చెప్పవలసి వచ్చింది. ఒకదఫా సీఎంగా జగన్ పాలనను.. డెబ్బై ఐదేళ్ల వృద్దుడు అయిన చంద్రబాబు తాను కూడా కొనసాగిస్తానని చెప్పడమే పెద్ద విజయం కాదని ఎవరైనా అనగలరా! వలంటీర్ల మొదలు, అమ్మ ఒడి వంటి స్కీముల వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డినే చంద్రబాబు ఫాలో అయ్యే పరిస్థితి రావడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుభూతి కోసం నాటకాలు ఆడవలసిన అవసరం లేదని తేటతెల్లం అవుతోంది. టీడీపీ వారు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే వారి కంగాళీతనం బయటపడుతోందన్నమాట. గత ఎన్నికల ప్రచారం సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో ఒక కత్తితో ఒక యువకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి చేశాడు. అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవాలి. ఎందుకంటే ఎయిర్ గన్ లేదా కాట్ బాల్ పంగలకర్ర వంటి దానితో రాయి లేదా పెల్లెట్ పెట్టి కొట్టి ఉండాలి. అందువల్లే అంత పదునుగా గాయం అయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటి పై భాగాన తగిలి గాయం అయింది. అదే పొరపాటున నవరగంత వద్ద తగిలి ఉంటే ఎంత ప్రమాదమో ఊహించుకోవడమే కష్టం. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ప్రాథమిక చికిత్స తీసుకుని మళ్లీ జనానికి అభివాదం చేస్తూ వెళ్లారు. జనం ఆయన బస్ వెంట పరుగులు తీస్తూ అన్నా.. ఆరోగ్యం జాగ్రత్త.. అని చెప్పారంటేనే ఆయనపై వారిలో ఎంత ప్రేమ ఏర్పడిందో తెలుస్తుంది. అంతగా ప్రజలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి కనెక్ట్ అయ్యారని అర్దం. సానుభూతి కోసం ఎవరైనా కన్ను పోగొట్టుకుంటారా? ప్రాణం పోగొట్టుకుంటారా? ఇంత నీచంగా మాట్లాడతారా? 2003లో చంద్రబాబు నాయుడు తిరుమల వెళుతుండగా, అలిపిరి వద్ద బాంబులు పేలాయి. ఆయన అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా పరామర్శకు వెళ్లి, తిరుపతిలో ఈ దాడికి నిరసనగా దీక్ష చేశారు. ఆ రోజు ఆయన అంత హుందగా ఉంటే, ఈరోజున తెలుగుదేశం పార్టీ ఇంత ఘోరంగా వ్యవహరించింది. అప్పుడు అదంతా నక్సల్స్ పని అని పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చారు కానీ, పోలీసుల నిర్లక్ష్యం అంటూ డైవర్ట్ చేసే యత్నం చేయలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం కానీ, ఆ పార్టీ మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, దుండగులను కాపాడే యత్నం చేయడం దుర్మార్గంగా కనిపిస్తుంది. నిజానికి ఇలాంటి ఘటనలు సృష్టించడంలో కానీ, సానుభూతి డ్రామాలు ఆడడంలో కానీ టీడీపీకి ఉన్న అనుభవం తక్కువేమీ కాదు. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్.బి స్టేడియంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్పై మల్లెల బాబ్జి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన డ్రామా అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మల్లెల బాబ్జి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అలిపిరి బ్లాస్ట్ తర్వాత చాలా రోజులు చంద్రబాబు కట్టు కట్టుకుని తిరిగే వారు. సానుభూతి వస్తుందని అనుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ క్రమంలో చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో చేతికి కట్టు తగిలించుకుంటున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత రోశయ్య గమనించి, నిమ్స్ డాక్టర్లను ఉద్దేశించి చమత్కారంగా ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబుకు పొరపాటున ఒక చేతికి బదులు మరో చేతికి కట్టు తగిలిస్తున్నారని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కట్టు లేకుండానే తిరిగారు. ప్రజలలో అలజడి కోసం ఎలాంటి అశాంతి నైనా సృష్టించాలన్నది చంద్రబాబు విధానంగా ఉంటుందని పలువురు టీడీపీ నేతలు చెబుతుంటారు. మాజీ మంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు జిల్లాలకు ఫోన్లు చేయించి బస్లు దగ్దం చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. బంద్ అంటే బస్ల అద్దాలు పగలకొట్టడమో, బస్లు దగ్ధం చేయడమో జరగకపోతే ఎలా అని.. ఈ చంద్రబాబు అంటారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో కూడా ప్రస్తావించారు. అమిత్ షా పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు నల్ల బెలూన్లు సెక్యూరిటీకి విఘాతం కలిగించేలా ఎగురవేశారు. పుంగనూరు, ఆంగళ్లు వద్ద టీడీపీ కార్యకర్తలను దాడులు చేయాలని రెచ్చగొట్టారు. టీడీపీ కార్యకర్తలు పోలీసు వ్యాన్ దహనం చేయడమే కాకుండా, రాళ్లు విసరడంతో ఒక పోలీసు కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఇదంతా చంద్రబాబు నైజం అని అంతా తెలుసుకున్నారు. రాజమండ్రి, కందుకూరు, గుంటూరులలో తన వల్ల తొక్కిసలాట జరిగి అనేక మంది తెలిసినా, మొత్తం పోలీసులపై తోసేసి చంద్రబాబు తప్పించుకున్నారు. ఆయన కుట్రదారుడిగా ముద్ర పొందినా, దానిని కనిపించనివ్వకుండా, రామోజీ, రాధాకృష్ణ వంటి మీడియా ప్రముఖులు కవర్ చేసేసి చాలా పవిత్రుడుగా చూపించే యత్నం చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు దొరికిపోతుంటారు. అందుకు ఉదాహరణే తాజాగా రాళ్లతో కొట్టండి.. మసి చేయండి అని అన్న చంద్రబాబు వ్యాఖ్యల వీడియోలు. సోషల్ మీడియా రాబట్టి ఈ మాత్రం అయినా ప్రజలకు తెలుస్తోంది. లేకుంటే ఎల్లో మీడియా ప్రజలను ఎప్పటికి మోసం చేస్తూనే ఉండేది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిని పక్కదారి పట్టించడానికి టీడీపీ కూటమి ఏదైనా ప్లాన్ చేస్తుందా అన్న డౌటు కూడా చాలమందిలో ఉంది. అనుకున్నట్లే ఆదివారం సాయంత్రానికి తనపైన రాళ్లు పడ్డాయని చంద్రబాబు సీన్ సృష్టించారు. అది నిజమా? కాదా? అన్నది తేలవలసి ఉంటుంది. పవన్ కల్యాణ్పై కూడా దాడి జరిగిందని చంద్రబాబు చెప్పేశారు. తీరా చూస్తే పవన్ కల్యాణ్పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం అయింది. దీనిని బట్టే వీరు ఎలా ప్రవర్తిస్తున్నది అర్థం కావడం లేదా! అందువల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు అనండి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనండి.. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సంయమనంతో వ్యవహరించారు. తన నొప్పిని భరిస్తూ జనంతో మమేకం అయిన తీరు అభినందనీయం. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పురంధేశ్వరి మాటల తూటాలతో.. మూడు పార్టీల్లో అయోమయం!
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక ప్రకటన అందరిని ఆశ్చర్యపరచింది. మూడు పార్టీలదీ ఒకటే ఎజెండా అని ఆమె అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని దించడమేనని ఆమె చెప్పారు. ఇదా ఎజెండా అంటే అని ఒరిజినల్ బీజేపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. టిక్కెట్ల విషయంలో వ్యక్తం అవుతున్న నిరసనలు, పార్టీల మధ్య అవగాహన కుదుర్చుకోవడంలో ఒక ప్రాతిపదిక లేని వైనంపై కొందరు అసహనం చెందుతున్న తీరు కానీ పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చాయి. వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న పురందేశ్వరి ఎలాగోలా తాను ఎంపీగా గెలిస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఛీప్ సెక్రటరీ, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై తెలిపిన నిరసన సహజంగానే పార్టీలోని అయోమయ పరిస్థితిని బహిర్గతం చేసింది. "ఆదోనిలో బీజేపీకి పట్టుంది. మిగిలిన ఏడు స్థానాలు ఏ ప్రాతిపదిక మీద బీజేపీకి కేటాయించారో అర్థం కావటం లేదు. ముందే అక్కడ ఎవరు బీజేపీ తరఫున పోటీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయించి తర్వాత బీజేపీ కేటాయించారా అనే అనుమానం చాలామంది బీజేపీ వారికి కలుగుతున్నది." అని ఆయన అన్నారు. దీనికి పురందేశ్వరి వద్ద జవాబు ఉన్నదా? గతంలో తీవ్ర వైరం ఉన్నా, రాజకీయ పదవులపై ఉన్న ఆశతో ఇప్పుడు పురందేశ్వరి తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజీపడి రాజకీయం చేస్తున్నారు. దీనివల్ల ఆమె ప్రతిష్ట మసకబారుతున్నా, పట్టించుకునే దశలో లేరు. పైగా మూడు పార్టీల కూటమిని ఆమె త్రివేణి సంగమం అని అంటున్నారు. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామి టీడీపీ కానీ, ఆ తర్వాత జనసేన కానీ ఈ కూటమిని పవిత్ర సంగమం అని భావించడం లేదు. తప్పనిసరి తద్దినం అని చంద్రబాబు మాటల్లో ఇప్పటికే వ్యక్తం అయింది. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, కేసులకు ఉపయోగపడతారులే అని తప్ప వేరే లక్ష్యం లేదని ఆయన ఓపెన్ గానే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ను బీజేపీ నేతలు ఈ పొత్తు విషయంలో ఎందుకు చీవాట్లు పెట్టారో ఎవరూ వివరించలేదు. ప్రధాని మోడీ ఏపీ ప్రచార సభకు వచ్చి ఏమైనా కొత్త హామీ ఇచ్చారా అంటే అదీ లేదు. ఇష్టం లేని పెళ్లికి వచ్చినట్లు వచ్చి వెళ్లారు. కానీ పురందేశ్వరి మాత్రం ఒకటే ఎజెండా అని చెబుతున్నారు. ఏదైనా పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడానికి ఒక కామన్ ఎజెండా ఉండాలి. దానిపై ముందుగానే చర్చలు జరిపి ఒక ప్రకటన చేయాలి. అలాంటిది ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీ పక్షాన ఆయన సూపర్ సిక్స్ అని కొన్ని వాగ్దానాలను ప్రకటించారు. వాటన్నిటిని బీజేపీ ఆమోదిస్తుందా? అన్నది ఆమె చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటటీలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అవన్నీ ఆచరణ సాద్యం కానీ హామీలని ప్రచారం చేసింది. అలాంటిది ఏపీలో అంతకు మించి టీడీపీ హామీలు ఇచ్చింది. వాటన్నిటిని కామన్ ఎజెండాలో పెడతారా? 2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ల ఫోటోలతో కొన్ని హామీలు ఇచ్చారు. నిజానికి అవన్నీ టీడీపీ ప్రకటించినవి. కానీ కరపత్రంపై మోడీ పోటో కూడా ఉండడంతో బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వచ్చింది. కానీ బీజేపీ నేతలు రైతు రుణమాఫీ వంటి కొన్ని హామీలు తమకు సంబంధం లేనివని ఆ తర్వాత చెప్పేవారు. ఇప్పుడు కూడా ఎన్నికల వరకు కామన్ ఎజెండా అని ప్రచారం చేసి, ఆ తర్వాత ఎవరికి వారు తమది కాదని చేతులెత్తేస్తే ఎవరు బాద్యత వహిస్తారు. అంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎవరికి తోచిన హామీలు అవి ఇచ్చి తర్వాత తమకు సంబంధం లేదని ప్రజలను మోసం చేస్తారా? ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలుమార్లు మాట మార్చారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఆయన హోదా విషయంలో తన తాజా వైఖరి ఏమిటో చెప్పలేదు. బహుశా ప్రత్యేక హోదా వంటి అంశాలను డిమాండ్ చేయవద్దని బీజేపీ కండిషన్ పెట్టిందేమో తెలియదు. ఎందుకంటే ఆయన దీనిపై బీజేపీని ప్రశ్నించకుండా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిను విమర్శిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా తేలేదని చెబుతున్నారు. మరి ఈ అంశంలో బీజేపీ స్పందిస్తుంందా? రైతుల రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీకి చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు కామన్గా అంతా కలిపి ప్రచారం చేసుకున్నారు. కానీ అమలు టైమ్ వచ్చేసరికి చంద్రబాబు కేంద్రం సహకరించడం లేదని విమర్శించేవారు. అలాగే బీజేపీ తాము ఇలాంటి హామీలను సమర్ధించబోమని చెప్పేది. బీజేపీ వారు కోరితేనే తాను పొత్తు పెట్టుకున్నానని ముస్లింల సమావేశంలో చంద్రబాబు చెప్పిన విషయంపై పురందేశ్వరి ఇంతవరకు వ్యాఖ్యానించకపోవడం కూడా సహజంగానే విమర్శలకు దారి తీస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ముస్లిం రిజర్వేషన్ లను చంద్రబాబు కూడా కొనసాగించారు. ఇప్పుడు కూడా ముస్లింలను రక్షించింది తానే అని అంటున్నారు. దీనికి సంబందించి ఇద్దరి మద్య వైరుధ్యాలు ఉన్నాయా. ఒక కామన్ ఎజెండా పెట్టుకుంటారా. చంద్రబాబుతో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిస్తారా? గతంలో అనేక అంశాలలో బీజేపీని చంద్రబాబు తీవ్రంగా దుయ్యబట్టారు. వాటన్నిటిలో ఎవరు రాజీపడ్డారు? టీడీపీనా? లేక బీజేపీనా? త్రిబుల్ తలాఖ్ను కేంద్రం రద్దు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ముస్లింలను అరెస్టు చేయడానికే బీజేపీ కుట్ర అని ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తన వైఖరి మార్చుకున్నారా?లేక బీజేపీనే ఏపీ వరకు చంద్రబాబు కోసం తన సిద్దాంతాన్ని వదలుకుందా? ఇన్ని వైరుద్యాల మధ్య పవిత్ర పొత్తుగా బీజేపీ అధ్యక్షురాలు భావించి ఏకంగా త్రివేణి సంగమంగా అభివర్ణించడం ప్రజలను మోసం చేసే యత్నమే అని చెప్పాలి. మన దేశంలో అనేక నదులు కాలుష్యంతో నిండిపోయాయి. త్రివేణి సంగమం పరిస్థితి కూడా అంతే.అలాగే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు కూడా అనైతికం, అపవిత్రం. కేవలం అధికార కాంక్షతో, పదవీ లాలసతో ప్రజలను మోసం చేయడానికి ఈ మూడు పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నాయి. వారికి చిత్తశుద్ది ఉంటే 2014లో తమ కూటమి ఏమి చెప్పింది? ఏమి చేసింది? ఎందుకు విడిపోయింది? ఎందుకు మళ్లీ ఇప్పుడు కలుస్తున్నది? పార్టీల మద్య ఉన్న వైరుద్యాలను ఏమైనా పరిష్కరించుకున్నారా?... మొదలైనవాటి గురించి స్పష్టత ఇచ్చి, ఆ తర్వాత కొత్త హామీలపై ఒక అవగాహన వచ్చామని ప్రజలకు చెప్పగలగాలి. లేకుంటే వీరికి కామన్ ఎజెండా ఏమీ లేదన్న సంగతి ప్రజలకు బాగానే అర్దం అవుతుంది. ఒకరిని దించడానికి కూటములు కట్టడం కాదు. తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పగలిగితేనే ప్రజలు నమ్ముతారు? ఏపీలో ఏర్పడిన కూటమికి ఆ లక్షణం లేదు. పరస్పర అవసరాల కోసం ఏర్పడిన ఈ కూటమి, గతంలో మాదిరే ఎన్నికల తర్వాత ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా ప్రజలను మోసం చేయరన్న గ్యారంటీ ఏముంది? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బలైపొవాలంటే.. బాబే 'కేర్ ఆఫ్ అడ్రస్'!
చంద్రబాబు రాజకీయ క్రీడలో బలైన నేతలు ఎందరో ఉన్నారు. ఆయన చరిత్ర చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం.. జెండా మోసిన వారిని కాదని డబ్బున్న వారికి టికెట్లు ఇవ్వడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ప్రతి ఎన్నికల సమయంలో తన స్వార్థ బుద్ధిని చాటుకున్న ఆయన.. ఈ ఎన్నికల్లోనూ తన నైజాన్ని చాటారు. జిల్లాకు చెందిన సీనియర్లకు శఠగోపం పెట్టారు. గత ఐదేళ్లూ వాడుకుని అర్ధంతరంగా తమను బలిపీఠం ఎక్కించడంతో వారంతా నైరాశ్యంలో మునిగిపోయారు. చివరి నిమిషం వరకూ టికెట్ ఆశచూపి ఆఖరున రూ.కోట్లకు పడగలెత్తిన వారికి పెద్దపీట వేయడంతో నాయకులు ఒక్కసారిగా కుదేలై పోయారు. బాబును నమ్ముకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని వాపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేసినా ఫలితమేది? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి రెండున్నర దశాబ్దాలుగా పార్టీకి కష్టపడి పనిచేశారు. గడిచిన రెండున్నరేళ్లుగా ఆయన కుమారుడు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేసినా ఆయన్ను దూరం పెట్టి కాంట్రాక్టర్ అమిలినేనికి సీటు ఇవ్వడంతో ఉన్నం రాజకీయ నిరుద్యోగి అయ్యారు. మరో నేత ఉమామహేశ్వరనాయుడుకూ మొండి చేయి చూపడంతో ఆయన చంద్రబాబును నమ్ముకోవడం సరికాదని, ఇక్కడ భవిష్యత్తు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జితేందర్ గౌడ్కూ మొండిచేయి గుంతకల్లు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరామ్కు టికెట్ ఇవ్వడం జిల్లా మొత్తం బాబు నైజాన్ని చాటింది. మొన్నటివరకూ తిట్టిపోసిన గుమ్మనూరుకు టికెట్ ఇచ్చారు. దీంతో బాబు ఎంతటి మోసానికైనా సమర్థుడే అంటూ మాజీ ఎమ్మెల్యే జితేందర్గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు రాజకీయ క్రీడలో జితేందర్గౌడ్ పరాజయం పాలయ్యారని నియోజకవర్గం ప్రజలు భావిస్తున్నారు. గుమ్మనూరు చేరిక జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపిస్తోందని టీడీపీ కేడర్ భావిస్తోంది. వైకుంఠం శకం ముగిసినట్టే.. రెండు దశాబ్దాలుగా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని భావిస్తున్నారు. పార్టీ అంతా నాదే అని భావించే ఆయనకు మొండిచేయి చూపి దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇచ్చారు. ప్రసాద్ రాక వెనుక భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు చర్చ జరుగుతోంది. దీంతో ప్రభాకర్ చౌదరి రాజకీయ శకం ముగిసినట్టేనని, చేసేదేమీ లేదని ఆయన వర్గం భావిస్తోంది. నిమ్మలకు నమ్మక ద్రోహం.. ఓట్లకోసం కులం కావాలి.. డబ్బు కోసం కొత్త నేతలు కావాలి.. ఇదీ చంద్రబాబు తీరు. బీసీ వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్ప పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో రెండు దఫాలు నిమ్మల ఎంపీగా చేశారు. అలాంటి వ్యక్తికి ఈ సారికి టికెట్ ఇవ్వలేదు. దీంతో చేనేత వర్గానికి చెందిన ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇక రాజకీయ శకం ముగిసినట్టేనని తెలుస్తోంది. చంద్రబాబుపై ఆయన కత్తులు నూరుతున్నారు. త్రుటిలో తప్పించుకున్న ఆ ఇద్దరు.. మరో ఇద్దరు సీనియర్ నేతలు బాబు వెన్నుపోటునుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ఇద్దరే బీకే పార్థసార«థి, పల్లె రఘునాథరెడ్డి. చివరి వరకూ ఇద్దరికీ టికెట్లు లేవు. చివరన ఇక తప్పని స్థితిలో బీకే పార్థసారథికి హిందూపురం ఎంపీ సీటు ఇవ్వగా.. పల్లె రఘునాథరెడ్డి కోడలికి పుట్టపర్తి టికెట్ ఇచ్చారు. అయితే, ఈ ఇద్దరూ చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా చంద్రబాబు వలలో నుంచి బయటపడ్డారని పార్టీలోని నాయకులే అంటుండడం గమనార్హం. ఇవి చదవండి: మళ్లీ పలికిన బాబు చిలక -
షర్మిల రాజకీయం.. ఘోరంగా మిస్ ఫైర్!
అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. అని ఒక పాట ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే అయినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి అయిన షర్మిలను ఏపీ రాజకీయాలలోకి తీసుకు వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఆదరించే వర్గాలలో కొంత చీలిక తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు. తదనుగుణంగా ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని రాజకీయ కార్యకలాపాలలో ఉన్న షర్మిలను అక్కడ నుంచి ఏపీకి తీసుకురావడంలో పరోక్షంగా ఒక పాత్ర పోషించారు. చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెను ఏపీ రాజకీయాలలోకే వెళ్లాలని పట్టుబట్టారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ వద్ద దీనిపై పంచాయతీ కూడా జరిగింది. ఆమె ఏపీ రాజకీయాలలోకి వెళ్లేలా ఒప్పందం కుదిరిన తర్వాతే ఆమె పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారు. తదుపరి షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె కూడా చంద్రబాబు తరపునే పనిచేస్తూ అన్నను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కూడా తన ఉపన్యాసాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డిను విమర్శిస్తూ చెల్లెలుకు న్యాయం చేయడం లేదని అనేవారు. షర్మిల పట్ల, అలాగే విజయమ్మ పట్ల తనకు సానుభూతి ఉందన్నట్లు మాట్లాడేవారు. షర్మిల రాజకీయాలలోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా తన వెనుక ఎవరు ఉంది ప్రపంచానికి పరోక్షంగా చెప్పేశారు. రాధాకృష్ణ అంటే చంద్రబాబు సొంత మనిషి కింద లెక్క. చంద్రబాబు తరపున ఆయా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో రాధాకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారని ఎక్కువ మంది నమ్ముతారు. అలాంటి వ్యక్తి చేసిన రాయబారం ఫలించి ఆమె కొంతకాలం తెలంగాణలో పార్టీ నడిపి, ఆ తర్వాత ఏపీ రాజకీయాలలోకి వచ్చారు. అంతవరకు తాను తెలంగాణ బిడ్డనని, ఈ మట్టిని వదలిపెట్టనని షర్మిల చేసిన శపధాలన్నీ గాలిలో కలిసిపోయాయి. షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కనుక, ఆ ఓట్లను ఆమె కొంతవరకు చీల్చగలిగితే అది తమకు లాభిస్తుందని చంద్రబాబు, రాధాకృష్ణ అంచనా వేసుకున్నారు. ఆమె కూడా వారికి యధో శక్తి రాజకీయంగా ఉపయోగపడుతూ, తన అన్నను విమర్శిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో గతంలో మాట్లాడినదానికి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు చేస్తున్న తీరు కూడా ఇంకో నిదర్శనంగా కనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చంద్రబాబును సైతం కొంతమేర విమర్శించవలసి వస్తోంది. వాటిని ఎడిట్ చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి వైఎస్ జగన్మోహన్రెడ్డిను విమర్శించిన మేర తమ మీడియాలో ప్రచారం చేశాయి. కాలం గడిచే కొద్ది చంద్రబాబుకు తత్వం బోధపడినట్లుగా ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. వారిలో కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ వద్దకు రాకుండా కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్లారా అని చంద్రబాబు మదనపడుతున్నారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచనకు వచ్చారు. బహుశా షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు వచ్చే ఓట్లలో ఏమైనా గండి పడుతుందా అని సర్వేలు చేయించుకుని ఉండాలి. ఆ సర్వేలలో షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఎలాంటి నష్టం ఉండదని తేలి ఉండవచ్చు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఉపయుక్తంగా ఉంటుందన్న సమాచారం వచ్చి ఉండవచ్చు. దాంతో అంతవరకు షర్మిలను భుజాన వేసుకుని సానుభూతి వచనాలు పలికిన చంద్రబాబు మళ్లీ పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ పాత డైలాగులు చెప్పడం ఆరంభించారు. 2014లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తదుపరి 2018లో తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిలను కలిపి విమర్శించేవారు. 2024 నాటికి అదే మోదీతో, బీజేపీతో ఆత్మగౌరవం వదలుకుని మరీ పొత్తు పెట్టుకున్నారు. డబుల్ స్టాండర్స్ కు పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు ఇలా యూ టర్న్లు తీసుకోవడం కొత్తకాదు. ప్రస్తుతం కూడా అలాగే షర్మిల విషయంలో కూడా యు టర్న్ తీసుకుని మాట్లాడడం ఆరంభించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే షర్మిల వచ్చారని ఆయన చెబుతున్నారు. పెద్ద కాంగ్రెస్, వైకాపా పిల్ల కాంగ్రెస్ అని పాతపల్లవిని కొత్తగా ఎత్తుకున్నారు. ఈ రెండు కలిసి డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని ఆయన అన్నారు. అక్కడితో ఆగకుండా రాజకీయాలకు దూరంగా ఇంటిలోనే ఉంటున్న విజయమ్మ పేరు ప్రస్తావించి.. మొన్నటివరకు కుమారుడికి ఆంధ్ర, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చారని చెప్పిన విజయమ్మ ఇప్పుడేమో కుమార్తెను ఏపీలో యుద్దానికి పంపారని అన్నారు. పిల్లలకే న్యాయం చేయలేని తల్లి ఐదు కోట్ల మందికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. షర్మిలకు అన్యాయం జరిగితే ఇంటిలోనే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. దీనిని బట్టి ఏమి తెలుస్తుంది! తన రాజకీయ అవసరాల కోసం తన ప్రత్యర్ది పార్టీ అధినేత ఇళ్లలో ఉన్న ఆడవారిపై కూడా అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి చంద్రబాబు వెనుకాడరనే కదా! తన భార్యను ఎవరో ఏదో అన్నారంటూ అసెంబ్లీలో రచ్చ చేసి, బయటకు వచ్చి ఏడుపు లంఖించుకున్న ఆయన, విజయమ్మపై విమర్శలు చేయవలసిన అవసరం ఏముంది. అంటే ఏదో రకంగా రెచ్చగొడితే ఆమె కూడా కామెంట్ చేస్తే, ఈ విషయంపై చర్చ కొనసాగించాలన్న దురుద్దేశంతోనా అనే సందేహం వస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానిఫెస్టోల గురించి సవాల్ చేస్తూ ప్రజా సమస్యల గురించి అధికంగా ప్రస్తావిస్తూ, యాత్ర సాగిస్తుంటే, చంద్రబాబు మాత్రం ఇలా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. దీని అంతటికి ఒక కారణం కనిపిస్తుంది. వలంటీర్లు తదితర అంశాలలో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు వాటిని జనం మర్చిపోవాలన్న లక్ష్యంతో పనికి రాని ఉపన్యాసాలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే? షర్మిల వల్ల తనకు రాజకీయంగా కలిసి వస్తుందని ఆయన ఆశించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ఇచ్చే వర్గాలలో ఎలాంటి విభజన రాకపోగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎంతో కొంత చీలుతుందని ఆయనకు అర్దం అయినట్లుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీచేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఓడించలేమన్న భయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్రాప్లో వేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులోకి వెళ్లారు.కానీ దీనివల్ల మైనార్టీ వర్గాలలో తనపై వ్యతిరేకత ఏర్పడిందని చంద్రబాబు అర్ధం చేసుకుని ముస్లింలకు తన పాలనలో రక్షణ ఉందని చెప్పడం ఆరంభించారు. షర్మిల వల్ల చీలే ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలపై ఆదారపడకుండా, తన ప్రభుత్వ పనితీరు, స్కీముల వల్ల ప్రజలకు జరిగిన మేలు మొదలైన విషయాలను చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. బీజేపీ,జనసేనలతో నేరుగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్, సీపీఐ వంటి పక్షాలతో అవగాహన పెట్టుకున్నారన్నది ఎక్కువ భావన. అయినా వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఓడించలేకపోతున్నామన్న ఆందోళన చంద్రబాబులో ఏర్పడింది. అందులో భాగంగానే షర్మిలపై చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. కొన్నాళ్ల క్రితం కూటమి సభ జరిగినప్పుడు మోదీ ఇలాగే అన్నా, చెల్లెళ్లు ఒకటేనని అన్నప్పుడు చంద్రబాబు సీరియస్గా తీసుకోలేదు. కానీ టీడీపీ ఓట్లకే గండిపడుతోందని సర్వేలు తెలపడంతో ఆయనలో మరింత కంగారు ఏర్పడింది. నిజానికి షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్కు ఇప్పటికి 99 శాతం నియోజకవర్గాలలో ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. 99 శాతం సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోవడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అయినా ఆమెను అడ్డుపెట్టుకుని తను లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తే, ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి భవిష్యత్తే అయోమయంలో పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. తత్ఫలితంగా చంద్రబాబు కొత్త స్వరం ఆలపిస్తున్నారు. అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి అనే చందంగానే చంద్రబాబు పరిస్థితి ఏర్పడింది! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘అరరె.. బాబు బుర్రలో చిప్కి ఏమైంది?’
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కానీ, ఇతరత్రా ఆయా ప్రాంతాలలో జరిగిన సభలలో కానీ చేసిన వివిధ ప్రసంగాలు తమాషాగా ఉంటున్నాయి. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఏమిటి! ఇలా మాట్లాడుతున్నారు.. అన్న సందేహం అందరిలో కలుగుతోంది. కొన్ని ఉదాహరణలు చూడండి. మగవారు టీడీపీకి ఓటు వేయకపోతే వారికి ఆడవాళ్లు భోజనం పెట్టవద్దని చంద్రబాబు అన్నారు. టీడీపీ గ్రాఫ్ పెరగాలని ఆయన అనడం వరకు అభ్యంతరం లేదు. కానీ గ్రాఫ్ పెరగకపోతే దానికి ప్రజలు బాధ్యులట. అందుకే బగ్గింగ్ మెకానీజం ఏదో ఆయన వద్ద ఉందట. ఎవరి ఇంటిలో ఏమి అనుకుంటున్నది ఆయనకు తెలిసిపోతుందని బెదిరిస్తున్నారు. దేశంలో ఇలాంటి విచిత్రమైన ప్రకటన చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు ఉండరు. చంద్రబాబు ఇలా పలు ఆణిముత్యాలను తన ప్రసంగాలలో చెబుతున్నారు. వాటిలో మరీ పరువు తక్కువవి అయితే, టీడీపీకి నష్టం కలిగించేవి అయితే ఎల్లో మీడియా జాగ్రత్తగా ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నాయి. ఆయన నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తారట. ఎవరైనా మద్యం సేవించవద్దని చెప్పాలా? లేక బాగా తాగండి.. తాను అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ తాగిస్తానని చెబుతారా? పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి హామీలా ఇచ్చేది! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరు తమ పిల్లలను బాగా చదివించాలని చెబుతుంటే, చంద్రబాబేమో పేదలకు మద్యం అందిస్తానంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్లన్ని చంద్రబాబు టైమ్ లో వచ్చినవే అయినా, వాటన్నిటిని వైఎస్ జగన్మోహన్రెడ్డికు అంటగడుతూ దుష్ప్రచారం చేస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సైకో అని చంద్రబాబు అంటారు. ఆయనేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నిస్తారు. తానేసిన రోడ్డుపై నడుస్తారా? తాను ఇచ్చిన మరుగుదొడ్లను వాడతారా అని ప్రశ్నిస్తారు. తన ప్రచార పిచ్చికి గోదావరి పుష్కరాలలో ఇరవై తొమ్మిది మందిని బలి తీసుకున్నారన్న విమర్శ ఎప్పటికి ఆయనపై ఉంటుంది. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా కందుకూరులో ఇరుకు రోడ్డుపై మీటింగ్ పెట్టి తొక్కిసలాటకు కారణం అయ్యారు. ఇక్కడ ఎనిమిది మంది మరణించారు. అలాగే గుంటూరు తొక్కిసలాటలో మరో ముగ్గురు చనిపోయారు. ఇలాంటి ఘటనలు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న కార్యక్రమాలలో ఎప్పుడైనా జరిగాయా? వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పరిపాలనను ఇంటి వద్దకు తీసుకు వెళితే సైకో అంట. ఈయనేమో ప్రజలను బలిగొంటే వారి ఖర్మ అట. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఈయనకు అండగా ఉండి వారు నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అబద్ధాలు వండి ప్రజల మీద రుద్దుతున్నారు. వాటన్నిటిని ఈయన పట్టుకుని తిరుగుతుంటారు. అలాంటివారిని సైకో అంటారు కానీ, తన మానాన తాను స్కీములు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలా సైకో అవుతారు? వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఐదేళ్లలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నది వాస్తవం. చంద్రబాబు టైమ్ లో మాదిరి ఉద్యమాలు, ఆందోళనలు దాదాపు లేవు. ప్రజలంతా ఈ స్కీముల ద్వారా లబ్ది పొందుతూ సంతృప్తిగా ఉంటే వీరికి కడుపు మంటగా ఉందని చెప్పాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈయన కూటమి కట్టారట. జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. నిజంగానే జనంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉందని నమ్మితే టీడీపీ ఎందుకు ఒంటరిగా పోటీచేయడం లేదు? వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆదరణ పొందుతుండడం వల్ల ఆయనను ఓడించలేమన్న భయంతోనే కదా కూటమి కట్టింది. అయినా గెలుపు మీద సందేహాలు ఏర్పడడంతో చంద్రబాబు చెమటోడ్చుతున్నారు. చివరికి కుప్పంలో ఏమవుతుందో అన్న వణుకు ఆయనలో పుట్టింది. అందువల్లే ఒకటికి రెండుసార్లు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నారు. కుప్పంకు విమానాశ్రయమని, కుప్పంలో అది చేస్తా, ఇది చేస్తా అంటూ హామీలు ఇస్తూ గెలిపించాలని తంటాలు పడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటిని ఎందుకు చేయలేదంటే సమాధానం ఉండదు. హైదరాబాద్కు తానే ఫౌండేషన్ వేశానని, రైతులు పొలంలో విద్యుత్ ఉత్పత్తి చేసి, మిగులు కరెంటును అమ్ముకోవచ్చని అందరూ ఆశ్చర్యపోయే ప్రకటనలు చేస్తున్నారు. ఏపీలో గంజాయి అధికంగా ఉందని అబద్ధాలు ప్రచారం చేసి రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని చెడగొట్టాలన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నోరు జారి వైశ్యుల, కిరాణా షాపులవారి ఆగ్రహానికి గురయ్యారు. రావులపాలెం సభలో మాట్లాడుతూ కిరాణా షాపులలో గంజాయి అమ్మతున్నారని విమర్శించారు. దానిపై షాపుల యజమానులంతా బంద్ పాటించగా, వివిధ ప్రాంతాలలో వైశ్య సంఘాలు తీవ్రంగా నిరసించాయి. టిప్పర్ డ్రైవర్కు వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇస్తారా అని డ్రైవర్ వృత్తి చేసుకునేవారిని అవమానించారు. ఫలితంగా డ్రైవర్లంతా టీడీపీపై మండిపడుతున్నారు. చంద్రబాబుకు ఏమైంది! ఇలా మాట్లాడుతున్నారు అని జనం విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. కుప్పంకు హంద్రీ-నీవా జలాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకు వచ్చినా ఎద్దేవగా మాట్లాడారు. ప్రస్తుతం కృష్ణా నదిలో నీళ్లు లేకపోతే, కుప్పంకు వచ్చే కాల్వల్లో నీళ్లేవి అని చంద్రబాబు ప్రశ్నించి ప్రజలను మోసం చేయాలని యత్నించారు. కుప్పం ప్రాంతంలోని చెరువులలో గతంలో ఎన్నడైనా వేసవిలో నీళ్లు ఉండేవా? ఇప్పుడు ఎందుకు ఉన్నాయి. అవి హంద్రీ-నీవా నీళ్లు కాదా? ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు. కుప్పంలో సైతం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీముల వల్ల కొన్నివేల కోట్ల మేర ప్రజలు లబ్ది పొందారు. సుమారు రెండువేల మందికి ఇళ్ల స్థలాలు వచ్చాయి. ఇళ్లు కట్టుకున్నారు. వీటన్నిటిని కప్పిపుచ్చుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో విద్వంసం అంటూ పడికట్టు డైలాగులు వదలుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద సాయం చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న స్కీములను మూడు రెట్లు అమలు చేస్తామని ఎలా చెబుతున్నారు? అంటే ప్రజలను మోసం చేయడమే కదా? సోషల్ మీడియాలో ఒక సామాన్యుడి వ్యాఖ్య చూశాను. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి సుమారు మూడు లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేసి వారిని ఆదుకున్నారు. చంద్రబాబు టైమ్ లో కూడా రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు కదా! ఆ డబ్బు అంతా అప్పుడు ఏమైపోయింది? వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలా ఇవ్వగలిగాడు?" అని ప్రశ్నించాడు. దీనికి చంద్రబాబు జవాబు ఇవ్వగలిగితే అప్పుడు ఆయన చెప్పే మాటలకు ఏమైనా విలువ వస్తుంది. తను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తానని చెబితే జనం విశ్వసిస్తారా? తాను పద్నాలుగేళ్లు గొప్పగా పాలన చేశానని, ప్రత్యేకించి 2014 -2019 మధ్య ఫలానా విధంగా పాలన చేశానని, దానినే మళ్లీ అందిస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఒక వైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను మంచి చేశానని అనుకుంటేనే ఓటు వేయండని ధైర్యంగా అంటుంటే, చంద్రబాబు మాత్రం తన పాలన గురించి చెప్పలేని దైన్య స్థితిలో ఉన్నారన్నది వాస్తవం. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చీరలతో ఓటర్లకు ఎర.. ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంట్రీతో గుట్టురట్టు!
కర్నూలు: వరుసగా రెండు సార్లు ఓటమిపాలైన తండ్రీకుమారులు.. ఈసారి గెలుపుకోసం అడ్డదారులు వెతుక్కుంటున్నారు.. చీరల మూటలు తెచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తమ అనుచరులతో ఓటర్లను ప్రలోభ పెడుతూ రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి టీడీపీ నాయకులు దొరికిపోయారు. వీరు కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అనుచరులు కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు నెలరోజుల ముందే కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రలోభాలకు తెర లేపారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అదే ఉత్సాహంతో మూడవ సారి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. మారి్నంగ్ వాక్, ఇంటింటి ప్రచారం కార్యక్రమాలతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ఫలాలు వివరిస్తూ ఆపార్టీ నేతలు బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం నేతల్లో సమన్వయం లేదు. తండ్రి టీజీ వెంకటేష్ ఒక పార్టీ, కుమారుడు టీజీ భరత్ మరో పారీ్టలో కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కూటమి ఏర్పడినా ఏ రోజూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలసి తిరిగిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. టీజీ భరత్ ఒక్కరే సైకిల్ యాత్ర పేరుతో కాలనీలలో తిరుగుతున్నా స్పందన అంతంత మాత్రమే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ప్రత్యేక మ్యానిఫెస్టో పేరుతో ఆ పార్టీ నేతలు నగర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి తండ్రీ కుమారులు ఓడిపోయారు. ఆ పారీ్టకి వెన్నుదన్నుగా ఉన్న లక్కీ–2 కుటుంబం కాంగ్రెస్ పారీ్టలో చేరింది. పి.జి.నరసింహులు యాదవ్ కొత్తపేట ప్రాంతంలో గతంలో కార్పొరేటర్గా స్టాండింగ్ కమిటీ మెంబర్గా పనిచేశారు. తాజాగా వీరి కుటుంబంలోనే ఉన్న 51వ వార్డు కార్పొరేటర్ మౌనిక రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పారీ్టకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వీరంతా టీజీ కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. ఇప్పుడు వీరంతా వెంట లేరు. పారీ్టలో నైరాశ్యం ఉంది. జోష్ లేదు. ఏలాగైన గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇక్కడ టీజీ భరత్ ప్రయత్నాలు చేస్తున్నారు. చీరలతో ఓటర్లకు ఎర.. తమ ప్రభుత్వ హయంలో ఫలానా పనులు చేశాం. ఓట్లు వేయండి అని చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. నగరంలోని ఎర్రబురుజు వద్ద కార్యకర్తలను కొంతమందిని నియమించి పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమీపంలోని విక్టరీ థియేటర్లో చీరల మూటలు దాచారు. ఎర్రబురుజు, బొంగుల బజార్, నెహ్రూరోడ్డు, మించిన్ బజార్ వంటి కాలనీలలో ముందుగానే స్థానిక తెలుగుదేశం నాయకులు ఓటర్లకు స్లిప్పులు పంచారు. ఒకేసారి అందరూ వెళ్లకుండా పక్కాగా ప్రణాళిక ప్రకారం చీరల పంపిణీకి రంగం సిద్దం చేశారు. గుట్టుగా ఎర వేసి ఓట్లు కొల్లగొట్టేందుకు చేసిన టీడీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఓటర్లకు పంపిణీ చేసేందుకు టీడీపీ వారు దాచిన చీరల మూటలు సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు.. కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కమిషన్ నియమించిన ఫ్ల్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో విక్టరీ థియేటర్లో తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో మూటల మాటున దాచిన చీరలు బయట పడ్డాయి. మొత్తం 975 చీరలు స్వాదీనం చేసుకున్నారు. ఒక్కొక్క చీర రూ.200 ప్రకారం ఉన్నట్లు గుర్తించిన అ«ధికారులు దాదాపు రూ.2 లక్షలు విలువ చేసే చీరలను సీజ్ చేసి నగరపాలక కార్యాలయానికి తరలించారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు రిటరి్నంగ్ అధికారి భార్గవ్తేజ వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియామావళిని తప్పకుండా పాటించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే తాను గెలిస్తే ఇది చేస్తా.. అది చేస్తా అని చెప్పుకునేందుకు ఏమీ లేక తాయిలాలు నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని పలువురు విమర్శిస్తున్నారు. తాగినోళ్లకు తాగినంత.. గత ఆదివారం.. ఓ హోటల్ కేంద్రంగా టీజీ భరత్ విందురాజకీయం నడిచింది. అప్పటికే అందిన సమాచారం మేరకు.. సాయంత్రానికి కొన్ని కుల సంఘాల ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. కులాల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు సుమారు పది మంది కూర్చునే వెసలుబాటు కల్పించారు. సమావేశంలో తమ భవిష్యత్కు హామీ లభిస్తుందనుకుని అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. ఇంతలో టీజీ భరత్ వచ్చి.. అందరూ సహకరిస్తే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెనుదిరిగారు. అప్పుడు మొదలైంది.. తాగినోళ్లకు తాగినంత మందు. రాత్రి సుమారు 11 గంటల వరకు ఈ తతంగం నడిచింది. అంతేకాదు.. తిన్నంత భోజనం కూడా ఏర్పాటు చేశారు.. ఎన్నికల సమయం కదామరి! ఏదో సమావేశం అనుకుని వచ్చిన కొందరు పెద్దలు ఇదేం పని అనుకుని నిట్టూర్చి బయటకు వెళ్లిపోగా.. మరికొందరు ఎంచక్కా విందు, మందుతో ఊగితూగుతూపోయారు. ఓ ఫంక్షన్ హాలులోనూ..? నగరంలోని సంకల్బాగ్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో టీడీపీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తాయిలాలు దాచి పెట్టినట్లు సమాచారం. ఒకే చోట చీరలు, బహుమతులు దాచి పెడితే ఇబ్బందులు వస్తాయని టీజీ అనుచరులు ఈ ఫంక్షన్ హాలులో దాదాపు 30 వేల నుంచి 50 వేల దాకా చీరలు దాచి ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఎన్నికల పర్యవేక్షణ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది విక్టరీ థియేటర్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న చీరలను పెద్ద సంఖ్యలో స్వా«దీనం చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. కుల సంఘాలకు ఎర.. కులాల వారీగా నాయకులను ఎన్నికల వేళ ప్రలోభపెట్టేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీగా తాయిలాలు ప్రకటించడమే కాక ముఖ్యమైన వారికి విందులు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. భరత్ వార్డుల వారీగా కొంతమందిని చేరదీసి వార్డుల్లో ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఉన్న వార్డుల్లోని ముఖ్యులను పిలిపించుకొని ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి కానుకలు పంపిణీ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఇవి చదవండి: వీళ్లా.. అభ్యర్థులు! -
'మేమంతా సిద్ధం' సభతో.. కపట కూటమిలో మొదలైన వణుకు!
సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సభలకు జనం పోటెత్తారు. అడుగడుగునా హారతులు పట్టి, దిష్టితీసి, దీవెనలందించారు. బస్సు యాత్రగా వస్తున్న సీఎం జగన్కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ‘నువ్వే మళ్లీ సీఎం.. మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ముసలి, ముతక, చిన్నాపెద్దా తేడాలేకుండా అభిమాన నేతను చూసి తరించారు. సెల్ఫీలు దిగి సంతోషంతో ఉప్పొంగి పోయారు. కరచాలనానికి పోటీపడ్డారు. దారిపొడవునా పూల వర్షం కురిపించారు. గుండెగుడిలో గూడుకట్టుకున్న అభిమానాన్ని రంగరించి ఆత్మీయతను పంచారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపగా.. కపట కూటమి నేతల్లో వణుకుపుట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పలు సంక్షేమ పథకాలను అందుకుంటున్న అనేక మంది లబ్ధిదారులు బస్సు యాత్రలో దారి పొడవునా జననేతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అప్యాయంగా పలుకరిస్తూ ‘నువ్వు సల్లగా ఉండాలి నాయనా’ అంటూ దీవించి ముందుకు సాగనంపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు గ్రామాల మీదుగా సాగింది. ఈ బస్సు యాత్రలో మరోసారి పల్లెలను పలుకరిస్తూ.. స్థానికుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగారు. ఈనెల 2న ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చౌడేపల్లి, పుంగనూరు, సదుం, కల్లూరు, పాకాల, ఐరాల, పూతలపట్టు, చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి, గూడూరు మండలాల మీదుగా సాగింది. బస్సు యాత్ర సాగినంత దూరం సీఎం వైఎస్ జగన్ని చూసేందుకు జనం బారులు తీరారు. సీఎం బస్సు దిగి వారందరినీ ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్వాగతం లభించింది. దామలచెరువుకు ముందే ఉగాది పండుగ వచ్చిందా? అనిపించేలా పండుగ వాతావరణం కనిపించింది. ఆత్మీయ సమావేశం కల్లూరు శివారు ప్రాంతంలో కురుబ సామాజికవర్గం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం, చిన్నసింగమాల వద్ద ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని భరోసా కల్పించారు. వారి ఆత్మీయతతో సీఎం వైఎస్ జగన్ పులకరించిపోయారు. ఇదిలా ఉంటే.. కల్లూరులో నిర్వహించిన బస్సు యాత్రకు ముస్లింమైనారిటీ మహిళలు పోటెత్తారు. దారిపొడవునా సీఎం వైఎస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి, నాయుడుపేటలో ట్రాంజెండర్స్ సీఎం వైఎస్ జగన్కి గుమ్మడి కాయలతో దిష్టి తీసి ఆశీర్వదించి ముందుకు సాగనంపారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూతలపట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలు నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలోని జనం, వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చెయ్యకుండా.. పనులన్నింటినీ పక్కనబెట్టి జననేతను ఒక్కసారి చూసేందుకు పరితపించిపోయారు. ఆయా పార్లమెంట్ పరిధి నుంచి వచ్చిన వారితో సభా ప్రాంగణం నిండిపోయి జాతీయ రహదారి కూడా కిక్కిరిసిపోయింది. కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. పచ్చ కూటమిలో కుదేలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభించడంతో పచ్చ కూటమి నేతల్లో వణుకు పుట్టింది. చంద్రబాబు వెంకటగిరి, గంగాధరనెల్లూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, కుప్పంలో నిర్వహించిన అన్ని బహిరంగ సభలకు హాజరైన జనం ఒక ఎత్తైతే.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం సభ ఒక్కటే ఒక ఎత్తుగా నిలిచిందని జనం చర్చించుకోవడం కనిపించింది. అదేవిధంగా మేమంతా సిద్ధం సభలు, బస్సు యాత్రకు వెళ్లలేని అనేక మంది టీవీలకు అతుక్కుపోయి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన, ప్రసంగాన్ని వినడం విశేషం. మారుమూల గ్రామాల నుంచి మేమంతా సిద్ధం సభలకు తరలిచ్చే జనాన్ని చూసిని జనం, మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ‘కూటమి కుదేలవ్వడం ఖాయం’ అని చర్చించుకోవడం గమనార్హం. ఇవి చదవండి: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర తొమ్మిదో రోజు షెడ్యూల్ ఇలా.. -
పవన్.. చిత్తశుద్ధే తారుమారు! పిఠాపురంలో కష్టాలే..
కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాన్ని ఏరి కోరి ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లోనూ కాపుల ఓట్లపై ఆశలు పెట్టుకునే ఆయన బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ మొదటినుంచీ కాపు వ్యతిరేకి అయిన చంద్రబాబుతో అంటకాగడం వల్లనే కాపు మేథావులు పవన్ కల్యాణ్ను దూరం పెడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. కాపుల ఆరాధ్య నాయకుడైన వంగవీటి రంగా హత్యకేసులో అన్నీ వేళ్లూ చంద్రబాబు నాయుడివైపే చూపిస్తోంటే.. పవన్ కల్యాణ్ ఆ చంద్రబాబుతోనే జట్టు కట్టి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయడంకోసం కాపుల రాజకీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంపై కాపుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తనకు కులాలు మతాలు లేవంటారు పవన్ కల్యాణ్. ఆ వెంటనే నేను రెల్లి కులస్థుడినంటారు. టీడీపీ హయాంలో కాపుల రిజర్వేషన్లకోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తే.. కాపులకు రిజర్వేషన్లేంటి? కులాల పేరుతో ఉద్యమాలేంటి? అంటూ పోజు కొట్టారు పవన్ కల్యాణ్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు రిజర్వేషన్లు ఏమయ్యాయంటూ అమాయకంగా అడిగారు ఇదే పవన్. వంగవీటి రంగా అంటే తనకు చాలా గౌరవం అన్నారు. ఆయన్ని జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఒకసారి.. ఓ సారి రంగా మా ఇంటికి వస్తే టీ ఇచ్చానని మరోసారి చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. వంగవీటి రంగా దారుణ హత్య వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే అని రంగా హత్య జరిగిన సమయంలో హోంమంత్రిగా ఉన్న కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో కాపు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రంగాతో పాటు తనని కూడా హతమార్చడానికి చంద్రబాబు సుపారీ ఇచ్చారని ఆరోపించారు. అటువంటి చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్నరాన్న అభియోగంపై జైలుకెళ్తే పవన్ కల్యాణ్ చాలా బాధపడ్డారట. రంగా హత్యోదంతం నేపథ్యంలో కాపులు చంద్రబాబును ఏవగించుకుంటున్నారని గమనించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకుని కాపులు - కమ్మలు కలిసి ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించాలంటే కాపులు - కమ్మలు చేతులు కలపాల్సిందేనని పవన్ థియరీని విడుదల చేశారు. కాపుల్లో రంగాకి అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. అటువంటినేతను చంద్రబాబు నాయుడు పొట్టన పెట్టుకున్నారన్న కోపం కూడా కాపుల్లో ఉంది. కాపు ఓట్లతోనే గెలవగలను అనుకుంటోన్న పవన్ పిఠాపురం సీటును ఎంచుకున్నది చంద్రబాబు సలహాతోనే అంటున్నారు. అయితే కాపుల్లో మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని సంక్షోభంలో ఉన్న టీడీపీకి మద్దతు పలికారు పవన్ కల్యాణ్. అయినా ఎన్నికల పొత్తులో కనీసం ఓ 60 సీట్లు కూడా సాధించుకోకుండా ముష్టి 21 సీట్లతో సరిపెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయి. అదికూడా చంద్రబాబును సీఎంని చేయడానికి పవన్ పరితపిస్తోన్న తీరు కాపులకు నచ్చడం లేదు. చంద్రబాబు నాయుడి కోసం, కాపులకోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలను సైతం పవన్ దూరం పెట్టేశారు. అంతే కాదు వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. మైక్ పట్టుకుని ఉపన్యాసాలు దంచేటపుడు తాను విశ్వమానవుడినని పవన్ చెబుతూ ఉంటారు. కొద్ది నిముషాల్లోనే అది మర్చిపోయి కులాల ప్రస్తావన తెస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డిపై ద్వేషంతో ఆయన నియోజక వర్గం అయిన పులివెందులను దూషిస్తూ పైశాచికానందాన్ని పొందుతూ ఉంటారు. కాపులకోసం పవన్ కల్యాణ్ ఏనాడూ చిత్తశుద్ధిగా పనిచేయలేదు కాబట్టే భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో కాపులు కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ఓటు వేయలేదు. అందుకే ఆయన ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలోనూ అదే రిపీట్ అవుతుందంటున్నారు పాలక పక్ష నేతలు. ఇవి చదవండి: నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్ జాగ్రత్త! -
ఒకప్పుడు పొసగేదే కాదు.. ఇప్పుడు మరీ ఇంత ఆత్మీయతా?
ఏపీలో వైఎస్సార్సీపీను ఓడించలేమన్న భావనకు వచ్చిన విపక్ష కూటమి ఇప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయానికి బరి తెగిస్తోంది. బీజేపీని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలిసిపోతూనే ఉన్నాయి. పట్టుమని పది అసెంబ్లీ సీట్లకు పోటీచేయని బీజేపీ పక్షాన ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల సంఘానికి పోలీసు అధికారులపై ఒక పెద్ద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న 22 మంది పోలీసు అధికారులపై ఈ ఫిర్యాదు ఉంది. అది చదివితే ఒక విషయం బోధ పడుతుంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న నాటకం అని ఇట్టే అర్దం అయిపోతుంది. బీజేపీ తాను పోటీచేస్తున్న ప్రాంతాలలో పోలీసు అధికారులు ఎవరైనా తప్పు చేస్తున్నారని సమాచారం ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లవచ్చు. అలాకాకుండా ఇంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారంటే ఇదంతా టీడీపీ కుట్రగానే కనిపిస్తుంది. ఇందులో విడ్డూరం ఏమిటంటే 'తమకు ఫలానా అధికారులు కావాలని అడగడం'. బహుశా దేశంలోనే ఇలా ఏ రాజకీయ పార్టీ కోరి ఉండరు. తాను నేరుగా ఫిర్యాదు చేస్తే పోలీసు వ్యవస్థ అంతా తమకు వ్యతిరేకం అవుతుందని, దాని వల్ల నష్టం ఏమైనా జరుగుతుందేమోనని అనుమానించిన చంద్రబాబు ఈ పనికి పురందేశ్వరిని పురమాయించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఏదైనా అప్రతిష్ట వచ్చినా పురందేశ్వరికే కాబట్టి వ్యూహాత్మకంగా ఈ ప్లాన్ అమలు చేశారని అనుకోవాలి. ఎన్టీ రామారావు కుమార్తెగా ఉన్న పురందేశ్వరి ఆయనకు ప్రతిష్ట తీసుకురాకపోతే మానే.. ఆయన పరువు తీస్తున్న కూతురుగా ప్రసిద్దికెక్కుతున్నారు. 'ఒకప్పుడు చంద్రబాబుకు, పురందేశ్వరికి మధ్య ఏ మాత్రం పొసగేది కాదు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును పలుమార్లు చంద్రబాబు అవమానించారని ఆమె మదనపడేవారు. ఒక సందర్భంలో ఆమె ఇంటిలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబును పలకరించడానికి కూడా ఆమె ఇష్టపడలేదంటే ఆశ్చర్యం కాదు'. అలాంటిది ఇప్పుడు సడన్గా ఇలా రెండు కుటుంబాల మధ్య ఇంత ఆత్మీయత ఎలా వచ్చిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. పురందేశ్వరి తమకు జరిగిన అవమానాలు మర్చిపోయి తెలుగుదేశం ఎజెండా కోసం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటే, ఆమె ఎంపీ పదవి కోసం ఎంత తహతహలాడుతున్నారో అర్ధం అవుతుంది. 2014లో కూడా బీజేపీ, జనసేన,టీడీపీ కలిసి పోటీచేశాయి. కానీ అప్పటికి చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజీ కుదరలేదు. చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి పురందేశ్వరిని తెలివిగా రాజంపేటలో పోటీచేయించారు. తద్వారా ఆమె అక్కడ ఓడిపోయేలా చేశారు. చాలాకాలం ఆ బాధ ఆమెలో ఉండేది. ఎప్పుడు రాజీపడ్డారో కానీ, చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో జైలులో ఉన్నప్పుడు లోకేష్ను పురందేశ్వరి వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్షా తో కలిపారు. అలాగే ఎన్టీ రామారావు గోల్డ్ కాయిన్ విడుదల సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను పిలిచి, అక్కడ చంద్రబాబుతో మాట, మంతి కలిసేలా దగ్గుబాటి దంపతులు చేశారు. బీజేపీ అధిష్టానం పురందేశ్వరిని ఎందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చేశారో తెలియదు కానీ, ఆమె అప్పటి నుంచి ఆ పార్టీని పూర్తిగా తెలుగుదేశంకు అనుకూలంగా మార్చివేశారు. చివరికి బీజేపీ ఇచ్చిన లోక్ సభ టిక్కెట్లు ఆరింటిలో ఐదు ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే దక్కడం విశేషం. ఒరిజినల్ బీజేపీ నేతలంతా దిక్కుతోచని స్థితిలో తమ ఖర్మ అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ విషయాలు పక్కనబెడితే పురందేశ్వరి రాసిన ఫిర్యాదును పరిశీలిస్తే, అందులో టీడీపీ అరాచకాలను అడ్డుకున్నవారి పేర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్లను బయటకు తెచ్చినవారి పేర్లే ఎక్కువగా కనిపించాయి. ప్రత్యేకించి ఒక సామాజికవర్గంపై వ్యతిరేకతతో కూడా ఈ ఫిర్యాదు చేశారా అన్న అనుమానం వస్తుంది. టీడీపీ మీడియాలో వచ్చిన కథనంలో ఏమి రాశారో చూడండి.. 'డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నుంచి ఎస్పీ ఆనందరెడ్డి వరకు అని పేర్కొనడంలోనే కుత్సిత స్వభావం కనిపిస్తుంది.వీరంతా వైసిపితో సంబంధాలు ఉన్నవారట. విపక్షాలను వేధిస్తున్నారట. వీరిని తప్పిస్తేకానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఈమె అంటున్నారు'. నిజానికి ఈ 22 మంది ఎవరో పురందేశ్వరికి తెలియకపోవచ్చు. వీరి పేర్లు చెప్పాలని ఆమెను అడిగితే చెప్పలేకపోవచ్చు కూడా. ఎందుకంటే కేవలం టీడీపీ రాసిన ఒక పత్రంపై ఆమె సంతకాలు చేసి ఎన్నికల సంఘానికి పంపి ఉండవచ్చనిపిస్తుంది. బహుశా టీడీపీ హయాంలో ఆనాటి ఇంటిలెజెన్స్ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావు మాదిరే, అలాగే కొందరు ఎస్పీల మాదిరే ఇప్పుడు కూడా ఐపిఎస్ అధికారులు ఎవరైనా చేస్తారేమోనన్న అనుమానంతో టీడీపీ ఈ లేఖ రాయించి ఉంటుంది. వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ కార్యకలాపాలు కూడా పర్యవేక్షించేవారు. ఈ మాట అప్పట్లో టీడీపీ నేతలే చెప్పిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బహుశా టీడీపీ కూటమికి అవకాశం ఇస్తే అలాంటివారిని నియమించుకోవాలని భావిస్తున్నారేమో తెలియదు. ఈనాడు రామోజీరావు మరో అడుగు ముందుకేసి కొన్ని జిల్లాలలో కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులకు కూడా పక్షపాత బుద్ధి ఆరోపిస్తూ పెద్ద స్టోరీ ఇచ్చేసింది. జర్నలిజం విలువలను దిగజార్చి టీడీపీకి నీచమైన రీతిలో మద్దతు ఇస్తున్న రామోజీనుంచి ఇంతకన్నా విలువలను ఆశించడం అత్యాశే అవుతుంది. పురందేశ్వరి రాసిన లేఖలో డీజీపీపై ఆరోపణలు చేస్తూ, సీక్రెట్ ఫండ్ను సొంతానికి వాడుకున్నారని, సంబంధిత ఫైళ్లను ద్వంసం చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏవీ చూపకుండా ఇలా రాయడం ఎంత బాధ్యతారాహిత్యం! వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు ఎన్నికలను మేనేజ్ చేసేందుకు, తప్పుడు సర్వేలు చేయించేందుకు బాగా డబ్బులు తీసుకున్నారని పురందేశ్వరి ఆరోపణ. 'విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారట. ప్రధాని సభకు జనం రాకుండా చేశారట'. వీటిలో ఒక్కదానికైనా అర్ధం ఉందా? పిచ్చి ఆరోపణలు చేసి జనాన్ని మోసం చేయడం తప్ప. చిత్తూరు ఎస్పీ జాషువా ఇటీవలే చిత్తూరు జిల్లాకు వెళ్లారు. ఆయనపై కూడా ఆరోపణ చేస్తూ కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత పెట్టుకున్నారని పురందేశ్వరి అంటున్నారు.. 'కుప్పంలో వైఎస్సార్సీపీ నేతలు ఏవో అరాచకాలు చేశారట. వాటిని చూసిచూడనట్లు వ్యవహరించారట'. ఈ ఫిర్యాదు చూస్తే అసలు భయం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారన్న అనుమానం వస్తుంది. 'పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా ప్రధాని సభకు జనం రాకుండా చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారట'. ఏమైనా బుద్ది జ్ఞానం ఉన్నవారు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తారా? ప్రధాని సభకు వెళ్లేవారిపై జాగ్రత్తగా నిఘా పెట్టకపోతే ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. చెక్ పోస్టులు పెడితే మోడీ సభకు జనం రాకుండా ఉంటారా? ఇలాంటి అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తే, వాటిని నమ్మి ఎన్నికల కమిషన్ ఆయనను పక్కనబెట్టిందా? అందుకే అయితే కచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికి లొంగుతోందన్న అభిప్రాయం కలుగుతుంది. సీఐడీ అదనపు డీజీ సంజయ్పై కూడా ఆరోపణ చేశారు. 'ఆయన మీడియా సంస్థలను బెదిరిస్తున్నారట'. మార్గదర్శి అక్రమాలను బయటపెడితే అది మీడియాను బెదిరించడమా! చంద్రబాబును స్కిల్ స్కామ్లో అరెస్టు చేస్తే అది ఆయన చేసిన తప్పా! డిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారో, లేదో కానీ, అంతా కలిపి వంద కోట్ల స్కామ్లో ఈడి అరెస్టు చేసింది. ఆప్ మరో నేత మనీష్ సిసోడియా ఏడాదిగా జైలులో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేశారు. అదంతా పద్ధతిగా జరిగినట్లు చెప్పే బీజేపీ ఏపీలో చంద్రబాబుపై వచ్చిన వందల, వేల కోట్ల రూపాయల విలువైన స్కామ్లను సమర్ధించడం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా తమ అడ్డగోలు పనులకు సహకరించని అధికారులను, టీడీపీ ప్రభుత్వ స్కామ్లను బయటపెట్టిన అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికే పురందేశ్వరి ద్వారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఇలాంటి ఫిర్యాదు చేసినట్లు అనిపిస్తుంది. వీటన్నిటిని పరిశీలించారో, లేక బీజేపీ ఒత్తిడి పనిచేసిందో కానీ వీరిలో కొందరిని ఎన్నికల సంఘం బదిలీ చేసి వారిని సంతృప్తి పరచే యత్నం చేసింది. అయినా అది చాలలేదని, ఇప్పుడు తెలుగుదేశం మీడియాలో ఆమె ఫిర్యాదు పేరుతో అందులోని అంశాలు అంటూ భారీ కథనం ఇచ్చారు. ఇదంతా కచ్చితంగా అధికారులను భయపెట్టి తమకు అనుకూలంగా లొంగదీసుకునే యత్నమే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. '2019లో చంద్రబాబు నియమించుకున్న పోలీసు అధికారులే జిల్లాలలోను, రాష్ట్ర స్థాయిలోను వివిధ బాధ్యతలలో ఉన్నారు కదా! వీరిలో కొందరిని ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తే టీడీపీ ప్రభుత్వం హైకోర్టుకు కూడా వెళ్లింది కదా! అప్పుడేమో అధికారులంతా సుద్దపూసలని, ఇప్పుడేమో అవినీతి పరులని బురద చల్లడానికి టీడీపీ మీడియా యత్నించింది'. ఎవరైనా అధికారి తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. కానీ కేవలం ఒత్తిడులకు లొంగి ఐపీఎస్ అధికారులను పక్కనబెడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే అది వ్యవస్థకే చేటు తెస్తుంది. బ్లాక్ మెయిల్ చేసే రాజకీయనాయకులకు, మీడియాకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ ఎన్నికల రణక్షేత్రంలో టీడీపీ కూటమి ఇంకెన్ని కుట్రలకు పాల్పడుతుందో చూడాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పవన్.. ఇంత దానికి అంత బిల్డప్ అవసరమా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. చివరికి జనసేన కార్యకర్తలను ఆయన బ్లేడ్ బ్యాచ్లతో పోల్చుతున్నారు. ఇది అమాయకత్వంగా చేసినా లేక అహంభావంతో చేసినా పవన్కు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏమిటో ప్రజలకు అర్దం అయిపోతోంది. జనం ఎక్కువ మంది తన వద్ద పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్ తీసుకు వచ్చి తనను, తన సిబ్బందిని గాయపరుస్తున్నారని దారుణమైన ఆరోపణ చేశారు. ప్రత్యర్ధి పార్టీ పన్నాగాలు తెలుసు కదా! అంటూ ముక్తాయింపు ఇచ్చారు. నిజానికి ఆయన వద్దకు వెళ్లేవారంతా మెజార్టీ సినిమా అభిమానులే. లేదా జనసేన కార్యకర్తలు. నిజంగానే వచ్చినవారు ఎవరితోనైనా ప్రమాదం ఉందని భావిస్తే, మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకుని, ఎవరి వద్ద అయినా అభ్యంతరకర వస్తువులు ఉంటే తీసేసుకోవచ్చు. అలా చేయకుండా తనను అభిమానంతో చూడడానికి వచ్చినవారిని బ్లేడ్ బ్యాచ్తో పోల్చడం కేవలం అహంకారం తప్ప మరొకటి కాదు. ఎందుకు ఈయన ఈ ప్రకటన చేశారో తెలుసా? కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ బస చేసిన చోట జనసేన కార్యకర్తలు కొంతమంది గుమికూడి ఆయనను కలవడానికి ప్రయత్నించారట. ఆయన సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు వారిని అనుమతించలేదు. గంటల సేపు వేచి చూసినా తమ నాయకుడిని కలుసుకోలేకపోయారు. అంతలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ తన అనుచరులతో కలిసి పవన్ కల్యాణ్ బసకు వచ్చారట. వెంటనే ఆయనను, అనుచరులను లోనికి పంపించేశారట. అది చూసి ఒళ్లు మండిన ఒక జనసేన కార్యకర్త తమకు ఇంత అవమానం చేస్తారా అని ప్రశ్నిస్తూ ఒక ఆడియో టేప్ను సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయింది. ఆయన దృష్టికి కూడా అది వెళ్లి ఉండాలి. దాంతో ఆయన స్వరం మార్చి కొత్త రాగం ఆలపించారన్నమాట. 'నిజంగానే ఎవరైనా బ్లేడ్ తీసుకుని ఆయన చేతిమీదో, లేక సెక్యూరిటీ సిబ్బంది చేతుల మీదో కోస్తే గాయం అవుతుంది కదా! అప్పుడు రక్తం వస్తుంది కదా! లేదా బట్టలు చిరుగుతాయి కదా! ఇన్నాళ్లుగా ఒక్కసారైనా అలాంటివి జరిగినట్లు పవన్కల్యాణ్ చెప్పలేదే!' పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు జరిగిన అవమానం నుంచి దారి మళ్ళించేందుకు పవన్ ఈ కొత్త డ్రామా ఆడాడని అనుకోవడంలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది. 'పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరిని కలవాలన్నది తన కోరిక అని, ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలన్నది తన అభిలాష' అని చెప్పారు. వచ్చిన జనసైనికులను కలవడానికి ఇష్టం ఉండదు కానీ, ఓట్ల కోసం పిఠాపురం ప్రజలందరితో ఫోటో దిగాలని ఉందని అంటే ఎవరు నమ్ముతారు? నిజంగానే అలా ఉంటే ప్రతీ ఊరుకు వెళ్లి అక్కడివారితో ఫోటో దిగండి. ఎవరు అడ్డుపడుతారు? అదే ఎన్నికల ప్రచారం అనుకోండి.. అప్పుడు పిఠాపురం అవసరాలు, సమస్యల గురించి తెలుసుకోవలసిన అవసరం లేకుండా పోతుందేమో! ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 'టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మను ఇదే పవన్కల్యాణ్ 2019 ఎన్నికలలో పేకాట క్లబ్లు నడిపే వ్యక్తిగా అభివర్ణించి అవమానించారు. ఇప్పుడు అదే వర్మను తనను గెలిపించాలని వేడుకుంటున్నారు'. గతంలో సముద్రం ఎవరి వద్దకు రాదు.. పర్వతాలు ఎవరికి తలవంచవు అంటూ డైలాగులు చెప్పిన పవన్కల్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం నేతలను బతిమిలాడుకుంటున్నారు. తన జనసైనికుల మీద కన్నా టీడీపీ వారే బెటర్ అని ఆయన భావిస్తున్నారు. తన గెలుపు బాధ్యత వర్మ చేతులలో పెడుతున్నానని ఆయన చెప్పారు. ప్లీజ్.. ఈ ఒక్కసారైనా తనను గెలిపించాలని అభ్యర్ధిస్తున్నానని అంటున్నారు. ఎందుకింత బేలతనం! 'ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా? నలుగురిని గెలిపించాల్సిన తమ నేతే ఇలా దిగజారి మాట్లాడుతున్నారంటే జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి సంకేతం పంపుతుంది'! జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్ గురించి ఆయన మాట్లాడుతూ గ్లాస్ పగిలితే మరింత పదును తేలుతుందని ఓ పిచ్చి డైలాగు చెప్పారు. పగిలిన గ్లాస్ ఎవరికి ఉపయోగపడదు. జాగ్రత్తగా, ఎవరికీ ప్రమాదం లేకుండా ఆ ముక్కలను బయట పడేస్తారు. పగిలిన గ్లాస్ ముక్కను జనసేన కార్యకర్తలు పట్టుకున్నా, వారికి చేతులు తెగుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. ఆ సంగతి కూడా తెలియకుండా సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం. 'పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని ఆయన చెబుతున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ గతంలో భీమవరంలో పోటీచేసినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. కానీ అక్కడ ఓడిపోయిన తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో ఉంటానంటే ఎవరు నమ్ముతారు?' సినిమా షూటింగ్లు మానుకుని ఇక్కడ ఉంటానంటే నమ్మడానికి ప్రజలు కాదు కదా, జనసైనికులు కూడా విశ్వసించరు. తమ పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. సంతోషమే. కానీ 'పదేళ్ల జనసేన ప్రస్తానంలో ఎందరు నాయకులు తయారయ్యారు. చివరికి టీడీపీ నుంచి పొందిన ముష్టి 24 సీట్లలో మూడు తగ్గించుకుని, అందులో కూడా ఓ ఆరేడు సీట్లు టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు ఎందుకు ఇచ్చారో చెప్పాలి'. పొత్తులో ఉన్న పార్టీల నుంచి నేతలను ఎవరైనా తీసుకుంటారా?అలా చేశారంటే ఏమిటి దాని అర్దం! జనసేనకు నేతలు లేరనే కదా? ఉన్న జనసేన నేతలు పనికిరారని పవన్ భావిస్తున్నట్లే కదా? జనసేనలో కొత్తగా చేరిన టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్కు అవనిగడ్డ టిక్కెట్ ఇచ్చారు. పాలకొండ సీటును కూడా జనసేనలో చేరిన టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు ఇవ్వబోతున్నారట. టీడీపీతో సన్నిహితంగా మెలిగిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి టిక్కెట్ ఇచ్చారు. భీమవరంలో టీడీపీ నేత పి.రామాంజనేయులును జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి టిక్కెట్ ఇవ్వడంపై అక్కడి జనసేన, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మచిలీపట్నం లోక్సభ సీటును వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బాలశౌరికి కేటాయించారు. ఇవన్నీ గమనిస్తే ఏమి తెలుస్తుంది? పదేళ్లలో పట్టుమని పది నియోజకవర్గాలలో జనసేన నుంచి నేతలను తయారు చేసుకోలేకపోయారనే కదా! ఈ పాటి దానికి ఇంత బిల్డప్ అవసరమా అని కొందరు సామాన్యులు ఎద్దేవ చేస్తున్నారు!. 'షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు కానీ, తాను అలా చేయలేదని పవన్కల్యాణ్ అంటున్నారు. ఆమె పార్టీని విలీనం చేసినా, పవన్కల్యాణ్ టీడీపీలో విలీనం చేయకుండా ఆ పార్టీకి తాకట్టు పెట్టినా పెద్ద తేడా ఏముందన్నది విశ్లేషకుల ప్రశ్న'. 2019లో సుమారు 140 నియోజకవర్గాలలో పోటీచేసిన జనసేన 2024లో పద్దెనిమిది నియోజకవర్గాలలో సొంత నేతలను పోటీలో ఉంచలేకపోయింది. ఈ సంగతి ప్రజలకు తెలియదా! పవన్కల్యాణ్ ఎంతగా భయపడుతున్నారంటే, మతపరమైన రాజకీయాలు చేయడానికి వెనుకాడడం లేదు. గుడులలో ఏదో జరిగిందని, దోషులను పట్టుకోలేదంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి వచ్చారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని పవన్ అంటున్నారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్ మొత్తం మీద తిరుగుతోందని ఆయన ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో తన గ్లాస్ పగిలిపోయిందని పవన్ కల్యాణే ఒప్పుకుంటున్నారు. తన చుట్టూ బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతున్నాయని ఆయనే చెబుతున్నారు కనుక, ఆయన అభిమానులు కూడా జాగ్రత్తగా ఉండడమే బెటర్!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా!
ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు టీడీపీని ముంచేశారు. వారిద్దరూ కలిసి ఏపీలో వేళ్లూనుకున్న వలంటీర్ల వ్యవస్థపై విషం కక్కుతూ రాసిన రాతలన్నీ నిజమేనని భ్రమపడి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విలవిలలాడుతున్నారు. ఆయనకు తత్వం బోధపడేసరికి టైమ్ ముగిసిపోయింది. జరగవలసిన డామేజీ జరిగిపోయింది. అందుకే రామోజీ, రాధాకృష్ణలు స్వరం మార్చి తాము చేసిన తప్పును వైఎస్సార్సీపీపై నెట్టేస్తూ పూర్తిగా దొరికిపోయారు. వలంటీర్లు పెన్షన్లు తీసుకునే వృద్దుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బు ఇవ్వరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వగానే తమ పన్నాగం ఫలించిందని వారు చంకలు గుద్దుకున్నారు. కొద్ది గంటలలోనే తాము ఎంత బ్లండర్ చేసింది అర్ధం చేసుకుని దానిని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను టీడీపీ ఏజెంట్గా మార్చుకుని, ఆయన ద్వారా అకృత్యాలు చేయిస్తూ ఏపీ ప్రజలను పీడించడమే టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు పనిగా పెట్టుకున్నాయి. అందులో భాగంగానే ఆయన ద్వారా హైకోర్టులో వలంటీర్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేయించడం, అది చాలదన్నట్లు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటివి చేయించారు. అంతేకాక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక, కేంద్రంలో ఎవరి ద్వారానో ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన నిర్ణయాలను టీడీపీ తెప్పించుకుంటోందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ క్రమంలో వలంటీర్లు ఈ మూడు నెలలు తమ సేవలు అందించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం అయినా ఇందులో ఉన్న మతలబు ఏమిటి? వృద్దులకు అందుతున్న సదుపాయం రద్దు చేయడం వల్ల వారు పడే బాధలు ఏమిటి? అన్నవి ఆలోచించకుండా టీడీపీ ఏజెంట్ కోరిందే తడవుగా ఆదేశాలు ఇచ్చేసింది. నిజానికి మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదు. అసలు అలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేయకూడదు. ఈ ఆదేశాలు ఇవ్వడానికి ముందుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా అడగవచ్చు కదా! ఇది ఎప్పటి నుంచో అమలు చేస్తున్న విధానం అయినా ఎన్నికల కమిషన్ వలంటీర్ల సేవలు అందకుండా చేసిందంటే రాజకీయ కుట్ర కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వలంటీర్లు పెన్షనర్లను కలిసి డబ్బు ఇస్తేనే వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనుకుంటే, ఇప్పుడు మాత్రం వేయకుండా ఉంటారా? టీడీపీ కుట్ర చేసి పెన్షన్లు తమ ఇంటికి రాకుండా ఆపిందని వారు తెలుసుకోకుండా ఉంటారా? ఇప్పటికే తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబును వారు బండబూతులు తిడుతున్నారు. ఎవరైనా టీవీవారు దీని గురించి ప్రశ్నిస్తే టీడీపీపై విరుచుకుపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న తమను మళ్లీ ఆఫీస్ల చుట్టూ తిప్పుతారా అని నిలదీస్తున్నారు. దీంతో.. పరిస్థితి అర్ధం చేసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే యుటర్న్ తీసుకుని పెన్షన్ దారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాశారు. ఆ రాసేదేదో ఎన్నికల సంఘానికి రాసి, వలంటీర్ల ద్వారానే పెన్షన్లు ఇళ్లకు పంపిణీ చేయాలని రాసి ఉంటే కాస్త గౌరవం అయినా మిగిలేది. కానీ అన్నిటిలోను డబుల్ స్టాండర్స్ పాటించే చంద్రబాబు ఇందులో కూడా ఆ ధోరణిలోనే వెళ్లారు. వలంటీర్లను గతంలో తిట్టింది ఆయనే. ఆయనకు తోడు పవన్ కల్యాణ్. మళ్లీ ఇద్దరూ యు టర్న్ తీసుకుని వలంటీర్లకు అనుకూలంగా మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక బినామీ సంస్థను స్థాపించి వలంటీర్లకు, ఇతరత్రా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడం, కోర్టులలో, ఇతర వ్యవస్థలలో లిటిగేషన్ పెట్టించడం చేశారు. అందులో భాగంగానే ఈ వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు అని చెప్పాలి. ఆ ఫిర్యాదుల ఫలితం తెలుగుదేశం మెడకే చుట్టుకుంటోందన్న విషయం తెలుసుకుని అంతే స్పీడ్గా రామోజీ, రాధాకృష్ణలు యుటర్న్ తీసుకుని చంద్రబాబును రక్షించడం కోసం కొత్త కథనాలు అల్లారు. వైఎస్సార్సీపీవారే పెన్షన్లను ఇళ్ల వద్ద ఇవ్వకుండా అడ్డుకున్నారని వీరు అడ్డగోలు కథనాలు రాశారు. వృద్దులు గ్రామ, వార్డు సచివాలయాలలో పెన్షన్ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే, అమ్మో వారిని ఎండలో తిప్పుతారా అంటూ వారిపై ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ బానర్ కథనాలు ఇచ్చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడింది అర్దం అవుతుంది. తాము అతి తెలివితో వలంటీర్ల వ్యవస్థపై బురదచల్లి చంద్రబాబుకు ఏదో మేలు చేశామని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయి టీడీపీకి ఉరితాడుగా మారడంతో మళ్లీ మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి యత్నించారు. గ్రామ, వార్డు సచివాలయాలలో 1.35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారిని పెన్షనర్ల ఇళ్లకు పంపించి డబ్బు ఇప్పించవచ్చని ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి కథనాలు వండాయి. బహుశా ఈ నాలుగేళ్లలో గ్రామ,వార్డు సచివాలయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని రామోజీ, రాధాకృష్ణ అంగీకరించారు. 'చిత్రమేమిటంటే.. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి డబ్బు ఇస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్లటా! అదే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వృద్దుల ఇళ్లకు వెళ్ళి డబ్బు ఇస్తే అది ఎన్నికలను ప్రభావితం చేయడం కాదట. ఇవేమి పిచ్చి రాతలు, ఈ సచివాలయాల ఉద్యోగులు సైతం వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్లో వచ్చినవారే కదా! వీరు వెళ్లి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది అనికాక, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని చెబుతారా? వలంటీర్లను నిలుపుదల చేయడంతో వృద్దులంతా టీడీపీని బండబూతులు తిడుతుండడంతో భయపడి రామోజీ, రాధాకృష్ణలు ఏమి చేయాలో దిక్కుతోచక ఇలాంటి కథనాలు రాసి వైఎస్సార్సీపీపై పడి ఏడ్చారు. పైగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బాధ్యతలు వేరుగా ఉంటాయి. ఒకవేళ వీరు కోరుకున్నట్లు వృద్దుల ఇళ్ల వద్దకు వీళ్లను పంపుతూ ఉత్తర్వులు ఇచ్చి ఉంటే అప్పుడు మళ్లీ ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి దానిని కూడా విమర్శిస్తూ డబ్బును వృద్దుల చేతికి ఇస్తున్నారని, ఇదంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్ర అని రాసి ఉండేవి. గతంలో టీచర్లను స్కూళ్ల బాగు చేతకు సంబంధించిన విధులలో పెడితేనే, వారిని అలా వాడతారా? ఇలా వాడతారా? అంటూ ఇదే మీడియా నానా యాగి చేసింది. సచివాలయ ఉద్యోగులను మాత్రం ఇప్పటికిప్పుడు వారికి సంబంధం లేని డ్యూటికీ వేయాలట. అంతా రామోజీ ఇష్టం అన్నమాట! ఎన్నికల సంఘం పవిత్రతపైన బురద చల్లేలా వైఎస్సార్సీపీ ఏదో చేసింది అంటూ ఆ వ్యవస్థపై ఏదో తెలుగుదేశంకు అంత గొప్ప అభిప్రాయం ఉన్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోకపోతే, అదే సంస్థను ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగ తిట్టిపోసేవి. జగన్మోహన్రెడ్డి వారిని మేనేజ్ చేసేశారని ఏకిపారేసేవారు. '2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ కార్యాలయానికి వెళ్లి ఎంత రచ్చ చేశారో గుర్తు లేదా?' అప్పుడు మాత్రం ఎన్నికల సంఘం పవిత్రమైనదని ఈనాడు రాయలేదే! బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఎన్నికల కమిషన్ను కేంద్రం ద్వారా ప్రభావితం చేయడానికే అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్నికలు 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకొండున ఎందుకు జరిగాయి. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన తర్వాత ఎన్నికలు మే పదమూడు వరకు ఎందుకు వెళ్లాయి? ఇందులో మేనేజ్మెంట్ లేదని ఎవరైనా అనుకుంటారా? అందులోను చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో తెలియదా! లేకుంటే వారికి కావల్సినట్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎలా ఇస్తుంది? కనీసం ఏపీ ప్రభుత్వ అభిప్రాయం అయినా తీసుకుందా? కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్కు ఈ వ్యవహారంలో బాద్యత లేదట! ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి, దారుణమైన ఆదేశాలు తెప్పించిన రమేష్ ఉత్తముడట! ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించిన ఏపీ ప్రభుత్వ అధికారులు చెడ్డవారట. వలంటీర్ల వ్యవస్తపై నీచమైన విమర్శలు చేస్తూ పలు కదనాలు రాసిన రామోజీ గొప్పవాడట. ఆ విమర్శలను సమర్దించిన చంద్రబాబు,పవన్లు గొప్ప నాయకులట. అంత గొప్పగా ఫీల్ అయితే వలంటీర్ల పై ఆంక్షలు పెట్టిన కొద్ది గంటలలోనే చంద్రబాబు కానీ, ఈ మీడియా సంస్థలు కానీ తమకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుని వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. రామోజీ, రాధాకృష్ణలు తనకు ఎంత డామేజీ చేశారో చంద్రబాబుకు అర్దం అయ్యే ఉంటుంది. కానీ ఆయన నిస్సహాయుడిగా మిగిలారు. వారి చేతిలో ఒక బందీగా ఉండి, వారు చెప్పినట్లు ఆడే పరిస్థితికి చంద్రబాబు చేరుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే తప్పుడు వార్తలు, అబద్దాలనే మహా ప్రసాదంగా భావించి చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలేసరికి లబోదిబో అంటున్నారు. ఇంటింటికి పంపీణీ సులువేనని టీడీపీవారు కానీ, 'ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కానీ కొత్త రాగం ఎందుకు అందుకున్నారో ప్రజలు అర్ధం చేసుకోలేరా? ఇంటింటికి పెన్షన్ ఇచ్చేటప్పుడు వలంటీర్లు అయితేనేమి? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అయితేమి?' ఈ మాత్రం ఇంగితం లేకుండా వలంటీర్లపై విషం కక్కిన ఎల్లో మీడియా, తాము చేసిన దిక్కుమాలిన చర్యవల్ల, తాము జాకీలేసి లేపుతున్న తెలుగుదేశంకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అర్ధం అయిందని అనుకోవాలి. కొన్నిచోట్ల వలంటీర్లు టీడీపీ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నారు. ఒక్క మచిలీపట్నంలోనే 1227 మంది వలంటీర్లు రాజీనామా చేశారట. ఇదంతా టీడీపీకి తల బొప్పి కట్టించేదే. అసలే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు ప్రచార సభలలో ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. టిప్పర్ డ్రైవర్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి టిక్కెట్ ఇస్తారా అని చంద్రబాబు అన్న ఫలితంగా లక్షల సంఖ్యలో ఉన్న డ్రైవర్లకు ఆగ్రహం తెప్పించారు. ఇప్పుడు వృద్దాప్య పెన్షన్లు ఇళ్లకు ఇవ్వకుండా ఆపి పాపం మూటకట్టుకోవడంతో అరవై లక్షలమంది టీడీపీకి, చంద్రబాబుకు శాపనార్ధాలు పెడుతున్నారు. దీని అంతటికి కారణం ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారేనని కూడా ప్రజలకు తెలిసిపోయింది. చంద్రబాబుకు కూడా అవగతమైంది కానీ, ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దెబ్బమీద దెబ్బపడుతుండడంతో ఏపీలో టీడీపీ గెలవడం అసాద్యమన్న భావన సర్వత్రా ఏర్పడడంతో దానిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా రకరకాల విన్యాసాలు, యుటర్న్లు చేస్తోంది. టీడీపీని ఆకాశానికి జాకీలతో ఎత్తాలని ప్లాన్ చేసిన వారిద్దరూ చివరికి పెద్ద గోతిలో పడేశారు. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ గోయినుంచి పైకి లేవడం అంత తేలిక కాదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబుకు తగ్గట్టే.. టీడీపీ అభ్యర్దుల నోటి జారుడు!
వాలంటీర్ల వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద తెలుగుదేశం లీడర్లు చేస్తున్న కామెంట్లు, అనుసరిస్తోన్న ధోరణి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. చంద్రబాబు తగ్గట్టే కొందరు టీడీపీ అభ్యర్దులు కూడా నోటికి ఎంత మాట వస్తే అంతా మాట్లాడి వివాదాస్పదులవుతున్నారు. వలంటీర్లను స్లీపర్ సెల్స్ అని, టెర్రరిస్టులని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్ది బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణంగా ఉంది. దీనిపై వలంటీర్లు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వలంటీర్లపై ద్వేషంతో ప్రవర్తిస్తోంది. తొలుత చంద్రబాబు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినా, ఆ తర్వాత వారి ప్రాముఖ్యత, ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించక తప్పలేదు. మొదట వలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు అవహేళన చేశారు. ఇళ్లలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడుతున్నారని నీచంగా ఆరోపించారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి, తాను కూడా వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని ప్రకటించారు. పైగా 'వలంటీర్లకు ఏభై వేల రూపాయల వరకు వచ్చే ఏర్పాటు చేస్తారట. అదెలాగో ఎవరికి తెలియదు'. వలంటీర్లకు ఆయన తాయిలాలు వేసే దశకు వచ్చారంటే ఆ వ్యవస్థ ఎంత బలంగా నాటుకుంది అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ప్లస్ అవుతున్నదన్నదే ఆయన బాధ. టీడీపీ నేతలలో వలంటీర్లు అంటే భయం ఏర్పడింది. దానికి తోడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్లు చేసిన అనుచిత వ్యాఖ్యల ప్రభావం తమమీద పడుతుందేమోనన్న సందేహం వారిలో ఉంది. 'పవన్ కల్యాణ్ అయితే ఏకంగా వలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చారు. నిజానికి వలంటీర్లలో అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు ఉన్నారు. అయినా వీరిద్దరూ దారుణంగా మాట్లాడారు. వారికంటే తానేమీ తక్కువ తీసిపోలేదన్నట్లు సుధీర్ రెడ్డి వంటి వారు మరీ మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు'. కరోనా కష్టకాలంలో ఏపీలో ప్రజలకు అండగా ఉండి వలంటీర్లు చేసిన సేవలను ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే పలకరించడానికి భయపడిన రోజుల్లో కరోనా సోకిన వారిని ఆస్పత్రులలో చేర్చి, వారికి చికిత్స జరిగేదాక శ్రద్ద తీసుకున్న వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చారంటే వారి సంస్కారం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్త సఫలం అవుతుందని తెలుగుదేశం, జనసేన నేతలు ఊహించలేదు. అందుకే ఇష్టారీతిన మాట్లాడి నోరుపారేసుకున్నారు. ఆ తర్వాత తప్పును గుర్తించినా లాభం లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వలంటీరు వందల మందిని ప్రభావితం చేయగలిగే శక్తి మంతులయ్యారన్నది వీరి అనుమానం. వలంటీర్లు సేవలందిస్తున్న ఆ వ్యవస్థను నెలకొల్పి ప్రజల ఇళ్ల వద్దకే పాలనను తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డిది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతోంది. కులం, ప్రాంతం, పార్టీ.. ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏపీలో మొదటిసారిగా ఇలా స్కీములు అమలు అవుతున్నాయి. 'గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తే, అవినీతి విశృంఖలంగా చేస్తే టీడీపీ గబ్బు పట్టిపోయింది'. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వలంటీర్ల సేవలు ప్రజలకు బ్రహ్మాండంగా అందుతుండడంతో పూర్వకాలంలో టీడీపీకి ఓటు వేసినవారు సైతం ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుతున్నారు. దాంతో కంగారు పుట్టిన టీడీపీ నేతలు అనుచితంగా మాట్లాడి మరింత అప్రతిష్టపాలవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలకు సంతోషపడి ఒక్కో వలంటీర్కు పది మంది చొప్పున టీడీపీ వారు మారినా, పాతిక లక్షల మంది వైఎస్సార్సీపీకి అనుకూలం అవుతారన్నది వీరి అంచనా. అందుకే వలంటీర్ల వ్యవస్థను అవుననాలో, లేక కాదానలో తేల్చుకోలేక, ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడి మరింతగా పలచన అవుతున్నారు. 'గతంలో రోజుల తరబడి వృద్ధులు తమ పెన్షన్ల కోసం ఆఫీస్ల చుట్టూ తిరగవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఇళ్లకే వలంటీర్లు వచ్చి ఇస్తుండడంతో వృద్ధులంతా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిను తమ బిడ్డగా చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారు. సహజంగానే అది టీడీపీవారికి గంగవెర్రిలెత్తిస్తుంటుంది'. 'చిత్రం ఏమిటంటే ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్టు అని వ్యాఖ్యానిస్తే, టీడీపీ నేతలు బొజ్జల వంటివారు వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతున్నారు'. చంద్రబాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నట్లే వీరు కూడా వలంటీర్లను ప్రశంసించక తప్పని స్థితి ఏర్పడింది. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏభై ఇళ్లకు ఒక వలంటీర్ను నియమిస్తే, ఇప్పుడు చంద్రబాబు ప్రతి ఇరవై కుటుంబాలకు ఒక వలంటీర్ను పెడతానని చెబుతున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తానని అంటున్నారు'. జనం వీటిని నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. వలంటీర్లను తెగతిట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని పెడతామంటే అన్నిటిలోను యుటర్న్ తీసుకున్నట్లు దీనిలో కూడా మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి పాట్లు పడుతున్నారని తెలియడం లేదా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కాలవ మోసం.. ఇదే సాక్ష్యం!
ఇది రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో నాయీ బ్రాహ్మణ భవన నిర్మాణం కోసమంటూ టీడీపీ హయాంలో వేసిన వేసిన శిలాఫలకం. సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికలు రెండు నెలల్లో జరగబోతున్నాయగా.. అప్పట్లో మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులు హడావుడిగా శిలాఫలకం వేసేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పట్టించుకోకుండా కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కనికట్టు చేసేశారు. ఇదొక్కటే కాదు... పలు వర్గాలను మచ్చిక చేసుకునేందుకు పట్టణంలో అనేక చోట్ల ఇలాగే శిలాఫలకాలతో నాటకాలకు తెరలేపి వలపన్నారు. కానీ, అప్పటికే ఆయన మోసాలతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. తనను నమ్మి ఓట్లేసిన పాపానికి నియోజకవర్గ ప్రజలను గతంలో కాలవ శ్రీనివాసులు నిండా ముంచారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినా నియోజకవర్గానికి ఆయన ఒరగ బెట్టిందేమీ లేదు. పైగా టీడీపీ నేతలతో కలిసి దోపిడీలకు తెగబడ్డారు. కావాల్సినంత వెనకేసుకున్నారు. అప్పట్లో ప్రజలపై పచ్చమూకలు దౌర్జన్యాలకు పాల్పడినా అడ్డు చెప్పలేదు. జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తున్నా ఆపలేదు సరికదా.. వారికే వంత పాడారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నారు. కుల సంఘాలకు కుచ్చుటోపీ.. మంత్రిగా ఉన్నన్నాళ్లూ నియోజకవర్గాన్ని పట్టించుకోని కాలవ శ్రీనివాసులు.. గత సార్వత్రిక ఎన్నికల ముందు నాటకాలకు తెరలేపారు. ఎలాగైనా ఓట్లు రాబట్టేందుకు కల్యాణ మండపాల పేరుతో డ్రామాలు చేశారు. సరిగ్గా ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉండగా, రాయదుర్గం ముత్రాసు కాలనీ బైపాస్రోడ్డు పక్కన షాదీమహల్కు, మల్లాపురం లౌఅవుట్ వద్ద రజక భవనానికి, బళ్లారి రోడ్డులో స్వకుళసాలి సమాజ కళ్యాణ మండపానికి శంకుస్థాపనలు చేశారు. ఆర్భాటంగా శిలాఫలకాలు వేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేవలం గంట ముందు కూడా డీ హీరేహాళ్ మండలం ఓబుళాపురం వద్ద గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ఓ నీటి పథకానికి శంకుస్థాపన చేశారంటే ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు ఆయన ఎంతలా యత్నించారో అర్థం చేసుకోవచ్చు. కాలవ మోసాలకు నేటికీ ఆ శిలాఫలకాలు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. మళ్లీ మోసగించేందుకు కుయుక్తులు.. ఎన్నికల సమయంలో నాటకాలు ఆడడం అలవాటుగా మార్చుకున్న కాలవ శ్రీనివాసులు.. నేడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుయుక్తులకు తెరలేపారు. ఈ సారి గెలిస్తే తప్పకుండా కల్యాణ మండపాలు పూర్తి చేస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. కానీ, ఆయన మోసాలు పసిగట్టిన నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే పూర్తి చేయలేని నిర్మాణాలను.. మళ్లీ గెలిపిస్తే పూర్తి చేస్తామని చెబుతుండడం హాస్యాస్పదమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 650 హామీలిచ్చి, ఆఖరుకు ఆరింటిని కూడా నెరవేర్చని టీడీపీ అధినేత చంద్రబాబు బాటలోనే కాలవ శ్రీనివాసులు ఇంకా నడుస్తుండడం బాధాకరమంటూ నిట్టూరుస్తున్నారు. కాలవను ఎవరూ నమ్మరు! గత ఎన్నికల ముందు షాదీమహల్ నిర్మాణానికి కాలవ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. ముస్లిం, మైనార్టీలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశపడ్డాం. చివరికి అంతా ఆర్భాటమేనని తేలింది. పైసా నిధులు మంజూరు చేయకుండా మోసం చేశారు. ఇలాగే, శ్మశాన వాటికకు కూడా శిలాఫలకం వేసి చెవిలో పూలు పెట్టారు. నేడు మళ్లీ డ్రామాలాడుతున్న ఆయనను నమ్మేవారు లేరు. – గోనబావి షర్మశ్, రాయదుర్గం ఆశలపై నీళ్లు చల్లారు.. కల్యాణ మండపం నిర్మిస్తామని చెప్పి నాయీ బ్రాహ్మణులను కాలవ శ్రీనివాసులు మోసగించారు. శాంతినగర్లో శిలాఫలకం వేసినప్పుడు చాలా సంతోషించాం. అంతటితోనే చేతులు దులుపుకుని మా ఆశలపై నీళ్లు చల్లారు. నిధులు మంజూరు చేయకపోవడంతో నేటికీ శిలా ఫలకం ప్రజలను వెక్కిరిస్తోంది. – రఘురాం, రాయదుర్గం మాయమాటలతో సరి టీడీపీ హయాంలో స్వకులశాలి, కుర్నిశాలి, పద్మశాలి కులాల వారి కోసం కల్యాణ మండపాలు నిర్మిస్తామంటూ శిలా ఫలకాలు వేశారు. ఇవి పూర్తయ్యాక ఎంతో ఉపయోగపడతాయని అనుకున్నాం. తీరా చూస్తే అవి ఉత్తుత్తివని తేలింది. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి వంచించడం సరికాదు. – నగేష్, శాంతినగర్, రాయదుర్గం -
బాబు పొత్తు ధర్మం చిత్తు చిత్తు?
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు అంటేనే అవకాశవాద రాజకీయాలకు, కుట్రలు, కుతంత్రాలకు ఆద్యుడు. కేవలం తన అవసరాల కోసమే పొత్తులు, ఎత్తులతో చెత్త రాజకీయాలు చేయడంలో ఆయనదే అగ్రస్థానం. 2014లో తన అవసరాల కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని గద్దెనెక్కారు. అధికారంలో భాగస్వామం ఇవ్వాల్సి వస్తుందని వారితో తెగతెంపులు చేసుకున్నారు. 2019లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. తర్వాత అవినీతి కేసుల్లో 52 రోజులు జైలు జీవితం అనుభవించారు. తాజాగా ఎన్నికల్లో మళ్లీ బీజేపీ వద్ద మోకరిల్లారు. ఢిల్లీలో పడిగాపులు కాసి ఎట్టకేలకు ఎన్డీఏ కూటమిలో బెర్తు సంపాదించారు. ఈ ఎత్తుగడ అంతా ఎందుకంటే కేసుల నుంచి తప్పించుకునేందుకేనని అందరికీ తెలిసిపోయింది. అయినా యథావిధిగానే చంద్రబాబు తన ప్రసంగాల్లో మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మరో వైపు తన మార్కు రాజకీయానికి పదును పెట్టారు. ఎన్నికల ప్రచారం నుంచి పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టేశారు. కూటమి పార్టీల్లోని మిత్రపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో మిత్రపక్షాలు రగిలిపోతున్నాయి. రోడ్ షో సభల్లోనూ అదే తీరు.. పలమనేరు, పుత్తూరు రోడ్ షో సభల్లోనూ చంద్రబాబు తీరులోనూ మార్పులేదు. ఇక్కడ కూడా మిత్రపక్షాల నేతలకు అవకాశం ఇవ్వలేదు. జిల్లాలో బీజేపీతోపాటు జనసేన పార్టీలకు చెప్పుకోదగ్గ నేతలు ఉన్నప్పటికీ వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. తన ప్రసంగాల్లో కూడా మిత్రపక్ష నేతల పేర్లుగానీ, వారి భాగస్వామ్యం కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కూటమి పార్టీలన్నీ టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని మాత్రం పదేపదే విన్నవించారు. ఇరుకు సందుల్లో సభలా.. రాజకీయాల్లో 40 ఏళ్లు అనుభవం ఉందంటూ పదే పదే చెప్పుకునే చంద్రబాబు తన స్థాయికి తగిన విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించటం లేదని సాక్షాత్తూ టీడీపీతోపాటు బీజేపీ, జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. కుప్పంతోపాటు పలమనేరు, పుత్తూరు నిర్వహించిన సభలు చాలా ఇరుకు సందుల్లో నిర్వహించారు. జనం రారనే ఉద్దేశంతోనే చంద్రబాబు ముందస్తు జాగ్రత్తగా పట్టుమని వందమంది నిలబడలేని సందుల్లో సభలు పెట్టడం గమనార్హం. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనం రాలేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచార వాహనం ముందు చుట్టూ పలుచగా జనం కనిపించడంతో ఏం చేయాలో దిక్కుతోచక తల పట్టుకునే పరిస్థితి ఎదురవుతోంది. జెండాలు మోయడానికేనా..? పొత్తు కోసం వెంపర్లాడిన చంద్రబాబు ఆ పొత్తు ధర్మాన్ని ఆచరించటం లేదని బీజేపీ, జనసేన నేతలు లోలోన రగిలిపోతున్నారు. తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా అడుగడుగునా అవమానిస్తున్నారని ఆయా పార్టీ నేతలు బాహాటకంగానే చెబుతున్నారు. తమను కేవలం జెండాలు మోయడానికే చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో తమ సత్తా చూపాలని ఆ రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు వన్మ్యాన్ షో.. చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి ఆరంభించారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఏకంగా మూడు రోజులు గడిపారు. పార్టీ నేతలు, క్యాడర్తో వరుసగా సమావేశాలు నిర్వహించి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. కానీ, పొత్తు ధర్మాన్ని యథావిధిగా పక్కన పెట్టేశారు. తన ప్రసంగంలో సొంత పార్టీ టీడీపీ కేడర్కే ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీ, జనసేన మైత్రిని కేవలం కరివేపాకులా ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారాన్ని జిల్లాతోపాటు తన సొంత కుప్పం నుంచే ప్రారంభించిన సందర్భంగా, పొత్తులు ఎందుకు? ఏ కారణం చేత కూటమిగా ఏర్పడాల్సి వచ్చింది? అనే విషయాన్ని వివరించకుండానే లక్ష మెజారిటీతో గెలిపించాలని పదేపదే ప్రాధేయపడ్డారు. కనీసం వేదికలపై మిత్ర పక్షాలు బీజేపీ, జనసేన నేతలను మాట వరుసకు ఊడా పిలవలేదు. వచ్చిన వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో కూటమి పార్టీ నేతల్లో తీవ్ర అసహనం కనిపించింది. ఇవి చదవండి: ‘దక్షిణ’ నాదంటే నాదే! -
Jana Sena Clash: ‘దక్షిణ’ నాదంటే నాదే!
సాక్షి, విశాఖపట్నం: జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు రసకందాయంలో పడింది. ఈ టికెట్ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్ జరుగుతోంది. ఈ సీటును కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజులతో పాటు మూగి శ్రీనివాస్లు ఆది నుంచీ ఆశిస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థుల జాబితాల్లో విశాఖ దక్షిణ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయినా ఈ సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. వంశీ అభ్యర్థిత్వంపై దక్షిణం సీటును ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ‘వంశీ వద్దు.. స్థానికులే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. కొద్దిరోజుల క్రితం ఒక మేకను తీసుకొచ్చి వంశీతో పోలుస్తూ ఈ సీటును బలి చేయొద్దని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో వంశీ వర్గీయులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జనసేన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో జనసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. వంశీ ఎన్నికల ప్రచారానికి వ్యతిరేక వర్గీయులు దూరంగా ఉంటున్నారు. మరోపక్క వంశీకృష్ణకు టికెట్ కేటాయింపు ప్రకటన వట్టిదేనని, అంతా బూటకమని కందుల బహిరంగంగానే చెబుతున్నారు. పవన్ ఆ సీటును తనకే ఖరారు చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. మంగళగిరికి కందుల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను కలిసి విశాఖ దక్షిణ సీటు తనకే కేటాయించాలని కోరేందుకు కందుల నాగరాజు గురువారం మంగళగిరికి పయనమయ్యారు. వంశీకృష్ణకు సీటిస్తే ఓడిపోతారని, తనకిస్తే గెలుస్తానని చెప్పడానికి వెళ్లారు. సీటు ఇస్తారన్న హామీతోనే గతంలో జనసేనలో చేరానని, ఒకవేళ తనకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి గుడ్బై చెబుతానని పవన్కు స్పష్టం చేయనున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. మంగళగిరి పంచాయతీలో దక్షిణ టికెట్పై ఏం తేలుస్తారోనని జనసేన శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇవి చదవండి: ‘సైకిల్’ దొంగ దొరికాడోచ్! -
కేజ్రీవాల్, కవితల అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రింకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలోనే, సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందుగా, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోది తెలంగాణలో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ అరెస్టు జరగడం విశేషం. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంటిపైకి దాడి చేసి, సోదాలు చేసి ఆయనను అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా కనిపిస్తుంది. కేజ్రీవాల్, కవితలకు ఈడీ ఇచ్చిన ఒకటి, రెండు నోటీసులకు స్పందించారు. విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వారికి అరెస్టు అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ విచారణకు హాజరవకుండా కాలయాపన చేశారు. ఎవరు అక్రమాలకు పాల్పడినా చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈ దర్యాప్తు సంస్థలు వేల కోట్ల అక్రమాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న వారిని చూసి, చూడనట్లు వదిలేస్తూ, వంద కోట్లు ఆరోపణలపై ఇంత గట్టిగా హడావుడి చేయడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసుకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రభుత్వంపై కోపంతోనే, అక్కడ బీజేపీకి ఉన్న బలం తగ్గడంతోనే తన చేతిలోని అధికారాన్ని బీజేపీ ఇలా వినియోగిస్తోందన్నది పలువురి అభియోగం. లిక్కర్ స్కామ్ జరిగింది కనుకే అధికారులు చర్య తీసుకున్నారన్నది బీజేపీ వాదన. 2023 శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందే కవితను ఈ కేసులో అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. ఎందువల్లో కానీ అలా జరగలేదు. దాంతో బీఆర్ఎస్, బీజేపీల మద్య రాజీ కుదిరిందేమో అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కొంత నష్టం జరిగింది. కనీసం ఇరవై సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది బీజేపీ నేతల మనోగతంగా ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నందున, మాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేయడానికి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వరాదన్న లక్ష్యంతోనే ఈ అరెస్టుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చని చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇందువల్ల బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా అన్నది చర్చనీయాంశం. ప్రస్తుతం బీఆర్ఎస్ విపక్షంలో ఉంది. తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. అలాంటప్పుడు తమవంతుగా ఒక దెబ్బకొట్టి బీఆర్ఎస్ను ఇంకా బలహీనపరిస్తే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని బీజేపీ నేతలు భావించి ఉండవచ్చు. విశేషం ఏమిటంటే బీజేపీ ఢిల్లీలో జరిగినట్లు చెబుతున్న వంద కోట్ల రూపాయల స్కామ్ పై ఇంత శ్రద్ద చూపుతోంది కానీ, వేల కోట్ల స్కామ్ల గురించి పట్టించుకోకుండా, తమ వైపునకు వస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులలోకానీ, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కొందరిపై ఉన్న కేసులలో కానీ,ఆదర్శ్ స్కామ్ లో పదవీచ్యుతుడైన కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీ మారి బీజేపీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చిన తీరుకానీ, చీలిక వర్గం శివసేన, చీలిక వర్గం ఎన్సీపీ నేతల పట్ల అనుసరించిన వైఖరులు కానీ ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. కవిత ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం తప్పే అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆప్కు చెందిన మంత్రి మనీష్ సిసోడియా ఇదే కేసులో సంవత్సర కాలంగా జైలులో ఉన్నారు. లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడానికి వీలుగా విధానాన్ని మార్చడంపై వచ్చిన ఆరోపణలు, ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు కనుక, కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీ వంటి వాటిని ప్రయోగించగలిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఇరుకున పెట్టాలని బీజేపీ తలపెట్టిందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. నిజంగానే అవినీతిపై బీజేపీ ఫోకస్ పెడితే మంచిదే. అలాకాకుండా కేవలం ప్రత్యర్ధులను భయపెట్టడానికి, తన రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికే ఈడీ, సీబీఐ వంటివాటిని వాడితే అది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లే అవుతుంది. గతంలో బీజేపీ ఈ సంస్థలపై, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసిందో, అదే పని ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుందని భావించవలసి ఉంటుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదిని టెర్రరిస్టుతో పోల్చారు. సీబీఐ, ఈడీ వంటివాటితో తమపై దాడులు చేయిస్తోందని ద్వజమెత్తేవారు. సీబీఐ తనను అరెస్టు చేయడానికి రావచ్చని, అప్పుడు ప్రజలంతా తన చుట్టూ నిలబడి రక్షించుకోవాలని అనేవారు. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని ఆదేశాలు కూడా ఇచ్చారు. అప్పట్లో కొందరు టీడీపీ ప్రముఖులపై ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలు దాడులు చేశాయి. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలయ్యాక, చంద్రబాబుకు పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో ఐటీ శాఖ సోదాలు చేసి రెండు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఆదారాలు దొరికినట్లు సీబీటీడీ ప్రకటించింది. అలాగే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ మనీ లాండరింగ్ తదితర ఆరోపణలకు సంబందించి పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఏదో రకంగా వాటి నుంచి బయటపడుతూనే ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు యుటర్న్ తీసుకుని ప్రధాని మోదిని, బీజేపీని పొగడడం ఆరంభించారు. అంతవరకు మోది అంత అవినీతి పరుడు లేడని, టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలతాడని అంటూ వ్యక్తిగతంగా చంద్రబాబు దాడి చేసేవారు. కానీ ఓటమి తర్వాత బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయారు. తన పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించారు. పవన్ కల్యాణ్ను బీజేపీ గూటికి పంపించి, తనకు, బీజేపీకి మధ్య రాయబారిగా వాడుకున్నారు. బీజేపీ కూడా చంద్రబాబు కేసుల జోలికి రాకుండా వదలిపెట్టేసిందని అనుకోవాలి. ఏపీలో చంద్రబాబు టైమ్ లో జరిగిన పలు కుంభకోణాలలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రం స్పందించలేదంటేనే చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ ఏ రకంగా ఉన్నది జనం అర్దం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరాన్ని ఏటీఎమ్గా వాడుకున్నారని మోది ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్గా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు సంచలన ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్లకు 150 కోట్ల మేర ముడుపులు చెల్లించామని చెప్పారు. అయినా ఈడీ, సీబీఐ ఏవీ స్పందించలేదు. ఐటీ ఇచ్చిన నోటీసులో దుబాయిలో జరిగిన మనీలాండరింగ్ గురించి కూడా ప్రస్తావించినా తదుపరి చర్యలేదు. చంద్రబాబు ఏపీలో స్కిల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు అయితే బీజేపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ను వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్షాను కలిసి సాయం చేయాలని అడిగారు. ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది! తాజాగా హైదరాబాద్లో ఐఎమ్.జి భరత్ అనే సంస్థకు అప్పనంగా 850 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన కేసులో సీబీఐ విచారణ జరగాలని హైకోర్టు అబిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయమై ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎటూ చంద్రబాబు శిష్యుడే కనుక దానినుంచి తప్పించవచ్చు. ఈ రకంగా అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ను మేనేజ్ చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించగలుగుతున్నారని చెప్పాలి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేవారు. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు కొందరు, న్యాయ వ్యవస్థలోని ఒకరిద్దరు ప్రముఖులు అండగా నిలిచి చంద్రబాబుపై కేసు రాకుండా చూడగలిగారు. ఇలా పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు జోలికి ఈడీ, సీబీఐ వంటివి ఎందుకు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చెబుతాం. బీజేపీలో చేరిన సుజనా చౌదరి సుమారు ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగవేశారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా పార్టీ మారగానే ప్రధాని ఎదురుగా కూర్చోగలిగారు. అలాగే చంద్రబాబు కూడా మోదితో కలిసి సభలో పాల్గొనగలిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేర్పరితనం కేసీఆర్లో, కేజ్రీవాల్లో కొరవడడం వల్లే ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే కేజ్రీవాల్ జైలు పాలయ్యారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించడానికి ప్రయత్నించడం, ప్రధాని మోదిపై, బీజేపీ నేతలపై తీవ్రంగా విమర్శలు గుప్పించడం వంటివి చేశారు. తొలుత మోదితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నా, ఎందువల్లో కేసీఆర్ ఆయనకు దూరం అయ్యారు. చివరికి పలకరించుకోలేని స్థితికి వచ్చారనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తన కుమార్తెను అరెస్టు చేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఇంకో వైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ నేతలపై దాడి పెంచింది. ఎంపీగా పోటీచేయాలని ఉబలాటపడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెక్ పెడుతూ ఆయన కుటుంబానికి చెందిన కాలేజీలో ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేశారని అధికారులు తవ్వేశారు. ఆక్రమిత స్థలంలో భవనాలు కట్టారని వాటిని కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి కర్నాటకకు పరుగెత్తి డీకే శివకుమార్ను వేడుకున్నారు. ఆ మీదట తాము ఎంపీ సీటుకు పోటీచేయడం లేదని ప్రకటించారు. అంతేకాక బీఆర్ఎస్ నుంచి ఎందరు దొరికితే అందరిని కాంగ్రెస్, బీజేపీలు గుంజుకుంటున్నాయి. ఎంపీలు కొందరిని బీజేపీ లాగితే ఎమ్మెల్యేలు ఇంతవరకు పదహారు మందిని కాంగ్రెస్ లాగేసినట్లేనని చెబుతున్నారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి మద్దతు ఇస్తున్నారట. అందువల్లే తన ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆయన ఉన్నారు. పఠాన్చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి సోదరుడిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేశారు. ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ ధోరణులేనని బీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. కానీ అప్పట్లో ఈ రకంగా దాడులు జరగలేదు. వారిని ప్రలోభపెట్టి ఆకర్షించుకున్నారు. అయినా అది కూడా విమర్శలకుగురి అయింది. ఇప్పుడు దాని ఫలితం అనుభవించవలసిన పరిస్థితి ఎదురైంది. నైతికంగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దానిని తప్పు పట్టలేని దైన్యంలో కేసీఆర్ పడ్డారు. ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న గేమ్లో బీఆర్ఎస్ బలి అవుతుందా అన్న సందేహం వస్తుంది. అయితే కేసీఆర్ను తక్కువ అంచనా వేయజాలం. ఆయన పలు డక్కీలు తిన్నవాడే. వీటన్నిటిని ఎలాంటి వ్యూహాలతో తిప్పి కొట్టి బీఆర్ఎస్ను సురక్షితంగా నిలబెట్టుకుంటారో చూడాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదేమాదిరిగా చిత్తశుద్దితో కాకుండా ప్రత్యర్ధులను లొంగదీసుకునే వ్యూహాలనే అమలు చేస్తే ఏదో ఒక రోజు దెబ్బతింటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
'భాజా, భజంత్రీల మీడియా'కు ఆపరేటర్గా బాబు!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏది చెబితే అదే నిజం అని ప్రజలు నమ్మాలి. ఆయన ఎన్నిసార్లు మాట మార్చితే అదే కరెక్టు అని ప్రజలంతా అనుకోవాలి. ఆయన ప్రధాని మోదీని పొగిడితే ఆహా, ఓహో అని అంతా చెప్పాలి. మోదీని బండ బూతులు తిడితే బాగుంది.. బాగుంది అని చెప్పాలి. అవును.. నిజమే మరి! చంద్రబాబు ఏది చెబితే అదే రైట్!. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా సంస్థలు ఆయనకు భాజా భజంత్రీలు వాయిస్తాయి కనుక, బాకాలు ఊదుతాయి కనుక, తాను ఏమి చేసినా రాష్ట్రం కోసమే చేస్తానని చంద్రబాబు ఊదరగొట్టుకుంటారు కనుక, రాష్ట్రం కోసం.. అనే బ్రహ్మ పదార్ధాన్ని చంద్రబాబు నాయుడు వాడుకున్నట్లుగా మరెవ్వరూ వాడుకుని ఉండరు. 'ఆయనకు అధికారం ఇస్తే రాష్ట్రం అంతా వెలుగులు చిమ్ముతున్నట్లు, ఆయన అధికారం కోల్పోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయినట్లు భ్రమ కల్పించే మీడియా మాత్రమే ఉన్నప్పుడు జనం కూడా కొన్నిసార్లు అదంతా నిజమేనని మోసపోతుంటారు.' ఆ మోసపోవడం కూడా రాష్ట్రం కోసమే అని అనుకోవాలి. ఆయన రాజకీయ జీవితం అంతా ఈ పదాన్ని అడ్డుపెట్టుకునే జనాల్ని మోసం చేస్తూనే వచ్చారని చెప్పడంలో ఎక్కడా అసత్యం లేదు. ఒక్కసారి గతానికి వెళదాం. 1995 నుంచి తన మామ ఎన్టీ రామారావును ఒక్కపోటు పొడిచి పదవి నుంచి లాగి అవతల పారేశారు. అప్పుడు కూడా చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ వంటివారు చెప్పిన మాట ఇదే. రాష్ట్రం కోసం, తెలుగుదేశం పార్టీ కోసమనే. 'NT రామారావు స్త్రీ లోలుడయ్యారని, ఆయన వల్ల చాలా నష్టం జరిగిపోతుందని' చంద్రబాబు ప్రచారం చేశారు. అదే నిజమని తను అప్పటికే ఆకట్టుకున్న మీడియా ద్వారా జనంపై రుద్దారు. ఎన్టీ రామారావు అప్పట్లో ఒక వీడియో చేశారు. 'చంద్రబాబు అంత నీచుడు లేడని, ఔరంగజేబు వంటివాడని' తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. ఎన్టీ రామారావు సొంతంగా మరో పార్టీని పెట్టుకోవడానికి సన్నద్దమవుతున్న తరుణంలో.. పార్టీ బ్యాంకు ఖాతాలలోని డబ్బును చంద్రబాబు వర్గం తన పరం చేసుకుంది. దాంతో ఎన్టీ రామారావు గుండెపోటుకు గురై మరణించారు. ఆ వెంటనే 'ఎన్టీ రామారావు వారసత్వం తమదేనని, ఆయన గొప్పవాడని, ఆయన ఆదర్శాల కోసమే టీడీపీ ఉన్నదని' కొత్త బాణి ఎత్తుకున్నారు. ఇదంతా రాష్ట్రం కోసమేనని ప్రజలు అనుకోవాలని అన్నారు. దాన్నే పచ్చమీడియా ఘనంగా ప్రచారం చేసింది, ఇప్పుడు కూడా చేస్తోంది. ఇక్కడ గమనించాల్సింది ఎన్టీఆర్ గుణగణాలను కాదు.. చంద్రబాబు గోబెల్స్ ధోరణిని. 1996 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చేపార్టీ అని ఆయన అన్నారు. అప్పట్లో కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా రాష్ట్రం కోసమని చెప్పారు. టీడీపీ అధికంగా లోక్సభ సీట్లు గెలిస్తేనే మద్యం నిషేధం కొనసాగుతుందని, రెండు రూపాయలకు కిలో బియ్యం స్కీము కొనసాగుతుందని అనేవారు. తీరా ఎన్నికలు అయిపోయాక మద్య నిషేధం ఎత్తివేయాలని, బియ్యం రేటు పెంచాలని ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నామని అన్నారు. ఇదంతా రాష్ట్రం కోసమేనని అన్నారు. 1996లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్లో టీడీపీ భాగస్వామి అయింది. దీనిని కూడా రాష్ట్రం కోసమేనని ప్రచారం చేశారు. 1998లో యూఎఫ్ నుంచి ఎవరికి చెప్పకుండా బీజేపీ కూటమిలోకి జంప్ చేశారు. 1999 లో బీజేపీతో కలిసి పోటీచేసి రాష్ట్రం కోసం అని అన్నారు. 2001లో గుజరాత్లో మత కలహాలు జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని నరహంతకుడు అని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తీరా పార్లమెంటులో మోదీ వ్యతిరేక తీర్మానం పెట్టినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయకుండా జారిపోయారు. 2004లో ఓడిపోయిన తర్వాత జన్మలో బీజేపీతో కలిసి పోటీచేయనని అన్నారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు. 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. 2009లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో కలిసి పోటీచేసి అదంతా రాష్ట్రం కోసం అని చెప్పారు. టీడీపీ ఏపీ నేతలు వద్దన్నా, రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చారు. తీరా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చేసిన తర్వాత తెలంగాణలో తనవల్లే రాష్ట్రం ఏర్పడిందని, ఆంధ్రను కాంగ్రెస్ నాశనం చేసిందని ప్రచారం చేశారు. సోనియాగాంధీ దెయ్యం, ఇటలీ మాఫియా అని ధ్వజమెత్తేవారు. ఇదంతా రాష్ట్రం కోసమేనని అనుకోవాలి. అలాగే ప్రచారం చేయించారు కూడా. 2014నాటికి మళ్లీ మోదీ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి బతిమలాడి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పొత్తు కోరారు. మోదీ, పవన్కల్యాణ్లతో కలిసి తిరుపతిలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. లక్ష కోట్ల రూపాయల రుణాల మాఫీకి హామీ ఇచ్చారు. రాష్ట్రం కోసమే ఇలా చేస్తున్నానని చెప్పేవారు. ఎలాగో అలా అధికారం సంపాధించాక రాష్ట్రం కోసం మానిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించారు. ప్రత్యేక హోదాపై రెండుసార్లు మాట మార్చారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నవనిర్మాణదీక్షలు, టరమ్ చివరిలో బీజేపీకి వ్యతిరేకంగా ధర్మపోరాట దీక్షలు చేసింది రాష్ట్రం కోసమేనని నమ్మబలికారు. ప్రధాని మోదీని టెర్రరిస్టు అని, మోసగాడు, అవినీతిపరుడు అని విమర్శించారు కుటుంబాన్ని పట్టించుకోని వ్యక్తి మోదీ అని, భార్యబిడ్డలు లేని వ్యక్తి అని చంద్రబాబు దూషించాడు. అది రాష్ట్రం కోసమేనని అనుకోమన్నారు. రుణమాఫీ హామీపై రైతులు ప్రశ్నిస్తే వారిని ఆశపోతులు అని విమర్శించారు. 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో జత కట్టినా, 2023లో కాంగ్రెస్కు పరోక్ష మద్దతు ఇచ్చినా ఏపీ ప్రయోజనాలకోసమేనని జనమంతా అనుకోవాలి కాబోలు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని రాత్రికి రాత్రే పెట్టేబేడా సర్దుకుని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదలుకుని విజయవాడ పారిపోయింది ఏపీ ప్రయోజనాల కోసమేనని నమ్మించడానికి తన వర్గం మీడియా ద్వారా యత్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీ నుంచి విడిపోయినా రాష్ట్రం కోసమేనని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేసి జనాన్ని మోసం చేయడానికి యత్నించారు. వీటన్నిటి ఫలితమే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అని చెప్పాలి. ఆ ఓటమి తర్వాత మళ్లీ బీజేపీ పంచన చేరడానికి నానా పాట్లు పడ్డారు. పవన్ కల్యాణ్ను ప్యాకేజీ ఇచ్చో, ఏదో రకంగా లొంగదీసుకుంది.. అతని ద్వారా బీజేపీతో రాయబారం చేసింది.. ఇదంతా రాష్ట్రం కోసమే. 2019 ఎన్నికలలో జగన్మోహన్రెడ్డికు ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని, ముస్లింలు, క్రిస్టియన్లను బతకనివ్వరని ప్రచారం చేసింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. 2024లో ఢిల్లీలో తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి చంద్రబాబు ఏపీలో ఒక్కశాతం ఓట్లు కూడా లేని బీజేపీతో జట్టు కట్టింది రాష్ట్రం కోసమేనట. దేశ ప్రధాని మోదీ పోలవరంను చంద్రబాబు ఏటీఎమ్గా మార్చుకున్నారని ఆరోపించినా, మోదీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నా.. చివరికి రాజీ కుదుర్చుకుంది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనట. ఇలా రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని పచ్చి అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ఏపీ ప్రజలను మోసం చేయడానికి భజంత్రి మీడియాను ఆపరేట్ చేస్తున్నారు. 'నిజానికి ఇదంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల స్వార్ధ ప్రయోజనాల కోసం. అధికార దాహంతోను, కేసుల భయం నుంచి బయటపడడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తప్పితే, ఇందులో రాష్ట్ర ప్రయోజనం లేదు.. వంకాయ లేదు.' అదేదైనా ఉంటే తాము పొత్తు ఫలానా డిమాండ్ల మీద పెట్టుకున్నామని చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఉందా? ఒకపక్క బీజేపీ వారు టీడీపీ అంటే చీదరించుకుంటున్నారని, తనను చివాట్లు పెట్టారని పవన్కల్యాణ్ చెప్సినా సిగ్గులేకుండా ఆ పార్టీ పొత్తు కోసం తహతహలాడి, బతిమిలాడో, బామాలో పొత్తు పెట్టుకుని ఇప్పుడు మళ్లీ రాష్ట్రం కోసమని గాత్రం ఆరంభించారు. దీనిని నమ్మేవారు ఎవరైనా ఉంటే అది వారి ఖర్మ. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
1994 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
1994 ఎన్నికలలో అన్ని సామాజికవర్గాలలో టీడీపీదే ఆధిక్యత. 1994లో ఎన్.టి రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఉమ్మడి ఎపిలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని తేడా లేకుండా టీడీపీ మెజార్టీ సీట్లు సాదించింది.అన్ని సామాజికవర్గాలలో కూడా టీడీపీదే పై చేయి అయింది. ఎపిలోని కోస్తా, రాయలసీమలలో నలభై మంది రెడ్డి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే అందులో ఇరవై ఐదు మంది టీడీపీ తరపున, పన్నెండు మంది కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒకరు సీపీఎమ్ తరపున గెలిచారు.కమ్మ నేతలు రికార్డు స్థాయిలో నలభైఏడు మంది గెలవగా, ముప్పై తొమ్మిది మంది టీడీపీ పక్షాన, ఇద్దరు మాత్రం కాంగ్రెస్ తరపున గెలిచారు. ఇండిపెండెంట్లుగా నలుగురు (వారిలో ముగ్గురికి కూడా టీడీపీ మద్దతు ఇచ్చింది) ఒకరు సీపీఐ, ఒకరు సీపీఎం ల పక్షాన గెలిచారు. కాపు సామాజికవర్గం నేతలు 21 మంది గెలవగా, టీడీపీ నుంచి పదిహేడు మంది, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు, ఒక ఇండిపెండెంట్ నెగ్గారు. బీసీల నుంచి 32 మంది గెలిస్తే ముప్పైమంది టీడీపీ, ఒకరు కాంగ్రెస్, ఒకరు సీపీఐ తరుపున గెలిచారు. ఎస్సీ నేతలు 22 మందికిగాను పదహారుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు సీపీఎం, ఒకరు సీపీఐ నుంచి ఎన్నికయ్యారు.గిరిజనుల నుంచి ఎనిమిదికి గాను ఏడుగురు టీడీపీ, ఒకరు సీపీఐ నుంచి గెలిచారు. క్షత్రియులు తొమ్మిది మంది గెలవగా, ఆరుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐకి చెందినవారు. ముస్లీంలు నలుగురికి గాను ముగ్గురు టీడీపీ, ఒకరు సీపీఐ పక్షాన గెలిచారు. ముగ్గురు వెలమలు, వైశ్య ఒకరు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో టీడీపీ, సీపీఐ, సీపీఎం లు కలిసి కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. కోస్తా, రాయలసీమల నుంచి బిజెపి పక్షాన ఒక్కరు కూడా నెగ్గలేదు. రికార్డు సంఖ్యలో కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు 1994 శాసనసభ ఎన్నికలలో కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు రికార్డు స్తాయిలో ఎన్నికయ్యారు. మొత్తం నలభై ఏడు మంది ఎన్నిక కాగా వారిలో టీడీపీ నుంచి ముప్పై తొమ్మిది మంది ఉన్నారు. వీరు కాక టీడీపీ మద్దతు ఇచ్చిన ముగ్గురు ఉన్నారు. మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంలకు చెందినవారు ఒక్కొక్కరు ఉండగా, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెట్ ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ గన్నవరం నుంచి టీడీపీపై గెలిచి, ఆ తర్వాత ఆ పార్టీలో చేరిపోయారు. కాగా కోస్తా నుంచి ముప్పై ఆరు మంది గెలవగా, రాయలసీమ నుంచి తొమ్మిది మంది ఎన్నికయ్యారు. కాగా ఎన్. రామారావు కోస్తాలోని టెక్కలి నుంచి, రాయలసీమలోని హిందుపూర్ నుంచి పోటీచేసి రెండు చోట్ల గెలిచారు. తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు 39 ఎన్.టి రామారావు-టెక్కలి, గద్దె బాబూరావు-చీపురుపల్లి, బి.భాస్కర రామారావు-పెద్దాపురం, వివిఎస్ చౌదరి -ఆలమూరు,కెవి రామకృష్ణ- బూరుగుపూడి, జి.బుచ్చయ్య చౌదరి-రాజమండ్రి, పీ.వి.కృష్ణారావు-కొవ్వూరు, ఎమ్.వి.కృష్ణారావు-తణుకు, కె.విశ్వనాదం-ఉంగుటూరు, జి.సాంబశివరావు-దెందులూరు, రావి శోభనాద్రి-గుడివాడ, వై.సీతాదేవి-ముదినేపల్లి, ఎ.బాబూరావు- ఉయ్యూరు, డి.రాజశేఖర్-కంకిపాడు, జె.రమేష్ బాబు-మైలవరం, డివి రమణ-నందిగామ, నెట్టెం రఘురాం-జగ్గయ్యపేట, డి.నరేంద్ర-పొన్నూరు, ఎ.రాజేంద్రప్రసాద్-వేమూరు, ఎమ్.వెంకటసుబ్బయ్య- రేపల్లె, రావి రవీంద్రనాద్-తెనాలి. ముప్పలనేని శేషగిరిరావు-బాపట్ల, మాకినేని పెదరత్తయ్య-ప్రత్తిపాడు, కోడెల శివప్రసాదరావు-నరసరావుపేట, యరపతినేని శ్రీనివాసరావు-గురజాల, చప్పిడి వెంగయ్య-కంభం, ఈదర హరిబాబు-ఒంగోలు,దివి శివరాం-కందుకూరు, దామచర్ల ఆంజనేయులు-కొండపి, కె.లక్ష్మయ్య నాయుడు-ఆత్మకూరు, కె.మీనాక్షి నాయుడు-ఆదోని, పయ్యావుల కేశవ్-ఉరవకొండ, ఎన్.టి రామారావు-హిందుపూర్, పరిటాల రవీంద్ర-పెనుగొండ, సి.వెంకట రాముడు-దర్మవరం, ఆర్.కృస్ణసాగర్-మదనపల్లె, ఎన్. రామ్మూర్తి నాయుడు-చంద్రగిరి, జి.ముద్దుకృష్ణమ నాయుడు-పుత్తూరు, ఎన్.చంద్రబాబు నాయుడు-కుప్పం. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు.. 2 వంగవీటి రత్నకుమారి-విజయవాడ-రెండు సోమేపల్లి సాంబయ్య-చిలకలూరిపేట. రెడ్డిసామాజికవర్గం ఎమ్మెల్యేల విశ్లేషణ-40 మొత్తం నలభై మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, టీడీపీ పక్షాన ఇరవై ఐదు మంది గెలిచారు. కాంగ్రెస్ తరపున పన్నెండు మంది, సీపీఎం నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు.తెలుగుదేశం నుంచి గెలిచినవారిలో తొమ్మిది మంది కోస్తా నుంచి పదహారు మంది రాయలసీమ నుంచి గెలిచారు. కాంగ్రెస్ కు చెందినవారిలో ముగ్గురు కోస్తా నుంచి తొమ్మిది మంది రాయలసీమ నుంచి విజయం సాదించారు.సీపీఎం నుంచి గెలిచిన నేత, ఇద్దరు ఇండిపెండెంట్లు ఇద్దరు కోస్తా నుంచి నెగ్గారు. తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-25 ఎన్.మూలారెడ్డి-అనపర్తి చల్లా వెంకట కృష్ణారెడ్డి-గుంటూరు-రెండు కె.పున్నారెడ్డి-మాచర్ల పీ.రాంభూపాల్ రెడ్డి-గిద్దలూరు ఎమ్.కాశిరెడ్డి-కనిగిరి ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి-కోవూరు, టి.రమేష్ రెడ్డి-నెల్లూరు, ఇ.శ్రీనివాసులురెడ్డి-రాపూరు, ఎస్.చంద్రమోహన్ రెడ్డి-సర్వేపల్లి, బి.వీరారెడ్డి-బద్వేలు, జి.ద్వారకానాధ్ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, జి.వీరశివారెడ్డి-కమలాపురం, పీ.రామసుబ్బారెడ్డి-జమ్మలమడుగు, భూమా నాగిరెడ్డి-ఆళ్లగడ్డ, బైరెడ్డి రాజశేఖరరెడ్డి-నందికోట్కేరు,కె.సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల, ఎస్.వి.సుబ్బారెడ్డి-ప్రత్తికొండ, బి.వి.మోహన్ రెడ్డి-ఎమ్మిగనూరు,వై.టి ప్రభాకరరెడ్డి-మడకశిర, టిడి.నాగరాజరెడ్డి-నల్లమడ, లక్ష్మీదేవమ్మ-తంబళ్లపల్లె, జివి.శ్రీనాదరెడ్డి-పీలేరు, చింతల రామచంద్రారెడ్డి-వాయల్పాడు, ఎన్.రామకృష్ణారెడ్డి-పుంగనూరు, బి.గోపాలకృస్ణారెడ్డి-శ్రీకాళహస్తి. కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు..12 గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల గాదె వెంకటరెడ్డి-పర్చూరు కె. యానాదిరెడ్డి-కావలి ఎమ్. నారాయణరెడ్డి-రాయచోటి వై.ఎస్. వివేకానందరెడ్డి-పులివెందుల ఎన్. వరదరాజులురెడ్డి-ప్రొద్దుటూరు డి.ఎల్. రవీంద్రరెడ్డి-మైదుకూరు ఇ. ప్రతాపరెడ్డి-ఆత్మకూరు కె. రాంభూపాల్ రెడ్డి-పాణ్యం కోట్ల విజయభాస్కరరెడ్డి-డోన్ జెసి దివాకరరెడ్డి-తాడిపత్రి సికె. జయచంద్రారెడ్డి-చిత్తూరు. ఇతరులు..3 జక్కా వెంకయ్య-అల్లూరు-సీపీఎం జంకె వెంకటరెడ్డి-మార్కాపురం-ఇండి కె.విజయరామిరెడ్డి-ఉదయగిరి- ఇండి( ఈ ఇద్దరు ఇండిపెండెంట్లకు కూడా టీడీపీ మద్దతు లభించింది.) కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు-21 కాపు సామాజికవర్గం నుంచి 21 మంది ఎన్నిక కాగా పదహారు మంది టీడీపీ నుంచి గెలిచారు. వీరిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాలకు చెందినవారే. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల నుంచి ఎన్నికైన వారు కూడా కోస్తా ప్రాంతం వారే. టీడీపీ కాపు ఎమ్మెల్యేలు-17 పీ.చలపతిరావు-యలమంచిలి పర్వత సుబ్బారావు-ప్రత్తిపాడు వి.నాగేశ్వరరావు-పిఠాపురం చిక్కాల రామచంద్రరావు-తాళ్లరేవు, మెట్ల సత్యనారాయణ-అమలాపురం, బి.సత్యానందరావు-కొత్తపేట, వడ్డి వీరభద్రరావు-కడియం, జెవి అప్పారావు(నెహ్రూ) -జగ్గంపేట, ఎవి సత్యనారాయణ-పాలకొల్లు, కె.సుబ్బరాయుడు-నర్సాపురం, పీ.కనక సుందరరావు-తాడేపల్లిగూడెం, అంబటి బ్రాహ్మణయ్య-మచిలీపట్నం, సింహాద్రి సత్యనారాయణ-అవనిగడ్డ, ఎన్.శ్రీరాములు-దర్శి, పీ.బ్రహ్మయ్య-రాజంపేట, బి.(బలిజ)హూలికుంటప్ప-రాయదుర్గం(బలిజ) ఎ.మోహన్-తిరుపతి (బలిజ) కాంగ్రెస్-1 కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు సీపీఐ-1 వంకా సత్యనారాయణ-పెనుగొండ సీపీఎం-1 పుతుంబాక భారతి-సత్తెనపల్లి ఇండి..1 తోట త్రిమూర్తులు-రామచంద్రాపురం బీసీ వర్గాల ఎమ్మల్యేలు 31 బీసీ వర్గాల ఎమ్మెల్యేలు మొత్తం 31 మంది ఎన్నికైతే ఐదుగురుతప్ప మిగిలి నవారంతా కోస్తా జిల్లాలకు చెందినవారు.వీరిలో అత్యధికం ఉత్తరాంద్ర జిల్లాలలో ఎన్నికయ్యారు.ఇరవై ఒక్క మంది శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాల నుంచి ఎన్నికయ్యారు. ఇక రాయలసీమ నుంచి ఐదుగురుఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ముప్పై మంది, సీపీఐ నుంచి ఒకరు ఎన్నిక కాగా కాంగ్రెస్ పార్టీ నేత ఒకరే ఎన్నికయ్యారు. బీసీలలో ఆయా సామాజికవర్గాలను పరిశీలిస్తే కొప్పుల వెలమ అత్యధికంగా తొమ్మిది మంది గెలుపొందారు. తూర్పు కాపులు ఐదుగురు, యాదవ నలుగురు,గౌడ ముగ్గురు, పొలినాటి వెలమ ముగ్గురు, పద్మశాలి ఇద్దరు, రెడ్డిక, కాళింగ, గవర, మత్సకార, బోయ ఒక్కొక్కరు గెలుపొందారు. మొత్తం పదకుండు కులాల వారు గెలిచారు. టీడీపీ బీసీ ఎమ్మెల్యేలు-29 డి.అచ్యుతరామయ్య-ఇచ్చాపురం-రెడ్డిక గౌతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ కె.మోహన్ రావు-పాతపట్నం-తూర్పు కాపు జిఎ.సూర్యనారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ తమ్మినేని సీతారామ్-ఆముదాలవలస-కాళింగ, బగ్గు లక్ష్మణ రావు-నరసన్నపేట-పీ.వెలమ, కె.ఎర్రన్నాయుడు-హరిశ్చంద్రాపురం-పీ.వెలమ, ఎర్రా కృష్ణమూర్తి-పార్వతీపురం-కె. వెలమ, ఎస్సీ.వి అప్పలనాయుడు-బొబ్బిలి-కె.వెలమ, తెంటు జయప్రకాష్-తెర్లాం-కొప్పుల వెలమ, పడాల అరుణ-గజపతి నగరం-తూర్పుకాపు, కె.అప్పలనాయుడు-ఉత్తరాపల్లి-కె.వెలమ, పీ.సూర్య నారా యణ-సతివాడ-తూర్పుకాపు, పీ.నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పు కాపు, పల్లా సింహాచలం-విశాఖ-రెండు-యాదవ, బి.సత్యనారాయణమూర్తి-పరవాడ-కొప్పుల వెలమ, జి.ఎర్రునాయుడు-చోడవరం-కె.వెలమ, రెడ్డి సత్య నారాయణ-మాడుగుల -కొప్పుల వెలమ, దాడి వీరభద్రరావు-అనకాపల్లి-గవర, సి.హెచ్.అయ్యన్నపాత్రుడు-నర్సీపట్నం-కె.వెలమ, యనమల రామకృష్ణుడు-తుని-యాదవ, టి.ఎస్.ఎల్.నాయకర్-సంపర-మత్స్యకార, మరడాని రంగారావు-ఏలూరు-కొప్పుల వెలమ, కాగిత వెంకటరావు-మల్లేశ్వరం-గౌడ, ఇ.సీతారావమ్మ-కూచినపూడి-గౌడ, పీ.రామారావు-చీరాల-యాదవ, గాది లింగప్ప-గుత్తి-బోయ, నిమ్మల కిష్టప్ప-గోరంట్ల-పద్మశాలి, జె.సూర్యనారాయణ-కదిరి-పద్మశాలి. కాంగ్రెస్ -1 పీ.రాజశేఖరం-ఉణుకూరు-తూర్పుకాపు ఇతరులు-1 కె.రామకృష్ణ-అనంతపురం-సీపీఐ-యాదవ షెడ్యూల్ కులాల ఎమ్మెల్యేలు-22 షెడ్యూల్ కులాలకు చెందిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో పదహారు మంది తెలుగుదేశం పార్టీవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్ ,ముగ్గురు సీపీఎం, ఒకరుసీపీఐ కి చెందినవారు. ఎస్సీ.టీడీపీ ఎమ్మెల్యేలు..16 కె.ప్రతిభా భారతి-ఎచ్చెర్ల టి.భద్రయ్య-పాలకొండ కె.నూకరాజు-పాయకరావుపేట ఉండ్రు కృష్ణారావు-నగరం ఎజెబి ఉమామహేశ్వరరావు-అల్లవరం జె.బాబాజీరావు-గోపాలపురం ఎన్.స్వామిదాస్-తిరువూరు బి.దుర్గాప్రసాదరావు-గూడూరు పివి రత్నయ్య-సూళ్లూరుపేట వడ్డి చిన్నయ్య-రైల్వేకోడూరు మసాల ఈరన్న-ఆలూరు కె.జయరాం-శింగనమల బీసీ గోవిందప్ప-కళ్యాణదుర్గం ఎమ్.సురాజన్-సత్యవేడు ఆర్.గాందీ-వేపంజేరి పీ.సుబ్బయ్య-పలమనేరు. కాంగ్రెస్-2 బత్తిన సుబ్బారావు-ముమ్మడివరం, ఎమ్.శిఖామని-కొడుమూరు. ఇతర పార్టీలు -4 డి.రాజగోపాల్-ఆచంట-సీపీఎం పీ.రామయ్య-నిడుమోలు-సీపీఎం తవనం చెంచయ్య-సంతనూతలపాడు-సీపీఎం జిఎమ్.ఎన్.వి ప్రసాద్-తాడికొండ-సీపీఐ షెడ్యూల్ జాతులు(ఎస్.టి)-8 ఎనిమిది మంది షెడ్యూల్ జాతులకు చెందిన ఎమ్మెల్యేలకు గాను ఏడుగురు టీడీపీవారు,ఒకరు సీపీఐకి చెందినవారు.కాంగ్రెస్ కు ఎస్టి స్థానాలలో ఒక్కటి కూడా రాలేదు. ఎస్.టి.టీడీపీ ఎమ్మెల్యేల వివరాలు..7 నిమ్మక గోపాలరావు-కొత్తూరు నిమ్మక జయరాజు-నాగూరు ఆర్.పీ.భంజదేవ్-సాలూరు ఎల్.బి.దుక్కు-ఎస్.కోట కె.చిట్టి నాయుడు-పాడేరు ఎస్.వెంకటేశ్వరరావు-రంపచోడవరం పీ.సింగన్నదొర-పోలవరం సీపీఐ-1: 1.జి.దేముడు-చింతపల్లి క్షత్రియ ఎమ్మెల్యేలు..9 క్షత్రియ ఎమ్మెల్యేలు తొమ్మిది మంది గెలవగా వారిలో ఆరుగురు టీడీపీ కి చెందినవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐ వారు. టీడీపీ క్షత్రియ ఎమ్మెల్యేలు-6 పీ.అశోక్ గజపతిరాజు-విజయనగరం ఆర్ఎస్ డి అప్పల నరసింహరాజు-భీమిలి ఎవి సూర్యనారాయణరాజు-రాజోలు పివి నరసింహరాజు-భీమవరం కె.రామచంద్రరాజు-ఉండి వి.దొరస్వామిరాజు-నగరి. కాంగ్రెస్-2 కనుమూరి బాపిరాజు-అత్తిలి, ఎన్.వెంకట్రామరాజు-కైకలూరు సీపీఐ-1 కె.సుబ్బరాజు-విజయవాడ-1 ముస్లీం-5 ముస్లీంలు ఐదుగురు ఎన్నిక కాగా నలుగురు టీడీపీ వారుకాగా, ఒకరు సీపీఎం నుంచి ఎన్నికయ్యారు. టీడీపీ ముస్లీం ఎమ్మెల్యేలు-4 రెహమాన్-విశాఖ-ఒకటి జియావుద్దీన్ -గుంటూరు-1 ఖలీల్ భాష-కడప ఎన్.ఎమ్.డి ఫరూఖ్-నంద్యాల సీపీఎం-1 అబ్దుల్ గఫూర్-కర్నూలు ఇతర వర్గాలకు చెందినవారిలో వెలమ సామాజికవర్గం నుంచి ముగ్గురు, వైశ్య ఒకరు నెగ్గారు.వెలమ నేతలు ముగ్గురూ టీడీపీవారు వెలమ-3 కె.విద్యాదరరావు-చింతలపూడి-వెలమ-టీడీపీ కె.హనుమంతరావు-నూజివీడు-వెలమ-టీడీపీ వివికె యాచేంద్ర-వెంకటగిరి-వెలమ-టీడీపీ వైశ్య-1: ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ- వైశ్య – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బాబు పాతపాట.. మహా ప్రసాదంగా రామోజీ బ్యానర్!
'సూది కోసం సోదికి వెళితే ఏదో బాగోతం బయటపడిందని సామెత.' ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరు అలాగే ఉంది. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన, వైఎస్సార్సీపీపైన తీవ్రమైన ఆరోపణలు చేయాలని తెగ ఉబలాటపడిపోతున్నారు. వాటిలో వాస్తవం ఉంటే అదొక పద్ధతి. కానీ ఎంతసేపు ఎదుటి వారి వ్యక్తిత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధిపొందాలన్నదే ఆయన లక్ష్యం. దానికి అనుగుణంగా ఈనాడు అధినేత రామోజీ బాకాలు ఊదుతుంటారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చకు రాకూడదన్న ఉద్దేశంతో, ఆ అంశాలను డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు, రామోజీరావులు కుట్రపన్ని వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా నిత్యం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావించడం, ముఖ్యమంత్రిపై ఏదో పిచ్చి ఆరోపణలు చేయడం ఒక తంతుగా మారింది. ఇప్పటికే సీబీఐ విచారణ చేసి, కొందరిని అరెస్టు చేసి, కోర్టు విచారణ దశకు వచ్చాక వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాజకీయ విమర్శలు చేయడంలోనే దురుద్దేశం కనిపిస్తుంది. వివేకా హత్య జరిగిన సమయంలో, ఆ తర్వాత మూడు నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైమ్లో ఎందుకు కేసులు పెట్టలేకపోయారు? అంత అసమర్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని చంద్రబాబు ఒప్పుకుంటున్నారా? అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద వేయాలని చూశారుకానీ, ప్రజలు నమ్మరని అప్పట్లో భావించారు. తదుపరి ఒక్కొక్క క్యారెక్టర్ను తమకు అనుకూలంగా మలచుకుని కొత్త డ్రామా మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాబట్టి, తన ప్రత్యర్ధులు ఎవరిపైన అయినా బురద చల్లడం ఆయనకు అలవాటే. ఆయనను పట్టించుకోనవసరం లేదు. కానీ ఈనాడు రామోజీరావుకు ఏమైంది? పత్రికలలో వరసగా ఒకే అంశాన్ని పదే, పదే ఇవ్వడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనా, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కోపంతో ఆయన కూడా చంద్రబాబు పాడే పాతపాటను, మహా ప్రసాదంగా రోజూ బ్యానర్ కథనాలుగా ఇచ్చుకుంటూ ఆత్మ వంచన చేసుకుంటున్నారు. అదే టైమ్లో వంగవీటి రంగా హత్య కేసు, తదితర కేసులలో చంద్రబాబు పాత్ర గురించి కూడా చర్చకు సిద్ధమని చెప్పి, వివేకా హత్య కేసుపై కూడా చర్చించదలిస్తే ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలను కూడా ఈనాడు బ్యానర్గా ఇస్తుందా? కొన్ని సంగతులు చూద్దాం. 1988లో విజయవాడ నడిరోడ్డుపై నిరశన దీక్ష చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావును హత్య చేసిన టీడీపీ నేతలు ఎవరు? వారికి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చింది ఎవరు? ఇప్పటికీ ఆ కేసులో విచారణ ఎదుర్కున్నవారికి టిక్కెట్ ఇస్తున్నది ఎవరు? మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన పుస్తకంలో రంగా హత్య ఉదంతంలో చంద్రబాబు పాత్ర గురించి చేసిన ప్రస్తావనను ఇంతవరకు ఎందుకు ఖండించలేదు? పాత్రికేయుడు పింగళి దశరథ్రామ్ను హత్య చేయించింది ఎవరు? మల్లెల బాబ్జి మరణానికి కారకులు ఎవరు? ప్రముఖ గాయకుడు గద్దర్పై కాల్పులు జరిపించింది ఎవరు? గద్దర్ బతికి బయటపడ్డాక ఎవరిపైన పాటలు కట్టారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్లోనే కదా ఈ ఘటన జరిగింది! మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు కనీసం పలకరించలేదు! ఏ అవమాన భారంతో కోడెల ఆత్మహత్య చేసుకున్నారు? అంతెందుకు! ఎన్.టి.రామారావును ఒక్క పోటు పొడిచి ఆయనను ముఖ్యమంత్రి సీటు నుంచి లాగేసింది ఎవరు? ఆయన మనోవేదనతో మరణించడానికి కారణం ఎవరు? రాజమండ్రి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది చంద్రబాబు ప్రచార యావ కారణంగా తొక్కిసలాటలో మరణించింది నిజమా? అబద్దమా?తిరుమలలో ఇరవై మంది తమళ కూలీలను చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్ కౌంటర్ చేస్తే దానికి బాధ్యులు ఎవరో ఎందుకు తేల్చలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. మరివీటన్నిటిపైన చంద్రబాబు, టీడీపీ నేతలు చర్చకు సిద్ధపడతారా? వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత ఆ రోజుల్లో ఏమని చెప్పేవారు. చంద్రబాబు ప్రభుత్వంపైన, ఇతర టీడీపీ నేతలపై ఎన్ని ఆరోపణలు చేశారు? తదుపరి ఆమె ఎలా మారిపోయారు? వివేకాకు ఉన్న అక్రమ సంబంధాల విషయాలన్ని బయటకు వచ్చాక కేసు ఎంత గందరగోళంగా మారింది? అసలు తానే హత్య చేశానని నిర్భీతిగా చెబుతూ బయట తిరుగుతున్న వ్యక్తికి సునీత ఎందుకు అండగా ఉంటున్నారు? వీటన్నిటి మీద కూడా చర్చ చేస్తే ప్రజలకు అన్ని అర్ధం అవుతాయి. అసలు వివేకా హత్య కేసుకు ఇప్పుడు ఎందుకు చంద్రబాబు, రామోజీ ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి ఒక కారణం కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోవడం కష్టమని వారికి అర్ధం అయిపోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకు వచ్చిన అనేక పాలన సంస్కరణలు, సంక్షేమ స్కీముల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. వారిలో సంతృప్తి స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఆ కోణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే తమకు ఓట్లు రాలవని వారు భయపడుతున్నారు. సూపర్ సిక్స్ అంటూ గతంలో హోరెత్తించారు. కానీ ఇప్పుడు దాని ప్రచార తీవ్రతను చంద్రబాబు తగ్గించినట్లు అనిపిస్తుంది. పైగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకు వచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగుతుందని చంద్రబాబు చెప్పవలసి వస్తోంది. వలంటీర్లను సంఘ వ్యతిరేక శక్తులుగా, మూటలు మోసేవారుగా ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు వెళ్ళి మహిళలను వేధించేవారిగా పోల్చి ప్రచారం చేసిన చంద్రబాబు, వలంటీర్లపై విషం చిమ్మిన రామోజీరావులు ఇప్పుడు అదే వ్యవస్థను కొనసాగిస్తాం అంటున్నారంటే, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత బలంగా పాతుకుపోయారో తెలిసిపోతుంది. అభివృద్ధి గురించి చర్చిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉద్దానం ప్రాజెక్టు మొదలు కర్నూలు గ్రీన్ కో కంపెనీ, ఓడరేవులు, వైద్య కళాశాలలు, విజయవాడ వద్ద నిర్మించిన వంతెనలు, కృష్ణానది రిటైనింగ్ వాల్, తిరుపతిలో సేతు నిర్మాణం మొదలైనవన్ని ప్రస్తావనకు వస్తాయి. అలాగే పరిశ్రమ గురించి చర్చించినా అదే పరిస్థితి. ఏ రకంగా చూసినా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ఏదో జనరల్గా విధ్వంసం అని, ఇంకేదో అని విమర్శించడం తప్ప స్పెసిఫిక్గా లోటుపాట్లు చెప్పలేని దైన్యం వారిది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రకరకాల పాత్రలను ప్రవేశపెట్టి వైఎస్ జగన్మోహన్రెడ్డిను బదనాం చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, ప్రశాంత కిషోర్ వంటివారు తమకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పాత్రలు పోషించి వెళుతున్నారు. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి టీడీపీ మీడియా సంస్థలు రోజూ లక్షల పత్రికలను కరపత్రాల మాదిరిగా పంచుతున్నాయి. టీవీలలో ఊదరగొడుతున్నాయి. అయినా అవేవి ఆనడం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చలేకపోతున్నామన్న భయం వారికి పట్టుకుంది. అందుకే చంద్రబాబు పదే, పదే వివేకా హత్య కేసు గురించి మాట్లాడి, తనకు ఇంకో సబ్జెక్టు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు కావల్సింది వారి అవసరాలు తీర్చే ప్రభుత్వం కానీ, ఇలా పిచ్చి ఆరోపణలతో కాలక్షేపం చేసే చంద్రబాబు వంటి నేతలు కాదు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు డైరెక్షన్.. నర్రెడ్డి సునీత యాక్షన్
'మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒక పేజీన్నర ప్రచురించారు. ఆ మొత్తం చదివితే ఆమె తెలివితక్కువగా చేసిన ప్రకటనలను ఎడిట్ చేసి పాఠకులను మోసం చేశారన్న సంగతి అర్ధం చేసుకోవచ్చు.' తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు మధ్య ఎంతో తేడాను మనం గమనించవచ్చు. సునీత ఒక రాజకీయ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడుతున్నట్టు వినగానే మనకు అర్థమవుతుంది. వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రితో పాటు మరికొందరు జైలులో ఉన్నారు. సీబీఐ చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమి సంబంధం ఉంది? తనవద్ద ఆధారాలు లేవంటూ చెబుతూనే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విచారణ జరపాలని కోరడం వింత విడ్డూరంగా కనిపిస్తోంది. ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా? వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాశ్ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది. ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు. ఈమె మాదిరే సొంత చెల్లెలు షర్మిల కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఏదో ఆశించిందని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించలేదని, తత్ఫలితంగానే ఆమె కూడా ఇదే రీతిలో రోడ్డెక్కి రాజకీయం చేస్తున్నారని తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఇక్కడ ఒక విషయం అంగీకరించాలి. తన చెల్లెళ్లను వదలుకోవడానికి అయినా వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడ్డారు తప్ప, ప్రజా ధనాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోలేదన్న విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ప్రతినిధులు హాజరై వారికి కావాల్సిన ప్రశ్నలు వేసినట్లు ఇట్టే కనిపెట్టేయవచ్చు. వాటిలో కొన్నింటిని గమనించండి.. మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్ జగన్ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా? అవినాశ్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు? అవినాశ్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుంటుందో వాటినే ప్రశ్నలుగా మలిచి ఈ మీడియా ప్రతినిధులు వేశారంటేనే వీరందరి రాజకీయ లక్ష్యం తెలుసుకోవచ్చు. అదే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజుతో సహా పలువురు చోటా, మోటా టీడీపీ లీడర్లకు సైతం సునీత కృతజ్ఞతలు చెబితే, దానిని మాత్రం ఈనాడులో ఎడిట్ చేశారు. ఆ పాయింట్ వల్ల టీడీపీకి నష్టం కలుగుతుందని ఈనాడు రామోజీరావు భావించడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఏతావాతా వీటన్నిటిని గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, రఘురామకృష్ణరాజు, లాయర్లను మార్చుకుని కోర్టుల ద్వారా యుద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆ ప్రక్రియలో సునీత కూడా ఒక భాగమే అని తేలడం లేదూ!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నమ్మకద్రోహం చేసేవారంతా అజ్ఞాతంలోకి..
సాక్షి, తిరుపతి: 'ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు... నవరత్నాలతో పేదల సంతోషాలు.. ఇవన్నీ ఆ నేతలకు కంటగింపుగా మారినట్టుంది. ప్రజారంజకంగా సాగుతున్న జగనన్న పాలనలో ఇమడలేకపోయారు. రాజకీయ అనుభవాలను రంగరించుకుని చెలరేగిపోయేందుకు కొందరు యత్నించి చతికిలపడ్డారు. మరికొందరు వైఎస్సార్సీపీ చరిష్మాతో కొత్తగా వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రజాసేవను విస్మరించి కేవలం స్వార్థరాజకీయాల కోసమే పరితపించారు. తమకు గుర్తింపునిచ్చిన పార్టీని వీడాలని నిశ్చయించుకున్నారు. మేకవన్నె పులుల్లా తమ గెలుపునకు పనిచేసిన నేతలు, కార్యకర్తలకు ద్రోహం చేస్తూ. ప్రత్యర్థి పార్టీలకు మంచి చేయడం ప్రారంభించారు. ఈ నాటకాలను గుర్తించిన అధిష్టానం ఉమ్మడి జిల్లాలో ఐదు గురు ఎమ్మెల్యేలను పక్కనబెట్టింది. దీంతో నిజమైన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి పెనుభారమైన వారు బయటకెళ్లడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు.' ఎలాంటి గుర్తింపూ లేని వారు కొందరికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలిచిమరీ టిక్కెట్లు ఇచ్చారు. గత రాజకీయ అనుభవాలు ఉన్న నేతలు మరింత ఎదగాలని, వారి అనుభవాలను పంచుకోవాలని చేయిపట్టుకుని నడిపారు. గత ఎన్నికల్లో అన్నీ తామై ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత ప్రజారంజక పాలన కోసం ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవ్వాలని సూచనలు చేశారు. అందుకోసమే గడపగడపకు మన ప్రభుత్వం, మీ ఊరికి మీ ఎమ్మె ల్యే.. అంటూ పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని ఆదేశాలు జారీచేశారు. ప్రతి నెలా అనేక సంక్షేమ కార్యక్రమాలు.. వారోత్సవాలకు సంసిద్ధం చేశారు. అదేకోవలో కార్యకర్తలు, నేతలను కలపుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశాలు జారీచేశారు. తరచూ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల ఇబ్బందులు.. సమస్యలు.. సంక్షేమ పథకాలపై దిశానిర్దేశం చేశారు. కానీ అవేవీ ఆ నేతలకు చెవికెక్కలేదు. తమ స్వార్థ రాజకీయాల కోసం పక్క పార్టీల వైపు చూసి తప్పటడుగులు వేస్తున్నారు... ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, పూతలపట్టు, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు ఎమ్మెల్యేలు. ఇప్పుడు అక్కడా తమకు సరైన గుర్తింపులేదని కొందరు.. ఎలాగైనా చక్రం తిప్పొచ్చని మరికొందరు ఊహాలోకాల్లో తేలుతున్నారు. ఇలాంటి నేతలు బయటకు వెళ్లడమే మంచిదని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వార్థం.. తప్పదు అజ్ఞాతం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాతో 2019లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రజలకు సేవచేయలేక, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. తల్లిలాంటి పార్టీ దగ్గర ఛీకొట్టించుకుని ఇప్పుడు టీడీపీ, జనసేన నాయకుల కాళ్లవేళ్లా పడుతున్నారు. వైఎస్సార్సీపీపై బురదజల్లేందుకు ఎదురుచూస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలు ముందుగా వారికి మాయమాటలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులపై విమర్శలు చేయిస్తున్నారు. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న టీడీపీ, జనసేన అధినేతలు ఆ ఎమ్మెల్యేల ద్వారా పబ్బంగడుపుకున్నాక టికెట్ కేటాయింపు విషయంలో పేచీపెడుతున్నారు. పొత్తులో భాగంగా బాబు, పవన్ ఒకరికి తెలియకుండా ఒకరు అన్నట్టు సీట్లు ప్రకటించేస్తున్నారు. మరికొన్ని చోట్ల కిమ్మకనకుండా నమ్మకద్రోహులైన ఎమ్మెల్యేలను మరింత దూరం పెడుతున్నారు. వారి అసలు రంగు బయటపడడంతో తప్పుచేశాం.. అని తన ముఖ్య అనుచరుల వద్ద కొందరు ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు. మరికొందరు తమను నమ్ముకున్న ప్రజలకు ముఖం చూపించలేక అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు. గుచ్చుకుంటున్న పక్కచూపులు! ఆడలేనమ్మ మద్దెల ఓడు అన్నట్టు ప్రజారంజక పాలనలో ఇమడలేని నమ్మకద్రోహులైన ఎమ్మెల్యేలు మొదట టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లారు. అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో జనసేన అధినేతను కలిశారు. ఆ తర్వాత టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆనం మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ గురజాల మోహన్ను ప్రకటించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎలాగూ పార్టీ పొత్తులో భాగంగా జనసేనలో ఉంటే చక్రం తిప్పవచ్చన్న ఉద్దేశంతో ఆదివారం ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ను హైదరాబాద్లో కలిశారు. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించమని వేడుకున్నట్టు తెలిసింది. ఎన్నికల తర్వాత అయినా పార్టీలో కీలక పదవి ఇప్పించమని ప్రాధేయపడినట్టు ప్రచారం జరుగుతోంది. నమ్మక ద్రోహులు వెళ్లిపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి చదవండి: ఏం పొత్తులో.. ఏంటో? -
బాబు బుద్ధి వంకర.. రామోజీ రాత టింకర.!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు వీలైతే అప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తుంటారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అబద్ధాలు చెబుతుంటారు. అంతేకాదు.. వైఎస్సార్సీపీ అభ్యర్దులు రౌడీలని, ఇంకొకటని విమర్శలు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తుంటారు. తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో సైతం స్మగ్లర్లు, రౌడీలు అంటూ ఆరోపణలు చేశారు. తీరా చూస్తే చంద్రబాబు ప్రకటించిన అభ్యర్ధులలో ఒకాయన ఏకంగా హిందూ దేవుళ్లను అవమానించిన వ్యక్తి కాగా, మరొకరు టీవీ ఛానల్ డిబేట్లోనే రౌడీయిజం ప్రదర్శించిన వ్యక్తి కావడం విశేషం. అంతేకాదు.. మరొకరు గతంలో హత్య కేసులో ఉన్న వ్యక్తి. ఇలా ఒక్కొక్కరి గురించి విశ్లేషిస్తే చాలా కథలు తలుస్తాయి. చంద్రబాబే కాదు.. ఈనాడు రామోజీరావు కూడా చాలా చెత్త రాస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రికలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదంటూ ఓ పెద్ద పాత చింతకాయ పచ్చడి స్టోరిని వండి వార్చారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఏకంగా హిందూ దేవతలను, హిందూ ఆచారాలను దూషిస్తూ వీడియోలు చేసిన మహాసేన రాజేశ్ అనే వ్యక్తికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. రాజేష్ అభ్యర్ధిత్వం ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన దూషణల తాలూకూ వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపై హిందూ వర్గాలకు చెందిన వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు కూడా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. అయినా చంద్రబాబు నోరు విప్పడం లేదు. గతంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయంటూ ప్రభుత్వంపై తప్పుడు అభియోగాలు మోపుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు హడావుడి చేశారు. తీరా పోలీసులు దర్యాప్తు చేస్తే అదంతా టీడీపీ, జనసేనలకు చెందిన కొందరు అలాంటి అరాచకాలకు పాల్పడ్డారని వెల్లడైంది. అంతర్వేది వద్ద జరిగిన రథం దగ్ధం కేసుపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా, బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది. దీనిని బట్టి విపక్షాల చిత్తశుద్ది బహిర్గతం అయింది. మరోవైపు చంద్రబాబు హయాంలోనే విజయవాడలో పలు ఆలయాలను కూల్చివేయడమే కాకుండా, కొన్ని విగ్రహాలను మున్సిపల్ వాహనంలో తరలించడం వివాదాస్పదం అయింది. వాటన్నింటినీ జనం మర్చిపోయారనుకుని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ఈనాడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఇప్పుడు హిందూ దేవతలను అవమానించిన వ్యక్తికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చినా, రామోజీ ఉలకలేదు. ఆయన పత్రిక ఈనాడు అన్నీ మూసుకుని కూర్చుంది. అంటే దీని అర్థం హిందూ ఆలయాల కోసం కాకుండా దిక్కుమాలిన రాజకీయాల కోసమే ఈనాడు మీడియా అసత్య కథనాలు వండి వార్చుతున్నారని వెల్లడవుతుంది. రాజేష్ అనే వ్యక్తికి ఎందుకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు? ఒకప్పుడు ఇదే చంద్రబాబును సైతం తీవ్ర భాషలో ఈయన విమర్శించకపోలేదు. ఆ తర్వాత లైన్ మార్చుకుని టీడీపీలో చేరి వైఎస్సార్సీపీని, సీఎం జగన్మోహన్రెడ్డిని దూషించడం ఆరంభించారు. ఇలా వైఎస్ జగన్మోహన్రెడ్డిను తిట్టడం బాగా నచ్చిందేమో తెలియదు కానీ, చంద్రబాబు ఈయనకు టిక్కెట్ ఇచ్చారు. బహుశా రాజేష్ బ్లాక్ మెయిల్కు భయపడి టిక్కెట్ ఇచ్చారేమో అన్న అనుమానం వస్తుంది. ఒకవేళ ఈ రాజేష్కు టిక్కెట్ ఇవ్వకపోతే మళ్లీ తిట్టడం మొదలు పెడితే భరించలేమన్న భావన ఏర్పడి ఉండవచ్చు. ఇంకో సంగతి ఏమిటంటే రాజేష్ జనసేన పైనా కూడా గతంలో దూషణల పర్వం నిర్వహించారట. దాంతో ఆ పార్టీవారు పొత్తులో టీడీపీ ఈయనకు టిక్కెట్ ఇవ్వడంపై మండిపడుతోంది. ఏకంగా పార్టీ ఆఫీస్లోనే సమన్వయ కమిటీ సమావేశంలోనే జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదే టైమ్లో టీడీపీలో సైతం ఈ అభ్యర్ధి ఎంపికపై ఆశ్చర్యపోతున్నారు. ఈయనకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించబోమని చెబుతున్నారట. ఈ పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు తన ఎదుటి పక్షం వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై ఏవేవో ఆరోపణలు చేస్తూ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తుంటారు. కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తికి తిరువూరు అసెంబ్లీ టిక్కెట్ను టీడీపీ ఇచ్చింది. ఈయన అమరావతి రాజధాని JAC పేరుతో హడావుడి చేస్తుంటారు. వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు సిఫారసు మేరకు టిక్కెట్ ఇచ్చారని అంటారు. కొలికపూడి కూడా గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తీవ్రమైన పరుష భాషతో విమర్శించేవారు. ఆ తర్వాత ఎలా రాజీ కుదిరిందో తెలియదు కానీ, చంద్రబాబుకు దగ్గరయ్యారు. మామూలుగా అయితే ఈయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశమే ఉండదు. పైగా ఈయనకు సంబంధం లేని తిరువూరు నియోజకవర్గాన్ని కేటాయించారు. కొలికపూడికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఆయన ఒక తెలుగుదేశం ఛానల్ డిబేట్లో కూర్చుని పక్కనే ఉన్న బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరారు. దానిపై ఆగ్రహించిన బీజేపీ కొంతకాలం ఆ ఛానల్ను బహిష్కరించింది. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఆ ఛానల్ యజమాని దీనిపై కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయనకు ఏకంగా చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. ఈయనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఎక్కడ రచ్చ చేస్తారో అన్న సందేహంతోనే టిక్కెట్ ఇచ్చి ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. విశాఖ జిల్లాలో ఒక అభ్యర్ధి ఏకంగా వంగవీటి రంగ హత్య కేసులో ఉన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎర్రచందనం స్మగ్లర్కు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారని టీడీపీలోని మరో వర్గం ఆందోళనకు దిగిందన్న వార్తలు వచ్చాయి. నిజానికి అన్ని పార్టీలలో ఇలాంటి సమస్యలు ఉండవచ్చు. అదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం కాదు. గతంలో జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న శివారెడ్డిని ఏకంగా బాంబుల శివారెడ్డి అని పిలిచేవారు. ఆయనకు ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిపదవి కూడా దక్కింది. మరో మాజీ మంత్రి పరిటాల రవిపై ఎన్ని హత్య కేసులు ఉన్నాయో లెక్కలేదు. ఆయన ఎన్టీఆర్ వద్ద మంత్రిగా పనిచేస్తే, చంద్రబాబు టైమ్లో టీడీపీ పక్షాన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక నేతపై ఎన్టీఆర్ టైమ్ లో పీడీ యాక్ట్ కింద అరెస్టు కూడా అయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి బస్ల చాసిస్ నంబర్లను బోగస్గా సృష్టించిన కేసులో నిందితుడిగా ఉన్నారు. అవన్నీ ఎందుకు... చంద్రబాబే స్వయంగా ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్లో అరెస్టయి జైలుకు వెళ్లారు. మరి ఆయన టిక్కెట్ తీసుకోవచ్చా అంటే.. నోరు ఉంది కదా అని ఎవరిపైనా అయినా చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారు! అది ఆయన లక్షణం. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి చీప్ విమర్శలకు దిగరు. తన పని తాను చేసుకుంటూ ఉన్నంతలో బెటర్ అభ్యర్ధులు అనుకుంటే టిక్కెట్ ఇస్తుంటారు. కానీ చంద్రబాబు మాత్రం తాను చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. అన్నింటిలోనూ ఇలా డబుల్ స్టాండర్డ్స్ను పాటిస్తుంటారు. అదే ఆయన 45 ఇయర్స్ ఇండస్ట్రీ విశిష్టత. నలభై ఐదేళ్లుగా ఇలాంటి రాజకీయాలతోనే ఆయన సఫలం అయ్యారు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, వీలైనంత బురద వేయడం, తన గురించి తాను గొప్పగా ప్రచారం చేసుకోవడం, మీడియాలోని ఒక వర్గాన్ని ఆకట్టుకుని లేని ఇమేజ్ని సృష్టించుకోవడం చంద్రబాబు అలవాటు చేసుకున్నారు. కొన్నిసార్లు అది సఫలం అయింది. కొన్నిసార్లు విఫలం అయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం ఆయన పప్పులు అంతగా ఉడకడం లేదు. అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ తాబేదారు మీడియా ద్వారా ఈ బురద రాజకీయం చంద్రబాబు చేస్తూనే ఉన్నారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సూపర్ సిక్స్తో చంద్రబాబు కలరింగ్.. తీరా తిరిగి చూస్తే..
తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన సంయుక్త బహిరంగ సభ సపలం అయినట్లా? విఫలం అయినట్లా? ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్కల్యాణ్లు అర్థవంతమైన ప్రసంగాలు ఎందుకు చేయలేకపోయారు? తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన దూషణలకు దిగడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబు నాయుడు టీడీపీని నిప్పుతో అభివర్ణించుకుని పవన్కల్యాణ్ను గాలితో పోల్చడం, ఇద్దరు కలిసి వైఎస్సార్సీపీని బుగ్గి చేస్తామనడం, పవన్కల్యాణేమో వైఎస్సార్సీపీని పాతాళానికి తొక్కేస్తామని అనడం.. ఇవన్ని చూస్తే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతామన్నట్లుగా లేదా! గత కొద్ది రోజులుగా ఈ సభకు టీడీపీ మీడియా వీర హైప్ ఇచ్చింది. రెండు పార్టీలు కలిస్తే లక్షల మంది జనం తరలి వచ్చేస్తారని ఊదరగొట్టింది. ఆరు లక్షల మంది వస్తారని కథనాలు ఇచ్చింది. తీరా చూస్తే సభ ఏర్పాట్లు చేసిందే లక్ష నుంచి రెండు లక్షల మంది పట్టేంత మైదానంలో. కుర్చీలు వేసిందే పదివేల మందికట. అయినా సభ సూపర్ సక్సెస్ అయిందని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలో ప్రచారం చేసి ప్రజలను మోసం చేయడానికి యత్నించాయి. తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం పట్టారని, జన సమూహం నిండు మనసుతో ఆశీర్వదించారని ఈనాడు పత్రిక రాయడం జనాలను మభ్య పెట్టడం కాక మరేమిటి! జనం పర్వాలేదని రాస్తే ఏదో సరిపెట్టుకోవచ్చు. అలాకాకుండా అతిశయోక్తులతో రాయడం, వచ్చిన జనం మనసులోకి రామోజీరావు బృందం దూరి చూసినట్లుగా వారంతా నిండుమనసుతో ఆశీర్వదించారని రాశారంటేనే టీడీపీ కరపత్రంగా ఈనాడును ఎలా మార్చింది ఇట్టే తెలిసిపోతుంది. వైఎస్సార్సీపీ సిద్ధం సభకు లక్షల మంది వచ్చి హోరెత్తిస్తే, టీడీపీ, జనసేన సభకు అంత కలిపి నలభై.. ఏభై వేల మంది రాకపోయినా, తెలుగుదేశం పత్రికలు ఆహో, ఓహో అంటూ ఊదరగొట్టాయి. సభకు అటంకాలు కల్పించినా జనం తరలివచ్చారని మభ్యపెట్టే యత్నం చేశాయి. చంద్రబాబు, పవన్కల్యాణ్లు ఒకరినొకరు పొగుడుకోవడానికి, జెండాలు మార్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం, కేవలం కింద స్థాయిలో కొట్టుకున్నట్లు రెండు పార్టీల నేతలను ఎలాగోలా బుజ్జగించడానికి చేసిన యత్నంగానే కనిపిస్తుంది. కాకపోతే పవన్కల్యాణ్ మాదిరి జనసైనికులంతా చంద్రబాబుకు లొంగిపోతారా? లేదా? అన్నదే చర్చనీయాంశం. పొత్తులపై ఎవరూ సలహాలు ఇవ్వనక్కర్లేదని, యుద్ధం చేసే యువత కావాలని పవన్కల్యణ్ చెప్పడం ద్వారా చేగొండి హరిరామజోగయ్య వంటి వృద్దనేతలను అవమానించడానికి కూడా వెనుకాడలేదు. అందుకే జోగయ్య కూడా తమ సలహాలు వినకపోతే పవన్, చంద్రబాబుల ఖర్మ అని వ్యాఖ్యానించడం విశేషం. చంద్రబాబు, పవన్కల్యాణ్లు వైఎస్ జగన్మోహన్రెడ్డిను తిట్టడానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మధ్యలో చంద్రబాబు తన సూపర్ సిక్స్ తో అంతా మారిపోతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఆయన సంపద సృష్టించి లక్షల కోట్లు పంచుతానని అంటే. జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏపాటి సంపద సృష్టించారా? ఎంత పేదలకు ఇచ్చారు? అది నిజమే అయితే ఈపాటికి ఏపీలో పేదరికం ఉండకూడదు కదా! అసలు సూపర్ సిక్స్ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు నాలుగైదు రెట్లు ఇస్తామని చెప్పారంటేనే చంద్రబాబు వైఫల్యం చెందినట్లు కదా! వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కితేనేమో శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన వీరు ఇప్పుడు ఐదు రెట్లు బటన్లు నొక్కుతామని అంటున్నారు. దీనిని జనం విశ్వసిస్తారా? వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటలు బద్దలు కొడతాం అంటూ కోతలు కోసిన పవన్కల్యాణ్ అసలు జనసేనకు బలమే లేదని, అందుకే తెలుగుదేశంపై ఆధారపడి పోటీచేస్తున్నామని చెప్పడం ద్వారా పార్టీ పరువును తీసేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వేల కోట్లు ఉన్నాయట. తన వద్ద ఏమీ లేవట. తానే కదా.. ఒక్క సినిమా తీస్తే వందల కోట్లు వస్తాయని చెప్పింది.. ఆ సంగతి మర్చిపోయారు. పోల్ మేనేజ్ మెంట్ చేయడం తెలియదట. అందుకే టీడీపీపై ఆధారపడ్డారట. అంటే టీడీపీ బాగా డబ్బు ఖర్చు చేస్తుందని, ఆ పార్టీ వద్ద వేల కోట్లు ఉన్నాయని పవన్కల్యాణ్ చెప్పకనే చెప్పేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, పిచ్చి వ్యాఖ్యలు చేయడం, తన మూడు పెళ్లిళ్లు గురించి, పెళ్లాల గురించి మాట్లాడి, వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నాలుగో పెళ్లామా అని అసభ్యంగా మాట్లాడడం చూస్తే ఆయన వెర్రి పరాకాష్టకు చేరినట్టలే అనిపిస్తుంది. చంద్రబాబును, లోకేష్ను తాను గతంలో ఎలా విమర్శించింది.. అవినీతి ఆరోపణలు చేసింది.. మర్చిపోయి ఇప్పుడు సమర్దిస్తున్న తీరు ఆయన నైజంను తెలియచేస్తుంది. తన తల్లిని దూషించిన లోకేష్ను క్షమించనని చెప్పింది పవన్కల్యాణ్ కాదా? చంద్రబాబుకు మనం బానిసలమా? పదో, పరకో సీట్లు పడేస్తే లొంగుతామా? అని చెప్పింది ఆయన కాదా? ఇప్పుడు చంద్రబాబును పొగుడుతున్న తీరు చూస్తే జనసేనకు సీట్లు ఇవ్వకపోయినా, పవన్కల్యాణ్కు ఏదో బాగానే గిట్టుబాటు అయిందన్న భావన కలగడం లేదా? అమరావతి రాజధానిని కుల రాజధాని అని అన్నది ఆయనే. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించింది ఆయనే. ఇప్పుడు నవనగరాల సృష్టికర్త అని చంద్రబాబును పొగుడుతున్నది పవన్ కళ్యాణే. ఇదంతా అవకాశవాదం కదా అని జనసైనికులు ఎవరైనా అనుకుంటే దానికి ఏమి సమాధానం దొరుకుతుంది! ఏదో పవర్ఫుల్గా మాట్లాడానని పవన్కల్యాణ్ అనుకోవచ్చేమో కానీ, కేవలం తెలుగుదేశం పార్టీకి బాగా పవర్ఫుల్గా బాకా ఊదారనే జనం అనుకుంటారు. ఈ సభకు లోకేష్ ఎందుకు రాలేదో తెలియదు. ఇక చంద్రబాబు ప్రసంగం తీరు చూస్తే.. మరీ అద్వాన్నంగా ఉంది. డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయనలో అధికార దాహం ఎంతగా ఉన్నది తెలిసిపోతుంది. ఎన్ని వీలైతే అన్ని అబద్ధాలు చెప్పడానికి ఆయన వెనుకాడడం లేదు. తానేమో స్వయంగా తన మామ ఎన్టీ రామారావును దారుణంగా అవమానించి పదవి నుంచి దించేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం షర్మిలకు ఏదో అన్యాయం చేశారంటూ పచ్చి మోసపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. సైకో భాషను వాడుతూ చంద్రబాబు రాష్ట్రం నాశనం అయిందని అంటారు. రాష్ట్రం నాశనం అవడం అంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పంకు తాగునీరు, సాగునీరు ఇవ్వడమా? కుప్పంతో సహా వేలాది స్కూళ్లను బాగు చేయడమా? ఇంటింటికి డాక్టర్ను పంపడమా? కిడ్నీ బాధితులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టడమా? వారికోసం భారీ నీటి పథకం తేవడమా? పద్నాలుగు మెడికల్ కాలేజీలు తేవడమా? నాలుగు ఓడరేవులు నిర్మించడమా? లక్ష కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు తేవడమా? వలంటీర్ల వ్యవస్థను తెచ్చి పాలనను ప్రతి ఇంటికి చేర్చడమా? గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించడమా? పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించడమా? గ్రామాలలో వేలాది భవనాలు నిర్మించడమా? రైతు భరోసా కేంద్రాలు పెట్టడమా? పేద పిల్లలకు ఆంగ్ల మీడియంతో సహా అంతర్జాతీయ కోర్సులు అందించడమా..? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.. వీటిలో ఒక్కదాని గురించి అయినా చంద్రబాబు మాట్లాడే ధైర్యం ఎందుకు చేయడం లేదు! పైగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన అమ్మ ఒడి తదితర స్కీములను ఇంకా ఎక్కువగా అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నారు? కుప్పంకు టాంకర్లతో నీరు తీసుకు వెళ్లి కుప్పం కాల్వలో పోశారని పచ్చి అబద్ధాన్ని చెప్పగలిగారంటేనే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిప్పుతో వైఎస్సార్సీపీని తగలపెట్టాలట. దానికి పవన్కల్యాణ్ అనే గాలి తోడయిందట. ఇలాంటివి వ్యాఖ్యలు అసూయతోనే చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. ఏపీ తగలబడాలన్న ఆలోచన ఉంటే తప్ప ఇలాంటివి ఊహకైనా వస్తాయా? ఏమి చేస్తాం. దురదృష్టం. చివరిగా ఈ వ్యాఖ్య చూడండి.. మనలో ఒకరు ఎక్కువకాదు.. తక్కువ కాదు.. ఒక పార్టీ వెనుకాల మరో పార్టీ నడవడం లేదు.. రెండు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి.. అని చంద్రబాబు అనడం చూస్తే ఏమనిపిస్తుంది. జనసేనను బకరా చేసి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నట్లు తేలడం లేదూ! పవన్కల్యాణ్కు సీఎం సీటు షేరింగ్ ఉంటుందని మాట మాత్రం చెప్పని చంద్రబాబు రెండు పార్టీలు సమానమని అంటున్నారు. అరవై సీట్లు కూడా ఇవ్వకుండా కేవలం 24 సీట్లతో సరిపెట్టి పవన్కల్యాణ్ పరువు తీసిన చంద్రబాబు రెండు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయని చెబుతున్నారు. పవన్కల్యాణ్ చెవిలో పూలుపెట్టవచ్చు.. లేదా ఏదైనా వైఎస్సార్సీపీవారు ఆరోపిస్తున్నట్లుగా పవన్కల్యాణ్కు ప్యాకేజీ ఇచ్చి సంతృప్తి పరచవచ్చేమో కానీ, జనసైనికులను కూడా ఏమార్చగలరా? వారుఅంత తెలివితక్కువవారా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పవన్ కల్యాణ్ వీక్నెస్ ఏంటో గానీ.. మరీ ఇంత దిగజారుడా..!?
'జనసేన అధినేత పవన్కల్యాణ్ ఊహించినట్లే ఆయన అభిమానులను, ఆయనకు అండగా ఉంటారనుకునే కాపు సామాజికవర్గాన్ని తీవ్ర ఆశాభంగానికి గురి చేశారు. గతంలో ఆయన ఒక సందర్భంలో తెలుగుదేశం వారు పదో, పరకో సీట్లు ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారని, కుక్క బిస్కట్లు వేస్తే ఒప్పుకుంటామా? మనకు ఆత్మగౌరవం లేదా అంటూ ఏదేదో.. ఆవేశపూరిత ప్రసంగం చేస్తే ఆయన మద్దతుదారులంతా చాలా సంతోషించారు. పవన్కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా, గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు తీసుకుంటారులే అని వారు భావించారు.' కానీ ఆయన చివరికి కేవలం 24 సీట్లకే టీడీపీతో పొత్తు ఓకే చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ఇరవై నాలుగు సీట్లను ఆయన కుక్క బిస్కట్లతో పోల్చుతారో, లేక బంగారు బిస్కట్లు అని సంతృప్తి చెందుతారో తెలియదు కానీ తీవ్ర విమర్శలకు గురి అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్కల్యాణ్కల్యాణ్ మరోసారి అప్రతిష్టపాలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇంతగా సరెండర్ ఏమిటా అని ఆయన మద్దతుదారులు రోధిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన ఒక ఆశావహుడు అయితే తాము ఇంతకాలం చేసిన కృషి అంతా వృధా అయిపోయిందని అంటూ తన భార్యతో కలిసి దీక్షకు కూడా దిగారు. ఇలా ఆయా చోట్ల జరిగిన పరిణామాలు చూసిన తర్వాత పవన్కల్యాణ్ మారి స్వతంత్రంగా వ్యవహరిస్తారేమో అని కొందరు ఆశపడుతున్నారు. అది జరిగినా డ్రామాగానే ఉంటుంది తప్ప నిజాయితీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం పవన్కల్యాణ్ సొంతంగా రెండు సీట్లు ప్రకటించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించకుండా రెండు సీట్లను ప్రకటించారని, అందుకే తాను కూడా రెండు సీట్లకు జనసేన అభ్యర్ధులను ప్రకటిస్తున్నానని చెప్పి జనసైనికులను మభ్య పెట్టే యత్నం చేశారు. ఎందుకంటే ఆ రెండు సీట్లు జనసేనకే వస్తాయని తెలుసు కనుక, చంద్రబాబుతో మాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు కనుక.. అలా చేశారని అర్ధమైంది. తణుకులో ఆయన రామచంద్రరావు అనే అభ్యర్దికి టిక్కెట్ వచ్చేసినట్లే ప్రసంగం చేసి, తాను మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పనని బీరాలు పలికారు. అనేకసార్లు మాటలు మార్చిన పవన్కల్యాణ్ ఈసారైనా మాట మీద ఉంటారనుకుంటే మళ్లీ యధాప్రకారం మాట తప్పారు. రామచంద్రరావుకు ఆయన సీటు ఇప్పించుకోలేకపోయారు. చంద్రబాబు తన పార్టీ అభ్యర్ధి రాధాకృష్ణకు టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఆయా చోట్ల జనసేన శ్రేణులు పూర్తిగా నీరుకారిపోయేలా పవన్కల్యాణ్ రాజకీయాలు చేశారు. దీనికి కారణం ఏమిటంటే.. కేవలం చంద్రబాబునాయుడుకు పూర్తి స్థాయిలో లొంగిపోవడం తప్ప మరొకటి కాదన్నది అర్దం అవుతుంది. పవన్కల్యాణ్కు ఉన్న వీక్ నెస్ ఏమిటో తెలియదు కానీ, టీడీపీని, చంద్రబాబును భుజనా వేసుకుని మోయడానికి నానా కష్టాలు పడుతున్నారు. జనసేనకు వెన్నుపోటు పొడిచి మరీ ఆయన టీడీపీ కోసం పని చేస్తున్నారు. ఇది కేవలం ముఖ్యమంత్రి జగన్పై ఉన్న ద్వేషంతోనే అని అనుకోలేం. ఎదుటివారిపై కోపం ఉంటే మాత్రం తన పరువును తానే తీసుకుని మరొకరి విజయానికి పనిచేస్తారా! గతంలో పవన్కల్యాణ్ చెప్పిన మాటలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? తాను సీఎం అభ్యర్ధినని అభిమానులకు పలుమార్లు చెప్పారు. ఆయన సభలలో సీఎం అంటూ నినాదాలు చేసేవారిని సంతృప్తిపరచడానికే అలా చెప్పి ఇప్పుడు వారిని మోసం చేశారని తేలిపోయింది. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎప్పుడైతే పవన్ కల్యాణ్ సీఎం పదవికి అర్హుడు కాదన్నట్లు మాట్లాడారో, అప్పుడే ఈయన సరుకేమిటో తేలిపోయింది. చివరికి ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ కల్యాణ్కు ఇచ్చేది, లేనిది టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయిస్తారని చెప్పినా, పవన్కల్యాణ్ నిస్సిగ్గుగా విశాఖలో జరిగిన టీడీపీ సభకు వెళ్లి వారికి సలాం చేసి వచ్చారు. చంద్రబాబు వద్ద ఏమి పరశువేది ఉందో తెలియదు కానీ, పవన్ కల్యాణ్ మాత్రం లొంగిపోయిన తీరు రాజకీయాలలో సరికొత్త రికార్డు అని చెప్పాలి. ఏ నాయకుడైనా పార్టీ పెడితే తనకంటూ ఒక సిద్ధాంతం పెట్టుకుంటారు. తనకంటూ ఒక లక్ష్యం పెట్టుకుంటారు. కానీ పవన్కల్యాణ్ మాత్రం వేరే పార్టీ కోసం, వేరే పార్టీ నాయకుడికోసం తన పార్టీని బలి చేయడానికి సిద్ధం అయ్యారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తూ తన పార్టీని తాకట్టుపెట్టడమో, అమ్మడమో చేస్తున్నారంటే ఇందులో ఎవరిది తప్పు అవుతుంది. చంద్రబాబుది కాదు. కచ్చితంగా పవన్కల్యాణ్దే. అందువల్లే ఈ మొత్తం ప్రహసనంలో జనసైనికులు చంద్రబాబు కన్నా, పవన్కల్యాణ్నే ఎక్కువగా నిందిస్తున్నారు. మనం బంగారం మంచిదైతే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని వారు నైరాశ్యానికి గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీ తొలి నుంచి ఒక మాట చెబుతోంది. పదో, పరకో ఇస్తే జనసేన తమ వెంట తిరుగుతుంది అని టీడీపీ నేతలు అంటుండేవారు. నిజంగానే పది, లేదా పదిహేను సీట్ల కంటే ఎక్కువ జనసేనకు ఇవ్వనవసరం లేదని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పేవారు. మామూలుగా అయితే అందుకు కూడా పవన్కల్యాణ్ ఒప్పుకునేవారేమో! కాపు సంక్షేమసేన నేత చేగొండి హరిరామజోగయ్య వంటివారు కాపులకు బాగా బలం ఉన్న నియోజకవర్గాలను, గతసారి జనసేనకు వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని అరవై సీట్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే మొత్తం సీట్లలో కనీసం మూడో వంతు అయినా సీట్లు జనసేనకు ఇస్తేనే రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందని స్పష్టం చేసేవారు. ఆ తర్వాత కాలంలో నలభై నుంచి ఏభై సీట్లవరకు ఇచ్చినా సరిపెట్టుకోవచ్చని అనుకున్నారు. కానీ పవన్కల్యాణ్ చాలా కష్టపడి, అది కూడా బీజేపీ వద్ద చివాట్లు తింటున్నానని బతిమలాడి మరో పది సీట్లు సంపాదించినట్లుగా కనిపిస్తుంది. దీనికి ఆయన చెప్పిన కారణం కూడా విడ్డూరంగా ఉంది. గత ఎన్నికలలో పది సీట్లు కూడా గెలవలేకపోయినందున ఈసారి ఎక్కువ సీట్లు అడగలేకపోతున్నానని అన్నారు. అలాగైతే టీడీపీ 2019లో 23 సీట్లే గెలిచింది కదా! అయినా 151 సీట్లను ఎందుకు తీసుకుంటోంది? టీడీపీకి సొంతంగా గెలిచే బలం ఉంటే జనసేన వెంట ఎందుకు పడుతుంది? పవన్కల్యాణ్ను ఎందుకు ట్రాప్లో వేసుకుంటుంది. అది చాలదన్నట్లు బీజేపీ కోసం ఎందుకు పాకులాడుతోంది. ఈ కామన్ సెన్స్ పవన్కల్యాణ్కు లేకపోయింది. రాజకీయాలపై పట్టు లేని కారణంగానే పవన్కల్యాణ్ ఇలా వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. మూడోవంతు కాకపోయినా, కనీసం నాలుగోవంతు అంటే.. నలభై ఐదు సీట్ల వరకు తీసుకుంటారని అనుకున్నవారిని కూడా ఆయన నిరాశపరిచారు. పవన్కల్యాణ్ ప్రత్యర్ధులు, వైఎస్సార్సీపీ నేతలు ఆయనను పావలా అని ఎద్దేవ చేస్తుంటారు. వారికి ఇప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. పవన్కల్యాణ్ కనీసం పావలా వంతు స్థానాలు కూడా పొందలేకపోయారని దెప్పిపొడుస్తేన్నారు. పార్ట్టైమ్ పాలిటిషియన్గా వచ్చి పెత్తనం చెలాయించాలని, రాజకీయం అంటే ఒక సినిమా వ్యాపారం మాదిరి మూడు నెలలో, ఆరు నెలల బిజినెస్గా పవన్కల్యాణ్ భావిస్తున్నారని ఈ ఉదంతంతో తేలిపోయింది. పవన్కల్యాణ్ 2014లోనే మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నారు. అప్పుడు ఎందువల్లోకానీ జనంలో ప్రత్యేకించి కాపు సామాజికవర్గంలో ఒక క్రేజీ ఏర్పడింది. దానిని చంద్రబాబుకు అమ్ముకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, తనకు తనను అభిమానించేవారికి ఉపయోగించలేకపోయారనిపిస్తుంది. అప్పట్లో ఒక్క సీటుకు కూడా పోటీచేయకుండా చంద్రబాబు కోసం పనిచేశారు. తదుపరి ప్రశ్నిస్తానని అంటూ గొప్పలు చెప్పుకుని, కేవలం తన సొంత లాభానికే పరిమితం అయ్యారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు పంపించే ప్రత్యేక విమానాలలో పర్యటించి, ఆయన చేసే మర్యాదలకు ఉబ్బితబ్బిబ్బు అయిపోయి, అంతకు ముందు ఎప్పుడైనా ఒకటి, అర విమర్శలు చేసినా, వాటికి తూచ్ చెప్పేవారు. 2019లో చంద్రబాబును, లోకేష్ను తీవ్రంగా విమర్శించి, వారిపై అవినీతి ఆరోపణలు చేసిన పవన్కల్యాణ్ సీపీఐ, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీతో జట్టు కట్టారు. అది ఎందుకంటే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే అని అర్ధం అయింది. ప్రజలు ఈయన పోకడలను గమనించి కర్రుకాల్చి వాతపెట్టి రెండుచోట్ల ఓడించారు. దాంతో ఆయన మళ్లీ కొత్త డ్రామాకు తెరదీసి, రాష్ట్రం కోసం అంటూ చంద్రబాబు వాయిస్గా మారి మళ్లీ టీడీపీతో పొత్తుకు వెళ్లారు. చంద్రబాబును అవినీతి కుంభకోణంలో అరెస్టు చేసినప్పుడు సొంత కొడుకు లోకేష్ రోడ్డుమీద పడుకోలేదుకానీ, పవన్కల్యాణ్ మాత్రం రోడ్డుపై పడి దొర్లి దత్తపుత్రుడు అన్న వ్యంగ్య వ్యాఖ్యను సార్ధకం చేసుకున్నారు. వారాహి యాత్ర అంటూ కొంతకాలం, ఇలా రకరకాల విన్యాసాలు చేసి, ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని బహిర్గతం చేశారు. చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయి ఆయన విసిరేసిన 24 సీట్లను తీసుకుని మొత్తం జనసేనను బ్రష్టు పట్టించారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. ఈ సీట్లను తీసుకునే ముందు తనపార్టీలో చర్చించారా అంటే అదేమి లేదు. ఇదంతా చూస్తే తను ఎలాగోలా ఎమ్మెల్యే కావాలని, తన సోదరుడు నాగబాబు ఎంపీ కావాలన్న ఏకైక లక్ష్యంతో మిగిలిన జనసేన నేతలందరిని బలిచేశారనిపిస్తుంది. వారికి కనీస గౌరవం మిగిల్చినట్లు అనిపించదు. బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో కాపురం చేయడం, ఇప్పుడు ఏకంగా వారితో సంబంధం లేకుండా టీడీపీనుంచి సీట్లు తీసుకోవడం, అయినా బీజేపీ ఆశిస్సులు ఉన్నాయని చెప్పడం రాజకీయాలలో ఒక వింత అని చెప్పాలి. అదేటైమ్లో బీజేపీ గురించి చంద్రబాబు అంత గట్టిగా చెప్పినట్లు అనిపించలేదు. బీజేపీకి ఏ సీట్లు ఇవ్వాలో కూడా వీరే డిసైడ్ చేసినట్లు అనిపిస్తుంది. ఓ నాలుగు సీట్లు బీజేపీకి ఇస్తే సరిపోతుందని వీరు అనుకుంటున్నారట. దానికి బీజేపీ కూడా సిద్దపడితే ఒక జాతీయ పార్టీ అంత దుస్థితిలో ఉందా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఏది ఏమైనా పవన్కల్యాణ్ పార్టీని చంద్రబాబు కోసమే పెట్టారని మరోసారి రుజువైంది. ఈ పొత్తు, సీట్ల కేటాయింపు.. ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్సార్సీపీ విజయం మరింత సులువు అయినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. అది నిజమే కావచ్చు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ కిచిడీ పార్టీలను ఓడించి, నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ఇవ్వవలసిన అవసరం ప్రజలపై ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబులోని చీకటి కోణమే ఇది!
"తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఖర్చు కోసం నల్లధనాన్ని సమీకరీస్తున్న వైనం, వడ్డీకి అప్పులు చేస్తున్న తీరు ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాతే ఎన్నికలలో ధన వ్యయం విపరీతంగా పెంచేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి లాగేసి తాను ముఖ్యమంత్రి అయ్యాక వచ్చాక జరిగిన కొన్ని ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితిలోను గెలవవలసిన అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు ఓటర్లకు 500 రూపాయల చొప్పున ఇవ్వడం ఆరంభించారన్నది ఆరోపణ కాదు.. వాస్తవం అని చాలామంది నమ్ముతారు." 1996లో జరిగిన అత్తిలి ఉప ఎన్నికలో కొందరు టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంచవద్దని సూచించినా, చంద్రబాబు రిస్క్ తీసుకోలేమని చెప్పి స్వీట్ బాక్స్ తో సహా డబ్బులు పంపిణీ చేశారని ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్న అప్పటి మంత్రి ఒకరు చెప్పారు. ఆ ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచిన దండు శివరామరాజు మాట్లాడుతూ ఈ డబ్బు ఖర్చేమిటి? అయ్యబాబోయ్ .. ఉప ఎన్నికలో ఈ రకంగా వ్యయం చేస్తే, జనరల్ ఎన్నికలో నా పరిస్థితి ఏమిటి? ఈ స్థాయిలో డబ్బు చంద్రబాబు ఇస్తారో, ఇవ్వరో తెలియదు.. అని స్వయంగా నాతోనే అన్నారు. అప్పటి నుంచి చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా ఎన్నికల మేనేజ్మెంట్లో సిద్దహస్తుడని చెబుతుంది. దొరకకుండా స్కామ్లు చేయడంలో కూడా చంద్రబాబు దిట్టే అని అంతా నమ్ముతారు. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తూ తాను టెక్నికల్గా, లీగల్గా దొరకనని చెబుతుంటారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ స్థాయిలో డబ్బు రావడం కష్టం కనుక ఎన్నికల సమయంలో డబ్బు పోగు చేయడానికి రకరకాల మార్గాలను ఆయన ఎంచుకుంటారు. అందులో ఒకటి తన మద్దతుదారులైన బడా పెట్టుబడి దారుల నుంచి డబ్బు సమీకరించడం, అందులో అత్యధిక భాగం నల్లధనం అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. అమెరికా వంటి దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులలో టీడీపీ మద్దతుదారులు, సామాజికంగా టీడీపీపై ఆసక్తి ఉన్న వారి నుంచి డబ్బు హవాలా ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో ధనం పోగు చేస్తుంటారు. 2019 ఎన్నికల సమయంలో పవర్లో ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐల నుంచి కూడా తిరిగి ఇచ్చివేసే ప్రాతిపదికన డబ్బు తీసుకున్నారని, ఓటమి ఎదురవడంతో వారిలో పలువురికి తిరిగి ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంటుంది. దీనిలో నిజం ఉందో, లేదో తెలియదు కాని టీడీపీ వర్గాలే ఈ విషయాలపై చర్చించుకుంటాయి. మరో కొత్త మార్గం ఏమిటంటే తనను నమ్మిన ప్రముఖ విద్యా సంస్థల అధినేతల నుంచి డబ్బు వచ్చేలా చూసుకోవడం. అందులో భాగంగానే నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ ద్వారా నల్లధనం పెద్ద ఎత్తున వచ్చేలా చూస్తుంటారని అంటారు. దీనిని నిర్ధారణ చేస్తూ మీడియాలో కథనం వచ్చింది. నారాయణ తనకు తెలిసిన వ్యాపారులు, మార్వాడీల నుంచి ఐదు రూపాయల వడ్డీకి రుణం రూపేణా డబ్బు స్వీకరించారట. సుమారు 600 కోట్ల రూపాయల మేర ఇలా జమచేసి, దానిని రహస్య స్థలానికి తరలించారట. 2014లో సైతం నారాయణ తన కాలేజీ సిబ్బందిని, విద్యార్దులను ఎన్నికల ప్రచారానికి, డబ్బు పంపిణీకి వాడుకున్నారు. 2019 లో రెండు రూపాయల వడ్డీ ఇస్తామని చెప్పి 300 కోట్లు పోగుచేశారట. ఈసారి అది ఐదు రూపాయల వడ్డీగా మార్చి వ్యాపారులను ఆకర్షించే యత్నం చేశారట. మీడియాలో వచ్చిన ఈ కథనాలను ఆయన ఎందువల్లో ఖండించలేదు. 2014లో నారాయణ పెట్టిన ఖర్చులకు ప్రతిఫలంగానే ఆయనను మంత్రిగా చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చంద్రబాబు చూసుకున్నారని అంటారు. చంద్రబాబు, నారాయణలు అమరావతి రాజధాని భూ స్కామ్లో కూడా నిందితులుగా కూడా ఉన్నారు. రాజధాని గ్రామాలలో 58 ఎకరాలను నారాయణ తన బినామీల ద్వారా కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈసారి టీడీపీ గెలిస్తే, ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఆర్ధిక వనరులను కూడా భారీగా సమకూర్చుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తాజాగా వచ్చిన మరో కథనం ప్రకారం చంద్రబాబు తన తమ్ముడి కుమారుడు నారా రోహిత్ను కూడా నల్లధనం మార్పిడికి బాగానే వాడుకున్నారని మీడియాలో ప్రచారం అయింది. దీని ప్రకారం చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో రోహిత్ 13 సినిమాలు తీశారు. అంతకు ముందు మూడు, నాలుగు సినిమాలకే పరిమితం అయ్యారు. 2019 తర్వాత దాదాపు సినిమాలు తీయలేదట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల పైగా వ్యయం చూపించారట. నిజానికి ఆ సినిమాలకు నాలుగైదు కోట్లకు మించి వ్యయం కాదని సినీరంగ ప్రముఖులు చెబుతుంటారు. అంటే ఆ మేర నల్లధనానికి లెక్కలు తయారు చేయడానికి ఈ సినిమాలను అడ్డుపెట్టుకున్నారన్నది అభియోగంగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా పదమూడు సినిమాలు తీసిన వ్యక్తి, ఈ ఐదేళ్లలో ఒక్క సినిమా కూడా తీయకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్న. ఇందులో నిజం ఉంటే మాత్రం ఆందోళనకరమైనదే. అవినీతికి సినిమాల ముసుగు వేస్తున్నారని అర్ధం అవుతుంది. ఈసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలతో విపరీత ప్రచారం చేయిస్తూ, గెలుస్తామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నిధుల వసూళ్ల కోసమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విడత ఎన్నికలు టీడీపీకి చావో, రేవో తేల్చేవిగా అంతా అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వివిధ పార్టీలను తనవెంటబెట్టుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు. బీజేపీతో కాపురం చేస్తున్న జనసేన అక్కడనుంచి లేచి వచ్చేలా చేయగలిగారు. కాంగ్రెస్తో పరోక్ష స్నేహం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు సాయం చేయడం కోసం పోటీ నుంచే తప్పుకున్న సంగతి తెలిసిందే. సీపీఐ ఏపీ శాఖ ఎప్పటి నుంచో టీడీపీకి తోకగా మారింది. ఇక బీజేపీని కూడా కాకా పట్టడానికి ఢిల్లీ వెళ్లి నానా పాట్లు పడ్డారు. బీజేపీ పెద్దలు రకరకాల షరతులు పెట్టడంతో చంద్రబాబు షాక్కు గురయ్యారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఒక వైపు ధన సమీకరణ, మరోవైపు ఆయా రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష, పరోక్ష ఎత్తుల వ్యూహాలతో చంద్రబాబు రాజకీయం సాగిస్తున్నారు. అయినా సఫలం అవుతానన్న నమ్మకం రాక ఆయన బెంబేలెత్తిపోతున్నారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జగనన్న హామీలన్నీ నెరవేర్చారు.. : ఎంపీ అవినాష్రెడ్డి
వైఎస్సార్ కడప: రాష్ట్ర ప్రజలకు 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సింహాద్రిపురంలో మండలానికి సంబంధించిన వైఎస్సార్ ఆసరా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించి 524 డ్వాక్రా సంఘాలకు చెందిన 5078మంది డ్వాక్రా మహిళలకు రూ.5,24,92,136ల మెగా చెక్కును ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డిలు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు సంబంధించిన ప్రార్థన చాలా మోటివేటివ్గా ఉంటుందన్నారు. ఈ మధ్యకాలంలో అనేక సమావేశాల్లో డ్వాక్రా మహిళలు ఆ ప్రార్థనతోనే మొదలుపెడతారన్నారు. జీవితంలో వెలుగులు నింపాలని.. చీకటిని పారదోలాలని.. స్వర్గం అనేది ఎక్కడ ఉన్నా నేలపైకి తీసుకొద్దాం.. అంటూ ఎంతో ప్రేరణగా ప్రార్థన ఉంటుందన్నారు. ఒక్కసారి ఆలోచిస్తే 2019లో జగనన్న ఎన్నికలకు వచ్చినప్పుడు 2019 ఏప్రిల్ నాటికి డ్వాక్రా రుణం రూ.26వేల కోట్లు ఉండేదన్నారు. ఆ రుణ మొత్తాన్ని నాలుగు విడతల్లో తీరుస్తానని.. ఆ డబ్బులు మీకు తిరిగి ఇస్తానని జగనన్న ఆనాడు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన విధంగా ఇప్పటికే మూడు విడతలుగా ఒక్కో విడత రూ.6,500కోట్లు చెల్లించారన్నారు. ఇప్పుడు నాలుగో విడతగా రూ.6,500కోట్లు చెల్లిస్తున్నారన్నారు. నిజంగా ఇది చాలా గర్వకారణమైన విషయమని అన్నారు. ఒక్క వైఎస్సార్ ఆసరానే కాదు.. వైఎస్సార్ చేయూత కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రూ.3వేల పింఛన్ కావచ్చు చెప్పుకుంటూ పోతే ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేర్చారని తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేలు కలిగేలా చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశమన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ సంతకం, మరోవైపు చంద్రబాబు సంతకాలతో ఇంటింటికి కరపత్రాలు పంచారన్నారు. అందులో రైతుల రుణాలు, బ్యాంకు రుణాలు మాఫీ చేస్తాం, బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు రావాలి, నిరుద్యోగ భృతి రూ.3వేలు, ఇలా అనేక హామీలతో కరపత్రాలు పంపిణీ చేశారన్నారు. అందులో చంద్రబాబు ఏ ఒక్క హామీనైనా అమలుపరిచారా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అలాంటి చంద్రబాబు మరలా ఇప్పుడు మరోసారి ష్యూరిటీ, గ్యారంటీ, వారంటీ అంటూ మరోసారి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారన్నారు. దయచేసి ప్రజలందరూ చంద్రబాబు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని హితవు పలికారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డ్వాక్రా మహిళలతో కలిసి సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు తమ జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటామన్నారు. అంతకముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్రెడ్డి, జెడ్పీటీసీ ఝాన్సీరాణి, ఎంపీపీ అరుణ, మండల ఉపాధ్యక్షురాలు సుభాషిణి, సింగిల్ విండో ప్రెసిడెంట్ శేఖరరెడ్డి, ఎంపీటీసీ జాఫర్, సర్పంచ్ రామ్మోహన్, వైఎస్సార్సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, అరవిందనాథరెడ్డి, రాజగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓ సాల్మన్ రాజు, డీఆర్డీఏ పీడీ ఆనంద నాయక్, కో.ఆర్డినేటర్ నీలకంఠారెడ్డి, ఏపీఎంలు మంజునాథ్, గురురాజ్, ఆంజనేయులు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమాన్ని అందించారు.డీవీటీ ద్వారా రూ.203కోట్లు మండలానికి అందించగా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.64కోట్లు సింహాద్రిపురం మండలానికి అందించారు. చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చేతులేత్తేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ నాలు విడత వైఎస్సార్ ఆసరా డబ్బులు విడుదల చేశారు. – శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, సింహాద్రిపురం మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళాసంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి పల్లెలో ఏర్పాటు చేసి న పాల కేంద్రాల ద్వారా మహిళలు నెలకు రూ. 4వేలు పొందుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం యా నిమేటర్లకు రూ.8వేలకు జీతం పెంచారు. ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి. – హేమావతి, వైఎస్సార్ ఆసరా లబ్ధిదారురాలు, సింహాద్రిపురం మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు.. మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కరోనా విపత్తు సమయంలో కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రజలకు అండగా ఉంటూ ఆదుకున్నారు. – ఝాన్సీరాణి, జెడ్పీటీసీ, సింహాద్రిపురం దోచుకోవడం.. దాచుకోవడం టీడీపీ నైజం! టీడీపీ హయాంలో దోచుకోవడం.. దాచుకోవడం తప్ప.. ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా విపత్తు సమయంలో కూడా సీఎం వైఎస్ జగన్ పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు. – రామ్మోహన్రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్, సింహాద్రిపురం ఇవి చదవండి: ఒక్క ఓటుతో ఏడుగురం పనిచేస్తాం! : మంత్రి వేణు -
టీడీపీ వాళ్లు నన్ను అవహేళన చేశారు.. వారికి ఒకటే చెబుతున్నా!
సాక్షి, నరసరావుపేట: బీసీ బిడ్డను గెలిపించి పార్లమెంట్కు పంపే బాధ్యత పల్నాడు జిల్లా ప్రజలదేనని నరసరావుపేట లోక్సభ సమన్వయకర్త అనిల్కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తొలిసారి జిల్లాలో అడుగిడిన సందర్భంగా బుధవారం నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జగనన్న ఆదేశాల మేరకు నెల్లూరు నుంచి వచ్చే సమయంలో చాలా బాధపడ్డా.. మనసుకు భారంగా అనిపించిందన్నారు. కానీ పల్నాడు జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలతో పలికిన స్వాగతం చూసి చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి సహకారంతో ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచి మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. ఓ గొర్రెల కాపరికి మంత్రి పదవి ఇచ్చారని టీడీపీ వారు నన్ను అవహేళన చేశారు. వారికి ఒకటే చెబుతున్నా.. శ్రీకృష్ణుడు గొర్రెలకాపరి, ఏసుప్రభు పుట్టింది గొర్రెల చావడిలో అని గుర్తుంచుకోండి. నారా భువనేశ్వరి తన ఆస్తిలో 2 శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తుందన్నారు. అంటే వారి ఆస్తి సుమారు రూ.20 వేల కోట్లు. ఇదంతా ఆవులు, గేదేలు కాసే బీసీ బిడ్డలు పాలు పితికి మీకు పోస్తేనే సంపాదించారని గుర్తుచేశారు. కోటప్పకొండ శివయ్య సాక్షిగా చెబుతున్నా జగనన్న నన్ను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు.. ప్రతీ అడుగులో అండగా నిలిచారన్నారు. తక్కువ సమయంలో ఉండటంతో వీలైన ఎక్కువ మందిని కలిసే ప్రయత్నం చేస్తానని, ఎవరైనా కలవలేకపోతే 5 ఏళ్లు ఎంపీగా ఉన్న సమయంలో కలుస్తానన్నారు. భారీ జోష్.. అనిల్ కుమార్ యాదవ్ పల్నాడులో అడుగుపెట్టిన సమయం నుంచి బహిరంగసభ ముగిసే వరకు కార్యకర్తల్లో భారీ జోష్ కనిపించింది. అనిల్కు ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. అనిల్ ప్రసంగించే సమయంలో యువత కేకలతో సభ దద్దరిల్లింది. కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి, నాగార్జున యాదవ్, ఖలీల్ అహ్మద్, నిమ్మకాయల రాజనారాయణ, యనుముల మురళీధర్రెడ్డి, గజ్జల నాగభూషణం రెడ్డి పాల్గొన్నారు. జగనన్న బాణం అనిల్.. జగనన్న వదిలిన బాణం అనిల్కుమార్ యాదవ్. అనిల్ పేరు ప్రకటనతో జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. నెల్లూరు వారికి నరసరావుపేట ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నేదురుమల్లి జనార్ధనరెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డిలను ఎంపీగా గెలిపించిన చరిత్ర ఉంది. అనిల్ ఎంపీగా గెలవడంతోపాటు మేం ఏడు మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తాం. – నంబూరు శంకరరావు, ఎమ్మెల్యే ఇవి చదవండి: ‘పోలవరం’ ఆలస్యానికి చంద్రబాబే కారణం! -
ఒక్క ఓటుతో ఏడుగురం పనిచేస్తాం! : మంత్రి వేణు
తూర్పుగోదావరి: సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం పోలీస్స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. మంత్రి వేణు మాట్లాడుతూ జక్కంపూడి ఈ నియోజకవర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఒక ఓటుతో ఏడుగురు పని చేస్తామని తనతో పాటు తన ఇద్దరు కుమారులు, జక్కంపూడి కుటుంబంలోని నలుగురు కలిపి మొత్తం ఏడుగురు ఈ నియోజవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంత అబివృద్ధి కోసం జక్కంపూడి రామ్మోహనరావు ఏ విధంగా పనిచేశారో అదే విధంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కూడా పనిచేస్తారని తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ కో–ఆర్డినేటర్ గూ డూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి జక్కంపూడి రామ్మోహనరావు విశేష కృషి చేశారన్నారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ విధేయత, విశ్వసనీయతకు మారుపేరు జక్కంపూడి కుటుంబం అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నక్కా రాజబాబు, కడియం మండల జేసీఎస్ అధ్యక్షుడు తడాల చక్రవర్తి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యా ల పోసికుమార్, జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షట్టర్ బాషా, వైఎస్సార్ సీపీ నాయకులు దేశెట్టి హరిప్రసాద్, డాక్టర్ తోరాటి ప్రభాకరరావు, సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇవి చదవండి: వలంటీర్లకు గుడ్ న్యూస్.. నేడు నగదు పురస్కారాలు -
రామోజీకి గుణపాఠం.. ఆరోజు త్వరలోనే!
జర్నలిజంలో ఇంత దరిద్రంగా కూడా కథనాలు ఇవ్వవచ్చని ఈనాడు మీడియా పదే, పదే రుజువు చేసుకుంటోంది. ఇప్పటివరకు మీడియా అంటే ఏవైనా సమస్యలు ఉంటే వార్తలుగా రాయడం, దానికి పరిష్కార మార్గాలు చెప్పడం, సంబంధిత వర్గాల నుంచి రెండో వర్షన్ తీసుకోవడం, నిష్పక్షపాతంగా స్టోరీలు ఇవ్వడం అని అనుకుంటాం. కాని గత నాలుగేళ్లుగా ఈనాడు మీడియా ఏపీలో వైఎస్ ప్రభుత్వంపై రెచ్చిపోయి రాస్తున్న పిచ్చి రాతలు, పైత్యపు పోకడలు చూస్తే ఈనాడు యజమాని రామోజీరావుకు మానసికంగా ఏదో అయ్యిందని అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది. కొద్ది రోజుల క్రితం ఏపీ ఎడిషన్లో విశోకపట్నం అంటూ ఒక దిక్కుమాలిన వార్తను బానర్గా ఇచ్చారు. కొత్తగా జర్నలిజంలోకి వచ్చినవారు కూడా ఇంత చండాలంగా వార్తలు ఇవ్వరు. అబద్దాలు చెప్పడంతో దిట్ట అని పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా డిపాజట్లు రాకుండా రామోజీ బృందం అసత్యాలు రాసి ప్రజల మనసులను విషపూరితం చేయాలని చూసింది. సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్దం పేరుతో ఎన్నికల శంఖారావం పూరిస్తున్న రోజునే ఈ విషపూరిత కథనం ఇచ్చారంటే వారు ఎంత అనైతికంగా, విలువల వలువలు వదలివేసి విశాఖ నడివీధిలో ఏ స్థాయిలో నగ్నంగా తిరిగింది అర్ధం చేసుకోవచ్చు. ఆ కథనంలో విశాఖ శోకించిందట... అది రామోజీకి చెప్పిందట. నిజానికి రామోజీ, ఈనాడు బృందం ఏడుపులు వినలేక విశాఖ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. విశాఖ అభివృద్దికి కీలకంగా ఉపయోగపడే కార్యనిర్వాహక రాజధాని రాకుండా పిచ్చి రాతల ద్వారా, కోర్టుల ద్వారా అడ్డుపడుతున్న రామోజీరావు బృందం ఇప్పుడు విశాఖపట్నం మీద అభిమానం ఉన్నట్లు నటిస్తూ, నగరం మీద విషం కక్కుతున్నారు. నిజానికి ఈనాడు విశాఖపట్నానికి రుణపడి ఉండాలి. రామోజీ అభివృద్దిలోకి రావడానికి ఇక్కడే పునాది పడింది. కాని ఆ నగరం వికాసానికి అదే రామోజీ ఎంత వీలైతే అంత ఆటంకం కల్పిస్తున్నారు. ఈ స్టోరీలో ఎంత నీచంగా రాశారో చూడండి. దీనినే ఈటివిలో కూడా ప్రసారం చూసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించి ఉంటారు. 'నా చుట్టూ ఉన్న పరిశ్రమలనుకుళ్ల బొడిచారు.." అని విశాఖ చెప్పిందట రామోజీరావుకు. పెట్టుబడిదారులను భయపెట్టారట. ఇంత ఘోరంగా అబద్దాలు రాసి రామోజీ పాపం మూటకట్టుకుంటున్నారు. ఐటి రంగాన్ని వదలుకున్నారట. ఇలా ఒకటేమిటి. ఒకటికాదు.. అనేక అబద్దాలు వండి ప్రజల మీద నూరిపోసే యత్నం చేసింది. చంద్రబాబు టైమ్లో లూలు అనే మాల్ కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన తొమ్మిదెకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆ కంపెనీ మాల్ కట్టలేదు. దానిని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాల్ కోసం అంత విలువైన భూమి ఇస్తారా అన్న విమర్శలు ఉన్నాయి. పోనీ అదైనా నిర్మాణం చేశారా? అంటే అదీ లేదు. అయినా ఆ భూమిని అలాగే ఇచ్చేయాలని ఈనాడు రాస్తోంది. అక్కడ ఇంకే అభివృద్ది కార్యక్రమం చేపట్టరాదట. చంద్రబాబు టైమ్లో చాలా ఐటి సంస్థలు వచ్చాయట. ఇప్పుడు లేవట. ఇంతకన్నా అబద్దం ఉందా? కొంతకాలం క్రితం విశాఖలో ఇన్ఫోసిస్ కంపెనీని ఓపెన్ చేసింది ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డిమోహన్రెడ్డి కాదా? అక్కడ ఐటి టవర్ను నిర్మించి ఐటి కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానించడం లేదా? అదాని డేటా సెంటర్కు భూమి ఇస్తే, అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. మరో వైపు ఆ డేటా సెంటర్ పదిహేనువేల కోట్లే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందని ఈనాడే రాస్తుంది. ఎలాగైనా విశాఖకు ఏ పరిశ్రమ రాకూడదన్నది ఈనాడు, రామోజీరావుల దురుద్దేశం. వస్తున్న కంపెనీలను అడ్డుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసి వారిని భయపెట్టడం.. ఇదే నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. విశాఖ ఉక్కుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుడు వార్తలు రాసే ఈనాడు రామోజీరావు దమ్ముంటే కేంద్రంపైన, ప్రదాని నరేంద్ర మోదీపైన విమర్శలు చేస్తూ రాయవచ్చు కదా! అక్కడ మాత్రం వణికి పోతారు. అంతేకాదు... మోదీ ఇచ్చిన పద్మభూషణ్ బిరుదును చూసుకుని మురిసిపోయే రామోజీ కేంద్రంపై ఎందుకు రాస్తారు.. ఎంతసేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై పడి ఏడుస్తారు కాని. చంద్రబాబు టైమ్లో అంత స్వర్గం అయిపోయినట్లు, ఆ తర్వాత నరకం అన్నట్లు దిక్కుమాలిన వార్తలు రాసి ప్రజలపై విషం చిమ్ముతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేక వెనుకుబాటు తనం మరింత పెరిగిందని ఉత్తరాంధ్రపై కపట ప్రేమను ప్రదర్శించింది. చంద్రబాబు టైమ్లో నిజంగా అన్ని పరిశ్రమలు వచ్చి ఉంటే యువత ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండేది కాదు కదా! చంద్రబాబు టైమ్లో హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు లేదా అమెరికా వంటి దేశాలకు వలస వెళితే అదంతా చంద్రబాబు గొప్పతనమని, అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ టైమ్లో వెళితే ఉపాధి లేక వెళ్లారని రాసే చండాలపు రాతలకు ఈనాడు పాల్పడుతోంది. మూలపాడు పోర్టును నిర్మిస్తోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి కాదా? పలాస వద్ద సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, రక్షిత నీటి పథకం తెచ్చింది ఈ ప్రభుత్వం కాదా? అయినా ముసలాయన అయిపోయిన రామోజీకి కనిపించకపోవచ్చు. మరి ఆయన దగ్గర పనిచేసేవారి కళ్లు కూడా పనిచేయడం లేదా? అచ్యుతాపురంలో ఈ మధ్య వచ్చిన పరిశ్రమలు, నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ను సాధించడం అబద్దమా? రిషికొండమీద మంచి భవనం నిర్మించినా రామోజీకి కడుపు మంటగానే ఉంది. ఆయన మాత్రం కొండలను గుండు చేసి ఇల్లు కట్టుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం ఏ కట్టడాలు కట్టకూడదు. తెలుగుదేశం నేతలు కొండలు, గుట్టలు ఆక్రమించి నిర్మాణాలు చేయవచ్చు. ప్రభుత్వం మాత్రం చట్టబద్దంగా కూడా ఏ నిర్మాణం చేసినా ఈనాడు రోధిస్తోంది. ఒకపక్క ఏపీలో పేదరికం తగ్గుతున్నట్లు, ఉపాది అవకాశాలు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెబుతుంటే, ఈనాడు మీడియాకు మాత్రం కనిపించదు. ఎందుకంటే వారికి గుడ్డి ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి. విశాఖ నుంచి భీమిలి వరకు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం పూనుకుంటే ఇదే పత్రిక ఏమి రాసింది? రోడ్డు విస్తరణలో పలువురు నిర్వాసితులు అవుతున్నారని, వారికి అన్యాయం జరుగుతోందని వ్యతిరేక కథనాలు ఇచ్చిందా? లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత అవుతుంది. కళ్లున్న కబోదుల మాదిరి రామోజీ బృందం వ్యవహరిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పై ఈర్శ్య, అసూయ ద్వేషాలతో పిచ్చి రాతలకు ఈనాడు మీడియా పాల్పడుతోంది. అందుకే ఈనాడును, రామోజీరావును ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అయినా వారు సిగ్గుపడడం లేదు. అదే దౌర్బాగ్యం. ఇలాంటి ఈనాడు జర్నలిజం ఏపీలో ఉన్నందుకు ప్రజలంతా చీదరించుకుంటున్నా, తమ లక్ష్యం వైఎస్ జగన్మోహన్రెడ్డిను ప్రజలకు దూరం చేయాలన్న దురుద్దేశం ముందు వారు ఏవీ పట్టించుకోవడం లేదు. ప్రజలే ఈనాడు మీడియాకు, రామోజీరావుకు గుణపాఠం చెప్పే రోజు రాకుండా ఉంటుందా? -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఎల్లో మీడియా మాయలో షర్మిల.. వైఎస్సార్ ఆశయాలకు తూట్లు!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన తెలంగాణ నేత వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వైఎస్ఆర్ అభిమానులలో తీవ్ర ఆగ్రహం తెప్పించాయని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ అంటే ఇష్టపడేవారి హృదయాలను ఆమె గాయపరిచేలా మాట్లాడుతున్నారు. తన అన్న తనకేదో అన్యాయం చేశారన్న భావన వచ్చేలా ప్రజలకు సంకేతం ఇస్తున్నారు. షర్మిల ప్రసంగాలు తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికి మొదటి పేజీ వార్తలుగా ఉపయోగపడుతున్నాయి తప్ప, ఆమెకు దీనివల్ల ప్రత్యేకంగా కలిసి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వపరంగా ఆమె చేస్తున్న విమర్శలు అవగాహనా రాహిత్యానికి దర్పణం పడుతుంటే, సీఎం జగన్పై చేసిన వ్యక్తిగత విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని చెప్పాలి. రాజకీయాలలో ఆమె ఏ పార్టీలో అయినా చేరవచ్చు అది ఆమె ఇష్టం. కానీ, కుటుంబ విషయాలను, రాజకీయాలను కలగలిపి మాట్లాడడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారి ఏజెంట్లుగా ఉన్న రామోజీరావు, రాధాకృష్ణ వంటివారి కళ్లలో ఆనందం చూడడానికే అయితే మనం చెప్పగలిగేది ఏమీ ఉండదు. షర్మిల, ఆమె భర్త అనిల్ ఇద్దరిని రాజకీయంగా వీరంతా కలిసి వాడుకుని వదలివేస్తారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. షర్మిల స్టేట్మెంట్ల వల్ల కాంగ్రెస్ నేతలు ఎవరూ ఆనందపడుతున్నట్లు లేదు. వారెవరూ పెద్దగా స్పందించడం లేదు. కానీ, టీడీపీ, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం తెగ ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేస్తున్నాయి. దీనిని బట్టే ఆమె ఎవరికి సేవ చేస్తున్నది అనే విషయం తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషన్ సమ్మిట్లో రాజ్ దీప్ సర్దేశాయ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ జవాబిస్తూ కాంగ్రెస్ పార్టీకి డర్టీ రాజకీయాలు అలవాటేనని, రాష్ట్రాన్ని దారుణంగా విభజించిందని, అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజిస్తోందని అన్నారు. గతంలో తన బాబాయి వివేకానందరెడ్డిని వేరుచేసి తమకు వ్యతిరేకంగా పోటీ చేయించిందని, ఇప్పుడు తమ చెల్లిని విడదీసిందని తప్పుపట్టారు. అంతే తప్ప వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ, షర్మిల మాత్రం తమ కుటుంబం విడిపోవడానికి జగనన్న కారణమని ఆరోపించారు. అందుకు సాక్ష్యం తను, తన తల్లి అని ఆమె వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం చేసిన ఫర్వాలేదని, కాని రాష్ట్రానికి జగన్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా తనకేదో అన్యాయం జరిగినట్లు చెప్పడానికి యత్నించారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ షర్మిలకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పాలని కోరారు. ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన బదులు ఇచ్చారే తప్ప, షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా హుందాగా వ్యవహరించారు. షర్మిల తనకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పలేకపోయారు కాని, పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఇక అభివృద్ది జరగలేదని ఆమె చెబుతున్న అబద్దాలకు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారానికి తేడా లేకుండా పోయింది. ఆమె అబద్దాలను వైఎస్ జగన్ అబిమానులు తీవ్రంగా ఖండిస్తూ, ఏపీలో ఎక్కడికక్కడ జరిగిన అభివృద్ది పనుల వద్దకు వెళ్లి వీడియో తీసి షర్మిల చూడాలని చెబుతూ యూట్యూబ్లో పెడుతున్నారు. ఉదాహరణకు జగన్ అభిమాని ఒకరు విజయవాడ కృష్ణానది కరకట్ట వద్దకు వెళ్లి అక్కడ జగన్ ప్రభుత్వం నిర్మించిన భారీ రిటైనింగ్ వాల్ చూపించి, దీనిని అభివృద్ది కాదంటారా అని తీవ్రంగా ప్రశ్నించారు. షర్మిల ఇక్కడకు వచ్చి చూడాలని ఆయన సవాల్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో పూర్తి చేసిన వంతెనలపై తిరుగుతూ వీడియోలు తీసి షర్మిలకు తెలియచేయాలని తలపెట్టారు. బాగు పడ్డ స్కూళ్లు, ఆస్పత్రులు, తీర ప్రాంతంలో నిర్మాణంలో ఓడరేవులు, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొదలైన వాటిని షర్మిల చూడాలని అంటున్నారు. షర్మిల శ్రీకాకుళం జిల్లాకు కూడా వెళ్లారు. అక్కడ పలాస వద్ద ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రభుత్వం నిర్మించిన సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, 800 గ్రామాలకు ఉపయోగపడే మంచినీటి ప్రాజెక్టును చూసి ఉంటే అభివృద్ది ఎలా జరుగుతోందో తెలుసుకునే అవకాశం ఉండేది. నిజానికి వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని, సీఎం జగన్ మాత్రం తన తండ్రి పేరును గొప్పగా నిలబెడుతున్నారని వైఎస్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీ మాయలో ఉన్న షర్మిలకు ఇవేవీ కనిపించడం లేదు. షర్మిల మరో ఆరోపణ కూడా చేశారు. సీఎం జగన్ తనను నమ్మినవారిని ముంచారని పిచ్చి ఆరోపణ చేశారు. తనకోసం రాజీనామా చేసిన వారికి మంత్రి పదవులు ఇవ్వలేదని తెలిసి, తెలియని ఆరోపణ చేశారు. నిజానికి జగన్ తన వెంట 2011 నుంచి ఉన్నవారిలో తొంభైఐదు శాతం మందికి ఏదో విధంగా పదవులు వచ్చేలా చేశారు. ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని, రోజా, అంబటి రాంబాబు మొదలైనవారికి మంత్రి పదవులు ఇచ్చారు. కాకపోతే పరిమితులను బట్టి కొందరికి ముందు, మరికొందరికి వెనుకా పదవులు ఇచ్చారు. పలువురికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చారు. అంతేకాదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నివేల మందికి కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర పదవులు ఇచ్చి అందరిని సంతృప్తి పరచే యత్నం చేశారు. కానీ, షర్మిల ఏమి చేశారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పెడతానని వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులందరిని పిలిచి, వారిని పార్టీలోకి తెచ్చి, తదుపరి వారితో చెప్పాపెట్టకుండా పార్టీని ఎత్తివేశారు. ఏ కాంగ్రెస్పై ఉమ్ము వేయాలని వైఎస్ చెప్పి ఉండేవారని ఆమె అన్నారో, అదే కాంగ్రెస్లో ఆమె తన పార్టీని విలీనం చేసి వైఎస్ అభిమానులందరిని షాక్కు గురి చేశారు. ఆమె పార్టీలో చేరి కొంత మంది కోట్ల రూపాయలు చేతి చమురు వదిలించుకుని అప్పుల పాలయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెతో పాటు వైఎస్సార్టీపీలో పనిచేసిన సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి ఓపెన్గా చెప్పారు. షర్మిల అహంకారంతో, ప్రస్టేషన్తో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. షర్మిల భర్త అనిల్ మరికొందరితో కలిసి సీఎం జగన్ నుంచి ప్రభుత్వపరంగా అనుచిత లబ్ది పొందాలని చూశారని, దానికి జగన్ అంగీకరించలేదని ఆయన నిర్మొహమాటంగా తెలిపారు. ఆ కారణంతోనే ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా మారారని ఆయన వెల్లడించారు. అక్రమ కేసులలో జగన్ అరెస్టు అయి జైలులో ఉన్నప్పుడు తనకు తానే పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించుకున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం జగన్పై షర్మిల ఆరోపణలు చేయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని అన్నారు. ఈ విషయంలో విజయమ్మ కూడా షర్మిల తీరుపై బాధ పడుతుంటారని కూడా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడిన విషయాల వీడియోలను లక్షల సంఖ్యలో ఆసక్తిగా గమనిస్తున్నారంటేనే ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రజలలో ఎంత అభిమానం ఉందన్నది అర్ధం అవుతుంది. అలాగే షర్మిల మాటలను వారెవ్వరు అంగీకరించడం లేదని తెలుస్తుంది. రాఘవరెడ్డి వ్యాఖ్యలపై స్పందించినా ఆమె ఆత్మరక్షణలో పడినట్లు అనిపిస్తుంది. విజయమ్మతో ఈ విషయాలు చెప్పించాలని అన్నారట. ఆ పని చేయవలసిన అవసరం రాఘవరెడ్డికి ఏమి ఉంటుంది. పైగా కొద్ది రోజుల క్రితమే విజయమ్మ ఇడుపుల పాయలో సీఎం జగన్ పట్ల ఎంత అప్యాయంగా వ్యవహరించింది అందరూ చూశారు. ఈ ఘటనలతో విజయమ్మ బాధపడుతుండవచ్చు. కానీ, షర్మిల కాంగ్రెస్లో చేరడాన్ని ఆమె కూడా సమర్ధించారనే అంతా అనుకుంటున్నారు. అందువల్ల షర్మిల ఇప్పటికైనా అనవసర వ్యర్ధ ప్రసంగాలుమాని ,రాజకీయంగా తనకు తోచిన నాలుగు మాటలు చెప్పుకుని తిరిగితే మంచిది. ఏపీలో షర్మిల పర్యటనలు చేసినా కాంగ్రెస్కు ప్రయోజనమేమీ ఉండదు. కాకపోతే ముఖ్యమంత్రి జగన్కు నష్టం చేయాలన్న దుష్ట తలంపుతో కాంగ్రెస్ పార్టీ ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకు వచ్చింది. ఏపీలో కాంగ్రెస్కు ఎవరూ నేతలే లేనట్లు, ఇక్కడ ఉన్న నేతలందరిని చెత్తబుట్టలోకి విసిరేసి, తెలంగాణ నుంచి షర్మిలను తీసుకురావడం ఒక రకంగా ఏపీ ప్రజలను సోనియాగాందీ మరోసారి అవమానించడమే అనిపిస్తుంది. ఇదంతా తెలుగుదేశంతో ఉన్న రహస్య అవగాహన తప్ప మరొకటి కాకపోవచ్చు. ఈ చదరంగంలో షర్మిల పావుగా మిగిలిపోవడం తప్ప సీఎం జగన్కు జరిగే నష్టం ఏమీ ఉండదని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు. -
YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం
వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు. రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా, మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు. ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. జగన్ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. -
టీడీపీపై నమ్మకం లేకే ఈ రాజకీయ డ్రామానా?
గుంటూరు తెలుగుదేశం లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్ మాటల్లో నిజాయితీ కనిపిస్తోందా? ఆయన నిజమే చెబుతున్నారా?వచ్చే ఎన్నికలలో గెలవలేనన్న భయంతో మాట్లాడుతున్నారా? ఆయన ఇంతకీ వ్యాపారం కోసం రాజకీయాల నుంచి తప్పుకున్నారా? లేక కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయన్న ఆరోపణతో తప్పుకున్నారా?పరస్పర విరుద్దంగా రెండు మాటలూ ఆయనే మాట్లాడుతున్నారు.ఆయన మొత్తం మీద చూస్తే ,తాను ధైర్యవంతుడనని చెప్పుకుంటూ ,పిరికితనంతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారటకాని, తెలుగుదేశంకు రాజీనామా చేయడం లేదట. ఇంతకీ ఆయన ఏమి చెప్పదలిచారు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లతో ఏర్పడిన బలమైన రహస్య బంధాన్ని వదలుకోలేకపోతున్నారన్న విషయం అర్ధం అవుతుంది. ప్రత్యేక హోదా కోసం పోరాడాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన సంస్థలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసిందని ఆయన అన్నారు. అనుమతులు ఉన్నా కేసులు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై నింద మోపారు. ఆయనలో చిత్తశుద్ది ఉంటే పూర్తి వివరాలు వెల్లడించి ఉండేవారు. తన సంస్థలలో ఈడి సోదాలు చేసినప్పుడు ,విచారణకు పిలిచినప్పుడు ఏమి జరిగింది? ఏ అంశాలలో ఆరోపణలు వచ్చాయి అన్న విషయాలపై ఎందుకు వివరణ ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ నేతలు కొందరు చెబుతున్నదాని ప్రకారం ఆయన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్కు సాయం చేసేందుకు చంద్రబాబు తరపున వందదల కోట్ల రూపాయల పంపిచారట.ఇందులో నిజం ఉందో లేదో తెలియదు. ఆ నేపద్యంలోనే ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆయన సంస్థలపై దాడులు చేసిందన్నది వారి అబియోగం. చంద్రబాబు నాయుడు గత టరమ్ లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తో సంబంధాలు పెట్టుకుని ఆ పార్టీకి ఆయా రాష్ట్రాలలో ఆర్ధిక వనరులు సమకూర్చారని ప్రచారం జరిగింది. రాజస్తాన్ లో అప్పట్లో అశోక్ గెహ్లాట్ కు నిధులు సమకూర్చారన్న టాక్ కూడా వచ్చింది. అలాగే కర్నాటక ఎన్నికలలో కూడా తన వంతు పాత్ర పోషించారని అంటారు. అందువల్ల వైఎస్సార్సీపీ నేతల ఆరోపణలలో నిజం ఉండే అవకాశం లేకపోలేదు.కేవలం ప్రత్యేక హోదా అంశంపైన జయదేవ్ పార్లమెంటులో మాట్లాడిన దానికే ఎలాంటి కనీసం సమాచారం లేకుండా ఒక కంపెనీపై ఈడి దాడులు చేస్తుందా? అన్న ప్రశ్న వస్తుంది. అలా జరగకూడదని లేదు కాని, ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు కదా!వారిలో కొందరికి సొంత కంపెనీలు ఉన్నాయి కదా!వారిపై కూడా దాడులు జరిగాయా?అలాగే టీడీపీలో మరికొందరు ఎంపీలకు కూడా పరిశ్రమలు ఉన్నాయి.వారిపై ఎందుకు దాడులు జరగలేదు?అనంతపురం టీడీపీ ఎంపీగా జెసి దివాకరరెడ్డి 2014లో ఎన్నికయ్యారు.ఆయన కుటుంబానికి సంబంధించి బస్ ల లావాదేవీలపై పలు ఆరోపణలు ఉన్నాయి. కాని వారిమీద అప్పట్లో ఎందుకు ఈడి దాడి జరగలేదు? అవన్ని ఎందుకు!టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పై ఎన్నిసార్లు మాట మార్చారు? ఆయన హోదా వద్దు..ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు గల్లా జయదేవ్ నోరు విప్పలేదే! అంటే ఈ అంశంపై జయదేవ్ కు ఉన్న చిత్తశుద్ది ఇదేనా?చంద్రబాబు ప్రధాని మోడీపై పలుమార్లు వ్యక్తిగత విమర్శలు చేసినా, ఆయన భార్య గురించి మాట్లాడినా ఈడి దాడులు ఎందుకు చేయలేదో కూడా గల్లా చెబితే బాగుంటుంది. చంద్రబాబు పిఎస్ పై ఐటి శాఖ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలు కనుగొన్నా, ఇన్నేళ్లుగా ఒక్క అడుగు ముందుకు ఎందుకు పడలేదో కూడా ఆయన చెబుతారా? అవిశ్వాస తీర్మానంపైన లోక్ సభలో మాట్లాడితేనే కేసులు వచ్చేస్తే, ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలలో చాలామందిపై కేసులు రావాలి కదా! మొత్తం మీద గల్లా జజయదేవ్ ఏదో దాస్తున్నట్లుగా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు కూడా అసంబధ్దంగా ఉన్నాయి.అమరరాజా బాటరీ పరిశ్రమ నుంచి కాలుష్యం విడుదలై స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తోందని నివేదికలు చెప్పింది వాస్తవం కాదా? దానిపై ఆయన హైకోర్టుకు వెళ్లినా కాలుష్యం విషయంలో నిబంధనలు పాటించాలని చెప్పిందా? లేదా? ఆ సంగతి వెల్లడించకుండా వేధించారని తప్పుడు ఆరోపణ చేయడం సరైనదేనా? రాజకీయ నాయకుల పరిశ్రమల జోలికి వెళ్లరాదని గల్లా జయదేవ్ పార్లమెంటులో బిల్లు పెట్టి ఉంటే బాగుండేది. ఒకవైపు పరిశ్రమ విస్తరణకు, వ్యాపారాభివృద్దికి గాను రాజకీయాలకు దూరం అవుతానని చెబుతూ,మరోవైపు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు చేసి అందువల్లే తప్పుకుంటున్నట్లు చెప్పడంలో అర్ధం ఏమైనా ఉంటుందా? ఏపీలో పరిశ్రమ విస్తరణకు జయదేవ్ ప్రయత్నించారా? అలా చేసినా అనుమతులు రాలేదా? లేక తెలంగాణలో విస్తరించాలన్న ఉద్దేశంతో అక్కడ ప్రతిపాదించారా? అదే టైమ్ లో ఏపీలో 250 కోట్ల పెట్టుబడులు పెడుతున్నానని జయదేవ్ ఆ రోజుల్లో చెప్పరా? లేదా? తెలంగాణతో పాటు యుపి , పశ్చిమాసియా దేశాలలో కూడా కంపెనీలు పెడుతున్నామని చెప్పేవారు ఏపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేయవలసిన అవసరం ఏముంది? పోనీ తెలుగుదేశం 2014-2019 వరకు అధికారంలోనే ఉంది కదా!చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! అప్పుడు ఎందుకు ఒక్క రూపాయి కూడా ఏపీలో కొత్త పెట్టుబడులు పెట్టలేదు? అంటే అప్పుడు కూడా వేధింపులే వచ్చాయని అనుకోవాలా? మీ వ్యాపారం మీ ఇష్టం. కాని దిక్కుమాలిన రాజకీయాల కోసం ఏపీపై ఎందుకు విమర్శలు చేస్తారు! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నంతమాత్రాన కొత్త పెట్టుబడులు పెట్టరా? నిజంగానే అప్పట్లో ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోతే లోక్ సభలోనే ప్రస్తావించేవారు కదా? అసలు ప్రతిపాదనే చేయకుండా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎవరు నమ్ముతారు! 'నన్ను కొట్టినా,తిట్టినా,జైలుకు పంపినా ఫర్వాలేదు.. గమ్మున కూర్చోమంటే నా వల్ల కాదు"అని జయదేవ్ అన్నారు. అదే నిజమైతే , అంత ధైర్యవంతుడవైతే వచ్చే ఎన్నికలలో పోటీచేసి గెలిచి లోక్ సభలో ఈ అంశాలపై తన వాణి వినిపించవచ్చు కదా! అంటే ఒక పక్క పిరికితనంతో వ్యవహరిస్తూనే మరో పక్క ఇలా మేకపోతు గాంభీర్యపు ప్రకటనలు దేనికి! అంతగా తప్పులు చేయకపోతే, భయం లేని వ్యక్తి అయితే గత మూడు సంవత్సరాలుగా రాజకీయాలలో ఎందుకు క్రియాశీలకంగా లేరో కూడా చెప్పాలి కదా! మరో సందర్భంలో ప్రజల గొంతుకగా ఉండలేకపోతున్నానన్న కారణంతో రాజకీయాలకు దూరం అవుతున్నానని చెబుతారు. మరో వైపు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలనై బురద జల్లుతున్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉంటానని అంటున్నారు కదా!అప్పుడు ప్రభుత్వాలకు కోపం రాదా . దీనిలో డొల్లతనం కనిపించడం లేదా? తన వ్యాపార స్వార్ధం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని వెనక్కి నెట్టేశానని ఆయన ఒప్పుకుంటున్నారా? ఒకదానికి మరోదానికి పొంతన లేకుండా ఆయనమాట్లాడుతన్నారనిపిస్తుంది. అమరరాజా బాటరీస్ టర్నోవర్ ను 58వేల కోట్లకు తీసుకు వెళ్లే లక్ష్యం పెట్టుకున్నానని చెప్పినప్పుడు మధ్యలో ఈ అనవసర రాజకీయ ప్రకటనలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది? మరో రెండునెలల్లో లోక్సభ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా!తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ గెలుపు ఖాయమని అంటున్నారు కదా? అది నిజమే అని జయదేవ్ నమ్మి ఉంటే ఎంపీగా పోటీచేయవచ్చు కదా! టీడీపీ ప్రభుత్వం వస్తే వేధింపులు ఉండవని ఆయన చెప్పదలిచారనుకుందాం. అలాంటప్పుడు రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించడం ఎందుకు? టీడీపీ కొత్త అభ్యర్ధిని వెతుక్కోవలసిన అవసరం కల్పించడం ఎందుకు?ఇవిన్ని పరిశీలిస్తే జయదేవ్ అసత్యాలు చెబుతున్నారని తేలిపోతుంది. అంతేకాక ఆయన తన మీద తనకే విశ్వాసం లేక, టీడీపీ విజయంపై నమ్మకం లేక ఈ రాజకీయ డ్రామాకు తెరదీశారా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబుతో ఉన్న రహస్య ఆర్ధిక సంబంధాల రీత్యానే టీడీపీలో కొనసాగుతున్నానని చెబుతన్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. జయదేవ్ గారూ.. మీరు వ్యాపారానికి వెళ్తే వెళ్లండి. కాని ఆ పనిమీద వెళుతూ ఎవరి మీదో రాయివేసి వెళ్లినా, బురద వేసినా అవి మీమీదే పడతాయని గమనించండి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
CBN: ఆ నవ్వు వెనుక అంత కథ ఉందా?
ఆ మధ్య చంద్రబాబు పబ్లిక్గా ఏడ్చారు. తప్పేం కాదు. మనిషి ఏడ్వొచ్చు. కానీ నాయకుడు ఏడ్వకూడదు. కనీసం ఏడ్చినట్లు కూడా కనిపించకూడదు. కానీ చంద్రబాబు తన ఏడుపును రాష్ట్ర ప్రజలంతా చూసేలా ఏడ్చారు. ఏడ్చి, ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నించారు. అభాసుపాలయ్యారు. ఆయన ఏడుపును ఎవరూ నమ్మలేదు. పైగా ‘‘హవ్వా’’ అని నవ్విపోయారు. నిజానికి చంద్రబాబు ఏడ్చే నాయకుడు కాదు. ఏడిపించే నాయకుడు కూడా. ఎన్టీఆర్ని అలాగే కదా ఏడిపించారు కదా. అసలు సిసలు చంబ్రాబును చూడాలంటే మీరు 2003 అక్టోబర్ 1వ తేదీకి వెళ్లి ఆగాలి. తిరుపతిలో అలిపిరి దగ్గర ఆరోజు ఆయనపై నక్సల్స్ దాడి జరిగింది. ఆయన దుస్తులు రక్తసిక్తం అయ్యారు. ఆయన బెదిరిపోయారు. నిజానికి అది బెదురు కాదు. ఆలోచన! ఆ ఘటనను ఎలా తనకు అనుకూలంగా మలచుకోవాలన్న ఆలోచన. గాయాల నుంచి ఇంకా కోలుకోకుండానే, తిరిగి అధికార బాధ్యతలు చేపట్టకుండానే ఆయన పన్నిన మొదటి వ్యూహం.. నక్సలైట్ల హింసాకాండను కారణంగా చూపి శాసన సభ రద్దుకు సిఫారసు చేయడం. ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేయడం! అయితే పీపుల్స్ వార్ గ్రూప్ రాజకీయాలే ప్రధాన అజెండాగా ఓటర్ల సానుభూతి కోసం ఆయన చేసిన ‘ముందస్తు’ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. తనపైన జరిగిన దాడి తెలుగుదేశం పార్టీకి సానుభూతి ఓట్లను సంపాదించి పెడుతుందని భావించిన చంద్రబాబు.. దాడి జరిగిన సరిగ్గా నెల రోజులకు నవంబరు 2న హైదరాబాద్లో ఉప ప్రధాని అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుతో సమావేశం అయ్యారు. ముందస్తు ఎన్నికలపై మరోసారి ఆలోచించాలని కోరారు. (అప్పటికి నెల రోజులుగా ఈ ప్రతిపాదన తెస్తూనే ఉన్నారు.) కానీ ప్రధాని వాజ్పేయి ముందస్తు ఎన్నికలపై ఆసక్తి చూపకపోవటంతో అద్వానీ కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ ఏడాది నవంబరు–డిసెంబరు నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ముందస్తు గురించి ఆలోచిద్దాం అని అద్వానీ ఆ విషయాన్ని దాటవేశారు. ఆ మర్నాడే చంద్రబాబు తన సన్నిహిత పార్టీ నేతలలో ముందస్తు గురించి చర్చించారు. టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న వాస్తవం వారి చర్చల్లోకి వచ్చింది. రాష్ట్ర హోం మంత్రి దేవేందర్ గౌడ్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, పార్టీ కోశాధికారి ప్రభాకర్ రెడ్డి, ఏపీ కె.రామ్మోహన్రావు చంద్రబాబు ముందస్తు ప్రతిపాదనపై ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ‘దాడి’ని పక్కన పెట్టి, సంక్షేమ పథకాల ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికలకు అది కూడా అవి జరిగినప్పుడే వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. 2004 మే నెలలో జరిగిన ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ నాయకుడిగా వై.ఎస్.రాజశేఖర్రెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 294 స్థానాల్లో కాంగ్రెస్ 185 స్థానాల్లో విజయం సాధించింది. చంద్రబాబుకు సానుభూతి దగ్గకపోగా, ఘోర పరాజయానికి గురయ్యారు. ఆయన నాటకాలు కాంగ్రెస్కు చేదోడు అయ్యాయి తప్పితే, సైకిల్ని ముందుకు నడిపించలేకపోయాయి. చంద్రబాబు యాక్టింగ్ మామూలుగా ఉండదు. యాక్టింగ్ క్లాసులకు వెళ్లి మరీ తన యాక్టింగ్ను మెరుగు పరిచేందుకు 2004 ఎన్నికల ముందు ఆయనెంతో శ్రమ పడ్డారు. చంద్రబాబు ఎప్పుడూ నవ్వుతూ కనిపించరు. ఒకవేళ కనిపించారంటే ప్రతిపక్ష నేతల్ని ప్రజల ముందు ఎద్దేవా చేయడానికి నవ్వుతారు. 2004 ఎన్నికలకు ముందు ఆయనపై సొంత పార్టీ నాయకులే ఈ విమర్శ చేశారు. ఆయనెప్పుడూ బిగదీసుకుని ఉంటారని, ప్రజల్లోకి అది వ్యతిరేక సంకేతాలను తీసుకెళుతుందనీ! దాంతో చంద్రబాబు తనని తను మలుచుకోవాలనుకున్నారు. మలుచుకోవడమే, మార్చుకోవటం కాదు. ముఖం మీదకు నవ్వు రమ్మంటే ఊరికే వస్తుందా? యాక్టింగ్ చెయ్యాలి. చంద్రబాబు సహజ నటుడే కానీ, నవ్వును ముఖంపైకి తెప్పించడం ఆయన వల్ల కాలేదు. అందుకే ట్రైనింగ్ తీసుకున్నారు. సినీ, టీవీ రంగాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. మూడు రోజుల పాటు వారి నుంచి శిక్షణ పొందారు! ఉచ్ఛారణ, బాడీలాంగ్వేజ్, వస్త్రధారణ.. విషయంలో తనను తను మెరుగుపరుచుకున్నారు. ముఖం మీదకు నవ్వు తెప్పించుకోవటం కూడా ప్రాక్టీస్ చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల సన్నాహాలలో భాగంగా టీవీ చానెళ్లలో జరిగే చర్చగోష్ఠులలో పాల్గొన్నప్పుడు ఓటర్లను ఇంప్రెస్ చేయాలన్నదే ఆ శిక్షణ వెనుక ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఆనాడు చంద్రబాబుకు పోస్టర్ల నాయకుడిగా కూడా పేరుండేది. అయితే ఆ ఇమేజ్ నగరాల్లో పనికొచ్చిందేమో కానీ, గ్రామాల్లోని ప్రజలు, ఓటర్లు ఈ నాటకాల నాయకుడిని తిరస్కరించారు. ప్రజలతో మమేకం అయి ఉన్న నాయకులే మనస్ఫూర్తిగా నవ్వగలరు. ఆ నవ్వు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిలో కనిపిస్తుందనే స్వయంగా టీడీపీ నాయకులే ఒప్పుకుంటారు. ఇవి చదవండి: AP: సంక్షేమం అంటే బాబుకు ‘సన్’క్షేమం : మంత్రి చెల్లుబోయిన -
జగన్ బ్లాక్బస్టర్.. బాబు డిజాస్టర్
ఒకే రోజు ఇద్దరు నేతల సభలు జరిగాయి. ఆ సభలలో వారు మాట్లాడిన విషయాలు మీడియాలో రిపోర్టు అయ్యాయి. ఆ నేతలు ఎవరో కారు. ఒకరు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిమోహన్ రెడ్డి కాగా, మరొకరు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్కు, చంద్రబాబు స్పీచ్కు ఎంత తేడా ఉందో పరిశిలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపన్యసించింది పార్టీ క్యాడర్కు సంబంధించిన సభలో కాగా, చంద్రబాబు మాట్లాడింది రా..కదలిరా.. అన్న సభలో. జనం విషయంలో ఈ రెండిటిని పోల్చనవసరం లేదు. ఉత్తరాంధ్ర అంతటికీ కలిపి భీమిలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్వహించిన సభలో లక్షల మంది హాజరయ్యారు. చంద్రబాబు సభలు ఉరవకొండ, పీలేరు నియోజకవర్గాలకు సంబంధించినవి. అయినప్పటికీ ఈ రెండు సభలలో కనిపించిన స్పందనను పోల్చవచ్చు. భీమిలి సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి విషయానికి విపరీతమైన రెస్పాన్స్ కనిపించింది. అదే చంద్రబాబు సభలో ముందు భాగంలో ఉన్నజనం మినహాయిస్తే వెనుకవైపు అంతా ఖాళీగా కనిపించడం సాధారణం అయిపోయింది. స్పందన కూడా అంతంతమాత్రమే. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి ఏమిటంటే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం ఏమి చేసిందో, తద్వారా ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో వివరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు ఎక్కడా తన పద్నాలుగేళ్ల పాలనలో ఫలానాది సాధించాను.. అని చెప్పలేకపోయారు. ఈ విషయం ఆదివారం నాడు తెలుగుదేశం భజనపత్రిక ఈనాడులో వచ్చిన వార్తను చదివితే అర్దం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనసభలో యుద్దానికి సిద్దమా! అని తన క్యాడర్ను ప్రశ్నించి వారి నుంచి సిద్దం అనే జవాబును రాబట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖం పూరించి, నగరా మోగించిన ఘట్టం అక్కడ ఉన్న లక్షలాది మందిని ఆకట్టుకుంది. చంద్రబాబు తన సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు సమాధానం చెబుతున్నట్లుగా సమరానికి సై అన్నారు. దానిని ప్రధాన హెడింగ్గా ఈనాడు పెట్టుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్లో చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కురుక్షేత్ర యుద్దానికి సిద్దమయ్యామని, తమను పాండవులుగా ఆయన అభివర్ణించుకుంటూ ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని, అర్జునుడు అని, టీడీపీ, జనసేన, రామోజీ, రాధాకృష్ణల వంటివారి కుట్రలను ఎదుర్కోబోతున్నానని, అర్జునుడు మాదిరి ఎదుటివారు పద్మవ్యూహం పన్నినా తాను ఛేదించగలనన్న అర్ధం వచ్చేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. 175 సీట్ల లక్ష్యం గురించి మరోసారి ఉద్ఘాటించి చంద్రబాబు కూడా గెలవడానికి లేదని ధీమాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హామీలు, తన హామీలను పోల్చి వివరిస్తూ.. ఇది అబద్దానికి, నిజానికి మద్య ఉన్న యుద్దం అని ఆయన అన్నారు. తద్వారా చంద్రబాబు 2014లో వందల కొద్ది హామీలు ఇచ్చి 90శాతం ఎగ్గొట్టిన వైనాన్ని, తాను ఇచ్చిన హామీలలో 99శాతం పూర్తి చేసిన తీరును వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ అర్ధం అయ్యేలా వివరించారు. వృద్దాప్య పెన్షన్లను ఇళ్లవద్దే అందిస్తున్నామని, బడులను మార్చివేశామని, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ మొదలైన మార్పులను ఆయన సభలో గుర్తు చేశారు. ఆ రకంగా చంద్రబాబు తన సభలలో చెప్పినట్లు కనిపించలేదు. ఈనాడు పత్రికలో ఒక్క లైన్ కూడా అలాంటివాటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చి ప్రపంచంతో పోటీ పడే విద్యను అందిస్తున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సీబీఎస్ఈ, బైజూస్ కంటెంట్, పిల్లలకు టాబ్లు ఇలా ఏ రకంగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్పు కనిపిస్తుందని ఆయన ధైర్యంగా చెప్పగలిగారు. అదే చంద్రబాబు తన సభలలో తన మార్పు ఏమిటో ఎక్కడా చెప్పలేకపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నర లక్షల కోట్లను ప్రజల ఖాతాలలతో వేసిన విషయాల గురించి చెబుతూ, చంద్రబాబు టైమ్ లో పేదల బ్యాంకు ఖాతాలను, తన పాలన టైమ్ లో బ్యాంక్ ఖాతాలలో జమ అయిన డబ్బును చూసుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనడం విశేషం. ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు టైమ్ లో ఎవరికీ ఇళ్ల స్థలం ఇవ్వలేకపోయారు. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు కలిసి వచ్చే పాయింట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్ లో కొన్ని అంశాలనే ప్రస్తావించారు. నిజానికి ఉత్తరాంధ్రలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉండి ఉంటే ఇంకా బాగుండేది. మూలపేట పోర్టు, సమీపంలోనే ఫిషింగ్ హార్బర్, గిరిజన విశ్వవిద్యాలయం, పలాసలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, భారీ నీటి పథకం, విశాఖలో ఐటి రంగంలో వస్తున్న కంపెనీలు మొదలైన వాటి గురించి కూడా వివరించి ఉండాలి. ఇన్ని లక్షల మంది హాజరైన సభలో అవి కూడా చెప్పి ఉండాల్సిందని ఎక్కువ మంది భావన. అయితే ఇతర వ్యక్తులు ఆ విషయాలన్ని ప్రస్తావించారు. అది వేరే సంగతి. చంద్రబాబు తన స్పీచ్లో ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తిట్టడం, శాపనార్దాలు పెట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యరంగాల గురించి, ప్రజలకు వాటి ఆవశ్యకత గురించి ప్రసంగిస్తుంటే, చంద్రబాబు మాత్రం మద్యం గురించి ఎక్కువ మాట్లాడి అప్రతిష్టపాలవుతున్నారనిపిస్తుంది. మద్యం ధరలు, బ్రాండ్ల గురించి 74ఏళ్ల వయసులో మాట్లాడడం ఏ మాత్రం బాగోలేదు. ప్రజలకు మద్యం సేవించవద్దని చెప్పాల్సిన నేత, వాటిని ఎలా తాగాలో చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దెబ్బతినని రంగం లేదని చంద్రబాబు అంటున్నారు. కాని ఏ రంగం ఎలా దెబ్బతిందో చెప్పలేకపోతున్నారు. స్కూళ్లను బాగు చేయడం మంచిది కాదని, విలేజ్ క్లినిక్స్ పెట్టడం సరికాదని, ఇళ్లవద్దకే పెన్షన్లు తీసుకువెళ్లి వృద్దులకు ఇవ్వడం తప్పని, వాలంటీర్ల వ్యవస్థ వృధా అని, గ్రామ, వార్డు సచివాలయాలు అనవసరమని కూడా చంద్రబాబు అనగలరా? ఆ ఊసులే చంద్రబాబు తేలేకపోతున్నారు. మరి ఏ రంగం నష్టపోయింది?.. అంటే తను విమర్శించడానికి సబ్జెక్ట్ లేక, జనరల్గా విమర్శలు చేస్తూ పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీమ్ల వల్ల లబ్ది పొందినవారంతా తన స్టార్ కాంపెయినర్స్ అని అంటే, చంద్రబాబు దానికి పోటీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులు తన స్టార్ కాంపెయినర్లు అని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు బాధితులో చెప్పలేకపోయారు. వైఎస్ఆర్సీపీలో సీట్ల కేటాయింపు, కొన్ని అసంతృప్తులు మొదలైనవి చంద్రబాబు మాట్లాడడం తెలివితక్కువతనంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, కొన్ని చోట్ల టీడీపీలో గొడవలు పెట్టుకుని ఎదుటివారిని అంటే ప్రజలు తెలుసుకోలేరనుకుంటే భ్రమే అవుతుంది. అంతేకాదు.. ఇంతకాలం లోకేష్ రెడ్ బుక్ అని ప్రచారం చేసి నవ్వులపాలైతే, చంద్రబాబు కూడా అదే బాటలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల చిట్టా రాస్తున్నానని, అందరిని అరెస్ట్ చేస్తానని చెప్పడం ద్వారా బెదిరింపు రాజకీయాలకే ప్రాదాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను రాయలసీమ ద్రోహి అని పిచ్చి ఆరోపణ చేశారు కాని, దానికి సంబంధించిన ఆధారాలు చూపలేదు. నిజానికి పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విస్తరణకు అడ్డుపడిన చంద్రబాబు ద్రోహి అవుతారు కాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతారు? అవుకు రెండో టన్నెల్ను, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ద్రోహి అవుతారు. పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్నా.. చేయని చంద్రబాబు ద్రోహి అవుతారు! కానీ.. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ సూపర్ హిట్ అవడం, ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించినట్లుగా కనిపిస్తే, చంద్రబాబుది రొటీన్గా రొడ్డకొట్టుడు ఫ్లాఫ్ సభగా మిగిలింది. ఒక ఎజెండా లేకుండా, ప్రజలకు ఏమి చేస్తామో చెప్పలేక నిస్సహాయస్థితిలో చంద్రబాబు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారన్న విషయం తేలికగానే అర్ధం అవుతుంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జనసేనకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం స్టార్ట్ చేశారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన సంచలన ప్రకటన ఆయనలో రియలైజేషన్ను తెలియచేస్తుందా? లేక కొత్త డ్రామాకు తెరదీశారా? అన్నది తెలియడానికి మరికొంత సమయం పడుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్లలో తమ అభ్యర్దులను ప్రకటించారని, అందువల్ల తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తామని చెప్పి ఆ నియోజకవర్గాల పేర్లను వెల్లడించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఉపన్యాసం ఇస్తూ టీడీపీ, జనసేన సంబంధాలపై వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు వింటుంటే ఒకరకంగా జనసేనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు పొడవడం ఆరంభం అయిందా అనిపిస్తుంది. దానిని నేరుగా చెప్పలేని పవన్ కల్యాణ్ మరికొన్ని విషయాలు చెబుతూ, యధాప్రకారం డిఫెన్సివ్గా మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తుంది. టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకోవడం రెండు పార్టీల ఇష్టం. తప్పు లేదు. కాని అది ఇరు పక్షాలకు గౌరవ ప్రదంగా ఉండాలని ఆ పార్టీలవారు కోరుకుంటారు. కాని ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ చెప్పిన అంశాలలో కొన్ని సందేహాలు వస్తాయి. ఒకవేళ ఇది ఏమైనా చంద్రబాబు, పవన్లు ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం చేస్తున్నారా? అన్న భావన కలుగుతుంది. ఎందుకంటే పవన్ వెల్లడించిన రెండు అసెంబ్లీ సీట్లు రాజోలు, రాజానగరం లు ఎటూ జనసేనకే ఇచ్చే అవకాశం ఉంది. రాజోలు అయితే గత ఎన్నికలలో జనసేన గెలిచిన ఏకైక సీటు. ఆ సీటు ఇవ్వడానికి టీడీపీ సిద్దం కాకతప్పదు. అలాగే రాజానగరంలో కాపు సామాజికవర్గం అధికంగా ఉండడం, గత ఎన్నికలలో కూడా జనసేనకు గణనీయమైన ఓట్లు రావడం వల్ల ఆ సీటు విషయంలో కూడా టీడీపీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. బహుశా చంద్రబాబుతో జరిపిన చర్చలలో వచ్చిన జాబితాలో ఈ రెండు సీట్లు ఉండవచ్చు. ఇవి కాకుండా జనసేన సీనియర్ నేత కందుల దుర్గేష్ కోరుకుంటున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పోటీస్తుందని చెప్పి ఉంటే, అప్పుడు పవన్ కల్యాణ్ ప్రకటనలో నిజాయితీ ఉందని అనుకోవడానికి అవకాశం ఉండేది. కాని అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉన్నారు. కచ్చితంగా టీడీపీ ఆ సీటును కోరుకుంటుంది. అదే సమయంలో జనసేన కూడా పట్టుబట్టాలని ఆ పార్టీవారు అభిప్రాయపడుతున్నారు. గాజువాక, భీమవరంలలో పవన్ కల్యాణ్ గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయినా, ఆ సీట్లు ప్రకటించకుండా వేరే సీట్లను పవన్ ప్రస్తావించారు. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ సవాల్ విసిరారు. అక్కడ నుంచైనా పోటీచేస్తామని ఆయన చెప్పి ఉంటే కొంత నమ్మకం ఉండేది. జనసేన క్యాడర్ తమ ఆత్మగౌరవాన్ని పవన్ తాకట్టు పెడుతున్నారని తీవ్రమైన విమర్శలు చేస్తున్న నేపద్యంలో వారిని బుజ్జగించడానికి పవన్ రాజోలు, రాజానగరంలలో పోటీచేస్తామని ప్రకటించినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎం అభ్యర్ధిపై గతంలో చేసిన ప్రకటన గురించి ఇప్పుడు ప్రస్తావించారంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. లోకేష్ ప్రకటనతో పవన్ కల్యాణ్ గ్రాఫ్ బాగా పడిపోయింది. పవన్ సీఎం అభ్యర్ధిగా పనికిరాడన్నట్లుగా లోకేష్ మాట్లాడడాన్ని జనసేన క్యాడర్ జీర్ణించుకోలేకపోయారు. పైగా పవన్ దానిని ఖండించకపోగా విశాఖలో జరిగిన యువగళం సభకు ఆయన వెళ్లడం మరింత చిన్నతనం అయింది. జనసేన పరువును పవన్ కల్యాణే తీసేస్తున్నారన్న భావన ఏర్పడింది. అంతేకాక పవన్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయం కూడా టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చ జరగాలని లోకేష్ అనడం మరింత అప్రతిష్టగా మారింది. దీంతో ఇంతవరకు కాపు సామాజిక వర్గంలో కాస్తో, కూస్తో.. ఉన్న నమ్మకం పటాపంచలు అయింది. జనసేనలో చేరాలని సీనియర్ ముద్రగడ పద్మనాభంను ఆ పార్టీ నేతలు కలిసినప్పుడు కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయట. దానిపై వారెవరూ సమాధానం చెప్పలేకపోయారట. యాభై నుంచి డబ్బై సీట్లు అడగాలని తనకు కూడా తెలుసునని అంటూనే, గత ఎన్నికలలో తానే గెలవలేకపోయానని అనడం ద్వారా బేలతనాన్ని ప్రదర్శించినట్లయింది. టీడీపీ వారు జనసేనకు పదిహేను నుంచి ఇరవై సీట్లు ఇస్తే సరిపోతుందని అనుకుంటుంటే, జనసేన అభిమానులు జోగయ్య వంటివారు కనీసం అరవై సీట్లు అయినా తీసుకోవాలని అంటున్నారు. దీంతో పార్టీలో ఏర్పడిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను మభ్యపెట్టడానికి పవన్ కల్యాణ్ ఇలా రెండు రకాలుగా మాట్లాడారా అనిపిస్తుంది. పైగా ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్న కుటుంబం నుంచి పుట్టిన లోకేష్ తన గురించి అడ్డగోలుగా మాట్లాడినా పర్వాలేదన్నట్లు పవన్ సరిపెట్టుకోవడం కూడా ఆశ్చర్యమే అనిపిస్తుంది. స్థూలంగా చూస్తే పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి తేవల్సిన ఈ తరుణంలో దీనిని డ్రామాటిక్గా మార్చి పార్టీ కాడర్లో తానేదో ఎక్కువ సీట్లకు ప్రయత్నిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడానికి పవన్ చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది. అలాకాకుండా నిజంగానే పవన్ కల్యాణ్ కనీసం నలభై నుంచి గరిష్టంగా అరవై సీట్లు పొందగలిగి, ముఖ్యమంత్రి పదవిలో వాటా ఇవ్వడానికి టీడీపీ అంగీకరించినట్లు ప్రకటన ఇప్పించగలిగితే, మిగిలిన వివాదాలు ఎలా ఉన్నా, పవన్పై జనసేనలో కొంతపాటి విశ్వాసం అయినా ఏర్పడుతుంది. అలా కాని పక్షంలో ఈయన కేవలం కొంత డ్రామాకు తెరదీశారన్న సంగతిని జనసైనికులు అర్దం చేసుకోవడం కష్టం కాదు. ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు బాగోదన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు 2009లో టీఆర్ఎస్తో టీడీపీ జత కట్టినప్పుడు టీఆర్ఎస్కు కేటాయించిన కొన్ని సీట్లలో టీడీపీ అభ్యర్దులు పోటీచేయడం, వారికి సైకిల్ గుర్తును చంద్రబాబు కేటాయించడం, ఆ తర్వాత వారిని విత్ డ్రా కండని చెప్పినట్లు నటించడం, అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడం వంటి ఘట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పెద్దపల్లిలో టీడీపీ నేత విజయరమణరావుకు టీడీపీ బీఫారం ఇచ్చారు. అది టీఆర్ఎస్ కు కేటాయించిన సీటు. మక్తల్లో కూడా కొత్తకోట దయాకర్రెడ్డి టీడీపీ గుర్తుపైనే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోటీచేశారు. దీంతో టీఆర్ఎస్ కూడా కొన్నిచోట్ల పోటీచేసింది. 2014లో బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ, కొన్ని సీట్లకు టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి తన వాళ్లను బీజేపీలో చేర్పించి వారికి టిక్కెట్ వచ్చేలా చంద్రబాబు చేశారు. ఆ రకమైన మ్యాచ్ ఫిక్సింగ్లు కూడా జరపడంలో చంద్రబాబు దిట్ట. ఈ నేపధ్యంలో జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఏ రకమైన పరిణామాలతో సాగేది ఇప్పుడే చెప్పడం కష్టం. చంద్రబాబు వ్యూహాలనండి.. కుట్రలనండి..! వాటి ముందు పవన్ తను క్యాడర్ ఆశించిన విధంగా సీట్లు సాధించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే జనసేన క్యాడర్ను టీడీపీకి సరెండర్ చేయడానికి పవన్తో చంద్రబాబు ఏమైనా ఈ డ్రామాకు తెరదీశారా అన్న సందేహం సహజంగానే వస్తుంది. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
సీఎం జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే
ఏపీ ముఖ్యమంంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్లో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్కు ఇచ్చిన ఇంటర్వ్యూను గమనించారా? ఎంత అందంగా సాగింది! అందం అన్న పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే రాజ్ దీప్ ఆంగ్లంలో అడిగిన అన్ని ప్రశ్నలకు అందమైన ఆంగ్ల భాషలో చిరునవ్వుతో జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పడం విని సంతోషం అనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకుడు దేశ, విదేశాలలో తనకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానంతో ఎదుటివారిని మెప్పించడం అంటే తేలికైన విషయం కాదు. అందులోను ప్రముఖ పాత్రికేయులతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా తప్పులు దొర్లకుండా ఉండాలి. వినడానికి కూడా హాయిగా ఉంటుంది. అలా అని తెలుగును విస్మరించాలని ఎవరూ చెప్పడం లేదు. తెలుగు నేర్చుకుంటూనే ఆంగ్లం, హిందీ వంటి భాషలు అభ్యసిస్తే దేశంలోకాని, విదేశాలలోకాని ఎక్కడైనా సులువుగా ఉపాది అవకాశాలు పొందవచ్చు. జీవితం సాఫీగా సాగిపోతుంది. జగన్మోహన్రెడ్డి ఆంగ్ల మీడియంలో చదువుకోబట్టి దాని విలువను గుర్తుంచుకుని ఏపీలోని స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తేవడానికి యత్నిస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చీరాని ఆంగ్లంలో మాట్లాడుతుంటే వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ రాకపోవడం తప్పుకాదు. కాని భాష రాకపోయినా తాను పండితుడినే అనుకుని మాట్లాడితే ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. పైకి ఏమీ అనకపోయినా, ఎదురుగా మాట్లాడకపోయినా, ఆ తర్వాత నవ్వుకుంటారు. దానివల్ల ఆయన నాయకత్వం వహించే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చిన్నతనంగా ఉంటుంది. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటనల సందర్భంగా ఆంగ్ల భాష పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారన్నది అర్ధం అవుతుంది. ఒక విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో సంబంధిత వీడియో వైరల్గా మారింది. బయటనుంచి వచ్చే ప్రముఖులకు తెలుగు రాదు. అందువల్ల వారు ఆంగ్లంలోనే మాట్లాడుతుంటారు. దానిని మనం అర్ధం చేసుకుని సమాధానం ఇవ్వకపోతే సంభాషణ గందరగోళంగా మారుతుంది. అలాగే ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తమకు వచ్చిన భాషలోనే మాట్లాడి అనువదించుకోవాలని చెప్పాలి. జగన్మోహన్రెడ్డికి ఆ ఇబ్బంది లేదు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో రాజ్ దీప్ సర్దేశాయి ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకు ఎక్కడా తడుముకోకుండా స్పష్టమైన జవాబులు ఇచ్చారు. గతంలో చంద్రబాబు ఇదే రాజ్ దీప్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ గుర్తుకు తెచ్చుకోండి. అప్పట్లో ప్రధాని మోదీని ఆయన తీవ్రంగా విమర్శించేవారు. ఆ సందర్భంలో చంద్రబాబు ఏమి చెబుతున్నది అర్ధం చేసుకోవడానికి రాజ్ దీప్ కష్టపడవలసి వచ్చింది. మోడీని ఫలానా విధంగా విమర్శిస్తున్నారా? అని రాజ్ దీప్ మళ్లీ అడిగి తెలుసుకోవలసి వచ్చింది. తిరుపతిలో జగన్మోహన్రెడ్డి చక్కగా మాట్లాడారు. అందుకే ఎడ్యుకేషన్ సమ్మిట్ అంత నీట్గా జరిగింది. అంతేకాక రాజ్ దీప్తో పాటు ఇండియా టుడె ప్రతినిధి బృందం స్వయంగా తిరుపతిలో నాడు-నేడు కింద ఆధునీకరించిన కొన్ని స్కూళ్లను చూసి వచ్చారు. స్కూళ్లు మారిన తీరును గమనించి వారు ఆశ్చర్యపోయారు. స్కూళ్లలో డిజిటల్ తరగతులు, మంచి మౌలిక వసతులు, స్టార్ హోటల్ స్థాయి టాయిలెట్లు, ఆంగ్ల మీడియం, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్కు చిన్నతనం నుంచే ట్రైనింగ్ వంటి విశేషాలు తెలుసుకుని ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు చేయడం ఎక్కడా చూడలేదని స్పష్టంగా చెప్పారు. ఇదే విధానం కొనసాగితే విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ అవుతుందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు స్కూల్ డ్రెస్ల మొదలు, వారు తినే గోరుముద్ద వరకు ఎంత శ్రద్ద తీసుకుంటున్నది వివరించారు. పిల్లలకు చదువే సంపద అని తన ప్రభుత్వం నమ్ముతోందని, అందుకే ఈ విదమైన మార్పులు తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటివారు తెలుగు మీడియంకు మద్దతుగా మాట్లాడుతున్నారు కదా అని రాజ్ దీప్ అడిగినప్పుడు జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మీడియం వద్దనేవారు తమ పిల్లలు, తమ మనుమళ్లు ఎక్కడ ఏ మీడియంలో చదువుతున్నారో ప్రశ్నించుకోవాలని జవాబు ఇచ్చారు. ఏపీలో పుస్తకాలన్నిటిని రెండు భాషలలోను ముద్రించిన సంగతిని ఆయన వివరించారు. నిజంగానే వెంకయ్య నాయుడు కాని, చంద్రబాబు నాయుడు కాని, పవన్ కళ్యాణ్ కాని, రామోజీరావు కాని.. వీరెవ్వరూ తమ పిల్లలను, మనుమళ్లను తెలుగు మీడియంలో చదివించడం లేదు. కాని పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఆంగ్ల మీడియానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. దీనిపై బహుశా దేశంలో ఎక్కడా జరగనంత చర్చ ఏపీలో జరిగింది. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా జగన్మోహన్రెడ్డి వివరించారు. ఇంత మార్పు జరుగుతుంటే సరైన ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతున్నారని రాజ్ దీప్ ప్రశ్నించడం విశేషం. ఇంతకాలం కేరళ రాష్ట్రం విద్యారంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఏపీలో క్రమేపి ఆ స్థానానికి చేరుకుంటోంది. ఈ మద్య తెలంగాణకు చెందిన ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఒక సెమినార్లో మాట్లాడుతూ ఏపీలో స్కూళ్లలో తీసుకువచ్చిన విశేషమైన సంస్కరణలు, ఆంగ్ల మీడియంలో బోధన వంటివాటి గురించి ప్రస్తావించి వీటిని కొనసాగించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన అభినందిస్తూ ఒకవేళ అవి కొనసాగకపోతే ఏపీ వందేళ్లు వెనక్కి పోతుందని హెచ్చరించారు. విద్యార్ధులంతా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పరోక్షంగా చెప్పారు. తాను ఇంతవరకు జగన్మోహన్రెడ్డిను కలవలేదని, కలవబోవడం లేదని, అయినా అక్కడ విద్యారంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను గమనించి ఇలా వ్యాఖ్యానిస్తున్నానని కంచ ఐలయ్య అన్నారు. చంద్రబాబు కొడుకు, కోడలు, మనుమడు అంతా ఇంగ్లీష్లో చదవాలి కాని, దళిత, కమ్మరి, కుమ్మరి, కురుమ, మంగళి తదితర బీసీ వర్గాలు మాత్రం ఆంగ్లమాద్యమంలో చదువుకోరాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంబేద్కర్ తప్పనిసరిగా ఆంగ్ల బోధన ఉండాలని కోరుకున్నారని కూడా ఐలయ్య చెప్పారు. నాలుగున్నరేళ్లుగా జగన్మోహన్రెడ్డి ఏపీలో చేస్తున్న కృషికి ఇప్పుడిప్పుడే గుర్తింపు రావడం ఆరంభం అయింది. గత ఏడాది ఏపీ పిల్లలు అమెరికాకు వెళ్లడం, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడడం వంటివి చేయడంతో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించింది. ఈ నేపధ్యంలో ఈ సమ్మిట్ జరగడం, ఏపీలో విద్యారంగంలో సాగుతున్న సమూల మార్పులకు మంచి ప్రాధాన్యం రావడం శుభపరిణామం అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
అయ్.. పాయె! ఎన్నికలకు ముందే బాబు ఓటమి! సాక్ష్యం ఇదే..
'2024 ఎన్నికల నోటిఫికేషనింకా రాకముందే చంద్రబాబు ఓటమి ఖరారైపోయింది!! అదెలా? ఎవరన్నారు? ఎవరో అనడం కాదు. చంద్రబాబు చేతికింది రెండు న్యూస్ పేపర్లు రాసింది అదే. బాబు పనైపోయిందని! ‘‘ఏడాదిలో 30 లక్షల ఓట్లు తొలగించేశారు’’ – అని ‘ఛీనాడు’ రాసింది. ‘‘జడ్జికి వజ్రాలు పొదిగిన బంగారు వాచ్’’ – అని బాధాకృష్ణ రాశాడు. వీటికి చంద్రబాబుకు సంబంధమేంటీ? మరి చంద్రబాబు ఓటమి ఖాయం అవడం ఏమిటి? సమాధానం సింపుల్.' చంద్రబాబు ఓటమి ఖాయం అని డిసైడ్ చేసుకున్నప్పుడే ‘ఛీమోజీ’ గానీ, ‘బాధాకృష్ణ’గాని ఇలాంటి కుళ్లు, కక్కుళ్ల వార్తలు మొదలుపెడతారు. 2019 ఎన్నికలకు ముందు కూడా వీళ్లద్దరు చేసింది ఇదే. ఆనాడు ఛీమోజీ తప్పుడు వార్తలు రాస్తే, బాధాకృష్ణ చిల్లర వార్తలు రాశాడు. చంద్రబాబును లేపడానికి వీళ్లు ఎన్ని కట్టెలు పెట్టి, ఎన్ని కట్టుకథలు అల్లినా చివరికి జనం జగన్మోహన్రెడ్డికే పట్టం కట్టటం, చంద్రబాబు పార్టీకి పటం కట్టి పూలదండ వేయటం ఈ కళ్లతోనే చూశాం కదా. ఏపీ సీఎంగా జగన్మోహన్రెడ్డి 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి, ఇప్పటి వరకు.. గత ఐదేళ్లుగా జగన్మోహన్రెడ్డిపై తప్పుడు రాతలు, చిల్లర కథనాలు కక్కుతున్న ఛీమోజీ, బాధాకృష్ణ.. ఇప్పుడు మరింతగా దిగజారి దగుల్బాజీ రాతలు రాయడం ప్రారంభించారంటే.. చంద్రబాబును ఎంత లేపి ప్రయోజనం లేదని వాళ్లకు లేటెస్టుగా ఉప్పో, టిప్పో అందిందని అర్థం. అయినా ‘దింపుడుకల్లం’ ఆశ ఎక్కడికిపోతుంది. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చంద్రబాబుకు వెంటిలేటర్ పై ఊపిరి ఎక్కించే వృధా ప్రయత్నాలు ప్రారంభించారు ఛీమోజీ, బాధాకృష్ణ. ‘బాధాకృష్ణ’వి చెల్లని చిల్లర కథనాలు. వాటిని పట్టించుకునే పని లేదు. ‘ఛీమోజీ’ కల్పనలు చిరిగిపోయిన కాగితాలు. అవీ చెలామణి అయ్యేవి కావు. కానీ ఆ చిరుగులకు సెలో టేప్ అంటించి ప్రజల్లోకి తోసేశాలని ఛీమోజీ చూస్తున్నారు కాబట్టి.. ఆయన ఇవాళ రాసిన 'ఓట్ల తొలగింపు’ ఏడుపుగొట్టు వ్యథపై మనం మాట్లాడుకోవలసిందే. చంద్రబాబు ‘బోగస్’ బతుకు ఏంటో కూడా తెలుసుకోవలసిందే. చంద్రబాబు పెద్ద బ్లఫ్ మాస్టర్. తను ఓడిపోతున్నాని తెలిస్తే, లేదా తను గెలవలేనని తెలిస్తే ఎన్నికలకు ముందు నకిలీ ఓట్లతో తన బలం పెంచేసుకుంటారు. అందులో ఆయన ఎక్స్పర్ట్. అందుకు సాక్ష్యాధారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత ఫైళ్లలో దొరుకుతాయి. ఓటమి ఖాయం అని ఇప్పుడు తేలిపోయినట్లే.. (కొత్త మలుపు తిరిగిన ఛీమోజీ, బాధాకృష్ణల దిగజారుడు కథనాలను బట్టి), 2004 ఎన్నికలకు ముందూ.. చంద్రబాబు ఓడిపోయేది ఖాయం అని సర్వేలు తేల్చేశాయి. వెంటనే చంద్రబాబు ‘ఓట్ల జోడింపు’ వ్యూహం మొదలైంది. అంటే బోగస్ ఓటర్లను చేర్చడం! ఆ చేర్పులపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రదర్శనలు జరిపాయి. ‘‘బాబు ప్రకటించిన ప్రోగ్రెస్ రిపోర్టులే కాదు, ఆయన హయాంలో స్టాంపులు, మెడికల్ కాలేజీలు, ఆఖరికి ఓట్ల జాబితాలు కూడా నకిలీవే.. ’’ అని ప్రతిపక్షనేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్న తెలుగుదేశం పార్టీ, గద్దె మీద కొనసాగడానికి ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉంది..’’ అని నాటి టీఆర్ఎస్ నేత కేసీఆర్.. బోగస్ ఓట్లపై చంద్రబాబును తూర్పారా పట్టారు. ‘‘ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గాడి తప్పించింది. ఎన్నికలు జరపడానికి ముందే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది..’’ అని బోగస్ ఓట్ల పై నాటి రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుపై వాళ్ల విమర్శలను కానీ, ఎద్దేవాలను కానీ, హెచ్చరికలను ఛీనాడు లోపలి పేజీలలో నామ మాత్రంగా తప్ప ప్రముఖంగా ఎక్కడా ప్రచురించలేదు. ఎందుకంటే ‘తమవాడు’ మళ్లీ సీఎం అవడం కావాలి ఛీమోజీరావుకు. ప్రతిపక్షాలన్నీ కలసికట్టుగా ఆరోపణ చేస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు మీద డౌట్ వచ్చి, రాష్టంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరపటంతో చంద్రబాబు దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది! ఓటు నమోదు కోసం ఎన్నికల కమిషన్కు అందిన 53,95,550 ల దరఖాస్తులలో 19,40,387 దరఖాస్తులు నకిలీవని తెలిసి, తెల్లబోయి, కమిషన్ వాటిని తొలగించింది. అంతేకాదు, పాత జాబితాలోని 1.21 కోట్ల ఓటర్ల నుంచి 55,32,713 మంది ఓటర్ల పేర్లను తొలగించింది. పాత, కొత్త బోగస్ ఓటర్ల సంఖ్య 74.13 లక్షలకు చేరుకున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించి తొలగించింది! అప్పుడు తొలగించినట్లే కమిషన్ ఇప్పుడూ తొలగించింది. అందుకే ఛీనాడు పెడబొబ్బలు. బాధాకృష్ణ ‘వజ్రాల వాచీ’ అంటూ బూడిద రాతలు. 2003లో చంద్రబాబు చేసిన బోగస్ ఓట్ల స్కామ్ చిన్న సంగతి కాదు. అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఆ లెవల్లో బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్షాళనను చేపట్టాల్సి వచ్చింది. కమిషన్కు ఎంతో శ్రమ, ఖర్చు అయ్యాక 2004 జనవరి మూడో వారానికి జిల్లా కలెక్టర్లు పూర్తిగా బోగస్ ఓట్లను తొలగించగలిగారు. బోగస్ ఓటర్లకు కారణమైన ఐదుగురు మండల రెవెన్యూ అధికారుల మీద చర్యలకు కమిషన్ సిఫారసు చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలేమీ లేవని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట బుకాయించినప్పటికీ కమిషన్ దర్యాప్తులో బోగస్ ఓట్ల సంఖ్య 75 లక్షలకు పైగా ఉన్నట్లు తేలడంతో ఆయనేమీ మాట్లాడలేకపోయారు. ఆయనే కాదు.. ‘ఛీమోజీ’ కూడా కుక్కిన పేనులా ఉండిపోయారు. ఇప్పుడేమో.. 30 లక్షల ఓట్లు తొలగించారని గుండెలు బాదుకుంటూ తీరూతెన్నూ లేని ఆంబోతు కథనాలు అచ్చోసి వదులుతున్నారు. ఇంతకీ ఛీమోజీ ఏమిటంటాడూ.. తటస్థులు, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు తప్పుడు వివరాలతో వై.ఎస్.ఆర్.సీపీ ఫామ్–7 దరఖాస్తు చేసిందట! కమిషన్ అంత గుడ్డిగా తొలగిస్తుందా? ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో పాటుగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆడిపోసుకోడానికి ఛీమోజీ అండ్ చంద్రబాబు తయారైనట్లే ఉంది. వారికి వంతగా బాధాకృష్ణ!! (అన్నట్లూ.. ‘అపద్ధర్మ ముఖ్యమంత్రి’ అనే మాట బాబుగారికి నచ్చదు. ఆ మాటను తీసేయించడానికి రాజ్యాంగాన్నే మార్పించే ఆలోచన కూడా 2003లో చేశారు!! ఇవి చదవండి: అజ్ఞాతవాసిగా నారా లోకేష్? -
కృష్ణదేవరాయలు తొందరపడ్డారా?
రాజకీయాలలో తొందరపాటు ఉండకూడదు. ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితాలు ఎక్కువ సందర్భాలలో అనుకూలంగా ఉంటాయి. నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడం తొందరపాటు చర్య అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నాయకత్వంతో కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కానీ ఆయనకు విబేధాలు ఏమీ లేవు. ఆయనకు పార్టీలో తగు గౌరవం లభించింది. ఎమ్మెల్యేల నుంచి సహకారం పొందగలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కాకపోతే ఈసారి గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే బాగుంటుందని కృష్ణదేవరాయలకు పార్టీ అధిష్టానం సూచించింది. దానికి కారణం ఈయన అభ్యర్ధిత్వం అక్కడ ఉపయోగపడుతుందనే కదా! కానీ రాయలకు ఇష్టం లేదు. నరసరావుపేట నుంచే పోటీచేస్తానని ఆయన పట్టుబడుతున్నారు. అంతవరకు తప్పు లేదు. దీనిపై ఒకటికి రెండు సార్లు పార్టీ నాయకత్వంతో చర్చించవచ్చు. సీఎం జగన్ను కలిసి తన వాదన వినిపించవచ్చు. అలా కాకుండా కృష్ణదేవరాయలు రాజీనామా ప్రకటన చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటో తెలియవలసి ఉంది. కానీ, ఇందుకు ఆయన చెప్పిన కారణాలు అంత సమర్ధనీయంగా లేవు. నరసరావుపేటలో బీసీ అభ్యర్ధిని పోటీలో దించాలని వైఎస్సార్సీపీ అధిష్టానం భావిస్తోందని, దాంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడిందని ఆయన అంటున్నారు. క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏర్పడిందని ఆయన చెప్పారు. అంటే కార్యకర్తలలో ఒక గందరగోళ పరిస్థితి ఉందని ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ, దానికే రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఆయన గందరగోళంలో ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. పార్టీ నాయకత్వంపైన, ముఖ్యమంత్రిపైన, ప్రభుత్వంపైన ఎలాంటి విమర్శలు చేయకపోవడం కొంతలో కొంత బెటర్. నిజానికి పార్టీకి కట్టుబడి ఉండటం అన్నది ఒక విధానం. విద్యాధికుడై, పలు విద్యా సంస్ధలను నిర్వహించే కృష్ణదేవరాయలు అందుకు భిన్నంగా కేవలం ఒక పదవిని ఆశించి ఇలా వ్యవహరించడం ఆయనకు అంత ప్రతిష్టకాదని చెప్పక తప్పదు. ఆయన తండ్రి లావు రత్తయ్య 1996లో ఎన్.టీ.ఆర్.టీడీపీ తరపున బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలలో రానించలేకపోయారు. విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా మంచిపేరు తెచ్చుకున్నా, రాజకీయాలలో ఆయనకు ఉన్న ఆసక్తిని నెరవేర్చుకోలేకపోయారు. కానీ, వైఎస్సార్సీపీను స్థాపించిన సీఎం జగన్.. ఆయన కుమారుడు కృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చి నరసరావుపేట నుంచి పోటీకిగాను టిక్కెట్ ఇచ్చారు. విజయం సాధించి ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. అంతవరకు ఓకే. కానీ, ఇప్పుడు సడన్గా పదవికి, పార్టీకి రాజీనామా చేయడం మాత్రం తొందరపాటే అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళతారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. అయినా రాయలు వంటి విద్యాధికులు అలా చేస్తారా అని అనుకునేవారు. ఒక వేళ ఆయన నిజంగానే అలా టీడీపీలోకి వెళితే రాజకీయాలలో విలువలు పాటించని వ్యక్తులలో ఈయన కూడా ఒకరు అవుతారు. విశేషం ఏమిటంటే వైఎస్సార్సీపీ నుంచి అయితే నరసరావుపేట టిక్కెట్ కావాలట. టీడీపీ అయితే గుంటూరు నుంచి పోటీకి దిగుతారట. ఇది వాస్తవమో, కాదో తెలియదు. కానీ, ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారేమోనన్న అనుమానం వస్తుంది. కృష్ణదేవరాయలు ఇలా ఓపెన్ అయిపోవడంతో బహుశా రాజీ చర్చలు కూడా ఏమీ ముందుకు వెళ్లకపోవచ్చు. నరసరావుపేట సీటును వైఎస్సార్సీపీ ఒక బీసీ అభ్యర్ధికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో ఎంపీ బాలశౌరిది మరో కధ. ఈయనకు పార్టీలో ఎనలేని గుర్తింపు ఉండేది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఒకసారి తెనాలి నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఆధ్వర్యంలో మరోసారి మచిలీపట్నం నుంచి ఎంపీ అయ్యారు. అయినా ఆ విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. మచిలీపట్నంలో కొత్త అభ్యర్దికి అవకాశం ఇస్తారన్న భావన ఆయనలో ఏర్పడి ఉండవచ్చు. దాంతో ఆయనకు అసంతృప్తి ఏర్పడినట్లు ఉంది. సామాజికవర్గం రీత్యా జనసేనకు వెళితే బెటర్ అని ఆయన అనుకున్నారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ను కలిశారు. ఇప్పుడు టీడీపీ పొత్తులో ఆయనకు జనసేట టిక్కెట్ వస్తుందో, లేదో ఎవరూ చెప్పలేరు. అయినా ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయం గమనిస్తే పాలిటిక్స్లో విధేయతకు తక్కువ అవకాశం ఉంటుందని రుజువు చేసినట్లయింది. పార్టీలో కొంతమందితో విబేధాలు ఉంటే ఉండవచ్చు. అయినా పార్టీ నాయకత్వంతో సంబంధాలు బాగానే ఉన్నప్పుడు ఇలా నాయకులు నిర్ణయాలు తీసుకుంటే వారికే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. బాలశౌరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్సీపీలోకి రాలేదా అన్న ప్రశ్న రావచ్చు. టీడీపీలో నాని అవమానాలకు గురవడం వల్ల పార్టీ మారక తప్పలేదు. సొంత తమ్ముడితోనే నానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకత్వం కుంపటి పెట్టించింది. తిరువూరులో జరిగిన పార్టీ సభ ఏర్పాట్లకు రావద్దని ఎంపీగా ఉన్న నానికి చెప్పడం అంటే ఒకరకంగా అవమానించడమే. ఆ నేపథ్యంలో ఆయన వైఎస్సార్సీపీలోకి వచ్చి విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక, లావు కృష్ణదేవరాయలకు కానీ, బాలశౌరికి కానీ పార్టీలో అలాంటి అవమానాలేమీ లేవు. పైగా వారికి మంచి గౌరవమే లభించింది. అయినా టిక్కెట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడడంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అందువల్లే రాజకీయాలలో వీరు విలువలు పాటించలేదన్న అభిప్రాయానికి తావిచ్చారు. ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ వీటిని ఏమీ పట్టించుకోకుండా, కేవలం జనాన్ని నమ్ముకుని రాజకీయాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్దులు ఎవరన్నదానికి కొంతమేరకే ప్రాముఖ్యత ఉంటుందనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారనిపిస్తుంది. కాబట్టి సీఎం జగన్కు ఎవరూ ఎదురు చెప్పలేకపోతున్నారనిపిస్తుంది. ఒకవైపు తెలుగుదేశం, జనసేనల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు టిక్కెట్ల కేటాయింపు ఎలా చేయాలో తెలియక సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పద్దతి ప్రకారం అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకత అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
AP: పొలిటికల్ ట్రాప్లో షర్మిల
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంతో కాంగ్రెస్ పార్టీకి దశ తిరుగుతుందా? కేవలం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న ద్వేషంతో షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ ఈ పదవికి ఎంపిక చేసుకుందా? ఈ మొత్తం వ్యవహారం కుట్రపూరితంగా ఉందా? ఈ కుట్రలో ఎవరెవరి భాగస్వామ్యం ఉండవచ్చు? ఈ అంశాలపై ఏపీ రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లో కొంతమంది కాకలుతీరిన నేతలు లేకపోలేదు. కానీ, అట్టడుకు పడిపోయిన కాంగ్రెస్ను లేపడం ఎవరివల్ల సాధ్యం కాదని అర్ధం చేసుకున్న వారు తెలివిగా ఎవరికివారు పార్టీ కాడిని కింద పారేశారు. కానీ.. ఎవరో ఒక బకరా కావాలి కదా అని వెతికి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు నమ్మకస్తుడుగా ఉండే ఒక చోట నేత గిడుగు రుద్రరాజును పీసీసీ అధ్యక్షుడిని చేశారు. బహుశా గిడుగు నియామకం నాటికే షర్మిలను ఏపీకి తీసుకురావాలన్న కుట్ర సాగి ఉండాలి. కాకపోతే అప్పటికే ఆమె తెలంగాణలో రాజకీయం చేస్తానంటూ తిరుగుతుండడంతో వెయిట్ చేశారని అనుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పట్లోనే షర్మిల ఏపీ రాజకీయాలకు వెళ్లాలని అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ మీదట ఆమె రేవంత్పై మండిపడ్డారు కూడా. తదుపరి పరిణామాలలో ఆమె చివరికి తెలంగాణలో పోటీచేయలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నారు. ఈ లోగా ఆమె తన భర్తతో పాటు తెలుగుదేశం ఏజెంట్ గా భావించే ఒక మీడియా యజమాని వేసిన రాజకీయ ట్రాప్లో పడ్డారు. వారు క్రమేపి మైండ్ గేమ్ ఆడి కాంగ్రెస్లో చేర్పించి, మెల్లగా ఏపీకి రప్పించినట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు షర్మిలపైన, ఆమె భర్త అనిల్ పైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి విమర్శలు చేశారో గుర్తు చేసుకోండి. ఈనాడు రామోజీరావు , ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఎంత నీచమైన వార్తలు రాశారో జ్ఞప్తికి తెచ్చుకోండి. తెలంగాణలోని బయ్యారం ప్రాంతంలోని ఐరన్ గనులను అనిల్ దోచుకుంటున్నాడని ప్రచారం చేసేవారు. ఆయన మత బోధనలను ఎద్దేవా చేస్తూ పలు కథనాలు ఇచ్చేవారు. కానీ, షర్మిల రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఈ మీడియావారు ఆమెపై అభిమానం కురిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితే చాలా సానుభూతి వర్షం కురిపిస్తున్నట్లు మాట్లాడుతూ జగన్పై విమర్శలు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ నేత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో షర్మిల పలుమార్లు మంతనాలు జరిపారు. తెలంగాణ రాజకీయాలలో ఉంటానని, ఏపీకి వెళ్లనని, అన్న సీఎం జగన్పై విమర్శలు చేయనని ఆయా సందర్భాలలో చెప్పినప్పటికీ, ఈ కుట్రదారులంతా కలిసి ఆమె మనసు మార్చినట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె అమాయకత్వాన్ని వీరు తమ రాజకీయ అవసరాలకు వాడుకున్నట్లు అనిపిస్తుంది. భర్త అనిల్ ఈ మంత్రాంగంలో ప్రధాన పావుగా మారారని అంటారు. సీఎం జగన్తో ఏ కారణంతో విభేదాలు ఏర్పడినప్పటికీ, ఏపీ రాజకీయాలలో ప్రవేశించడం మాత్రం ఆమెకు అంతగా శోభనివ్వదు. ఆమె కుట్రదారులతో కుమ్మక్కయ్యారన్న భావన ప్రజలలో ఏర్పడుతుంది. ఒక వ్యక్తిగా రాజకీయాల్లోకి రాకూడదా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాలలోకి రావచ్చు. తప్పు లేదు. కానీ, ఒక విధానం, ఒక ఎజెండా లేకుండా రాజకీయాలు చేస్తే తెలంగాణలో విఫలం అయినట్లే అవుతుంది. అందులోనూ తన అన్నపై అసంతృప్తితో ప్రత్యర్ధులైన కాంగ్రెస్ , తెలుగుదేశంలతో ఆమె కలవడం రాజకీయంగా అంత తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. మరో మూడునెలల్లో ఎన్నికలు జరగబోతున్నందున ఈ కీలక సమయంలో సీఎం జగన్ రాజకీయ అవకాశాలను దెబ్బకొట్టాలన్నది ప్రత్యర్ధి పార్టీల వ్యూహం. అందులో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసే కుట్రపన్నుతాయన్నది బహిరంగ రహస్యం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ తెలుగుదేశం పార్టీని కానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కానీ ఒక్క మాట అనడం లేదు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ, అదే సమయంలో చంద్రబాబు జోలికి వెళ్లడం లేదంటే కారణం ఊహించుకోవచ్చు. చంద్రబాబు, డీకే శివకుమార్ల మంతనాల ఆంతర్యం అర్ధం చేసుకోవచ్చు. గతంలో సోనియాగాందీని తీవ్రంగా దూషించిన చంద్రబాబు, ప్రస్తుతం కాంగ్రెస్ నేతలను ఒక్క మాట అనడం లేదు. సరే! ఒకప్పుడు బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని తిట్టిన తెలుగుదేశం పెద్దలు, వారిని కూడా ఏమనడం లేదు. పైగా వారి ప్రాపకం కోసం పాట్లు పడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ప్రకటించి, అక్కడకాకుండా సంసారం మాత్రం తెలుగుదేశంతో చేస్తూ విచిత్రమైన రాజకీయం నడుపుతున్నారు. బీజేపీ నేతలు పురందేశ్వరి, ఇతరులు కూడా పవన్ను తప్పుపట్టడం లేదు. పవన్ కానీ, ఏపీ బీజేపీ నేతలు కానీ కాంగ్రెస్ విధానాలపై విమర్శలు చేయడం లేదు. ఇక వామపక్షాలు సరేసరి. ప్రత్యేకించి సీపీఐ నారాయణ, రామకృష్ణలు అయితే చంద్రబాబు సొంత మనుషులుగా మారారన్న అభిప్రాయం ఉంది. ఏతావాతా చూస్తే సీఎం జగన్కు వ్యతిరేకంగా ఈ పార్టీలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక్కటైనట్లు అనిపిస్తుంది. జగన్ మాత్రం ఎప్పటిమాదిరే ఒంటరిపోరుకు సిద్దం అవుతున్నారు. తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రుద్రరాజును తప్పించి షర్మిలను రంగంలోకి తీసుకు వచ్చారు. తద్వారా ఒక విషయాన్ని తెలియచేసినట్లయింది. కాంగ్రెస్ను తామే నడుపుతున్నామని చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కానీ, ఇతరత్రా కేంద్ర మంత్రులు చేసిన పల్లంరాజు, చింతా మోహన్ తదితరులు ఎవరూ ఏపీ కాంగ్రెస్ను నడపలేరని, వారిలో అంత సమర్ధత లేదన్న అభిప్రాయానికి వచ్చారని అనుకోవాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి అయితేనే జనంలో కొంత ఆదరణ వస్తుందని భావించాలి. దీనికన్నా ఏపీలో కాంగ్రెస్ క్షీణించి పోవడానికి సీఎం జగనే కారణమన్న కోపంతో ఆమెను రంగంలో దించారని అనుకోవచ్చు. నిజానికి కాంగ్రెస్ ఇలా తయారు కావడానికి స్వయంకృతాపరాధమని చెప్పాలి. రాష్ట్ర విభజనను సజావుగా చేయలేకపోవడం, ఆంధ్రులకు అన్యాయం చేసిందన్న అభిప్రాయం ప్రజలలో ఉండడం వల్ల కాంగ్రెస్ జీరో స్థాయికి పడిపోయింది. ఈ నేపధ్యంలో షర్మిల వచ్చి కాంగ్రెస్ను ఉద్దరించగలుగుతారా అంటే అది ప్రస్తుతానికి భ్రమే అనుకోవాలి. ఆమె తెలంగాణ రాజకీయాలలో ఏమైనా రాణించి ఉంటే అప్పుడు కాంగ్రెస్లో చేరి ఏపీ రాజకీయాలలోకి వచ్చి ఉంటే కొంత ప్రభావం ఉండేది. అలాంటిది ఆమె స్వయంగా బతిమిలాడి కాంగ్రెస్లో చేరే పరిస్థితి రావడం ఆమెకు అప్రతిష్టే అని చెప్పాలి. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పై ఆమె కొరడా ఝళిపించేది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చార్జిషీట్లో చేర్చడాన్ని తీవ్రంగా ఆక్షేపించేవారు. ఒక సందర్భంలో అయితే కాంగ్రెస్పై ఉమ్ము వేయాలని కూడా అన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పన్నిన వ్యూహంలో ఆమె చిక్కుకుపోయి ఏపీ రాజకీయాలలోకి ప్రవేశించారు. ఒకరకంగా చూస్తే కేంద్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసి కాకలు తీరిన నేతలు పలువురు ఉన్నప్పటికీ, వారెవ్వరికి కాకుండా షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం ఆమెకు సంతోషం కలిగించవచ్చు. అది కేవలం తాత్కాలికమే అన్న సంగతి అర్ధం కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఆమె ద్వారా పార్టీ కోసం డబ్బు ఖర్చు చేయించి తదుపరి ఆమెకు మొండి చేయి చూపినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈలోగానే ఆమె ఏదైనా రాజ్యసభ సంపాదించుకోగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. ఇక ఏపీ రాజకీయాలలో ఆమె ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిపై కూడా ఆలోచించుకోవాలి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలను కూడా విమర్శిస్తే కొంత విలువ ఉంటుంది. అలాకాకుండా కేవలం వైసీపీపైనే విమర్శలు సాగిస్తే మాత్రం జనానికి మొత్తం కుట్ర వ్యూహం అంతా అర్ధం అయిపోతుంది. తన అన్న, ముఖ్యమంత్రి అయిన జగన్పై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేసినా ఆమెకే నష్టం కలగవచ్చు. కేవలం ఆ పాయింట్లో ఉపయోగపడతారన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ పెద్దలు ఆమెను ఏపీ రాజకీయాలకు తీసుకు వచ్చారు. ఇంతా చేసినా సీఎం జగన్ అధికారంలోకి తిరిగి వస్తే అప్పుడు ఇదే పెద్దలు ఆమె రాజకీయాన్ని చులకన చేసి చేతులు దులుపుకుంటారని చెప్పాలి. తన కుటుంబ వ్యవహారాలను, తన రాజకీయ వ్యవహారాలను వేరు చేసుకుని పీసీసీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తే విలువ ఉంటుంది. అందుకు భిన్నంగా సీఎం జగన్నే వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటే మాత్రం ఆమెకే నష్టం అని చెప్పకతప్పదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
అబద్ధాలు వండబడును c/o రామోజీ
కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు, దివంగత కాపు నేత వంగవీటి రంగాపై ఈనాడు రామోజీరావుకు ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. అలాగే కాపులపై ఎక్కడలేని ఆప్యాయతను కురిపిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఆడుతున్న కపట ప్రేమే అన్న సంగతి తెలిసిపోతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం కాపులపై వైఎస్సార్సీపీ వల అంటూ ఒక తప్పుడు వార్తను సృష్టించడంలో ఈనాడు మీడియా దురుద్దేశం కనిపెట్టలేరా! గతసారి వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి కాపులను ఆ పార్టీకి ఎంతో కొంత దూరం చేయడమే ఈనాడు మీడియా లక్ష్యం. ఆ ఒక్క వర్గాన్నే కాదు.. వైఎస్సార్సీపీకి బాగా మద్దతు ఇచ్చే ప్రతి వర్గంలోను ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడానికి నానా పాట్లు పడుతున్న రామోజీరావు తన పత్రికను టీడీపీ కరపత్రంగా హీనంగా మార్చివేశారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు ఏవో వేసుకుంటాయి. వాటిని కధనాలుగా ఇవ్వడం తప్పుకాదు.కాని లేని వాటిని కల్పించి, అసత్యాలను అలవోకగా వండేసి పాఠకులపై రుద్దాలనుకోవడమే నీచం. రామోజీకి ఈ వయసులో ఇంత అప్రతిష్టపాలు అవడం వల్ల వచ్చే లాభం ఏమిటో తెలియదు. కాని ఏదో అపరిమతమైన లబ్ది కోసమే ఆయన ఇంతగా దిగజారారానిపిస్తుంది. ఆ వార్తలో ఏమి రాశారో చూడండి.. కాపులకు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇచ్చేశారట. దానిని జగన్ అమలు చేయడం లేదట. ఏమన్నా బుద్ది జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఇంత పచ్చి అబద్దాన్ని రాయగలుగుతారా! పార్టీ కార్యకర్తలకన్నా హీనంగా జర్నలిస్టులను ఇలా తయారు చేస్తారా? కాపు రిజర్వేషన్లపై 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసేస్తానని కాపులను నమ్మబలికారు. దానిని నమ్మి ఆ వర్గం వారు టీడీపీకి ఓట్లు వేశారు. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సాక్ష్యం. ఆయన కూడా కాపు కావడంంతో చంద్రబాబు హామీ అమలు అవుతుందిలే అని అమాయక కాపులు నమ్మారు. ఆ తర్వాత ఏమి జరిగింది! చంద్రబాబు కేంద్రానికి ఒక తీర్మానం పంపి వదలివేశారు. దాంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులు ఉద్యమించారు. అప్పుడు చంద్రబాబు కొత్త డ్రామా ఆడారు. కాపులను బీసీలలో కలిపే విషయంలో విచారణ చేసి సిఫారస్ చేయడం కోసం జస్టిస్ మంజూనాధ కమిషన్ను నియమించారు. కొందరు సభ్యులను కూడా ఇందులో వేశారు. ఆ కమిషన్ ఆయా ప్రాంతాలలో తిరిగి వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది. కాపులను బీసీలుగా గుర్తించడానికి బీసీ వర్గాల వారు అంగీకరించలేదు. అలా ఆ రెండు వర్గాల మధ్య అదొక వివాదంగా మారింది. ఈ కమిషన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని సిఫారస్ చేస్తుందని సందేహించిన చంద్రబాబు నాయుడు కమిషన్లోని సదరు సభ్యులను మేనేజ్ చేసి చైర్మన్ తో సంబందం లేకుండా ఒక నివేదిక తెప్పించుకుని కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలవారికి పది శాతం రిజర్వేషన్ లు ఇచ్చింది. దానికి తనదైన భాష్యం చెప్పి చంద్రబాబు నాయుడు ఆ పదిశాతంలో ఐదు శాతం కాపులకు ఇస్తామని ప్రకటించారు. నిజానికి అది చెల్లదు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో కనుక ఐదు శాతం ప్రత్యేకించి కాపులకు రిజర్వేషన్లు పెట్టి, మిగిలిన ఐదు శాతం ఇతర అగ్రకుల పేదలకు అని చెప్పి ఉంటే అప్పుడు సాధ్యమయ్యేది. ఇది దేశవ్యాప్త అంశం కనుకక కేంద్రం అలా చేయలేదు. అయినా కాపులను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు చెల్లని చట్టాన్ని తీసుకు వచ్చారు. కోర్టులలో అది నిలబడని పరిస్థితి. దీనిని ఈనాడు రామోజీరావు వక్రీకరించి చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు, దానిని జగన్ అమలు చేయనట్లు దుర్మార్గపు రాతలు రాశారు. కేవలం తెలుగుదేశం పార్టీకి జాకీలు వేసి లేపడం కోసమే ఈ అబద్దాలు వండుతున్నారన్నది స్పష్టం అవుతుంది. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తుని వద్ద కాపుల భారీ సభ జరిగింది.సభ పూర్తి అయ్యాక కొంతమంది ఆవేశపరులు రిజర్వేషన్ల డిమాండ్తో రైల్వే లైన్ పైకి వెళ్ళారు. ఆ టైమ్లో ఎవరో రైలు భోగీలకు నిప్పు పెట్టారు. అది పెద్ద సంచలనం అయింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ మంటలను ఆర్పడానికి కాకుండా, దానిని ఒక అవకాశంగా మార్చుకుని ప్రతిపక్షనేత జగన్ పైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పైన బురద చల్లే యత్నం చేశారు. పైగా రాయలసీమ నుంచి, కడప నుంచి వచ్చిన రౌడీలు ఈ పని చేశారని ఆరోపించారు. తీరా కేసు విచారణలో పోలీసులు కాపు నేతలు పలువురిని అరస్టు చేశారు. ముద్రగడను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికివెళ్లినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను ఎంత నీచంగా దూషించింది ఆయనే స్వయంగా కన్నీళ్లుపెట్టుకుని చెప్పారు. ఇంకోసారి ముద్రగడ పాదయాత్ర చేపడితే ఇంటి నుంచి బయటకు రాకుండా వందలాది మంది పోలీసులను కిర్లంపూడి వద్ద మోహరింప చేసి కదలనివ్వలేదు. అదంతా ప్రజాస్వామ్యంగా ఈనాడు రామోజీకి కనిపించింది. గత ఎన్నికల సమయంలో జగ్గంపేట ప్రాంతంలో జగన్ పర్యటిస్తున్నప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. అది తమ పరిధిలో లేని అంశమని, కేంద్రం ప్రభుత్వం చేతిలో ఉంటుందని విస్పష్టంగా తెలిపారు. తాను మాత్రం కాపులకు ఐదువేల కోట్లు కేటాయించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దానికి చాలామంది సంతృప్తి చెందారు.ఫలితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు తప్ప అన్నిటిని వైఎస్సార్సీపీ గెలుచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ కనీసం ముద్రగడకు సానుభూతి కూడా చెప్పలేదు. కాపులకు రిజర్వేషన్లు ఏమిటి? తాను కులాలకు అతీతుడని చెబుతూ చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా మాట్లాడేవారు. కాని అదే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల సమయంలో కాపులకు కుల భావన లేకపోతే ఎలా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. జగన్ కాపులకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదని అజ్ఞానంగానో, లేక మోసపూరితంగానో ప్రశ్నిస్తున్నారు. గతంలో ముద్రగడ పట్ల చంద్రబాబు ప్రభుత్వ అనుచితంగా వ్యవహరించినప్పుడు పవన్ సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి సంఘీభావం తెలపడానికి గాను రాజమండ్రి వెళితే విమనాశ్రయంలోనే పోలీసులు నిలిపివేశారు. అయినా అప్పుడు కూడా చంద్రబాబుకే పవన్ మద్దతు ఇచ్చారు. ఇక వంగవీటి రాధా విషయానికి వద్దాం. ఆయనకు గత ఎన్నికల సమయంలో సీటు ఇవ్వలేదంటూ ఈనాడు తప్పుడు ప్రచారం చేసింది. నిజానికి రాధాను పార్టీ వదలవద్దని, బందరు ఎమ్.పి సీటు ఇస్తామని చెప్పినా వినకుండా ఆయన టీడీపీలో చేరారు. ఒకప్పుడు తన తండ్రిని చంద్రబాబే చంపించారని చెప్పిన రాధా టీడీపీలో చేరడాన్ని రంగా అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.. పోనీ అక్కడ ఏమైనా సీటు ఇచ్చారా? ఎమ్మెల్సీ పదవి ఏమైనా ఇచ్చారా? అదీ లేదు. కాని రాధామీద రామోజీరావు ప్రేమ ఒలకపోస్తున్నట్లు నటిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేయాలి. నాలుగు దశాబ్దాల కిందట రామోజీరావు ప్రతిఘటన అనే సినిమా తీశారు. అందులో రాధా తండ్రి, దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను పరోక్షంగా విలన్ గా చిత్రీకరించింది వాస్తవం కాదా! ఆ సినిమాలో చివరి సన్నివేశంలో హీరోయిన్ విలన్ను గొడ్డలితో నరికి చంపినట్లు చూపుతారు. ఆ తర్వాత కొంతకాలానికి బందరు రోడ్డులో నిరసన దీక్ష చేస్తున్న రంగాను టీడీపీకి సంబంధించినవారు గొడ్డళ్లతోనే నరికి హత్య చేశారు. ఆ హత్య విషయం అంతా చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసునని కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు. దాని గురించి ఎన్నడైనా ఈనాడు రామోజీరావు వార్తలుగా ఇచ్చారా? విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో రంగా అభిమానులకు, టీడీపీ వారికి ఉప్పు, నిప్పుగా ఉండేది. అలాంటిది రంగా విగ్రహానికి స్వయంగా టీడీపీ పెద్ద నేతలు దండలు వేసి ఆయనపై అభిమానం ఉన్నట్లు కనిపించే యత్నం చేయడం అంటే కాపు వర్గాన్ని బుట్టలో వేసుకోవడానికే అన్నది విదితమే. వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారికి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఆమె రెండుసార్లు గెలిచారు కూడా. ఆ తర్వాత ఆమె అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ వైపు మొగ్గు చూపారు. తిరిగి 2004లో రంగా కుమారుడు రాధాకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించింది వైఎస్ రాజశేఖరరరెడ్డి.ఆ తర్వాతకాలంలో రాధా కూడా జగన్ వెంట నడిచి విజయవాడ తూర్పు నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయినా పార్టీలో ఆయనకు గుర్తింపు తగ్గలేదు. కారణం ఏమైనా ఆయన గత ఎన్నికల సమయంలో టీడీపీవైపు వెళ్లారు.ఇప్పుడు ఆయన మళ్లీ వైఎస్సార్సీపీలోకి వస్తారో లేదో తెలియదు. కాని ఈనాడు మాత్రం కంగారుపడుతూ ఇలాంటి అసత్యపు వార్తలు రాసింది.జగన్ అధికారంలోకి వచ్చాక తాను హామీ ఇచ్చిన విధంగా కాపు నేస్తం స్కీమును అమలు చేసి ఆ వర్గంం మహిళలకు ఏడాదికి 18500 చొప్పున ఆర్దిక సాయం చేస్తున్నారు. అంతేకాక కాపులలో పేదలైనవారికి కూడా వివిధ సంక్షేమ స్కీములు ఇస్తున్నారు. దానివల్ల కాపులలో ఆయనకు ఆదరణ కొనసాగుతోంది. దానిని తగ్గించడానికి చంద్రబాబు నాయడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రయోగించారు. పవన్ కళ్యాన్ వ్యూహాత్మక తప్పిదాలనండి, ఆయన ప్రత్యర్ధులు చెబుతున్నట్లు ప్యాకేజీ ఆకర్షణ అనండి.. ఆయన టీడీపీతో ఎలాంటి షరతులు లేకుండా పొత్తు పెట్టుకున్నారు. చివరికి లోకేష్ సీఎం.పదవి చేపట్టడానికి చంద్రబాబు మాదిరి పవన్ కు అనుభవం, సమర్ధత లేదని పరోక్షంగా చెప్పినా ఆయన మాట్లాడలేకపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నా టీడీపీ పాలిట్ బ్యూరో డిసైడ్ చేయాలని మరింతగా అవమానించారు. దీనిని కాపువర్గం భరించలేకపోతోంది. ఈ నేపధ్యంలో కాపులను ఎలాగొలా చంద్రబాబు, పవన్లకు దూరంకాకుండా చూసే యత్నంలో భాగంగా ఈనాడు రామోజీరావు ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచురించి, టివీలో ప్రసారం చేస్తున్నారు. ఇదంతా కాపులను మరోసారి మోసం చేయడానికే. రామోజీరావు వంటివారి మాటలను నమ్మి కాపులు మళ్లీ, మళ్లీ మోసపోవడానికి సిద్దపడతారా? - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్. ఇవి చదవండి: బాబు బ్యాచ్ చిత్తు..! -
AP: పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 08:15 PM, Jan 15, 2024 చంద్రబాబుపై బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సెటైర్లు.. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలి. అనైతిక పొత్తులతో కుట్రలు చేస్తున్నారు. సీఎం జగన్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలకు అసూయ ఉన్నాయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు లేదు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు చంద్రబాబుకు నలుగురు ష్యూరిటీ ఇచ్చారు టీడీపీ బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు హాస్యాస్పదం 06:30 PM, Jan 15, 2024 ఎన్నికల వేళ పచ్చ బ్యాచ్తో జాగ్రత్త.. టీడీపీ పెయిడ్ బ్యాచ్ దిగింది. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం మౌత్ పబ్లిసిటీ కోసం టీడీపీ దొంగదారులు. టీడీపీ పెయిడ్ బ్యాచ్ దిగింది.. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి..! ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో @JaiTDP మౌత్ పబ్లిసిటీ కోసం టీడీపీ దొంగదారులు#TDPFakePropaganda #EndOfTDP pic.twitter.com/hrm8bw775f — YSR Congress Party (@YSRCParty) January 15, 2024 04:40 PM, Jan 15, 2024 ప్రజాక్షేత్రంలోకి సీఎం జగన్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి సన్నద్ధమవుతున్న సీఎం వైఎస్ జగన్ 2024 ఎన్నికల సాంగ్ను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా పాట మాట ఇస్తే దాని కోసం ఎంత వరకైనా పోరాడే వ్యక్తే జగన్ అని పాటలో వివరణ 04:40 PM, Jan 15, 2024 ఆక్ పాక్ కరివేపాక్.. టీడీపీలో ఆ ఐదుగురికి చెక్ రఘురామరాజు, కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి, శ్రీదేవి టికెట్లపై టీడీపీలో చర్చ వీళ్లను భరించడం కష్టమని పార్టీ సీనియర్ల టాక్ ఒకవేళ టికెట్ ఇచ్చి గెలిచినా.. ఎన్నాళ్లుంటారో తెలియని పరిస్థితి అంటున్న సీనియర్లు టీడీపీలో సుదీర్ఘకాలం నుంచి ఉంటున్న నాయకులకే టికెట్లు ఇవ్వాలని పెరుగుతున్న డిమాండ్ అధికార పార్టీ తరిమేసిన వాళ్లకు మనం ఎందుకు టికెట్లు ఇవ్వడం అంటూ అభ్యంతరాలు గద్దె రామ్మోహన్ రావు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి అయితే మంచిదంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలంటున్న టీడీపీ సీనియర్లు 04:00 PM, Jan 15, 2024 టీడీపీ పచ్చ కామెర్లకు మందు లేదు.. పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ప్రతీ విషయాన్ని తప్పుగా చూపే ప్రయత్ని టీడీపీది. పరనిందతో పగ్గం గుడుపుకునే పచ్చ బ్యాచ్ మరోసారి ఓవరాక్షన్ షూస్ వేసుకుని టెంకాయ కొట్టే వ్యక్తి చంద్రబాబు హిందూ సంప్రదాయం గురించి చెబుతున్నారు. 03:45 PM, Jan 15, 2024 టాప్లో నిలిచిన ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో టాప్లో నిలిచిన ఏపీ వరుసగా మూడో ఏడాది టాప్లో ఏపీ కార్యరూపం దాల్చుతున్న గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒప్పందాలు జీఎస్డీపీ వృద్ధిరేటులోనూ మనేమే టాప్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో వరుసగా మూడో ఏడాది టాప్లో నిలిచిన ఏపీ కార్యరూపం దాల్చుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒప్పందాలు జీఎస్డీపీ వృద్ధిరేటులోనూ మనమే టాప్..!#YSJaganDevelopsAP#YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/DIiH3U1Pe4 — YSR Congress Party (@YSRCParty) January 15, 2024 03:00 PM, Jan 15, 2024 ఊరు మారింది.. సామాన్యుడి కామెంట్స్ చంద్రబాబు హయాంలో పేదవాడిని పట్టించుకున్న నాథుడే లేడు పేదవాళ్ల కోసమే పనిచేస్తున్న సీఎం జగన్ నేడు కార్పోరేట్ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం. పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు ఏపీలో పూర్తిగా మారిపోయిన స్కూల్స్ పండుగకు ఇంటికి వచ్చి స్కూల్స్ను చూసి పాత విద్యార్థుల భావోద్వేగం ఇది కదా మార్పు అంటే అని సీఎం జగన్పై ప్రశంసలు పేదవాడి నాడి పట్టిన నాయకుడు సీఎం వైయస్ జగన్ నాడు పేద ప్రజల ఆరోగ్యం కోసం పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. నేడు కార్పొరేట్ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పేద ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయి.#VooruMarindi pic.twitter.com/EPHgj9h9Yq — YSR Congress Party (@YSRCParty) January 15, 2024 సంక్రాంతి పండగ వేళ సొంతూరికి వెళ్లి.. మారిన స్కూల్ని చూసి అద్దంకిలో ఓల్డ్ స్టూడెంట్స్ భావోద్వేగం..! ఇది కదా మార్పు అంటే.. ఇది కదా అభివృద్ధి అంటే..!#YSJaganDevelopsAP#VooruMarindi #AndhraPradesh pic.twitter.com/2cRxgO1sU7 — YSR Congress Party (@YSRCParty) January 15, 2024 02:15 PM, Jan 15, 2024 గిడుగు రుద్రరాజు రాజీనామా ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు రాజీనామా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖ పంపిన రుద్రరాజు త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్ను నియమించనున్న ఏఐసీసీ 01:45PM, Jan 15, 2024 పెనమలూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం:మంత్రి జోగిరమేష్ పార్టీ విజయానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తా 90 శాతం ప్రజలు జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు 2024 ఎలక్షన్లో 150 పైగా సీట్లు గెలుస్తాం నియోజవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి అందరిని కలుస్తున్నా గతంలో కంటే అధిక మెజారిటీతో నియోజవర్గంలో గెలుస్తా 12:05AM, Jan 15, 2024 అందుకే పార్టీ పనులు చూసుకుంటున్నా: వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు లోక్సభకు పోటీ చేయనని సీఎం జగన్కు చాలాసార్లు చెప్పా పోటీ చేసేవాడినే అయితే 2019లోనే పోటీ చేసేవాడ్ని ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నా పోటీ విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా సీనియర్ నేతలు పార్టీని వీడడానికి వాళ్ల వ్యక్తిగత కారణాలే సీట్ల మార్పు విషయంలో జగన్ స్పష్టంగా ఉన్నారు సిట్టింగ్లు అభ్యర్థులతో అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి బీసీలకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శ సరికాదు కాంగ్రెస్తో షర్మిల చేరితో మాకు ఎలాంటి నష్టం లేదు షర్మిలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీలేదు 10:50AM, Jan 15, 2024 టీడీపీ – సేనకు బై.. వైఎస్సార్ సీపీకి జై వైఎస్సార్సీపీలో చేరిన తూర్పు గోనగూడెంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇతర పార్టీల నుంచి అనేక మంది వైఎస్సార్సీపీలోకి వస్తున్నారు: జక్కంపూడి రాజా ఎన్నికల తేదీ నాటికి నియోజకవర్గంలో ఈ చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయి ఆ రెండు పార్టీలూ దాదాపు ఖాళీ అయినా ఆశ్చర్యపడనవసరం లేదు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,158 కోట్లతో అభివృద్ధి రాష్ట్రంలో కుల మత వర్గ రాజకీయాలతో సంబంధం లేకుండా, అర్హతే ప్రామాణికంగా సీఎం జగన్ ప్రభుత్వం సంక్షేమం 10:00AM, Jan 15, 2024 రాజకీయాల్లో రఘురామ పాత్ర ముగిసినట్లేనా? రఘురామను పట్టించుకోని జనం ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చిన రఘురామ ఆయనకోసం ఎక్కడా ఎదురు పడని క్యాడర్, అభిమానులు రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనా? టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారనే చర్చ. కనీసం ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదని నరసాపురం ప్రజల మాట 09:00AM, Jan 15, 2024 చంద్రగిరిలో ఓట్లపై అపోహలొద్దు:ఆర్డీవో నిషాంత్రెడ్డి 2019తో పోల్చుకుంటే ఐదేళ్లలో 17 వేల ఓట్లు పెరిగాయి ఓటర్ల జాబితాను వందశాతం పారదర్శకంగా రూపొందిస్తున్నాం చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకూ 105ఫిర్యాదులు వీటికి రాజకీయ నేతలతో చర్చించి పరిష్కరించాం ఓటర్ల జాబితాలో చిన్న పొరపాటు కూడా లేకుండా తనిఖీలు చేయడానికి 10 కమిటీలను ఏర్పాటు చేశాం 8:50AM, Jan 15, 2024 అమరావతిపై దత్తపుత్రుడి ప్రేమ! అమరావతి నుంచే పాలన అంటున్న చంద్రబాబు అండ్ పవన్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న క్రమంలో వీరిద్దరి నోట.. అమరావతి మాట అమరావతిపై తమకు ఇంకా ‘మోజు’ తగ్గలేదనే సంకేతాలు 8:30AM, Jan 15, 2024 ఆ ఇద్దరిది అపవిత్ర కలయిక ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ చంద్రబాబు, పవన్ల కలయిక అత్యంత అపవిత్రమైనది బాబు, పవన్లు పండుగలను సైతం రాజకీయం చేస్తున్నారు 2014లో ఒక విధంగా వారు కలయిక జరిగితే, 2019లో కలిసి ఉండి మరో విధంగా విడిపోయారు 2024లో మళ్లీ కలిసి తేడా రాజకీయాలు చేస్తున్నారు 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పాలన చూశాం 2019 నుంచి సీఎం జగన్ పాలన కూడా చూశాం ప్రజలు ఎవరిని తరిమేస్తారో 80 రోజుల్లోనే తేలనుంది ఈసారి టీడీపీ, జనసేనలను ప్రజలు భోగి మంటల్లో వేస్తారు 8:15AM, Jan 15, 2024 నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్దే బాధ్యత: రాయపాటి రంగారావు తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల చందాలు వసూలు చేసింది దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశా ఈనెల 13న గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారు వైజాగ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని బెదిరించారు లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు 7:52AM, Jan 15, 2024 రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే.. ఏప్రిల్ 2తో పూర్తికానున్న టీడీపీ సభ్యుడు ‘కనకమేడల’ పదవీకాలం వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ల పదవీకాలం ముగిసేదీ అప్పుడే రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో ఎన్నికలు అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్సీపీ పరం చివరికి రాజ్యసభలో ఉనికే లేకుండాపోనున్న టీడీపీ 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి 07:10AM, Jan 15, 2024 రేపు బాబుకి జడ్జిమెంట్ డే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 16న సుప్రీం కోర్టు తీర్పు! స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజలు జైల్లో ఉన్న చంద్రబాబు మధ్యాహ్నాం ఒంటి గంటకు తీర్పు వెల్లడించిన ద్విసభ్య ధర్మాసనం 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన వర్తించదని ఏపీ సీఐడీ వాదనలు వాదనలు విని.. తీర్పు రిజర్వ్ చేసిన బెంబ్ 07:05AM, Jan 15, 2024 ఇది కదా అసలైన అభివృద్ధి జగనన్న పాలనలో మన ఊరు మారింది.. ఏపీ ప్రజల జీవితాలు మారాయి అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి ఊరు.. జిల్లా.. మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందింది ఇది కదా అసలైన అభివృద్ధి అంటే..! 07:00AM, Jan 15, 2024 బలం సరిపోవట్లేదు.. బీజేపీ కావాలి చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో ప్రధానంగా బీజేపీని ఒప్పించడంపై చర్చ ప్రస్తుతం తమకున్న బలం పూర్తిస్థాయిలో ఓట్లు కురిపించలేదని ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు-పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగించిన చంద్రబాబు అడిగినని ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పాలని సూచించిన చంద్రబాబు ఈసారి పొత్తు తర్వాత నమ్మకంగా ఉంటామని ఢిల్లీ పెద్దలకు హామీ ఇవ్వాలని సూచన ఉమ్మడి మేనిఫెస్టో కు సిద్ధమని అలాగే బిజెపి సూచించే అంశాలను కూడా అందులో పెట్టేందుకు రెడీ అని అంగీకారానికి వచ్చిన చంద్రబాబు పొత్తుకు బీజేపీ ఓకే అంటే మొదటి జాబితాలోనే బీజేపీ నేతల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమంటున్న చంద్రబాబు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే.. ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై చర్చ ఎన్నికల సమీపిస్తున్నాయి ఇక మ్యానిఫెస్టో తొందరగా విడుదల చేయాలని చర్చ ఈ నెలలోనే కనీసం మినీ మేనిఫెస్టో విడుదల చేయాలని లక్ష్యం వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై తెలుగుదేశం జనసేన మధ్య కొలిక్కిరాని చర్చలు -
భళా... తాటాకు చప్పుళ్ల తాండవం!
‘ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి’ – ఘటోత్కచుని వేషంలో ఎస్వీ రంగారావు చెప్పిన డైలాగ్ ఇది – ఆల్టైమ్ గ్రేట్ మూవీ ‘మాయాబజార్’ క్లైమాక్స్ సీన్లో! కుట్రలతో, కుయుక్తులతో, కపటంతో, వంచనతో పాండవులను వేధిస్తున్న దుష్టచతుష్టయ కౌరవ ముఠాకు ఘటోత్కచుడు తన ఇంద్రజాలంతో బుద్ధి చెబుతాడు. అతని మాయాజాలంలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటూ పలాయన మంత్రం పఠిస్తున్న ఆ కౌరవ మూకను చూసి పగలబడి నవ్వుతాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉరఫ్ వెన్నుపోటు బాబు అనే కాలం చెల్లిన నాయకుడు మనుగడ కోసం ప్రదర్శి స్తున్న గారడీ విద్యలు కూడా వినోదం పుట్టిస్తున్నవి. ఏఐ టెక్నాలజీ కాలంలో కూడా కనికట్టు టెక్నిక్ల దశను ఈ వృద్ధ నేత దాటలేకపోతున్నారు. ఈ తరహా బేసిక్ మోడల్ నాటు విద్య లనే... బాబు చాణక్యాలు, బాబు ‘చక్ర’ వ్యూహాలుగా యెల్లో మీడియా ప్రచారం చేసిపెట్టింది. ఇప్పుడు కూడా యెల్లో పిల్లి కళ్లు మూసు కొని పాలు తాగే వ్యూహాలను అమలు చేస్తున్నది. తాటాకు చప్పుళ్లను కూడా అణుబాంబు విస్ఫోటాలుగా ప్రచారం చేసే పనిలో యెల్లో మీడియా నిమగ్నమై ఉన్నది. మార్చి నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి కావచ్చని వినబడుతున్నది. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వరకు కూడా యాభై శాతానికి పైగా ఓటింగ్ బలం ఉన్నది. ముఖ్యమంత్రి రేటింగ్లో చంద్రబాబు అందుకోలేనంత దూరంలో జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారు 58 శాతం మంది ఉన్నారు. ఇటువంటి క్షేత్ర వాస్తవికత గురించిన స్పష్టమైన అవగాహన టీడీపీ కూటమికి ఉన్నది. అయిననూ ఎన్నికల్లో గెలిచి తీరవలె! ఎలా? వీలైనన్ని ఎక్కువ పొత్తులు పెట్టుకొని తమ కూటమి బలాన్ని ఎంతో కొంత పెంచుకోవాలి. ఇదొక్కటే సరిపోదు. వైసీపీ ఓటింగ్ బలంలో కోతపెట్టాలి. ఈ రెండంచెల వ్యూహాన్ని చాలాకాలంగానే టీడీపీ పెద్దలు అమలు చేస్తున్నారు. ఈ కార్య క్రమానికి వ్యూహం లాంటి గొప్ప మాటలు అనవసరం. ఇదో అనైతిక ఎత్తుగడ. దిగజారుడు విధానం. చంద్రబాబు ఆశించే పొత్తులకు సైద్ధాంతిక ప్రాతిపదిక అవసరం లేదు. భావజాల సారూప్యత గురించిన చింతే లేదు. తనకు ఐడియాలజీలు లేవని ఆయనే ప్రకటించుకున్నారు. కమ్యూనిజం అంతరించిందనీ, టూరిజమే అసలైన ఇజమనీ ఓ దివ్య సందేశాన్ని కూడా ఆయన వెలువరించారు. అయినా సరే, మన ఏపీ కమ్యూనిస్టుల్లో కొందరు ఎర్రజెండాలను చంద్ర బాబుకు వింజామరలుగా ఉపయోగించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇదేమి సంబంధమో సామాన్యులకు అర్థం కాదు. అదో దేవ రహస్యం. ‘ఏ బంధమో ఇది ఏ బంధమో, ఏ జన్మబంధాల సుమ గంధమో’ అని నిట్టూర్పులతో పాడుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. కోస్తా జిల్లాల్లో ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు చంద్రబాబుకు సహజ శత్రువులు. ఈ వ్యతిరేక ప్రవాహం తనను రాజకీయంగా ముంచేయకుండా ఉండటానికి పవన్ కల్యాణ్ ద్వారా ఒక డైవర్షన్ స్కీమ్ను తయారు చేసుకున్నారు. తన అవసరాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకో, చీలడం కోసమో ఈ డైవర్షన్ స్కీమ్ను ఆయన వినియోగిస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీయే గనుక తెలుగుదేశం పొత్తు కోసం నిలబడే తొలి పార్టీ – జనసేన. అదొక్కటే సరిపోదు. బీజేపీ కూడా తోడు రావాలి. ఐదేళ్ల కింద ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుంచే చంద్రబాబు బీజేపీతో సయోధ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ వగైరా పలువురు నాయకులను ఢిల్లీ లాబీయింగ్ కోసం కమలం పార్టీలో ప్రవేశపెట్టారు. పవన్ కల్యాణ్తో తాను పెట్టించిన పార్టీని ఎన్డీఏలో చేర్పించారు. పూర్వాశ్రమంలో తాను ఎన్డీఏలో ఉన్న కాలం నాటి కొందరు సావాసగాళ్ల తోడ్పాటును కూడా పొందు తున్నారు. బీజేపీ వాళ్లకు కూడా ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు ఎన్నో కొన్ని సీట్లు రావాలని ఉంటుంది కనుక తమ పొత్తుకు అంగీకరించక తప్పదని తెలుగుదేశం అంచనా. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించేలా చంద్రబాబు కూటమి పావులు కదిపింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి బాబు అప్పగించిన ‘మిషన్’పైనే ఆమె పనిచేస్తున్నారు. ఈ పండుగలోపునే ‘మిషన్ ఎకాంప్లిష్డ్’ అనే ప్రకటన ఆమె చేసే అవకాశం ఉన్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కటాక్ష వీక్షణాల కోసం ఇంతగా పరిత పిస్తున్న బాబు బృందం మరి ఆరేళ్ల కింద ఎందుకు విడి పోయినట్టు? మోదీతో సహా బీజేపీ నాయకత్వంపై ఎందుకు తీవ్రమైన విమర్శలు చేసినట్టు? బాబు రాజకీ యాల్లో సిద్ధాంతాలే కాదు లాజిక్ కూడా ఉండదు. అవకాశ వాదమే ఎజెండా! అధికారమే అంతిమ లక్ష్యం!! చంద్రబాబు ఆకాంక్షల మేరకు, పురంధేశ్వరి అభిలషి స్తున్నట్టుగా... బీజేపీతో కూడా పొత్తు కుదిరితే ఇంతటితో ప్రత్యక్ష పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్టే! ఇక పరోక్ష పొత్తుల కార్యక్రమాన్ని చాలాకాలంగా టీడీపీ నరుక్కొస్తున్నది. బీజేపీ ఉన్న కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేరే అవకాశం ఉండదు కనుక వీరిని అధికార పార్టీ ఓట్లు చీల్చేందుకు ఉపయో గించుకోవాలనే చావు తెలివితేటలతో టీడీపీ ప్లాన్ రూపొందించుకున్నది. కాంగ్రెస్ పార్టీకి గత కొంతకాలంగా వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు సహకారాన్ని కూడా చంద్ర బాబు తీసుకుంటున్నారట! సునీల్ కూడా చంద్రబాబు సామా జిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్ఠానంతో చంద్రబాబు మైత్రీ బంధం ఈనాటిది కాదు. గడిచిన పుష్కరకాలంగా అది బలపడుతూనే వస్తున్నది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ భవిష్యత్తును మొగ్గలోనే తుంచేయడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో పనిచేశాయి. ఉమ్మడిగా ఆయనపై కేసులు వేశాయి. ఆయనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన న్యాయ మూర్తిని పదవీ విరమణ అనంతరం మానవ హక్కుల కమిషన్కు చైర్మన్గా ప్రతిష్ఠించారు. జాతీయ స్థాయిలో చిక్కి శల్యావశిష్ట స్థితికి చేరిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఆయన మరణానంతరం ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చి కాంగ్రెస్ హైకమాండ్ దారుణమైన కృతఘ్నతకూ, నమ్మకద్రోహానికీ పాల్పడింది. చంద్రబాబు సలహా సంప్రదింపులు కూడా ఈ వంచన వెనుక ఉన్నాయి. విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలో ఎన్టీఏతో నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు చంద్రబాబు ఆ కూటమి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో మరోసారి కాంగ్రెస్కు చేరువై ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆర్థిక సహకారం అందించినట్టు కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్లోనైతే ఆయన మాటే చెల్లుబాటైంది. ఆయనే ఆర్థిక సహకారం అందించి కలిసి పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని సమకూర్చడమే గాక ఆర్థికంగానూ తోడ్పడ్డారనేది బహిరంగ రహస్యమే. జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచడానికి వివేకానందరెడ్డి రూపంలో ఆయన కుటుంబాన్ని చీల్చినట్టే ఇప్పుడు ఆయన సోదరి షర్మిలను తెలంగాణ కార్య క్షేత్రం నుంచి ఏపీలోకి దించాలనే కాంగ్రెస్ ప్రయత్నాల వెనుక వ్యూహం కూడా చంద్రబాబుదే! తెలంగాణ కాంగ్రెస్లో షర్మిలకు భాగస్వామ్యం కల్పించడానికి రేవంత్రెడ్డి వ్యతిరేకించడం, ఆమె ఇడుపులపాయ, విజయవాడల పర్యటనలకు సీఎం రమేశ్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం, పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉండే బీటెక్ రవి కడప ఎయిర్పోర్టులో బ్రదర్ అనిల్తో రాజకీయ చర్చలు జరపడం... ఇవన్నీ చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తున్నాయి. అడ్రస్ గల్లంతయిన కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయం కల్పించడం కోసం చంద్రబాబు ఎందుకు తాపత్రయపడు తున్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత వైసీపీ ఓట్లను చీల్చక పోతుందా అన్న ఆశ. కుళ్లిపోయి కంపు గొడుతున్న పాతకాలపు రాజకీయ చతురత ఇది. ఏపీ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీనీ, హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగవేసిన బీజేపీనీ కుడిఎడమల నిలబెట్టుకొని అధికార పార్టీపై యుద్ధం చేయాలనుకోవడమే ఒక దిక్కుమాలిన ఆలోచన. మెదడు పూర్తిగా పాడైతే తప్ప ఈ తరహా ఆలోచనలు ఎవరూ చేయలేరు. నెగెటివ్ ఓటును చీల్చాలంటే ఒక అర్థం ఉంటుంది. పాజిటివ్ ఓటును ఎట్లా చీల్చగలుగుతారు? అది ప్రభుత్వం పట్ల అభిమానంతో వేసే ఓటు కదా? మరో పార్టీతో ఎట్లా పంచుకుంటారు? అది పక్కన పెడితే, జగన్ ప్రభుత్వం ఈ దేశం ముందుకు ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చింది. మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలందరూ సాధికారత సంతరించుకోవడమే ఆ ఎజెండా. ఈ సరికొత్త నమూనా ఇప్పుడు ప్రపంచంలోని అభ్యుదయ శక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నది. రాష్ట్రంలోని బహుజనులంతా జగన్ పార్టీ గొడుగు కిందకు సమీకృతమవుతున్నారు. పాచిపోయిన వ్యూహాలతో, ఊకదంపుడు హామీలతో వారిని చీల్చడం కలలోని మాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి కూడా సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నమైనది. సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొనిపోవడం, స్థానిక ప్రజల ఆకాంక్షలనూ, సామాజిక వర్గాల ఆకాంక్షలనూ గౌరవించడం, ప్రజా ప్రతినిధులను ప్రజలకు జవాబుదారీగా నిలపడం జగన్ మోహన్ రెడ్డి ఎజెండాలో భాగం. టిక్కెట్ల పంపిణీలోనూ ఇది ప్రతిఫలిస్తున్నది. ఈ కొత్త ఒరవడిని ఊహించలేని యెల్లో మీడియా, సాంప్రదాయ రాజకీయ పరిశీలకులు హరాయించు కోలేకపోతున్నారు. ఏదో జరిగిపోతున్నదని తాటాకు చప్పుళ్లతో హడావిడి చేస్తున్నారు. జగన్ మోహన్రెడ్డి మాత్రం కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. యెల్లో మీడియా సంగతి తెలిసిందే. అది చేసే గోబెల్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తరహా దుష్ప్రచారం సంగతీ తెలిసిందే. చంద్ర బాబు పరిపాలనలో అభివృద్ధి అంతరిక్షాన్ని తాకిందనీ, జగన్ మోహన్రెడ్డి దాన్ని పాతాళంలోకి తోసేసాయనీ రాయని రోజు లేదు. అమరావతి అనే రాజధాని నగరం అలనాటి విజయ నగరంలా వెలిగిపోయిందనీ, ఇప్పుడు మసకబారిందనీ రాస్తున్నారు. ‘కత్తులును ఘంటములు కదనుదొక్కినవిచట... అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట...’ అంటూ గ్రాఫిక్–డిజైన్లను చూపెడుతున్నారు. ఇప్పుడు రాజధాని రాళ్లపాలైందని వాపోతు న్నారు. నిజానికి రాష్ట్రంలోని ఏ పట్టణాన్ని తీసుకున్నా చంద్ర బాబు ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఈ అయిదేళ్లలో జరిగిన అభివృద్ధే ఎక్కువ. మౌలిక వసతుల రంగంలో గడిచిన డెబ్బయ్యేళ్ల అభివృద్ధిని సవాల్ చేసేదిగా ఈ ఐదేళ్ల కాలం నిలబడిపోతుంది. ఏకకాలంలో నాలుగు ఓడరేవులు శరవేగంగా పూర్తవు తున్నాయి. పది ఫిషింగ్ హార్బర్లు రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖ సమీపంలో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జరుగుతున్నాయి. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ మవుతున్నాయి. 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పల్లె ఒక మినీ రాజధానిగా మారింది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లినిక్లు వగైరా వేలాది కొత్త భవనా లతో గ్రామసీమలు కళకళలాడుతున్నాయి. పేద బిడ్డలకు అధు నాతనమైన బడులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి ముందటే ఆధునిక వైద్యం లభిస్తున్నది. ఇటువంటి మార్పులను యెల్లో మీడియా డార్లింగ్ విజనరీ కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే కలవరపడుతున్నారు. తాటాకుల చప్పుళ్లు చేస్తున్నారు. ఐదు వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చి ఒక మౌత్ పబ్లిసిటీ వింగ్ (మూతి ప్రచారంగాళ్లు)ను ఏర్పాటు చేసి జనంలోకి వదిలారు. రాబిన్ శర్మ టీమ్తో పాటు ఒక రిటైర్డ్ డీఐజీ ఈ వింగ్ను పర్యవేక్షిస్తున్నారు. నలుగురు కూడిన ప్రతి చోటకు ఈ మూతి ప్రచారంగాళ్లు చేరుకుంటారు. జగన్ ప్రభు త్వానికి వ్యతిరేక గాలి వీస్తున్నదని, అన్నిచోట్లా ఓడిపోతారని చెబుతారు. ఎన్నికలయ్యేంత వరకూ వీరి పని ఇదే! ఈ ప్రచారంతో జనం ప్రభావితం కావాలనే అథమస్థాయి ఎత్తుగడ. వీరి ఆపసోపాలూ, ఆయాస ప్రయాసలూ వినోదభరితంగానే ఉన్నాయి. గెలుపు మీద నమ్మకం లేక గిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటే గమ్మత్తుగానే కనిపిస్తున్నది. ఔను! వారి ఆర్తనాదములు శ్రవణా నందకరముగా నున్నవి!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సీఎం జగన్ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ సమాధానాలు చెప్పగలరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఆయన ధాటిగా మాట్లాడటమే కాదు.. ప్రతిపక్షాన్ని సెంటిమెంటు ఆయుధంతో దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షం బలహీనతను ఆయన నొక్కి మరీ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు 175 సీట్లలో పోటీచేయగలరా? అని జగన్ సవాల్ విసురుతున్నారు. జగన్ ప్రసంగంలోని వివిధ అంశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతారన్నది సందేహమే. తెనాలిలో జరిగిన రైతు భరోసా -పి.ఎమ్.కిసాన్ సాయం పంపిణీ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. రాజకీయంగా టీడీపీ, జనసేనల బలహీనతలపై దెబ్బ కొడుతూ వారు శాసనసభ ఎన్నికలలో మొత్తం అన్ని సీట్లకు పోటీచేయలేని నిస్సహాయ స్థితిని ప్రజల ముందుంచారు. టీడీపీ, జనసేనల బలహీనత తెలిసేలా.. 2019 శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఒంటరిగా పోటీచేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జనసేన పరిస్థితి మరీ దయనీయం. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. వామపక్షాలు, బీఎస్పితో ఆయన పొత్తు పెట్టుకుని కూడా ఈ పరాభవానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జనసేనతో కలిస్తే ఏమైనా రాజకీయ లబ్ధి కలుగుతుందా అన్న ఆశతో టీడీపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు ఇందుకోసం తన మంత్రాంగం కొనసాగిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తాను గెలిస్తే చాలన్నట్లుగా టీడీపీతో ఎలా జట్టుకట్టాలా అని తంటాలు పడుతున్నారు. ఒకవేళటీడీపీతో కలిస్తే జనసేనకు కేవలం 25 నుంచి సీట్ల లోపే ఇవ్వవచ్చన్న అంచనా ఉంది. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్కు అవమానమే. అయినా దానిని భరించడానికి ఆయన సిద్ధపడుతున్నారని అంతా భావిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నందున పవన్ తన వారాహి యాత్రను కూడా వాయిదా వేసుకున్నారని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిని పవన్ కళ్యాణ్ ఖండించలేదు. అంటే జనసేన ఎటూ 175 సీట్లలో పోటీచేసే అవకాశమే లేదు. అసలు ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాలలో క్యాడరే లేదు. సాయం కోసం టీడీపీ ఎదురుచూపు.. ఇక టీడీపీకి అన్ని నియోజకవర్గాలలో క్యాడర్ ఉన్నా, బలం క్షీణించిపోవడంతో బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని ఎదురుచూస్తోంది. స్థానిక ఎన్నికలలో కేవలం 25 శాతం ఓట్లే రావడం వారికి తీవ్ర ఆశాభంగం కలిగించింది. అందువల్ల జనసేనతో కలిస్తే ఏమైనా పోటీ ఇవ్వగలుగుతామా? అన్నది వారి ఆలోచన. అందుకే జనసేనకు కొన్ని సీట్లు ఇస్తే 175 సీట్లలో పోటీచేసే పరిస్థితి టీడీపీకి ఉండదు. ఆ విధంగా టీడీపీ, జనసేనల బలహీనతను జనానికి తెలిసేలా చేయగలిగారు. సీఎం జగన్కు అడ్వాంటేజ్.. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని సీట్లకు పోటీకి సై అంటూ సవాల్. తద్వారా ప్రజలలో తమకు ఆదరణ ఉందన్న నమ్మకాన్ని ,అన్ని చోట్ల పార్టీ బలంగా ఉందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయగలుగుతోంది. ఆ కాన్ఫిడెన్స్ ప్రతిపక్షంలో కొరవడడం జగన్కు అడ్వాంటేజ్ అని చెప్పాలి. దీనికి సమాధానంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీతో కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయా? అని పిచ్చి ప్రశ్న వేశారు. 2014లో బిజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నాయకత్వం కోరినా జగన్ ఒప్పుకోలేదు. తాను ఒంటరిగా పోటీచేసి గెలవగలమన్న దమ్ము ఆయనకు ఉండడమే దీనికి కారణం 2014లో అధికారం రాకపోయినా, ఏ ఇతర పార్టీ పొత్తుకోసమో ఆయన తెలుగుదేశం మాదిరి అర్రులు చాచలేదన్న సంగతి సోమిరెడ్డి గ్రహించాలి. జగన్ సెంటిమెంట్ ఇక ఇతర అంశాలలో జగన్ సెంటిమెంట్ పండించారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు టైమ్ లో 300కి పైగా కరువు మండలాలు ఉన్న స్థితిని ఆయన గుర్తు చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు తన తండ్రి హయాంలో కానీ పుష్కలంగా వర్షాలు పడ్డాయని సభలో పాల్గొన్న రైతులకు జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ఆ రోజులలో రెయిన్ గన్ అంటూ షో చేసి, వాటితోనే కరువును పొగొట్టినంత బిల్డప్ ఇచ్చేవారు. అది వందల కోట్ల మేర దండగమారి ఖర్చుగానే మిగిలిపోయింది. దాంతో రైతులలో బలంగా ఒక అభిప్రాయం నాటుకుపోయింది. చంద్రబాబు పాలనలో కరువు తప్పదన్న భావన సర్వత్రా ఏర్పడింది. అదే జగన్ పాలన ఆరంభమైన సంవత్సరం నుంచి నాలుగేళ్లలో పుష్కలంగా వర్షాలు పడడం, నదులు పొంగిపొర్లడం, చెరువులు ,రిజర్వాయిర్లు నిండడంతో పంటలు బాగా పండుతున్నాయి. భూగర్భ జలాల మట్టం బాగా పెరిగింది. సాధారణంగానే వైఎస్సార్సీపీ నేతలు.. కరువు, చంద్రబాబు కవల పిల్లలని విమర్శిస్తుంటారు. దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి జగన్ రైతుల సభలో చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో కరువు పరిస్థితులను తన స్పీచ్ లో గట్టిగా వినిపించారు. రైతులకు తన ప్రభుత్వం అమలు చేసిన వివిధ స్కీములను ఆయన వివరించారు. తదుపరి రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ పేదలు, రైతులకు , పెత్తందార్లకు మధ్య యుద్దం జరగబోతోందని ఆయన చెప్పారు. తాము హామీ ఇచ్చినట్లు భరోసా డబ్బు పంపిణీ చేశామని, అదే చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేస్తామని చివరికి వారిని మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాగే పేదల పిల్లలకు ఆంగ్ల మీడియంలో చదువు చెప్పిస్తున్న తనకు, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్న పెత్తందార్లకు మధ్య యుద్దం జరగబోతోందని ఆయన చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా.. ఇవన్నీ సెంటిమెంట్ తో కూడిన అంశాలే అవుతాయి. జగన్ ప్రభుత్వం స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేయడమే కాకుండా ఆంగ్ల మీడియం కూడా ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అదే టైమ్లో ఆ పార్టీలు జనంలో పలచన అయ్యాయి. ఫలితంగా తాము ఆంగ్ల మీడియంకు వ్యతిరేకం కాదని ఆ పార్టీల నేతలు చెప్పవలసి వస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ విషయంలో జగన్ ధైర్యంగా ముందడుగు వేశారు. ఇది ఆయనకు సానుకూల పరిణామంగా ఉంది. అన్నింటినీ మించి వందల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని చంద్రబాబుకు, ఇచ్చిన హామీలలో 98.5 శాతం అమలు చేసిన తనకు మధ్య పోటీ జరగబోతోందని, హామీలు నెరవేర్చినవారిని తిరిగి ఎన్నుకోకపోతే, భవిష్యత్తులో ఎవరూ ఎన్నికల మానిఫెస్టో అమలుపై దృష్టి పెట్టరని జగన్ హెచ్చరించారు. మాట తప్పే వ్యక్తిగా చంద్రబాబును ఫోకస్ చేయడంలో జగన్ సఫలం అవుతున్నారు. అదే ధైర్యంతో జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. తెనాలి సభకు పెద్ద ఎత్తున హాజరైన రైతులు, ఇతర వర్గాల ప్రజలు, వారు ఆయా సమయాలలో జగన్ స్పీచ్ కు వ్యక్తం చేసిన స్పందన గమనిస్తే జగన్కు జనంలో తిరుగులేదన్న అభిప్రాయం మరోసారి కలుగుతుంది. -హితైషి -
ముంచే గాలివాటు రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ గత శాసనసభ ఎన్నికల్లో ‘బింకానికి’ పోయి రెండు చోట్ల నిలబడి, ఘోరాతిఘోరమైన ఓటమి పాలయ్యాడు పవన్ కల్యాణ్. పరువూ పోయింది, ‘పవరూ’ రాలేదు. అయినా తన డంబపు ‘పవనిజం’ స్లోగన్ను వదులుకోలేదు. అంతవరకే అయితే సరే అనవచ్చు. కానీ ఆయన ఏ నిశ్చితాభిప్రాయం లేని ‘వ్యామోహాల పుట్ట’ అని రోజురోజుకూ రుజువవుతోంది. అదే ఆయనతో ‘నేనెవరితోనైనా సరే పొత్తులకు సిద్ధం’ అనేలా చేస్తోంది. అన్నట్టూ– పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెడుతుందట అన్న సామెత మనకు ఉండనే ఉంది. శతాబ్దాలకు సరిపడా నీతుల్ని శతక వాఙ్మయ కర్తలు ఎందుకు బోధించి పోయారోగానీ, అవి నేటి భ్రష్ట రాజకీయ సంస్కృతికి ప్రత్యక్షర సాక్ష్యాలుగా నిలిచి పోతున్నాయి. ‘గాలి వాటు’ రాజకీయాలకు పేరు మోసిన పవన్ కల్యాణ్ నిశ్చితా భిప్రాయం లేని ‘వ్యామోహాల పుట్ట’ అని రోజు రోజుకూ రుజువ వుతోంది. ‘వారాహి’ వాహనాన్ని చూపి దాన్నొక బెదిరింపు సాధనంగా చూపెడుతున్నాడు. ‘వ్యామోహాలు’ ఎలాంటివో వేమన నిర్వచించి పోయాడు: ‘‘ఈ దేహమే వ్యామోహాల పుట్ట. కానీ అశాశ్వతమై పగిలి పోయే ఓ కుండ. ఈ శరీరం తొమ్మిది కంతల తిత్తి. ఆ ‘తిత్తి’కి ఒంటి నిండా దిగేసే సొమ్ములు చాలక కులాలు, గోత్రాల పేర్లు కూడా ఆభరణాలుగా తగిలించుకుని ఊరేగుతున్నారు’’. అల్ప బుద్ధివాడు అధికారంలోకి వస్తే మంచివాళ్లందర్నీ తొలగ్గొడతాడనీ, ఇదెలాంటిదంటే ‘పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెట్టిందన్న’ సామెత లాంటిదనీ అన్నాడు. బహుశా అందుకనే పోతనామాత్యుడు కూడా మనిషి బుద్ధుల్ని నాలుగైదు రకాలుగా వర్ణించి పోయాడు. అవి: ‘కుబుద్ధి, మంద బుద్ధి, అల్ప బుద్ధి, దుర్బుద్ధి’ అని! ఈ అవకాశవాద బుద్ధే, ఇప్పుడు ‘నేనెవరి తోనైనా సరే పొత్తులకు సిద్ధం’ అని పవన్ చేత అనిపిస్తోంది. గత ఎన్నికల్లో ‘బింకానికి’ పోయి రెండు చోట్ల నిలబడి, అభాసుపాలై ఘోరాతిఘోరమైన ఓటమి పాలయ్యాడు. ఫలితంగా పరువూ పోయింది, ‘పవరూ’ దూరమై పోయింది. ఇన్ని దారుణ అనుభవాల నుంచి కూడా పవన్ తన ‘పవనిజం’ అన్న పాత స్లోగన్ను మాత్రం వదులుకో లేకుండా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగ తుల అభ్యున్నతికి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించే అవసరాన్ని తొలి సారిగా గుర్తించి దానికి చట్టరూపం ఇవ్వాలన్న తలంపు మొదటి సారిగా 2001లోనే ప్రతిపక్ష నాయక హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చింది. ఆయన ప్రతిపాదించిన దరిమిలానే దళిత వర్గాలకు ‘సబ్ ప్లాన్’ చట్టం వచ్చింది. ఆ చట్టం కాలపరిమితి మొన్నటి జనవరి 23తో ముగియవలసింది. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ముందడుగు వేసి దాన్ని మరొక పదేళ్లకు పొడిగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించడం వల్ల దళితుల, ఆదివాసీల అభ్యున్నతికి ఈ చర్య ఎంతో దోహదం చేస్తుంది. సకల దళిత శక్తులు వివిధ దశల్లో సమీకృతమైన ఫలితమే ‘సబ్ ప్లాన్’. ఆ నిధులు దుర్వినియోగమై పక్కదారులు పడుతున్నాయని సబ్ ప్లాన్ లక్ష్యాల గురించిన అవగాహన లేని పవన్ వాపోవడం కేవలం ఆయన ద్వేష భావననే బట్టబయలు చేస్తోందని చెప్పక తప్పదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజా బాహుళ్యానికి మాత్రం గణనీయమైన స్థాయిలో ఒరిగిందేమీలేదంటూ అంబేడ్కర్ తన బాధను చివరి శ్వాస వరకూ వ్యక్తం చేస్తూనే వచ్చారు. ‘‘షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల బతుకుతెరువులు ఆచరణలో బాగుపడనంత కాలం, ఆ వైపుగా సమూలమైన, సమగ్ర మైన మార్పులు రానంత కాలం భారతదేశ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోదని అంబేడ్కర్ స్పష్టం చేశారని సుప్రసిద్ధ జాతీయ వ్యంగ్య చిత్ర వారపత్రిక ‘శంకర్స్ వీక్లీ’ (1953 ఫిబ్రవరి) నివేదించింది. అంతేగాదు, కళావంతులైన దేవదాసీలకు చెందిన కేసరీబాయి కేర్కర్ (1892–1977) స్వరంతో ‘వందేమాతరం’ గ్రామఫోన్ రికార్డును సిద్ధం చేయాలనీ, ఆ తొలి కాపీని తానే కొంటాననీ ప్రకటించినవారు అంబేడ్కర్! ఎందుకంటే ‘సురశ్రీ’గా పేరొందిన కేర్కర్, జైపూర్కు చెందిన అత్రౌలి ఘరానాలో 20వ శతాబ్దపు క్లాసికల్ సింగర్గా పేరొందిన హిందూస్తానీ సంగీత విద్వాంసుడు అల్లాదియా ఖాన్ వద్ద శిక్షణ పొందిన విషయాన్ని బహిర్గతం చేశారు అంబేడ్కర్. హైందవంలోని కుల వ్యవస్థను, పరమత విద్వేష భావాలను వ్యతిరేకించిన అంబేడ్కర్ చివరికి బౌద్ధ ధర్మాన్ని ప్రేమించి ఆహ్వానించవలసి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర శాసన వేదికలలో పాల్గొనే సభ్యులపై ఏయే అనర్హతా నిబంధనలను విధించాలో 1951లోనే ప్రత్యేక బిల్లును ఆయన రూపొందించారు. శాసన వేదికల్లోని సభ్యులకు రాజకీయ పదవుల ఆశ జూపడం ద్వారానో, మరే ఇతర ప్రయోజనాలు కల్పి స్తామనో ప్రలోభాలకు గురిచేసే పార్లమెంట్ వేదిక వల్ల ప్రయోజనం లేదు. ఎలాంటి భీతి లేదా ప్రలోభమో ప్రభుత్వం నుంచి లేకుండా పార్లమెంట్ సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే అలాంటి ‘పార్లమెంట్’ వల్ల గానీ, శాసనసభ వల్లగానీ ప్రజలకు ఉపయోగం ఉండదు. అలాంటి స్థితిలోనే పాలకులకు ‘డూడూ బసవన్న’లుగా వ్యవహరిస్తారని అంబేడ్కర్ హెచ్చరించారు. అలాంటి పరిస్థితుల్లోనే పార్లమెంట్ (లేదా శాసన వేదిక) కాస్తా స్టాక్ ఎక్స్ఛేంజి వ్యాపార మార్కెట్గా ఎలా మారిపోతుందో అంబేడ్కర్ ఉదాహరించారు. అంతేగాదు, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల అభ్యర్థుల సంఖ్యకన్నా స్వతంత్ర భారత ప్రభుత్వ కొలువులో ఉన్న వారి సంఖ్య బహు తక్కువనీ, ఆ మాటకు వస్తే తన స్వతంత్ర భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతినే తారుమారు చేయడానికి ముసాయిదా సంఘంలోని కొందరు సభ్యులు సాహసించిన విష యాన్నీ కూడా అంబేడ్కర్ బయట పెట్టాల్సి వచ్చిందని మరచి పోరాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలలో అధికారం కోసం, దళిత వర్గాలపై ఆధిపత్యం కోసం కేవల పదవీ కాంక్షతో కక్షిదారులైన కొందరు అగ్ర – అర్ధ అగ్రవర్ణాలకు చెందిన ‘వినాయకులు’ పని చేస్తున్నారన్నది పచ్చి నగ్న సత్యం. బహు పరాక్, ప్రసిద్ధ ఫ్రెంచి చిత్రకారుడు పియరీ నోరా అన్నట్టు– ‘‘జ్ఞాపక శక్తి ఉన్న చోటునే మరుపు పెద్దమ్మ కూడా వెన్నంటే ఉంటుంది’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పప్పు సుద్ద లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా?
కృష్ణా:టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కొడాలి నాని. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అసమర్థుడని ధ్వజమెత్తారు. చందాలిచ్చిన వారికోసం తప్ప లోకేష్ పాదయాత్ర దేనికి పనికిరాదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఏం సాధించాడని, ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నాడు? అని కొడాలి ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు అని తప్ప లోకేష్ ఉన్న అర్హత్ ఏంటి? అని అడిగారు. పోటీ చేసిన చోట ఓడిపోయిన పప్పు సుద్ద లోకేష్ అని దుయ్యబట్టారు. అలాంటి లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా? అని ఎద్దేవా చేశారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్ -
అదే జరిగితే కర్నూలుకు హైకోర్టు రావడం తథ్యం!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తను చేపట్టిన సంక్షేమ పథకాల బలంతో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తుంటే, దానిని అడ్డుకుని, అసలేమీ జరగడం లేదేమో అన్న భావాన్ని ప్రజలలో కల్పించడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఇరు పక్షాలు పోటాపోటీ యాత్రలు, సభలు నిర్వహిస్తున్నాయి. కర్నూలులో న్యాయ రాజదాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో రాయలసీమ ప్రాంతం అంతా ఉంది. అదేమీ లేదని ప్రజలను మభ్య పెట్టడానికి టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కర్నూలులో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రధాన వీధులలో జనసమీకరణ చేసి, బ్రహ్మాండంగా జనం వచ్చేశారని భ్రమింప చేయాలని ఆయన యత్నించారు. ఆ తర్వాత ఆయనకు బాజా వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కొన్ని మీడియా సంస్థలు అబ్బో ఎంత జనమో అంటూ ఊదరగొట్టాయి. పరిస్థితి అంతా మారిపోయిందా అన్న చందంగా టిడిపి ప్రచారం చేసింది. అయితే అక్కడ టిడిపి అధినేతకు ప్రజల నుంచి ముఖ్యంగా లాయర్ల నుంచి హైకోర్టుపై ప్రశ్నల వర్షం కురిసింది. నిరసనలు వెల్లువెత్తాయి. కర్నూలులో హైకోర్టు వద్దనలేక, అవునని అనలేక చంద్రబాబు సతమతమై, తాను కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని భావించానని చెప్పారు. నిజానికి అలాంటి ప్రతిపాదన ఏదీ ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో కేంద్రానికి పంపించలేదు. మొత్తం మీద కర్నూలులో తేనెతుట్టె కదల్చినట్లు చేశారు. అసలే అక్కడ ప్రజలు తమకు న్యాయ రాజధాని అంటే హైకోర్టు తదితర సంబంధిత విభాగాలు రాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారని బాదపడుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు వెళ్లి కర్నూలుకు అది అవసరం లేదన్నట్లుగా మాట్లాడారన్న అభిప్రాయం కలిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు యాత్ర తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్, జేఏసీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సీమ గర్జన పేరుతో న్యాయరాజధాని కోసం సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి దానిని సక్సెస్ చేశారు. ఈ సభకు వ్యతిరేకంగా ఈనాడు, తదితర పత్రికలు కొంత ప్రచారం చేయకపోలేదు. బలవంతంగా విద్యార్థులను తీసుకు వెళ్తున్నారని, బస్లు తిప్పుతున్నారని ఇలా ఏవేవో కధనాలు ప్రచారం చేశాయి. చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష అని, నవనిర్మాణ దీక్ష అంటూ ఆయా చోట్ల ప్రభుత్వపరంగా సభలు పెట్టినప్పుడు జనాన్ని ఎలా మళ్లించింది అందరికి తెలిసినా, ఈ పత్రికలు మాత్రం కళ్లు మూసుకున్నాయి. పోలవరం, అమరావతి సందర్శన అంటూ కోట్ల రూపాయలతో బస్లలో జనాన్ని అప్పట్లో తరలించినా, అదంతా గొప్ప విషయంగా కనిపించేది. అది వేరే విషయం. న్యాయ రాజధానిని శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం చేయాలన్నది సీమ ప్రాంతవాసుల కోరిక. ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్న మాట నిజం. అప్పట్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తర్వాతకాలంలో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడి అన్నీ హైదరాబాద్కు తరలివెళ్లాయి. తిరిగి 2014లో తెలంగాణ విడిపోయాక, యధాప్రకారం ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యవహారంతో పాటు, మొత్తం రాజధాని ఎలా ఉండాలన్నదానిపై నిపుణుల కమిటీలు వేశారు. అప్పటికే శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులు ఉన్నాయి. ఇవన్నీ రాజధాని వికేంద్రీకరణకు అనుకూలగా ఉండటంతో జగన్ వికేంద్రీకరణకు మద్దతుగా నిర్ణయం చేశారు. కానీ అది వివిధ కారణాల వల్ల ఇంకా అమలు కాలేదు. అందుకు టిడిపి అడ్డు తగలడమే ప్రధాన హేతువు అన్న సంగతి తెలిసిందే. తాజాగా మారిన పరిణామాలలో సుప్రీంకోర్టు నుంచి ఐదు అంశాలలో ప్రభుత్వానికి అనుకూలంగా స్టే రావడంతో ప్రభుత్వ వర్గంలో నమ్మకం పెరిగింది. అందుకే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జగన్నాధగుట్టలో హైకోర్టు వస్తుందని ప్రకటించారు. ఇది ఒక అడుగు ముందుకు వేయడమే అవుతుంది. ఈ గర్జన సభ సక్సెస్ అవడం టిడిపికి మింగుడు పడని అంశమే. అసలే రాయలసీమలో టిడిపి బాగా బలహీనంగా ఉంటే, ఇప్పుడు ఈ హైకోర్టు ఉద్యమం ఆ పార్టీని మరింత గందరగోళంలోకి నెట్టింది. కర్నూలు హైకోర్టు డిమాండ్కు బిజెపి, సిపిఎం వంటి పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కాదనలేని స్థితి. సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావచ్చన్నది ఎక్కువమంది విశ్వాసం. అలా జరిగితే ఆ తర్వాత కర్నూలుకు హైకోర్టు రావడం తథ్యమన్న అభిప్రాయం కలుగుతుంది. అందుకే బుగ్గన ధైర్యంగా కర్నూలులో ఫలానా చోట హైకోర్టు వస్తుందని ప్రకటించి ఉండాలి. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
నేనొకటి చెప్తే నువ్వొకటి రాస్తావా.. వయసొచ్చింది బుద్ధి రాలేదా రామోజీ
-
ప్రత్యేక హోదాని నెరవేర్చాలని కోరతాం: ఎంపీ విజయసాయి రెడ్డి
-
నీవు 14 సం.ల్లో చేయలేనిది.. మేము మూడేళ్ళలో చేసి చూపించాం..!!
-
బోగస్ సర్వేలు చేయించుకోవడం చంద్రబాబుకు అలవాటే
-
భార్య మీద అనుమానం.. ఎనిమిదేళ్ల కుమారుడికి నిప్పు..!!
-
వైఎస్ఆర్ సీపీ మద్దతు కోరనున్న ద్రౌపది ముర్ము
-
చరిత్ర సృష్టించిన సీఎం జగన్.. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు
-
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ గ్రాండ్ సక్సెస్
-
బట్టలైనా ఊడదీసుకుని తిరుగుతామంటారు: కొమ్మినేని విశ్లేషణ
-
గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ హైలైట్స్
-
ఎన్నికలకు సన్నద్ధం కండి.. సర్వ సైన్యాన్ని సిద్ధం చేయండి..!!
-
ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
-
లక్షలాది మంది కార్యకర్తల్ని తన స్పీచ్ తో ఉర్రుతలూగించిన సీఎం జగన్
-
చంద్రబాబు ధరించిన ఉంగరం పై సీఎం జగన్ పంచులు
-
వైఎస్ఆర్ సీపీ జీవిత కాలపు జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక
-
నీ జీవితంలో వారికి పదవులు ఇచ్చావా బాబు ??
-
మన పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం పుట్టిన పార్టీ
-
అభినవ అల్లూరి జగనన్న.. అది చంద్రబాబు జలగల సమూహం
-
విజయమ్మ ప్రసంగం వక్రీకరణ.. ఎల్లో మీడియాపై సజ్జల ఆగ్రహం
-
కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యారంగంలో మార్పులు
-
పేదింటి తల్లిదండ్రులు, పిల్లల అభిలాషకు విలువనిచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్
-
విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్
-
ఇదే ఉత్సాహంతో 2024లో కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం
-
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు
-
ప్రతి పేదవాడికి అండగా నిలబడటమే వైఎస్ఆర్ సీపీ సిద్ధాంతం
-
ఆశయం కోసం పోరాడే పులివెందుల పులి సీఎం వైఎస్ జగన్
-
మహిళలను శక్తివంతంగా తీర్చి దిద్దాలన్నది సీఎం జగన్ సంకల్పం
-
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం