ముగ్గులతో మహిళల నిరసన | ap capital area women protest with rangoli | Sakshi

ముగ్గులతో మహిళల నిరసన

Jan 14 2015 5:21 PM | Updated on Aug 18 2018 5:48 PM

ముగ్గులతో మహిళల నిరసన - Sakshi

ముగ్గులతో మహిళల నిరసన

ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు ప్రాంత మహిళలు సంక్రాంతి సందర్భంగా ముగ్గులతో తమ నిరసన తెలిపారు.

నిరసన  తెలపడానికి అనేక మార్గాలుంటాయి. కొంత మంది  ఉద్యమబాట పడతారు..మరికొంత మంది మౌనప్రదర్శన చేస్తారు.. ఇంకొంతమంది హింసను ఎన్నుకుంటారు. కానీ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు ప్రాంత మహిళలు మాత్రం.. సంక్రాంతి సందర్భంగా ముగ్గులతో తమ నిరసన తెలిపారు.

ముగ్గుల ద్వారా తమ మనసులోని భావాలు చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చేది లేదని పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు తెలిపారు. భూములు ఇవ్వం అంటూ రంగురంగుల ముగ్గులతో రాశారు. స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా, ఏపీ సర్కారు మాత్రం మొండిగా భూసేకరణతోనే ముందుకెళ్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement