women protest
-
నాలుగేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సోషల్ మీడియా ఇన్స్ట్రాగామ్లో చిగురించిన ప్రేమ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో కొత్త మలుపు తిరిగింది. ప్రియురాలు ప్రియుడు ఇంటి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని కోరిన ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల వివరాలు ప్రకారం.. ఇల్లంతకుంట మండలానికి చెందిన రచన అనే యువతికి తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి ఇరువురు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో రచన తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్న క్రమంలో ఆ విషయాన్ని సాగర్కు చెప్పి తనను వివాహం చేసుకోవాలని కోరింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించాలని కోరింది. అప్పటి నుంచి సాగర్ ముఖం చాటేశాడు. రచన ఫోన్ నంబర్ను బ్లాక్లో పెట్టి స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించింది. ఆదివారం గండిలచ్చపేట గ్రామానికి చేరుకొని సాగర్ ఇంటి ఎదుట బైఠాయించింది. యువతి బైఠాయించిన విషయం తెలుసుకున్న తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్ సఖీ టీమ్తో గండిలచ్చపేట చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రచన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆంక్షలను ధిక్కరిస్తూ.. లో దుస్తులతో నిరసన
టెహ్రాన్: బహిరంగంగా మహిళల వేషధారణపై కఠిన నిబంధనలు, కట్టుబాట్లను అమలుచేస్తున్న ఇరాన్లో ఓ విద్యార్థిని నిరసన గళం విప్పారు. ముఖం కనిపించకుండా సంప్రదాయ వస్త్రం ధరించలేదన్న కారణంగా టెహ్రాన్లో ఆ విద్యార్థినిపై బసీజ్ పారామిలటరీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టెహ్రాన్లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ ఇందుకు వేదికైంది. వాగ్వాదంలో బసీజ్ పారామిలటరీ సభ్యులు ఆ వర్సిటీ విద్యార్థిని దుస్తులు చింపేశారు. దీంతో ఆగ్రహంతో ఆ అమ్మాయి చిరిగిన బట్టలు పక్కన పడేసి లోదుస్తుల్లో తన నిరసన వ్యక్తంచేసింది. విద్యార్థినులపై కఠిన మత చట్టాలను అమలుచేయడమేంటని నిలదీసింది. అలాగే లోదుస్తుల్లో వందలాది విద్యార్థినీవిద్యార్థుల మధ్యలో వర్సిటీ ప్రాంగణంలో కలియ తిరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసింది. దీంతో సాధారణ దుస్తుల్లో వచి్చన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కారులో కుక్కి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దీంతో ఆమె ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ సంస్థ స్పందించింది. ‘‘ ఆమె ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. బేషరతుగా విద్యార్థిని తక్షణం విడుదలచేయాలి. ఆమెను పోలీసులు కొట్టడం, వేధించడం చేయొద్దు. కుటుంసభ్యులు, లాయర్తో మాట్లాడే అవకాశం కల్పించాలి. పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలి’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ డిమాండ్ చేసింది. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమినీ అనే యువతిని నైతిక పోలీసులు చిత్రవధ చేసి చంపడం, అది ఇరాన్లో భారీ నిరసనలకు దారితీయడం తెలిసిందే. -
కాకినాడ జిల్లా తునిలో మద్యం షాపులపై మహిళల తిరుగుబాటు
-
నెల్లూరులో టెన్షన్ టెన్షన్..
-
తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మద్యం షాపును మహిళలు అడ్డుకున్నారు. ఆశ్రమం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డెక్కారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు, స్థానికుల నినాదాలు చేశారు.విజయవాడ: కూటమి లిక్కర్ టెండర్లపై వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి నేతల జేబులు నింపడానికే చంద్రబాబు లిక్కటర్ టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిని కూటమి నేతలు బెదిరిస్తున్నారని.. కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తున్నారన్నారు. మరికొందరు బరితెగించి టెండర్ దక్కించుకున్న వారిని కిడ్నాప్ చేస్తున్నారన్నారు.పేద మహిళల కళ్లలో ఆనందం చూడటమే అప్పటి జగన్ ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు కుటీల రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అవినాష్ అన్నారు.ప్రకాశం జిల్లా: ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడం చేతకాని ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం సిగ్గుచేటని ఐద్వా ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి.పద్మ మండిపడ్డారు. అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన మద్యం టెండర్ల లాటరీని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి.మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మద్యం వ్యాపారాన్ని చేస్తుందని మండిపడ్డారు. -
అర్ధరాత్రిలో స్వతంత్ర పోరాటం
‘నైట్ ఈజ్ అవర్స్’ పేరుతో ఆగస్టు 14 అర్ధరాత్రి కోల్కతాలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలుపనున్నారు.అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాని అర్ధరాత్రి సురక్షితంగా జీవించే హక్కు స్త్రీలకు రాకపోవడంపై ఈ నిరసన.కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో రాత్రిని చూసి భయపడుతూ బతకవలసిందేనా అని నిలదీస్తున్నారు స్త్రీలు.ఈ నిరసన, గతంలో ఇలాంటి ప్రతిఘటనలపై కథనం.‘ఏ రోజైతే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా రోడ్డు మీద నడవగలదో ఆ రోజు ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అన్నారు గాంధీజీ. ఆయన కలలుగన్న స్వాతంత్య్రం ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉంది. డిసెంబర్ 16, 2012లో ఢిల్లీలో అర్ధరాత్రి ఒక నిర్భయ దారుణంగా లైంగికదాడికి లోనై మరణిస్తే మొన్న గురువారం (ఆగస్టు 8) అర్ధరాత్రి కోల్కతాలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఒక ట్రయినీ డాక్టర్ దారుణంగా అత్యాచారానికీ హత్యకూ లోనైంది. దీంతో దేశవ్యాప్తంగా వైద్యబృందాలు భగ్గుమన్నాయి. నిరసనలు సాగుతున్నాయి. వైద్యులు వైద్యసేవలు మాని ఈ అన్యాయానికి జవాబేమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణ న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.అర్ధరాత్రి నిరసన‘ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వచ్చింది. కాని స్త్రీలకు తమ ఇంట్లో, పని చోట, బహిరంగ ప్రదేశాల్లో రాత్రుళ్లు ఎటువంటి స్వేచ్ఛ లేని బానిసత్వమే మిగిలింది. కోల్కతాలో జరిగిన దారుణకాండ కు నిరసనగా ఈ ఆగస్టు 14 అర్ధరాత్రి మహిళలందరం నిరసన చేయనున్నాం’ అని కోల్కతాలోని మహిళలు తెలియచేస్తున్నారు. ఈ నిరసకు స్త్రీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మనదేశంలో సూర్యుడు అస్తమించగానే స్త్రీలలో, వారి కుటుంబ సభ్యుల్లో ఆ స్త్రీలు ఇంటికి చేరే వరకు ఆందోళన ఉంటుంది. వారి మీద ఏదోవిధమైన దాడి జరిగే వాతావరణం ఉండటమే ఇందుకు కారణం. ఒంటరి స్త్రీ బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తే ఆమెతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే తెగింపు కొన్ని మూకలలో ఈ సమాజంలో ఉంది. స్త్రీలకు పరిమిత సమయాలలో పరిమిత స్థలాలలోనే రక్షణ. లేదంటే లేదు. అయితే నిర్భయ ఘటన ఆమె రోడ్డు మీద ఉన్నప్పుడు జరిగితే కోల్కతాలో బాధితురాలు ఆస్పత్రిలో తన డ్యూటీలో ఉండగా దాడి జరగడం తీవ్రమైన ప్రశ్నను లేవదీసేలా ఉంది.మీట్ టు స్లీప్నిర్భయ ఘటన జరిగాక ఆమెను తలుచుకుంటూ ప్రతి డిసెంబర్ 16న పార్కుల్లో మహిళలు బృందాలుగా నిదురించే కార్యక్రమం ‘మీట్ టు స్లీప్’ నిర్వహించాలని బెంగళూరుకు చెందిన ‘బ్లాక్ నాయిస్’ అనే సంస్థ పిలుపునిస్తే దేశంలోని అన్ని మెట్రో నగరాలలో ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ‘పబ్లిక్ ప్లేసులపై మా హక్కు కూడా ఉంది. మేము అక్కడ సురక్షితంగా ఉంచే పరిస్థితిని డిమాండ్ చేస్తున్నాం’ అని ఈ కార్యక్రమం కోరుతోంది. బ్లాక్ నాయిస్ ఫౌండర్ జాస్మిన్ పతేజా దీని రూపకర్త.విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్:ఢిల్లీ రోడ్ల మీద అర్ధరాత్రి స్వేచ్ఛగా నడిచే హక్కు స్త్రీలకు ఉంది అని ‘విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్’ పేరుతో అక్కడి మహిళా బృందాలు రాత్రుళ్లు నడిచి తమ గళాన్ని వినిపించాయి. మల్లికా తనేజా అనే థియేటర్ ఆర్టిస్ట్ ఇందుకు పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘రాత్రిపూట ఖాళీ ఫుట్పాత్ మీద స్వేచ్ఛగా కూచునే అనుభూతి ఇప్పుడు పొందాను’ అని ఈ అర్ధరాత్రి నడకలో పాల్గొన్న ఒక మహిళ అంది.సమాజంలో స్త్రీకి గౌరవం దక్కాలన్నా ఆమె సురక్షితంగా ఉండాలన్నా ఇంటిలో బడిలో పని చోట్ల ప్రభుత్వ విధానాలలో సినిమాలలో కళల్లో ఆమెను గౌరవించే వాతావరణం, బౌద్ధిక శిక్షణ అవసరం. కఠినమైన చట్టాలతో పాటు విలువల ఔన్నత్యం కూడా అవసరం. స్త్రీలను కించపరిచే భావజాలం ఎక్కడ ఉన్నా దానిని నిరసించడం అందరూ నేర్వాలి. లేని పక్షంలో అర్ధరాత్రి నిరసనలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూనే ఉంటాయి. -
దారి ఆక్రమించారని మహిళ నిరసన
కుప్పం రూరల్: రోడ్డు సమస్య పరిష్కరించాలంటూ ఓ మహిళ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య హిమబిందు తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించారని మునిసిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఆ దారిలో కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నారని, తమకు దారి సౌకర్యం కల్పించాలని కోరింది. ఈ నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్ తనతో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారని, రోడ్డు సమస్యను పరిష్కరించలేదని ఆమె నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు మహిళను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి రోడ్డు మూసివేసిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మునిసిపల్ కమిషనర్పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. శనివారం సాయంత్రం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో తన తప్పు ఏమీలేదని, హిమబిందు తనకు కూతురు లాంటిందని వివరణ ఇచ్చారు. -
ఇరాన్లో హిజాబ్ హీట్.. చైనా తరహా పరిస్థితే అక్కడ కూడా ఉందా?
ఆడోళ్లు పిడికిళ్లు బిగించడంతో ఇరాన్ భగ్గుమంటోంది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని ఓ అమ్మాయిని అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆరోపిస్తూ మహిళలు వీధులకెక్కి ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే హిజాబ్లను తీసి నడివీధిలో దగ్ధం చేశారు. పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హిజాబ్ అనేది తమ కల్చర్ కానే కాదని అది కేవలం మహిళలను కల్చర్ ముసుగులో అణచివేసే ఒత్తిడి మాత్రమేనని వారు దుయ్యబడుతున్నారు. ఇరాన్లో కొనసాగుతోన్న ఈ ఉద్యమానికి పలు ప్రపంచ దేశాల్లో ప్రజల నుండి సంఘీభావం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వంపైనా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. పోలీసుల తీరుకు.. పాలకుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ మంటలు పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలీని భయం పాలకులను కంగారు పెడుతోంది. గత ఏడాదో అంతకు ముందో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటిన వేళ ఇరాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు. ఆ తర్వాత ఇంతగా జనం బయటకు వచ్చి ఆందోళనలకు దిగిన సంఘటనలు ఒక్కటి కూడా లేవు. ఇపుడు ఈ ఉద్యమం రోజు రోజుకీ తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే ఈ ఆందోళనలో పోలీసుల తూటాలకు లాఠీ దెబ్బలకు చాలా మంది తలలు వాల్చేశారు. ఆందోళన కారుల తిరుగుబాటు దాడిలో ఒకరిద్దరు భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. మొత్తం మీద అటూ ఇటూ కలిసి ఇప్పటివరకు 75 మందికి పైనే మరణించి ఉంటారని ప్రాధమిక అంచనా. కాకపోతే చైనా తరహాలోనే ఇరాన్ లో కూడా ఉద్యమాల సమయంలో మరణించే వారి సంఖ్య బయటకు రాదు. ప్రభుత్వాలు అంత గట్టిగా ఉక్కుపాదానికి పని చెబుతారు. అంతటి కఠిన నిబంధనల చట్రంలోనూ 75 మంచి చనిపోయారన్న వార్త బయటకు వచ్చిందంటే వాస్తవంగా ఈ లెక్క ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో ఊహించడానికే భయమేస్తుందంటున్నారు మేథావులు. అసలింతకీ ఇరాన్లో మహిళలు ఎందుకిలా వీధుల్లోకి వచ్చి ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందో తెలుసుకోవాలి ముందు. మహసా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి కుటుంబ సభ్యులతో కలిసి టెహ్రాన్ కు వచ్చింది. ఆమెను మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేసిన తప్పేంటంటే హిజాబ్ ను సరిగ్గా ధరించకపోవడమే. ఇరాన్ లో ప్రతీ మహిళ హిజాబ్ ను ధరించాలి. అది అక్కడి డ్రెస్ కోడ్. ఆ హిజాబ్ ను కూడా ఒక పద్ధతి ప్రకారం ధరించాలి. ఎలాగంటే అలా తలకి చుట్టేయకూడదు. ఈ నిబంధనలను మహిళలు అమలు చేస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించేందుకే మోరల్ పోలీసు విభాగాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మహాసా అమిని హిజాబ్ ను సరిగ్గా కట్టుకోలేదని గమనించిన మోరల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత అత్యంత దారుణంగా హింసించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా లాభం లేకపోయింది . సెప్టెంబరు 16న అమిని చనిపోయింది. Thousands of people at the #Vancouver Art Gallery, standing in solidarity with the people of Iran, following Mahsa Amini's death in custody. Their message: “stop Islamic regime’s brutality, put an end to compulsory hijab, end the use of capital punishment in Iran.” @cbcnewsbc pic.twitter.com/gtdKea1p2w — Janella Hamilton (@JanellaCBC) September 26, 2022 అమిని మరణ వార్త క్షణాల్లో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో అధికారులను తిట్టిపోసిన జనం ఈ విషయంలో ప్రభుత్వానికి గట్టి అల్టిమేటం ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. గంటల్లోనే అమిని హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. మహిళలు తమ పోనీ టెయిల్ జుట్టును కత్తిరించుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఉంచి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇరాన్ అంతటా వ్యాపించేసింది. అక్కడితో ఆగలేదిది. ఇరుగు పొరుగు దేశాలకూ విస్తరించింది. ప్రతీ దేశంలోనూ ఇరాన్ మహిళల ఉద్యమానికి మద్దతుగా మహిళలు యువకులు కూడా బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. టర్కీలో నివసించే ఇరాన్ యువతి నసీబే ఇరాన్ కాన్సులేట్ ఎదురుగా నిరసన ప్రదర్శనలో పాల్గొని అందులోనే తన పోనీ టెయిల్ ను కత్తిరించుకుంది. ఈ ఆందోళనల్లో చనిపోయిన ఓ యువకుడి మృతదేహాన్ని ముందు పెట్టుకుని కుటుంబ సభ్యులు రోదిస్తోన్న సమయంలో అతని సోదరి తన జుట్టు కత్తిరించి సోదరుని మృతదేహంపై పెట్టి నిరసన వ్యక్తం చేసింది. "Women have been protesting against the compulsory hijab for four decades now, and this time around, there has been a real outpouring of support from people from all walks of life, from many different provinces across Iran." - @UNHumanRights #Iran #IranProtests #MahsaAmini pic.twitter.com/slGRXebak0 — UN Geneva (@UNGeneva) September 27, 2022 అసలు హిజాబ్ సంస్కృతి ఎలా మొదలైందో కూడా తెలసుకోవాలి.. 1979 ప్రాంతంలో ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖొమైనీ దేశంలో మహిళలంతా విధిగా హిజాబ్ ధరించి తీరాలని ఆదేశించారు. దాంతో వేలాది మంది వీధుల్లోకి వచ్చి దాన్ని వ్యతిరేకించారు. ఆ ఉద్యమ సెగకు కంగారుపడిన పాలకులు అబ్బే అదేమీ ఆంక్ష కాదు కేవలం ఆయన సిఫారసు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ తర్వాత దేశంలో విప్లవం వచ్చింది. దాని తర్వాత 1983 నుండి హిజాబ్ ధారణతో పాటు మహిళల వస్త్రధారణకు సంబంధించి ఒక డ్రెస్ కోడ్ ను ప్రకటించారు. అప్పటి నుండి హిజాబ్ ను ధరించడమే కాదు దాన్ని చట్టంలో చెప్పిన విధంగానే ధరించాలన్న ఆంక్ష అమలవుతూ వస్తోంది. 1979కి ముందు దేశాన్ని పాలించిన లౌకిక పాలకుడు మహమ్మద్ రెజా పహలావి హయాంలో హిజాబ్ ధరించాలన్న ఆంక్షలు లేవు కానీ.. చాలా మంది మహిళలు స్వచ్ఛందంగా హిజాబ్ ధరించేవారు. దానికి రకరకాల కారణాలున్నాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకైతేనేం ఓ సంప్రదాయంగా భావించడం వల్లనైతేనేం తమ మతానికి సంబంధించిన ఓ చిహ్నంగా గౌరవించడం వల్లనైతేనే మహిళలు తమంతట తాము ధరించేవారు. అయితే 1983కి ముందు వరకు ఎవరైనా హిజాబ్ ధరించకపోయినా అది నేరమేమీ కాదు. ఎలాంటి శిక్షలూ ఉండేవి కావు. ఎవరూ ఒత్తిడి చేసేవారు కూడా కాదు. కానీ ఎప్పుడైతే అది ఒక చట్టమై కూర్చుందో అప్పటినుంచే సమస్య మొదలైంది. దాన్ని కఠినంగా అమలు చేసే క్రమంలో మోరల్ పోలీసులు మరీ కఠినంగా వ్యవహరించడంతో మహిళల్లో హిజాబ్ పట్ల ఒకరకమైన వ్యతిరేకత వస్తోందని ప్రముఖ ఇరాన్ జర్నలిస్ట్, కవి అమిని అంటున్నారు. హిజాబ్ ధరించకపోతే అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తారన్న భయమే మహిళల్లో హిజాబ్ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యిందని మేథావులు అంటున్నారు. హిజాబ్ను అడ్డుపెట్టుకుని మహిళలను అణచివేస్తున్నారన్న భావన రావడంతోనే హిజాబ్ ను అణచివేతకు ఓ సింబల్ గా భావిస్తున్నారు మహిళలు. ప్రస్తుతం ఇరాన్ ను అట్టుడికిస్తోన్న ఉద్యమం కేవలం హిజాబ్ కు వ్యతిరేకంగా మాత్రమే కాదంటున్నారు ఇరాన్ మహిళలు." మాకు స్వేచ్ఛ కావాలి. మాకు ప్రజాస్వామ్యం కావాలి. సంప్రదాయాలు సంస్కృతుల ముసుగులో మమ్మల్ని అణచివేసే నిరంకుశ పోకడలు పూర్తిగా పోవాలి మా బతుకులు మేం ప్రశాంతంగా బతికే వీలు ఉండాలి" అని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. ఇరాన్లో రకరకాల జాతులు, తెగల వాళ్లు జీవిస్తున్నారు. వాళ్లల్లో ఒక్కో తెగ ఒక్కో రకమైన వస్త్ర ధారణ చేస్తారు. అది వారి సంప్రదాయం. హిజాబ్ను కూడా ఒక్కో తెగ ఒక్కో విధంగా కట్టుకుంటారు. అది కూడా వారి సంస్కృతి. పాలకుల ఆంక్షలు మాత్రం అందరూ ఒకేలా హిజాబ్ కట్టాలి. ఇష్టం వచ్చినట్లు హిజాబ్ ను కట్టుకుంటే అరెస్ట్ చేసి జైలుకు పంపేస్తారు. ఈ తలా తోకా లేని పాలకుల విధానాలే వివిధ తెగలు జాతుల స్వేచ్ఛను మంటకలుపుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇరాన్లో పర్షియన్లు, కుర్దులు, అజర్ బైజానీయులు, గిలాకీలు, అరబ్బులు, బలూచ్లు, టర్క్ మెన్లతో పాటు మరికొన్ని జాతులు నివసిస్తున్నాయి. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో జీవనశైలి. ఒక్కొక్కరిదీ ఒక్కో సంప్రదాయం. ఒక్కో సంస్కృతి. అందరినీ ఒకే గాటన కట్టేసి మీరు ఇలాగే చేయండని ఆంక్షలు విధించడమంటే వారి జీవించే స్వేచ్ఛను అణచివేయడమే అవుతుందంటున్నారు హక్కుల నేతలు. ప్రజలకు నచ్చని పనులు చేసి తీరాలని ఆంక్షలు విధించడం హక్కులను హరించడం కిందే లెక్క అంటున్నారు మహిళలు. ఇరాన్ పాలకులు రకరకాల ఆలోచనలతో చేస్తున్నది అదే అంటున్నారు వారు. తల నుంచి పాదాల వరకు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే నల్లటి బట్టను ధరించాలని ప్రభుత్వం ఓ విధానాన్ని ప్రతిపాదించింది. వ్యవస్థలో మార్పు రావాలన్న కసి అందరిలోనూ ఉంది. అందుకే హిజాబ్ అనేది కేవలం మహిళల సమస్యగా చూడ్డంలేదు ఇరానియన్లు. మహిళలతో పాటు పురుషులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా వీధుల్లోకి వచ్చి పాలకుల తీరును ఎండగడుతున్నారు. దేశంలోని మొత్తం 31 ప్రావిన్సులు, 80కి పైగా నగరాల్లో ఉద్యమం ఉధృత రూపంలో కొనసాగుతోంది. జనజీవితాలు స్తంభించాయి. ఈ ఉద్యమ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోక తప్పదంటున్నారు ఇరాన్ అధినేత ఎబ్రహీం రైజీ. దేశ సమగ్రత అంతర్గత భద్రతలకు ముప్పు వాటిల్లేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి ఉండనే ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు. దానర్ధం ఉద్యమం ఎంత ఉధృతం అయినా అణచివేసి తీరతాం అనా? అని మేధావులు నిలదీస్తున్నారు. Why are Iranian women burning their hijabs and cutting their hair? Al Jazeera's @DorsaJabbari explains how Mahsa Amini has become a symbol for Iranian women’s rights after her death ⤵️ pic.twitter.com/puw0gZYTN4 — Al Jazeera English (@AJEnglish) September 27, 2022 ఆందోళనలే అయితే ఫరవాలేదు. ఇవి ఆందోళనల్లా కనపడ్డం లేదు. అంతకు మించి తీవ్రమైన లక్ష్యాలేవో ఉన్నాయని అనిపిస్తోంది అని రైజీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ కు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఆస్కార్ అవార్డ్ విజేత అస్ఘర్ ఫర్హాదీ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులంతా కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. అమిని హత్యోదంతం యావత్ ప్రపంచం సిగ్గుతో తలదించుకోవలసిన ఘటన అని అస్ఘర్ అభివర్ణించారు. యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాల్లోని ఇరానియన్లు ఈ ఉద్యమానికి మద్దతుగా ఆయా దేశాల్లో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ సమాజం అంతా ఇరాన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతోంది. ఇది ఇరాన్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగానే ఉంది. అలాగని ఇప్పటికిప్పుడు హిజాబ్ తప్పనిసరి కాదు అని ఎలాంటి ప్రకటన చేసే పరిస్థితులూ లేవు. అమెరికా ఆంక్షలతో ఆర్ధికంగా చితికిపోయి ఉన్న ఇరాన్కు హిజాబ్ ఉద్యమం పెద్ద తలనొప్పిగానే పరిణమిస్తోంది. ఏదో ఒకటి చేయకపోతే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందంటున్నారు మేథావులు. Famous Turkish singer Melek Mosso cut her hair on stage in a show of support to the anti-hijab protests in Iran following the death of Mahsa Amini.#MelekMossco #MahsaAmini #Hijab pic.twitter.com/IbMIqJC2gp — TIMES NOW (@TimesNow) September 28, 2022 ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలే పోరాడారు. సతీసహగమనానికి వ్యతిరేకంగా హిందువులే ఉద్యమించారు. అదే వేరే మతాల నుంచి ఒత్తడి వస్తే ఆ సమస్యలు ఎప్పటికీ అలానే ఉండేవి కావచ్చు. అందుకే ఆంక్షలు విధించడం అనేది పాలకులకు, వ్యవస్థలకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు మేథావులు. అది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని వారంటున్నారు. అందరికీ స్వేచ్ఛనిచ్చే మంచి సమాజాన్ని ఆవిష్కరించడమే ప్రభుత్వాల విధానం కావాలని వారు సూచిస్తున్నారు. Ruthless: Look how this Young Iranian Girl is Brutally thrashed by Monster Police of Iran on roads😡4 Protesting against Forced Hijab & Murderer Regime of Predators that her Head Hit d Pavement on d Road #Hijab #IranProtests2022 #Iran #IranProtests #IranRevolution #MahsaAmini pic.twitter.com/mOe1FJRMQ5 — Jyot Jeet (@activistjyot) September 26, 2022 -
బన్నీ వాసు మోసం చేశాడు.. జనసేన కార్యాలయం ఎదుట..
మంగళగిరి : మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట సోమవారం ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బోయ సునీత ఆరోపించింది. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దామనుకుంటే.. తనను మానసిక వికలాంగురాలిగా చిత్రీకరించారని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎదుట మహిళల నిరసన
-
మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎదుట మహిళల నిరసన
సాక్షి, గుంటూరు: మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. బీస్సీ, ఎస్సీ, ఎస్టీలను పార్టీలో ఎదగకుండా అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ పీఏ సాంబశివరావు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, చర్యలు తీసుకోవాలంటూ మహిళలు నిరసన తెలిపారు. చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్.. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి.. ఐదుగురితో కలిసి కారులో
సాక్షి, జడ్చర్ల(మహబూబ్నగర్): పెద్ద దిక్కుగా ఉంటానంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. ఈ క్రమంలోనే బలవంతంగా కారులో ఎక్కించుకుని మరో నలుగురితో కలిసి ఆమెను రాత్రంతా చిత్రహింసలకు గురిచేసి మొబైల్ ఫోన్, పర్సు గుంజుకున్నాడు. తెల్లవారుజామున ప్రధాన రహదారిపై ఆపి బయటకు తోసేసి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబ్నగర్లో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న 37ఏళ్ల మహిళతో ఎనిమిది నెలలుగా జడ్చర్లకు చెందిన పెద్ద వెంకటేశ్గౌడ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య ఆరోగ్యంగా లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు కలువలేకపోతున్నానని చెప్పాడు. తాను పెద్ద దిక్కుగా ఉంటానంటూ నమ్మబలికి భార్యతోనూ మాట్లాడించాడు. ఇటీవల మహబూబ్నగర్కు చెందిన మిత్రుడు వెంకటేశ్ తదితరులతోనూ వివాహేతర సంబంధం పెట్టుకోవాలన్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఈనెల 2న జడ్చర్లలోని తన ఇంటికి రప్పించాడు. అనంతరం కారులో ఎక్కించుకుని తన బావమరిదితో కలిసి మహబూబ్నగర్కు వెళ్లారు. అక్కడి నుంచి క్రిస్టియన్పల్లి మీదుగా భూత్పూర్కు తీసుకెళ్లారు. అక్కడి దాబాలో ఉన్న పెద్ద వెంకటేశ్గౌడ్ తమ్ముడు చిన్న వెంకటేశ్గౌడ్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కి ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అక్కడి నుంచి తిరిగి జడ్చర్ల మీదుగా అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు మయూరి నర్సరీ సమీపంలో పర్సు, మొబైల్ ఫోన్ లాక్కొని దింపేసి వెళ్లిపోయారు. కాలినడకన మహబూబ్నగర్లోని పాత డీఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద ఉన్న కానిస్టేబుళ్లకు తన గోడును వెళ్లబోసుకుంది. చివరకు వన్టౌన్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. మూడు గంటలకు డీఎస్పీ శ్రీధర్ వచ్చి బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ధర్నాకు అనుమతివ్వండి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జడ్చర్ల పోలీస్స్టేషన్కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సిగ్నల్గడ్డపై ధర్నా చేసేందుకు అనుమతివ్వాలని కోరగా పోలీసులు నిరాకరించారు. అనంతరం విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. నిందితులు ధన బలంతో పోలీసులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. తన మొబైల్లోని ఫొటోలు, వీడియో, ఆడియో రికార్డులను డిలీట్ చేసి పోలీసులకు అప్పగించారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
సాక్షి, కామారెడ్డి : జిల్లాలోని భిక్కనూరు మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంగళవారం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని నినాదాలతో హోరెత్తించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించిన మహిళలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా -
అయిన వాళ్ల మోసం: కూతురితో బిక్షాటన
సాక్షి, సంగెం: ఆర్మీ ఉద్యోగం చేస్తూ భర్త పట్టించుకోకపోగా.. తన పేరిట ఉన్న భూమిని అత్త, బావలు అక్రమంగా పట్టా చేసుకున్నారు.. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కూతురుతో కలిసి భిక్షాటన చేసింది ఓ మహిళ. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తీగరాజుపల్లి గ్రామానికి చెందిన రంగరాజు అమరావతికి, మధుసూదన్కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో సదరు మహిళ 2012లో హన్మకొండలోని మహిళా పోలీసుస్టేషన్లో భర్త, బావ, అత్త, ఆడబిడ్డలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఓ వైపు ఆ కేసు విచారణలో ఉండగానే అత్త, బావ రంగరాజ్ రాజు.. బాధితురాలు పేరిట ఉన్న భూమిని వారి పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయం తెలియగానే అమరావతి తన కూతురుతో కలిసి గ్రామంలో భిక్షాటన చేసింది. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు పరశురాములు, మహేందర్రెడ్డి వారిని అడ్డుకున్నారు. చిన్నపిల్లలతో భిక్షాటన చేయడం నేరమని వారించడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బాధితురాలు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా పోలీసులు గ్రామానికి చేరుకుని కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. -
దేశంలో జైళ్లు సరిపోవు
సాక్షి, హైదరాబాద్: సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతి రేకంగా జైల్ భరో ఆందో ళన్ నిర్వహిస్తే దేశంలోని జైళ్లు సరిపోవని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శివరాంపల్లి లోని జామియా ఇస్లామియా దారుల్ ఉలుమ్లో ఆదివారం యూనైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా జరిగిన మహిళా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మోడీకి వ్యతిరేకంగా గళం విప్పితే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ‘‘నరేంద్ర మోడీజీ.. ఒక సమయం వస్తోంది..జైల్ భరో ఆందోళన్ నిర్ణయం తీసుకుంటాం. దేశంలోని జైళ్లలో మూడు లక్షల మంది కంటే ఎక్కువగా నింపలేరు. మూకుమ్మడిగా రోడ్డుపైకి వస్తే దేశంలోని జైళ్లు సరిపోవు’’అని పేర్కొన్నారు. బాధ్యతగల ఒక మంత్రి అసభ్య పదజాలంతో ఆందోళనకారులపై కాల్పులు జరపమని పిలుపునివ్వడం ఆయన మానసిక స్థితిని బహిర్గతపరుస్తోందన్నారు. మతాలకతీతంగా ఈ దేశం అందరిదీ అని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని హిందుత్వ అజెండా నుంచి కాపాడవల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతి రేకంగా ఉద్యమం కొనసాగుతుందని, గాం«ధీజీ, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుగు సాగుతామని ప్రకటించారు. ఈ సదస్సులో ఇస్లామిక్ పండితులు, మహిళా ప్రతినిధులు,పౌర హక్కుల కార్యకర్తలు ప్రసంగించారు. -
తాళిబొట్ల అప్పగింత ఆందోళన
టీ.నగర్: విద్యుత్ టవర్ల ఏర్పాటు పనులతో బాధిత రైతులకు అధిక నష్టపరిహారం చెల్లించాలంటూ మహిళలు తాళిబొట్ల అప్పగింత ఆందోళన బుధవారం జరిగింది. తిరుపూర్ జిల్లా, పల్లడం తాలూకా సెంబిపాళయం గ్రామంలో విద్యుత్ టవర్లు ఏర్పాటుచేసేందుకు 30 మంది రైతుల 200 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పనులు చేపట్టేందుకు వచ్చిన పవర్గ్రిడ్ సంస్థ సిబ్బందికి రైతులు వ్యతిరేకత తెలిపారు. ఇటీవల తమ ఇళ్లను ఖాళీ చేసి మేకలు, గేదలతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రెవెన్యూ అధికారులు వారిని అడ్డగించి చర్చలు జరిపారు. దీనిపై కలెక్టర్ సమావేశం చర్చలు జరిపి హామీ ఇచ్చారు. అయినప్పటికీ సరైన పరిష్కారం లభించలేదు. ఇలావుండగా మంగళవారం ఆ ప్రాంతంలో 300 మంది పోలీసుల భద్రతతో పవర్గ్రిడ్ సంస్థ సిబ్బంది పనులు చేపట్టేందుకు వెళ్లారు. దీంతో ఆగ్రహించిన రైతులు మహిళలతో కలెక్టరేట్ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. ఆ సమయంలో మహిళలు పసుపు కొమ్ములు కట్టిన తాళిబొట్లతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి కుమార్, ఉద్యమకారుడు పళనిస్వామి పాల్గొన్నారు. దీంతో ఆర్డీఓ కవితా అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. తర్వాత పది మందిని మాత్రం కలెక్టర్ను కలిసేందుకు అనుమతినిచ్చారు. తర్వాత కలెక్టర్తో వారు చర్చలు జరిపారు. ఆందోళన జరపడం మంచిది కాదని కలెక్టర్ తెలిపారని, దీంతో విద్యుత్ టవర్లు ఏర్పాటుచేస్తే అడ్డుకుంటామని అన్నారు. -
మొఘల్స్పై పోరాడిన గభోరులాగే....
సాక్షి, న్యూఢిల్లీ : దేశ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా అస్సాంలో కొనసాగుతున్న ప్రజాందోళనలో మహిళలే ముందున్నారు. నాడు 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తుల దురాక్రమణకు వ్యతిరేకంగా అహోం రాజుల తరఫున వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర వనిత మూల గభోరుతో నేటి మహిళలను పోలుస్తున్నారు. ‘సరాయిఘాట్’ యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయిన నాటి యుద్ధంలో బెంగాల్ సుల్తాన్ జనరల్ టర్బక్ ఖాన్ను గబోరు నాయకత్వాన మహిళలు తరమితరమి కొట్టారు. నేటి సీఏఏ వ్యతిరేక ఆందోళనలో ప్రతి మహిళా ఒక మూల గభోరు కావాలని సామాజిక, కళారంగాలకు చెందిన ప్రముఖులు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ర్యాలీలలో అస్సాం సినీ నటి బార్షా రాణి బిషాయ ప్రముఖ ఆకర్షణగా మారారు. ఆమెను మూల గభోరుగా ప్రముఖ అస్సాం, హిందీ చలన చిత్రాల దర్శకుడు పద్మశ్రీ జాహ్ను బారువా పోల్చారు. ఆదివారం నాడు గువాహటిలోని లతాసిల్ ప్లేగ్రౌండ్ నుంచి చాంద్మారి సెంటర్ వరకు కొనసాగిన ఆందోళనలో పద్మశ్రీ జాహ్ను గట్టిగా నినాదాలు చేస్తూ అందరిని ఆకర్షించారు. ఆమెకు అండగా ప్రముఖ డిజైనర్ గరిమా గార్గ్ సైకియా నిలబడ్డారు. ‘కావల్సినంత సమయం ఉన్నప్పటికీ మీ కాలంలో మీరేమీ చేయలేకపోవడంవల్ల నేడు మేము ఇబ్బందులు పడుతున్నాం. పరాయి వాళ్లు వచ్చి మా భాషను, సంస్కతిని నాశనం చేయడమే కాకుండా నోటికింత ముద్ద దొరక్కుండా మా ఉద్యోగాలను కొల్లగొట్టుకుపోయారు’ అంటూ మన పిల్లలు మనల్ని రేపు నిలదీయకముందే లక్ష్య సాధనలో మనం ముందుకుపోదాం పదంటూ సినీ నటి బార్షా రాణి తోటి మహిళలను ప్రేరేపిస్తున్నారు. 1985లో కేంద్ర ప్రభుత్వం తమ అస్సాం రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా నేడు కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఎలా తీసుకొస్తుందంటూ ఆమె నినదిస్తున్నారు. 1971, మార్చి 24వ తేదీ అర్ధరాత్రికి ముందు భారత్కు వచ్చి స్థిరపిడిన వారిని, వారి పిల్లలను మినహా ఆ తర్వాత వచ్చిన వారందరిని విదేశీయులుగానే పరిగణించి అస్సాం నుంచి బయటకు పంపించాలన్నది 1985లో కేంద్రంతో చేసుకున్న అస్సాం ఒప్పందం. ఇప్పుడు ఆ ఒప్పందానికి విరుద్ధంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ నుంచి 2014కు ముందు వచ్చిన ముస్లింలు మినహా మిగతా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏ బిల్లును తీసుకొచ్చింది. నాడు అహోమ్ రాజులు, మొఘల్స్కు మధ్య జరిగిన యుద్ధాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన యుద్ధంగా చూడలేం. ఎందుకంటే మొగల్స్ సైన్యానికి జైపూర్కు చెందిన రాజా రామ్ సింగ్ నాయకత్వం వహించగా, అహోం రాజుల సైన్యానికి అస్సామీస్ ముస్లిం బాగ్ హజోరికా అనే ముస్లిం నాయకత్వం వహించారు. బీజేపీ నేతలు మాత్రం నాటి ‘సరాయిఘాట్’ యుద్ధాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన యుద్ధంగా పేర్కొంటూ ‘ఇదే ఆఖరి సరాయి ఘాట్’ యుద్ధమంటూ 2016లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేయడం ద్వారా బీజేపీ మొట్టమొదటిసారి అస్సాంలో అధికారంలోకి వచ్చింది. ఇక తమ రాష్ట్రంలో బీజేపీకి శాశ్వతంగా నూకలు చెల్లాయని బార్షారాణి నాయకత్వాన అస్సాం మహిళలు నినదిస్తున్నారు. -
సమీప బంధువే నమ్మించి మోసం చేశాడు!
-
పెళ్లి చేసుకుంటానని మోసం
సాక్షి, మల్యాల(చొప్పదండి) : ప్రేమించానని వెంటపడి.. కన్నవారికి.. కడుపున పుట్టిన వారికి దూరమై.. ప్రేమించిన వాడి సరసన చేరిన మహిళ రోడ్డున పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ.. ఇంట్లో సమస్యలు పరిష్కారం కాగానే ఇంటికి తీసుకెళ్తానంటూ పన్నెండేళ్లుగా సహజీవనం చేశాడు. ప్రియురాలితో నిత్యం ఫోన్లో మాట్లాడుతూ.. మరో మహిళ మెడలో తాళి కట్టిన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన మ్యాకల అనిల్తో పన్నెండేళ్ల క్రితం స్నేహం కుదిరింది. అప్పటికే మహిళకు వివాహమై, ముగ్గురు పిల్లలున్నారు. నిన్ను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానంటూ అనిల్ నమ్మబలికాడు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం వ్యవహారం మహిళ భర్తకు తెలియడంతో పలుమార్లు పంచాయతీ కాగా, చివరికి వీరిద్దరి వివాహేతర సంబంధం కారణంతోనే విడాకులు తీసుకుని, భర్త దగ్గరనే పిల్లలను వదిలిపెట్టి అనిల్ చెంతకు చేరింది. పన్నెండేళ్లుగా సహజీవనం పెళ్లిచేసుకుంటానంటూ నమ్మిస్తూ.. పన్నెండేళ్లుగా సంసారం చేస్తున్నాడు. మా చెల్లి భర్త చనిపోతే కూడా వెళ్తానన్నా వెళ్లనివ్వలేదు. బయట ప్రపంచంతో సంబంధం ఉండకూదడని, ఎవరితో మాట్లాడవద్దంటూ హింసించాడు. వివిధ ప్రాంతాల్లో అద్దెకు ఉంచుతూ, ఇంట్లో సమస్యలు తీరిపోగానే ఇంటికి తీసుకెళ్తానంటూ నమ్మించాడు. చివరికి చెల్లి పెళ్లి అయిన తర్వాత అంటూ ఏ రోజుకారోజు ఏదో ఒక సమస్య చెబుతూ దాట వేశాడు. అన్ని సమస్యలు తీరిపోగానే పన్నెండేళ్లు సంసారం చేసిన విషయం మరిచి, మరో మహిళను మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈనెల 25న కూడా ఫోన్లో మాట్లాడాడు. నా పుట్టింటికి దూరమై..అందరికి నన్ను దూరం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేసి, మరో మహిళను వివాహం చేసుకున్నాడని మహిళ బోరున విలపించింది. పోలీస్స్టేషన్కు చేరిన బాధిత మహిళ తక్కళ్లపల్లిలో నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఇంటి ఎదుట బుధవారం మహిళ బైఠాయించింది. సమాచారం మేరకు ఎస్సై ఉపేంద్రచారి అక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. తనను అనిల్ ఏవిధంగా వంచించాడో వివరించింది. తనకు న్యాయం చేసేదాకా ఇక్కడి నుండి కదలనని, పోలీస్స్టేషన్కు వస్తే అనిల్ తన ధనబలంతో న్యాయం జరగదంటూ తేల్చి చెప్పింది. దీంతో అక్కడినుంచే ఎస్సై ఉపేంద్రచారి అనిల్తో ఫోన్లో మాట్లాడి, పోలీస్స్టేషన్కు రావాల్సిందిగా హుకుం జారీ చేశారు. చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని, ఎవరి పైరవీలకు లొంగమంటూ మహిళకు నచ్చజెప్పడంతో పోలీసులతోపాటు బాధిత మహిళ మల్యాల పోలీసు స్టేషన్కు చేరింది. -
అదనపు కట్నం కోసం వేధింపులు
అనంతపురం సిటీ: అదనపు కట్నం మెట్టినింటి వారి వేధింపులు తాళలేని ఓ మహిళ న్యాయం కోసం ఆందోళనకు దిగింది. భర్త ఇంటి ఎదుట చంటిబిడ్దతో బైఠాయించింది. ఈ ఘటన బుధవారం నగరంలోని శ్రీనగర్కాలనీలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... నగరంలో శ్రీనగర్కాలనీకి చెందిన శ్రీనివాసులుకు గుంతకల్లుకు చెందిన యామినితో 2016లో వివాహమైంది. అప్పట్లో కట్నం కింద రూ.15 లక్షల నగదు, 23 తులాల బంగారు నగలు, రెండు సెంట్ల స్థలం ఇచ్చారు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపుకట్నం కోసం భర్త, అత్తమామాల నుంచి వేధింపులు ప్రారంభమాయ్యియి. భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసించడంతో పాటు జేఎన్టీయూ అనుబంధ ఓటీఆర్ఐలో ఉద్యోగానికి రాజీనామా చేయించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై గతంలో గుంతకల్లు వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపింది. అయితే పోలీసుస్టేషన్కు రావాలని చెప్పినా బేఖాతరు చేస్తున్నట్లు ఆరోపించింది. దీంతో తాను న్యాయం కోసం ధర్నాకు దిగినట్లు వివరించింది. దాదాపు రెండు గంటల పాటు చంటిబిడ్డతో భర్త ఇంటి ఎదుట ఆందోళన కొనసాగించింది. విషయం తెలుసుకున్న నాల్గవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి సర్దిచెప్పారు. న్యాయం చేస్తామని, స్టేషన్కువచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈమెకు మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశాబీ, పద్మావతి, చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగమయ్య తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పొదుపు మహిళల కన్నెర్ర
పొదుపు మహిళలు టీడీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు – కుంకుమ పేరుతో మరోసారి మోసం చేశారని చెబుతున్నారు. చెక్కులను బ్యాంక్ల్లో వేస్తుంటే నగదు రావడంలేదని, పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నారని మహిళలు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల బ్యాంక్ల ఎదుట నిరసన చేపట్టారు. నెల్లూరు సిటీ: పసుపు – కుంకుమ పథకం కింద మూడు దఫాలుగా ఇచ్చిన చెక్కులను ఒకేసారి చెల్లించాలని పొదుపు సమన్వయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని మెప్మా కార్యాలయం ఎదుట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు విడతలుగా రూ.10 వేలు చెల్లించడం చూస్తుంటే అది ఓట్ల కోసమే అని అర్థమవుతోందన్నారు. మొదటి చెక్కును బ్యాంక్లో జమ చేసినా బ్యాంకర్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేయలేదన్నారు. మూడు చెక్కులకు సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాలని చెబుతున్నారన్నారు. వేలమందికి ఇప్పటి వరకు చెక్కులు అందలేదన్నారు. ప్రతిరోజూ మెప్మా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొందరి చెక్కులను బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ మాత్రమే పొదుపు మహిళలు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి మస్తాన్ బీ, రెహానాబేగం, షామీనా బేగం తదితరులు పాల్గొన్నారు. -
నువ్వు లేక నేను లేను అన్నాడు.. కానీ!
భువనేశ్వర్ : వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. నువ్వు లేకపోతే నేను లేనంటూ బాసలు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు ఆ యువకుడు ముఖం చాటేయడంతో కథ అడ్డం తిరిగింది. బాధిత యువతి, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జమదాల గ్రామానికి చెందిన కళింగపట్నం పద్మ (రజక కులానికి చెందిన యువతి) అదే గ్రామానికి చెందిన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కొర్ర సంతోష్కుమార్ ప్రేమించుకున్నారు. సంతోష్ను పూర్తిగా నమ్మిన పద్మ శారీరకంగా దగ్గరైంది. పద్మ తల్లిదండ్రులు సంబంధాలు తీసుకువచ్చినా ఎవర్నీ పెళ్లి చేసుకోవద్దని... తానే చేసుకుంటానని సంతోష్ చెప్పడంతో బాధిత యువతి వచ్చిన సంబంధాలను వదులుకుంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని పద్మ కోరగా కొద్దికాలం నుంచి సంతోష్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సంతోష్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట పద్మ ప్రియుడి ఇంటిముందు తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించగా.. పెద్ద మనుషుల ముందు సంతోష్ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరలా మాట తప్పడంతో పద్మ శుక్రవారం యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేసే వరకూ దీక్ష విరమించేది లేదని బాధితరాలు స్పష్టం చేస్తోంది. మాకు ఇష్టమే.. తమ కుమారుడు సంతోష్కి నచ్చితే పెళ్లి చేయడానికి తమకు ఇబ్బంది లేదని యువకుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఈ నాటకమంతా వారే ఆడిస్తున్నారని బాధిత యువతి ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటే చనిపోతామని తల్లిదండ్రులు బెదిరించడం వల్లే సంతోష్ తనతో వివాహానికి వెనకడుగు వేస్తున్నాడని చెప్పింది. ఇదిలా ఉంటే తనతో పాటు తమ కుటుంబ సభ్యులపై దాడి కూడా చేస్తున్నారని ఆరోపించింది. చివరకు ఈ కేసు పార్వతీపురం రూరల్ పోలీసు స్టేషన్కుచేరింది. ఎస్సై లోవరాజు ఇరువర్గాలతో మాట్లాడినా సంతోష్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అనేక మలుపులు..! ప్రేమికుల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఒకసారి చేసుకుంటాను.. మరోసారి చేసుకోను.. అంటూ ప్రియుడు మాట మార్చడం వెనుక కొంతమంది పెద్దల దన్ను ఉందని బాధిత యువతి తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించి ఆ నెపం మామీద వేసి కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించండి
కత్తిపూడి (శంఖవరం): నమ్మించి గర్భవతి చేసిన వ్యక్తితోనే మనువు జరిపించాలని కోరుతూ ఓ యువతి పోరాటానికి దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఆపై ముఖం చాటేశాడు. దిక్కు తోచని ఆ యువతి పోలీసులను ఆశ్రయించినా కనికరం చూపలేదు. న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందే మంగళవారం ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ రెండో రోజూ బుధవారం కూడా ఆందోళన కొనసాగించింది. మండలంలోని కత్తిపూడి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. బాధితురాలు దడాల వసంత కథనం ప్రకారం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దడాల వసంత అదే గ్రామానికి చెందిన మిరియాల రాజేష్ గత కొంత కాలంగా ప్రేమించమంటూ వెంట తిరిగాడు. తన సామాజిక వర్గీయుడే కావడం, వివాహం చేసుకుంటానని చెప్పడంతో అతడిని నమ్మింది. అయితే తాను గర్భవతిని కావడంతో మోహం చాటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రోత్సాహించడంతో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని తెలిపింది. ప్రేమించిన రాజేష్తో వివాహం జరిపించాలని అంతవరకు ఆందోళన విరమించేది లేదని ఆమె భీష్మించింది. ఆమె ఆందోళనకు బుధవారం మహిళా సంఘాల సభ్యులు మద్ధతు తెలిపారు. ఈ విషయంపై అన్నవరం పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మహిళలేమైనా మావోయిస్టులా : ప్రకాశ్రెడ్డి ఆవేదన
మంత్రి పరిటాల సునీతకు తన రాజకీయ జీవితంలో చవిచూడని ఎదురుదెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గంలో ఆర్భాటంగా ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం నిర్వహించాలనుకున్న ఆమెకుఅడుగడుగునా అడ్డుంకులే ఎదురయ్యాయి. ఆదివారం తోపుదుర్తి వెళ్లిన సునీతను.. డ్వాక్రా మహిళలుఅడ్డుకున్నారు. రోడ్లపై బైఠాయించి.. నల్లజెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ‘నిన్ను నమ్మం సునీతమ్మా’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో చేసిన మోసం చాలనీ, ఇప్పుడు కొత్తగామళ్లీ స్మార్ట్ఫోన్ రూ.10 వేల పేరుతో మాయచేయడం మానుకోవాలన్నారు. మహిళల ప్రతిఘటన..పోలీసుల బలవంతపు అరెస్టులతో తోపుదుర్తి గ్రామం అట్టుడికింది. అనంతపురం, ఆత్మకూరు : మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఆదివారం ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయాలని మంత్రి పరిటాల సునీత నిర్ణయించుకున్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆ గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలు రెండురోజుల కిందటే సమావేశమయ్యారు. మంత్రి సునీత, టీడీపీ సర్కార్ చేసిన మోసానికి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మంత్రి గ్రామానికి వస్తున్నట్లు తెలిసి రోడ్డుపై బైఠాయించారు. నల్లజెండాలు చేతబట్టి నిరసన తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది చాలక మళ్లీ ఇప్పుడు రూ.10వేలు ఇస్తామని పోస్ట్డేటెట్ చెక్కులు(మూన్నెల్ల తర్వాత చెల్లేలా తేదీ వేసిన చెక్కులు) ఇచ్చి మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. తమకిచ్చిన హామీలు నెరవేరిస్తేనే మంత్రిని గ్రామంలోనికి అడుగుపెట్టనిస్తామని, లేదంటే అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. ఇదంతా తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత గ్రామంలోకి కచ్చితంగా వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ బాబుతో పాటు సీఐలు, ఎస్ఐలు, సుమారు 400 మంది పోలీసులను గ్రామంలో మొహరించారు. మహిళలపై పోలీసు జులుం గ్రామానికి వస్తున్న మంత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతామని మహిళలు భీష్మించారు. దీంతో పోలీసులు వారిని చుట్టుముట్టారు. ‘వజ్ర’ వాహనాలను రప్పించారు. 11 గంటలకు మంత్రి కార్యక్రమం జరగాల్సి ఉండగా.. మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ సమయంలోనే మహిళలు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. చివరకు పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. గంటన్నర గ్రామం బయటే... గ్రామంలోని పరిస్థితి తెలుసుకున్న మంత్రి సునీత గ్రామం బయటే వేసి చూశారు. ఆ తర్వాత గ్రామానికి వెళ్లారు. అయితే పరిస్థితి అదుపులోకి రాలేదని తెలిసి దారిలోని గంటన్నరేపు కాన్వాయ్ నిలిపేశారు. దీంతో ఎస్పీ అశోక్కుమార్ గ్రామానికి వచ్చి పోలీసు బలగాలతో మహిళలను అరెస్టు చేసి తరలించారు. ఆ తర్వాత మంత్రి కాన్వాయ్ గ్రామంలోకి రాగానే పోలీసులు రెండువైపులా రక్షణగా ఉండి గ్రామంలోకి అనుమతించారు. అయినప్పటికీ గ్రామస్తులు మంత్రి కాన్వాయ్పై చెప్పులు, పొరకలు, చేటలు విసిరి నిరసన తెలిపారు. తోపుదుర్తి మహిళల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు మద్దతు తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని కూడా బలవంతంగా అరెస్టు చేశారు. రోడ్డుపై బైఠాయించి మంత్రి సునీతకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తోపుదుర్తి గ్రామ మహిళలు వడ్డీ మాఫీ కాలేదు మహిళా సంఘాల్లో తీసుకున్న రుణం అంతా మాఫీ అవుతుందని ఆశపడ్డాం. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇంత వరకు రుణాలు కాదు కదా...వాటికి సంభందించిన వడ్డీలు కూడా మాఫీ కాలేదు. అలాంటప్పుడు మోసపూరిత హామీలు ఎందుకివ్వాలి. – భావమ్మ, తోపుదుర్తి పోలీసుల అండతో వచ్చారు డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మహిళలం నిలదీస్తామని తెలియడంతో మంత్రి సునీత గ్రామంలోకి పోలీసులు అండతో వచ్చారు. నిజంగా హామీలు నెరవేర్చి ఉంటే మహిళలు ఎందుకు నిలదీస్తారు. ఇప్పుడు ‘పసుపు –కుంకుమ’, సెల్ఫోన్ అంటూ మళ్లీ మోసం చేస్తూ.. చెక్కులను అందజేస్తున్నారు. – చంద్రకళ, తోపుదుర్తి మహిళలకుఅన్యాయం చేసిన మంత్రి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని పరిటాల సునీత ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ రుణమాఫీ కాదు కదా కనీసం వడ్డీ కూడా కట్టలేదు. పెట్టుబడి నిధి కింద రూ.10 వేలు ఇస్తే.. ఆ డబ్బును బ్యాంకోళ్లు వడ్డీ కింద జమ చేసుకున్నారు. మహిళలకు అన్యాయం చేసిన మంత్రి మాకు వద్దేవద్దు.– అక్కమ్మ, తోపుదుర్తి -
ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష
పాతపట్నం: ఎన్నారై భర్త మోసం చేశాడంటూ భార్య మౌన పోరాటం చేసిన సంఘటన పాతపట్నం ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలంలోని హరిజన గోపాలపురం గ్రామానికి చెందిన పట్నాల సింహాద్రి, భారతిల కుమార్తె శిరీషకు పాతపట్నం ఎస్సీ కాలనీకు చెందిన సాన ధర్మపురి, విజయల కుమారుడు సాన గౌరీశంకర్తో 2016లో వివాహం జరిగింది. గౌరీశంకర్లో బ్యాంకాక్లో పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో రూ.5 లక్షలు, 5 తులాల బంగారం, ఇతర వస్తువులు కానుకగా ఇచ్చారు. పెళ్లయిన నెల రోజుల నుంచే అదనపు కట్నం కావాలంటూ అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. రెండు నెలలు గడిచిన తర్వాత శిరీషను బ్యాంకాక్ తీసుకెళ్లిన గౌరీశంకర్ 15 రోజుల అనంతరం భార్యను ఒంటరిగా పాతపట్నం పంపించేశాడు. అప్పటి నుంచి శిరీష కన్నవారింట్లోనే ఉంటుంది. గౌరీశంకర్ మాత్రం పాతపట్నం రాకుండా విదేశాల్లోనే ఉంటున్నాడు. ఎప్పటికీ భర్త రాకపోవడంతో శిరీష శనివారం తన మూడేళ్ల కుమారుడు సుజిత్ శంకర్తో కలిసి మౌనదీక్షకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అత్తమామలు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, పోలీసులు స్పందించి తన భర్త పాతపట్నం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడింది. -
సీఎం చంద్రబాబు సభలో మహిళల నిరసన
-
సీఎం చంద్రబాబు ఎదుటే మహిళల నిరసన
సాక్షి, శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాలకు అడుగడుగునా నిరసన సెగలుస తగులుతున్నాయి. తాజాగా జిల్లాలోని రాజాం మండలం పొగిరిలో సీఎం చంద్రబాబు శనివారంజన్మభూమి సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతుండగానే.. మహిళలు ఆందోళనకు దిగారు. సభలో లేచినిలబడిన మహిళలు తమకు ఇళ్లు ఇవ్వలేదని, చంద్రబాబు ప్రభుత్వం వల్ల తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనను తెలియజేస్తూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంతకవిటి మండలం తాలాడకు చెందిన గిరిజన మహిళలు ఈ మేరకు సీఎం సభలో నిరసన గళం ఎత్తారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఎల్ఎన్ పేట మండలం దనుకువాడలో జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎళ్ల తరడబి అర్జీలు ఇస్తున్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామసభను అడ్డుకొని.. అధికారులను గ్రామస్తులు వెనక్కిపంపారు. నాతో పెట్టుకుంటే ఫినిష్.. కాగా ‘‘నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు జాగ్రత్త’’ అని తనను అడ్డుకున్న మహిళలను సీఎం చంద్రబాబు కాకినాడలో హెచ్చరించడంపై దుమారం రేగుతోంది. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కాన్వాయ్ను కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో పలువురు అడ్డుకున్నారు. ‘సీఎం గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బస్సులో ఉన్న చంద్రబాబు బయటకు వచ్చి మండిపడ్డారు. మీకు ఏం కావాలంటూ రుసరుసలాడారు. తనను అడ్డుకున్న వారికి రాష్ట్రంలో ఉండే అర్హతలేదంటూ ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘లేనిపోని ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దు ఇక్కడ..పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు మర్యాదగా ఉండు..చాలా సమస్యలు వస్తాయి..ఢిల్లీలో నిన్న కూడా లాఠీ చార్జీ చేశారు.ఈ నీళ్లు తాగుతున్నారు.. ఈ గడ్డ మీద ఉన్నారు... ఏయ్ ఉండండీ.. నేను అడిగింది చెప్పు.. ఏం చేశారు మీ మోదీ.. ముంచాడు అందరినీ.. రాష్ట్రాన్నీ, దేశాన్ని...బయటకు వస్తే వదలరు.. మిమ్మల్ని పబ్లిక్...ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా..?’ అంటూ తనను అడ్డుకున్న మహిళలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు సభలో మహిళల నిరసన.. ఖాళీగా కుర్చీలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విశాఖలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గురువారం భీమిలిలో జరిగిన సభలో చంద్రబాబు ప్రసగిస్తుండగా మధ్యాహ్న భోజన పథక మహిళలు నిరసన తెలిపారు. ప్రభుత్వమే ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయవద్దని మహిళలు నినదించారు. టీడీపీ కార్యకర్తలు వారించిన కూడా వారు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కూర్చొవాలని చెప్పిన కూడా లెక్కచేయకుండా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు వారించిన కూడా వినకుండా తాము పడుతున్న కష్టాలను ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. సీఎం సభలో ఖాళీగా కుర్చీలు.. ఆత్మీయ సదస్సు పేరిట ఏర్పాటు చేసిన ఈ సభకు జనాలు హాజరు కాలేదు. సభకు జనాలను తరలించేందుకు టీటీడీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. మైకుల్లో పదే పదే ప్రకటనలు ఇప్పించారు. ఆర్టీసీ బస్సులో జనాలను తరలించే ప్రయత్నం చేశారు. దీంతో నగరవాసులు సీటీ బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం సీఎం సభకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. -
కేరళ వ్యాప్తంగా కదం తొక్కిన మహిళాలోకం
-
న్యాయం చేయాలని వివాహిత ఆందోళన
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత మరోసారి పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ఆదివారం ఆందోళనకు దిగిన ఈమెకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ లాబాల స్వర్ణమణి, స్థానిక మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. పట్టణంలోని కొండివీధికి చెందిన నందిక శంకర్ బెల్లుపడ కాలనీకి చెందిన వివాహితను తన ఇంటిలో ఆర్నెల్ల క్రితం లైంగిక దాడికి యత్నించాడు. ఈ నేపథ్యంలో ఆమెకు భర్త విడాకులు ఇస్తానని, కన్నవారు ఇంట్లోకి రానివ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. దీంతో తన ఇద్దరి పిల్లలతో జీవించేందుకు నిందితుడి నుంచి పరిహారం ఇప్పించాలని ఈ నెల 10న పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించింది. ఈ విషయమై స్థానిక పెద్దలతో చర్చించి మూడ్రోజుల్లో న్యాయం చేస్తామని పోలీసులు హామీచ్చారు. నేటికీ ఎటువంటి న్యాయం చేయకపోవడంతో మరలా ఆందోళనకు దిగింది. ఈ విషయమై స్థానిక టీడీపీ నాయకుడు గుజ్జు జగ్గు తనను బెదిరిస్తున్నాడని, అతని వల్లే న్యాయం చేయడంలేదని వివాహిత కన్నీటిపర్యంతమైంది. అతన్ని కూడా విచారించాలని డిమాండ్ చేసింది. ఇక్కడ గంటపాటు ఎదురు చూసిన వివాహిత పోలీసులు అందుబాటులో లేకపోవడంతో వారంతా వెనుదిరిగారు. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి నిరసన
ప్రకాశం, మార్కాపురం: కోచింగ్ సెంటర్లో పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పి ఇప్పుడు ముఖం చాటేశాడంటూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీ ప్రాంతంలో ఉన్న రామాలయం వెనుక వీధిలో జరిగింది. వివరాలు.. అర్ధవీడు మండలం కాకర్లకు చెందిన దండు ప్రియాంక మార్కాపురంలోని ఓ కోచింగ్ సెంటర్కు ఉద్యోగ శిక్షణకు వెళ్తోంది. అక్కడ మహేష్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తాను ఎవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నాడని ప్రియాంక ఆరోపిస్తోంది. మహేష్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది. పోలీసులు సమాచారం అందుకుని ఆమెను పోలీసుస్టేషన్కు పిలిపించారు. తల్లిదండ్రులు యాకోబు, రంగమ్మలు తమ కుమార్తెకు న్యాయం చేయాలని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్ఐ కోటయ్యను వివరణ కోరగా కేసు విచారిస్తున్నట్లు తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌన దీక్ష
షాబాద్(చేవెళ్ల) : ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనదీక్షకు దిగింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేసింది. ఈ సంఘటన షాబాద్ మండల పరిధిలోని లక్ష్మారావుగూడలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మారావుగూడకు చెందిన శేఖర్రెడ్డి తాళ్లపల్లిలో నర్సరీ నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్ద తాళ్లపల్లికి చెందిన మానస పనిచేస్తుండేది. ఈక్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన శేఖర్రెడ్డి మాయమాటలు చెప్పి తన వెంట తిప్పించుకొని లోబర్చుకున్నాడు. తల్లిలేని ఆమెకు జీవితాతం తోడుగా ఉండి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని నమ్మించాడు. మూడు సంత్సరాలు వీరిద్దరు కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి నేడు..రేపు అంటూ శేఖర్రెడ్డి దాటవేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం కలిగిన మానస అతడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో శేఖర్రెడ్డి తమ ఇద్దరి సామాజిక వర్గాలు వేరు.. మన పెళ్లికి తన తల్లిదండ్రులు, కుటుంబీకులు అంగీకరించరని స్పష్టం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకునేది లేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి షాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు శేఖర్రెడ్డిని పిలిపించి విచారణ జరిపారు. మానసతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన నర్సరీలో పనిచేస్తుండేదని, అంతవరకే తనకు తెలుసని స్పష్టం చేశాడు. ఇరువర్గాలకు చెందిన వాళ్లం మాట్లాడుకుంటామని చెప్పి ఠాణా నుంచి వచ్చిన శేఖర్రెడ్డి పరారయ్యాడు. కుటుంబీకులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలని మానస తండ్రితో కలిసి శేఖర్రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించింది. శేఖర్రెడ్డి తనను మోసం చేశాడని కన్నీటిపర్యంతమైంది. అతడితో తనకు పెళ్లి చేసేవరకు ఆందోళన విరమించబోనని తెలిపింది. శేఖర్రెడ్డి తనను వివాహం చేసుకోకుండా ఆత్మహత్యే శరణ్యమని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించింది. పోలీసులు, అధికారులు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మానస ఆందోళనకు గ్రామస్తులు మద్దతు పలికారు. -
రేణుక మోసం చేశారని గాంధీభవన్ ఎదుట ధర్నా
ఖమ్మంసహకారనగర్ : కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తన భర్త రాంజీకి గత సాధారణ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని కోటీ 20లక్షలు తీసుకున్నారని, టికెట్ రాలేదని తన భర్త మరణించారని, ఆ డబ్బును వెనక్కి ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ రాంజీ భార్య కళావతి శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట ధర్నా చేశారు. గిరిజన సంఘం నాయకులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కళావతి, గిరిజన సంఘం నాయకుడు రవిచంద్ర చౌహాన్లు మాట్లాడుతూ..2014లో వైరా టిక్కెట్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని..టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. రాంజీ చనిపోతే కనీసం చూడ్డానికి కూడా రాలేదని, తీరా ఇంటికి వెళ్తే కేసులు పెట్టించారని ఆరోపించారు. నాలుగేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగట్లేదని, ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శికి, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. ఇన్ని సంవత్సరాలుగా వివిధ దశల్లో పోరాడామని, అయినా స్పందించకపోవడం రేణుకకు తగదని, తమ డబ్బును వెనక్కిప్పించాలని కోరారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
సాక్షి, పి.గన్నవరం : తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం చిరతపూడిలో సమస్యలపై ఎమ్మెల్యే పూలపర్తి నారాయణమూర్తిని స్థానిక మహిళలు నిలదీశారు. పదేళ్లుగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు లేవన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపై ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. మీరు ఓట్లేస్తేనే గెలిచామా అంటూ నోరుపారేసుకున్నారు. దీంతో సమస్యలు చెప్తే ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నించారు. ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తాం మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో అధికార టీడీపీ నేతలు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కువైట్ తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడు.. ఆపై
సాక్షి, కడప: వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ఓ యువతి తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగారు. భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. బద్వేలుకు చెందిన షరీఫ్.. సాయి ప్రత్యూష ప్రేమించుకున్నారు. దీంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్కు తీసుకెళ్లిన షరీఫ్.. అక్కడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్లో వదిలేసి.. షరీఫ్ స్వస్థలం తిరిగొచ్చాడు. తన బంధువుల సాయంతో సాయిప్రత్యూష కూడా స్వస్థలం తిరిగొచ్చారు. ఈ క్రమంలో షరీఫ్ బంధువుల కోరిక మేరకు రెండో పెళ్లికి సిద్ధమవ్వడంతో సాయిప్రత్యూష పోలీసులను ఆశ్రయించారు. అయితే, పోలీసులు కేసు నమోదుచేయకుండా పంచాయతీ పేరిట తాత్సారం చేస్తుండటంతో బాధిత యువతి ఆందోళనకు దిగారు. షరీఫ్ ఇంటి ముందు సాయిప్రత్యూష ఆందోళన కొనసాగిస్తున్నారు. -
బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి..
సాక్షి, అమరావతి : భూమి కోసం కన్నకొడుకులే కనికరం లేకుండా ప్రవర్తించారు. తల్లి బతికుండగానే.. ఆమె చనిపోయిందంటూ డెత్ సర్టిఫికేట్ తీసుకొని.. భూమి తమ పరం చేసుకున్నారు. భూమి లాక్కున్న విషయం తెలియడంతో ఆ తల్లి తల్లిడిల్లిపోయింది. కన్నకొడుకుల చర్యకు దిగ్భ్రాంతి చెందింది. తనకు న్యాయం చేయాలంటూ అమరావతిలో ఏపీ సచివాలయం ఎదుట నడిరోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపింది. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆమెను పోలీసులు బలవంతంగా అక్కడ నుంచి తరలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామానికి చెందిన నరసమ్మ తన పేరిట ఉన్న 90 సెంట్ల భూమిని తన ఇద్దరు కొడుకులు లాక్కున్నారని ఏపీ సచివాలయం ఎదుట ఆందోళన దిగారు. తను బతికుండగానే.. అక్రమంగా బూకటపు డెత్ సర్టిఫికెట్ సృష్టించి.. వీఆర్వో వద్ద భూమిని తమ పేరిట బదలాయించుకున్నారని ఆమె వెల్లడించారు. అధికారులకు విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చానని, గతంలో పలుమార్లు అధికారులను కలిసినా తనకు న్యాయం జరగలేదని ఆమె తెలిపారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించిన ఆమెను బలవంతంగా పోలీసులు అక్కడికి నుంచి బయటకు పంపేశారు. -
కన్నకొడుకుల చర్యకు తల్లి దిగ్భ్రాంతి
-
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..
కేతేపల్లి(నకిరేకల్) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామంలో గురువారం జరగింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండకిందిగూడెం గ్రామానికి చెందిన పెరిక చంటి నకిరేకల్లోని ట్రాక్టర్ షోరూంలో కం ప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి పత్తి తీసేందుకు ఇదే మండలంలోని కొత్తపేట గ్రామం నుంచి కొండకిందిగూడెం వస్తున్న మంద మౌనిక, చంటి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చంటి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లోబరుచుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరించాడు. దీంతో బాధితురాలు ఇటీవల కేతేపల్లి పోలీసులను సం ప్రదించింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వటంతో చంటి మూడు రోజులు గడువు కావాలని, తదనంతరం పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. పది రోజులుగా మౌనిక ఫోన్ చేస్తుండగా ఎత్తకుండా ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌనిక చంటి ఇంటి ఎదుట ఆదోళనకు దిగింది. ఇది గమనించిన చంటి కుటుంబ సభ్యులు ఉదయమే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మౌనికకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. -
ప్రేమ, పెళ్లి పేరుతో వంచన
దొడ్డబళ్లాపురం(రామనగర): ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ తన ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈఘటన రామనగర తాలూకా బసవనపురంలో సోమవారం చోటు చేసుకుంది. బసవనపురం సమీపంలోని మధుర గార్మెంట్స్లో పనిచేస్తున్న నిర్మలకు వివాహమైంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే భర్త నుంచి వేరుగా జీవిస్తోంది. ఈక్రమంలో ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భరత్(30)అనే యువకుడితో పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరూ కొంత కాలం సహజీవనం చేశారు. భరత్కు పెద్దమొత్తంలో డబ్బు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే భరత్కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో నిర్మలను వదిలి వెళ్లిపోయాడు. ఇదేం న్యాయమని ప్రశ్నించగా కులం వేరని తన ఇంట్లోనివారు వివాహానికి ఒప్పుకోవడంలేదని సాకు చెప్పాడు. దీంతో నిర్మల మహిళా సంఘాలతో కలిసి భరత్ ఇంటి ముందు ధర్నా చేపట్టింది. మరో వైపు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
లావయ్యావని.. వద్దన్నాడు..
సాక్షి, జగద్గిరిగుట్ట: లావయ్యావని ఓ మహిళను భర్త నిరాకరించిన సంఘటన నగరంలోని బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు శుక్రవారం మహిళ సంఘాలతో అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్కు రాజచంద్ర డెలాయిట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి 2015లో నవంబర్లో ఉప్పల్కు చెందిన రంగయ్య, అనిత దంపతుల కుమార్తె అమూల్యతో వివాహం జరిగింది. పెళ్లయిన మూడు నెలల నుంచి అత్త, తన భర్త వేధిస్తున్నారని అమూల్య ఆరోపించింది. తనకు కళ్లద్దాలు ఉన్నాయని, లావుగా ఉన్నావని వేధిస్తున్నాడని, అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ఎదుట ఆందోళన కొనసాగిస్తానని పేర్కొ ంది. అమూల్య భర్తపై కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు కొనసాగుతుంది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇరు వర్గాలను పోలీస్స్టేషన్కు పిలిచి మాట్లాడారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఆందోళన చేయడం సరికాదని అమూల్యకు నచ్చచెప్పారు. కోర్టు ద్వారా లేదా మధ్య వర్తుల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. -
రాజమ్మ ఆందోళన అనూహ్య మలుపు
సాక్షి, కొత్తగూడెం: ప్రేమికుడి నుంచి తనను దూరం చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోడ రాజమ్మ అనే యువతి వారం రోజులుగా దీక్ష చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ ఘటన కొత్త మలుపు తిరిగింది. ఆమె డిమాండ్ మేరకు పోలీసులు రెండు రోజుల క్రితం వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రాజమ్మను వివాహం చేసుకోవాలని పెద్దలు కూడా అతడికి నచ్చజెప్పారు. అయితే, వెంకటేశ్వర్లు వెంట తెచ్చుకున్న ఎలుకల మందు తాగాడు. ఇది తెలుసుకున్న రాజమ్మ కూడా విషం తాగిందని సమాచారం. ఆమెకు మద్దతు తెలుపుతున్న వారు కూడా ఆందోళనకు దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ములకపల్లి మండలం మంచుపోసుగూడెం గ్రామానికి చెందిన బోడ రాజమ్మ(27)కు ఖమ్మంలో డిగ్రీ చదివే సమయంలో ఎల్. వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. తన క్లాస్మేట్ అన్న అయిన అతనితో పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమగా పరిణమించింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంకటేశ్వర్లు చెప్పాడు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం నెల్లూరులో ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే, అతని కుటుంబసభ్యులకు వీరి వ్యవహారం నచ్చలేదని.. దీంతో ఇటీవల నెల్లూరు వెళ్లి వెంకటేశ్వర్లును తమతో పాటు తీసుకెళ్లారని రాజమ్మ ఆరోపణలు చేసింది. అతడిని వెంటనే తనకు చూపాలంటూ రాజమ్మ గత గురువారం నుంచి సీతంపేట బంజర గ్రామంలోని అతడి ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది. -
మా జీవితాలు ఇంతేనా.. రోడ్డెక్కిన మహిళలు!
లక్నో : బతుకు పోరాటంలో తమకు సాంత్వన చేకూర్చాలని రోడ్డెక్కిన అంగన్ వాడీ కార్యకర్తలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా తమ జీతాలు పెంచాలంటూ అంగన్ వాడీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి రాజధాని లక్నోలో రోడ్లపైకి వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. పోలీసులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అంగన్ వాడీ కార్యకర్తలను శాంతింపచేసే యత్నం చేయగా ఫలితం లేకపోయింది. దీంతో బలవంతంగా వారిని చెల్లాచెదురు చేసేందుకు చూడటంతో తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. 'మేమేం అడిగామని మా డిమాండ్లు నెరవేర్చడం లేదు. మా కనీస వేతనం రూ.18 వేలు చేయడం. ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తింపు అడుగుతున్నాం. ఇక ఎన్నాళ్లయినా ఇంతేనా.. మా జీవితాల్లో మార్పు కోరుకోకూడదా అంటూ' అంగన్ వాడీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అవకాశం కూడా లేకపోయిందంటూ కార్యకర్తలు వాపోయారు. -
పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు
శృంగవరపుకోట రూరల్: ప్రేమించి... పెళ్లి చేసుకుని ఆనక ముఖం చాటేసి... మరో వివాహానికి సిద్ధపడుతున్నాడంటూ విజయనగరం జిల్లా కొట్టాం గ్రామానికి చెందిన బొడబళ్ల సతీష్ ఇంటి ఎదుట బెంగళూరుకు చెందిన కుమారి అనాంబ బుధవారం ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన తాను హైదరాబాద్లో ఓ ఎన్జీవో సంస్థలో ఉద్యోగం చేస్తూ మెహదీపట్నంలో ఉండేదాన్నని తెలిపారు. మూడున్నరేళ్ల క్రితం ఏపీఎస్పీ హెడ్కానిస్టేబుల్ బొడబళ్ల సతీష్ తనను పరిచయం చేసుకుని ప్రేమించి హైదరాబాద్లోని శివాజీ ఆలయంలో 2015 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన పెళ్లాడినట్టు తెలిపింది. తరువాత తనను వదిలేసి తప్పించుకు తిరుగుతున్నాడని, మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుండటంతో నిలదీసేందుకే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. సతీష్ కారణంగా తాను రెండుసార్లు గర్భం దాల్చగా అబార్షన్లు చేయించాడని వాపోయింది. తాను సతీష్ భార్యగానే ఓటరు ఐడెంటిటీ కార్డు కూడా ఉందనీ, హైదరాబాద్ నుంచి సతీష్ నాలుగు నెలల కిందట కాకినాడ బెటాలియన్కు బదిలీ చేసుకుని వచ్చి, ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఆరోపించింది. తనను చంపేసినా సరే కదిలేది లేదని ఆ ఇంటిముందు దీక్షకు దిగింది. కాగా తన కుమారుడినుంచి డబ్బు గుంజేందుకు ఈమె నాటకం ఆడుతోందని సతష్ తల్లి బొడబళ్ల రామాయమ్మ ఆరోపిస్తున్నారు. కాగా సతీష్ను ఫోన్లో సంప్రదించగా కుమారి అనాంబతో తనకు హైదరాబాద్లో పరిచయం ఉందనీ, అనాథ అని తెలిసి పెళ్లి చేసుకుందామనుకున్నాననీ, కానీ ఆమెకు ఇదివరకే వివాహం అయినట్టు తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నానని తెలిపారు. -
మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళల సమరం
- నడిమివంకలో మద్యంషాపుల ఎదుట ఆందోళన - వంటావార్పుకు యత్నం, మహిళా నాయకులు అరెస్ట్ అనంతపురం సెంట్రల్: జనావాసాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేసి, మహిళల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వైఎస్సార్సీపీ 39వ డివిజన్ కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి మండిపడ్డారు. ఆదివారం నడిమివంకలో మద్యం షాపుల ఎదుట 13 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శాశ్వతంగా తొలగించేవరకూ ఆందోళన విరమించేదిలేదని భీష్మించుకూర్చున్నారు. వంటావార్పు చేసిన నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో పోలీసులు జోక్యం చేసుకొని అరెస్ట్ చేసి నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్థానిక కార్పొరేటర్ సుశీలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రమ్మ మాట్లాడుతూ మద్యం షాపుల వల్ల స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల మహిళలు అటుగా వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే జనావాసాలు, గుడి, బడి, బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ మల్లికార్జునవర్మ ఆందోళనకారులతో చర్చించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శి వరలక్ష్మి, పద్మావతి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు శ్రీదేవి, కార్పొరేటర్ హిమబిందు, భూలక్ష్మి, డీఓడబ్ల్యూవో జిల్లా కార్యదర్శి హేమలత, ఆవాజ్ నాయకులు వలి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సూర్యచంద్ర, రమేష్, డీఎవైఎఫ్ఐ నాయకులు ఆంజనేయులు, నూరుల్లా, ఎపీరైతు సంఘం నాయకులు సరస్వతి, జేవీవీ నాయకులు ప్రసాద్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం షాపుల ఎదుట మహిళల ఆందోళన
-
ఎమ్మెల్యే ఇంటి ముందు మహిళల ఆందోళన
హైదరాబాద్: హబ్సిగూడలోని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటిముందు మహిళలు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. గత పదిహేనేళ్లుగా పెండింగ్లో ఉన్న అమ్ముగూడా భూ వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు. సైనిక్ పురి అమ్ముగూడ వద్ద 15 సంవత్సరాల క్రితం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లేఅవుట్ చేసి 120 ప్లాట్లను అమ్మారు. హుడా అప్రూవుడ్ లేఅవుట్ అని చెప్పడంతో చాలా మంది మాజీ సైనికులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఇళ్ళు కట్టుకోవడానికి అనుమతి తీసుకుందామని వెళితే అధికారులు ఈ లేఅవుట్ పై కేసు నడుస్తోంది అనుమతీ ఇవ్వలేము అని చెప్పారు. దీంతో గత 15 సంవత్సరాలు గా తమ సమస్యను పరిష్కరించాలని భాదితులు ముత్తిరెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ తమ సమస్యను పరిష్కరించకపోవడంతో భాదితులు గురువారం హబ్సిగూడలోని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. -
మద్యం.. యుద్ధం
గుత్తిలో ఉద్రిక్తత జనావాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహిళల రాస్తారోకో పోలీసుల సమక్షంలోనే వైన్షాపు యజమానుల దాడి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దంపతులు, మహిళలకు గాయాలు పోలీస్స్టేషన్ ఆవరణలో బాధితుల ధర్నా ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై జనం తిరగబడ్డారు. తక్షణమే దుకాణాలు అక్కడి నుంచి తొలగించాలంటూ ఉద్యమించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గుత్తిలో రాస్తారోకో చేశారు. ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రశ్నించిన మహిళలు, నాయకులపై మద్యం షాపుల యజమానులు, సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దంపతులతోపాటు పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుత్తి (గుంతకల్లు) : గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో నాలుగు రోజుల క్రితం ఒకే చోట ఐదు మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎక్సైజ్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగా మొదట రెండు షాపులు ప్రారంభించారు. మరో మూడు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోతుందని బీసీ కాలనీ మహిళలు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మద్యం దుకాణాలను తొలగించాలని సివిల్, ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా దుకాణాలు యథావి«ధిగా నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో ఆగ్రహించిన మహిళలు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం మద్యం దుకాణాలకు ఎదురుగా రాస్తారోకో చేశారు. వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పీరా, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లయ్యయాదవ్, జిల్లా కార్యదర్శులు సుభాష్రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, కౌన్సిలర్లు కళ్యాణి, రాజేశ్వరి, నజీర్, కమలాక్షమ్మ మాట్లాడుతూ టీడీపీ సర్కార్ బడులు మూసివేసి బార్లు, బ్రాందీషాపులు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యనే మద్యం తాగుతున్నారని, మహిళలకు, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోందని మహిళలు వరలక్ష్మి, లక్ష్మీదేవి, గౌరమ్మ, పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. షాపులు ఎత్తేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహిళలపై మద్యం షాపు నిర్వాహకుల దాడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై మద్యం దుకాణం నిర్వాహకులు శ్రీనివాసులు, వలి, నారాయణస్వామిలు తమ అనుచరులతో కలిసి పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా మహిళలను అని చూడకుండా వరలక్ష్మి, కళ్యాణి, రాజేశ్వరిలను కాళ్లతో తన్ని, ఇష్టానుసారం కొట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులపై కూడా దాడికి పాల్పడ్డారు. బండరాయితో తలపై మోదడంతో వైఎస్సార్ సీపీ నాయకుడు జానప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఈ తతంగమంతా పోలీసుల సమక్షంలోనే జరగడం గమనార్హం. ఆందోళనకారుల అరెస్ట్ ఘర్షణ పూర్తయిన తర్వాత ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి వచ్చారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు పీరా, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు మల్లయ్యయాదవ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శులు సుభాష్రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, రంగస్వామి, జిల్లా అధికార ప్రతినిధి పాశం రంగస్వామి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, శివ, రాజశేఖర్ రెడ్డి, ఆనందరెడ్డి, నిర్మల, రంగప్రసాద్ రాయల్, ప్రసాద్ గౌడ్, బేల్దారి చంద్రలను బలవంతంగా అరెస్టు చేసి జీపులో తరలిస్తుండగా మహిళలు అడ్డుపడ్డారు. పోలీసులు వారికి నచ్చజెప్పి, ఆందోళనకారులను స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టుకు నిరసనగా పోలీసు స్టేషన్లోనే ఆందోళనకారులు ధర్నా చేపట్టారు. అనంతరం మహిళలు పోలీసు స్టేషన్ను ముట్టడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా, మండల నాయకులు నారాయణస్వామి, జీపు రమణ,కొత్తపల్లి రంగయ్య, బసినేపల్లి భాస్కరరెడ్డి, గోపాల్, అబ్బేదొడ్డి కాంతారెడ్డి, రమాకాంత్రెడ్డి, భీమలింగ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకొని..
వలిగొండ: ప్రేమించి పెళ్లి చేసుకొని.. నాలుగేళ్లు కాపురం చేసి ఇప్పుడు తనను వద్దంటున్నాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో శనివారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన పలుసం లింగస్వామి, కొరబోయిన జ్యోతి నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరుకావడంతో వారి ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్లో నివాసముంటున్న వీరి మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో 'నువ్వు నా భార్యవే కాదు.. నీకు నాకు సంబధం లేదు' అని అంటుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఈ రోజు నాతాళ్లగూడెంలో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు వివిధ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపారు. -
ఐదు రోజులుగా ప్రియుడి ఇంటి ముందే..
జయశంకర్ భూపాలపల్లి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్న యువకుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్బీనగర్కు చెందిన బోడ కళాసాగర్ ఇంటి ముందు అతను ప్రేమించిన నాగమణి ఐదురోజులుగా దీక్ష చేస్తోంది. కళాసాగర్తో పెళ్లి జరిపించేంత వరకు ఇక్కడి నుంచి కదలనని భీష్మించుకొని కూర్చుంది. యువతికి మహిళా సంఘాల వారు మద్దతు తెలిపారు. కాగా.. ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. -
ప్రియుడి ఇంటి వద్ద యువతి ఆందోళన
-
ప్రియుడి ఇంటి వద్ద యువతి ఆందోళన
పెద్దపల్లి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని బాస చేసిన ప్రియుడు మొహం చాటేశాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. వివరాలివీ.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన శనిగారపు అజయ్ అనే యువకుడు కరీంనగర్ జిల్లా బొమ్మకల్కు చెందిన సౌజన్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అజయ్ మోసం చేశాడని సౌజన్య ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. -
ప్రియుడి ఇంటి వద్ద మౌనదీక్ష
మంత్రాలయం: ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. తర్వాత వదిలేసి మోసం చేశాడంటూ ఆర్తి అనే అమ్మాయి ప్రియుడి ఇంటి వద్ద మౌనదీక్ష చేపట్టింది. మంత్రాలయం మండల కేంద్రం రాఘవేంద్రపురంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. ‘అమ్మ, నాన్న శ్రీనివాసతురాయి, సురేఖ తురాయి ఆరేళ్ల క్రితం మంత్రాలయంలో ఉండేవారు. ఆ సమయంలో మంత్రాలయానికి చెందిన మల్లికార్జునగౌడ్ కుమారుడు ఈరన్నగౌడ్తో పరిచయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం మంత్రాలయానికే చెందిన లక్ష్మన్నతో పెళ్లి జరిగింది. అయితే ఈరన్నగౌడ్తో ప్రేమ విషయం తెలియడంతో ఏడాదికే భర్త వదిలేశాడు. తర్వాత అమ్మనాన్నతోపాటు ముంబయ్లో ఉండేదాన్ని. మూడు నెలల క్రితం ఈరన్నగౌడ్ రావడంతో తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. మూడు వారాలు అక్కడే గడిపి 15 రోజుల క్రితం బెంగళూరు వెళ్లాం. వారం తర్వాత మల్లికార్జున గౌడ్ వచ్చి ఆదోని తీసుకొచ్చాడు. వారం రోజుల్లో పిలిపిస్తామంటూ నన్ను ముంబయిలో వదిలేసి వచ్చాడు. వారం గడిచినా స్పందన లేకపోవడంతో మూడు రోజుల క్రితం అమ్మతో కలిసి మంత్రాలయం వచ్చాం. ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇక్కడే కూర్చున్నాం’ అని చెప్పింది. న్యాయం కోసం పోరాటం చేస్తానని, లేదంటే పోలీసులను ఆశ్రయిస్తానని వివరించింది. -
బాబూ.. మా గోడు పట్టదా?
-
బాబూ.. మా గోడు పట్టదా?
విజయవాడలో అగ్రిగోల్డ్ బాధిత మహిళల ధర్నా సాక్షి, అమరావతి: ఆడపడు చులకు పెద్దన్నగా ఉంటానని గొప్పలు చెప్పిన చంద్రబాబూ.. మా గోడు పట్టదా అంటూ అగ్రిగోల్డ్ బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే అగ్రిగోల్డ్ యాజ మాన్యంతో కుమ్మక్కైనట్టుగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఈ నెల 21లోగా అసెంబ్లీలో చర్చించి తమకు న్యాయం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అగ్రిగోల్డ్ బాధిత మహిళలు ఆదివారం విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్కు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసిన దగాకు ఆడబిడ్డల మంగళసూత్రాలు తెగిపోతున్నా సీఎం చంద్రబాబు కనికరం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో ఏపీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, కోశాధికారి ఈవీ నాయుడు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు. ఇద్దరు అగ్రిగోల్డ్ మార్కెటింగ్ డైరెక్టర్ల అరెస్ట్ 31 వరకు రిమాండ్.. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలింపు నెల్లూరు (క్రైమ్): అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఇద్దరు మార్కెటింగ్ డైరెక్టర్లను ఆదివారం నెల్లూరు సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ డిపాజిట్దారుల్ని మోసగించిన కేసులో 18వ, 19వ నిందితులైన వీరవెంకటబాబూరావు, కిశోర్లను అరెస్ట్చేసి నెల్లూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితులకు ఈనెల 31వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. అవ్వా వెంకటరామారావు చైర్మన్గా 1995లో ఏర్పాటైన అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో 32 లక్షల మంది నుంచి రూ.6,380 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది. ఆంధ్రప్రదేశ్లో 19 లక్షల మంది నుంచి రూ.2,250 కోట్లు సేకరించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేటల్లో ఆఫీస్లను ఏర్పాటు చేసి 11 వేలమంది ఏజెంట్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల మంది నుంచి రూ.264 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది. అనంతరం బాధితులకు చెల్లింపులను నిలిపేసి బోర్డు తిప్పేసింది. -
తుందుర్రులో కదం తొక్కిన ప్రజలు
ఆక్వా పార్క్ ఏర్పాటుపై వ్యతిరేకత 200 మంది ఆందోళనకారుల అరెస్ట్ పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం మండలాల మధ్య గల తుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి నిషేధాజ్ఞలు జారీ చేశారు. వాటిని ధిక్కరించి ధర్నాలో పాల్గొన్న సుమారు 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నర్సాపురం పోలీస్స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు త్రిమూర్తులు, పెద్దిరాజు, పూర్ణ, పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పరిసర గ్రామాల్లో 144 సెక్షన్.. ప్రజల ఆందోళనతో తుందుర్రులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1,300 మంది పోలీసు సిబ్బందితో గ్రామం నిండిపోయింది. ప్రధాన రహదారులపై బారీకేడ్లు, తనిఖీలతో పోలీసులు ఉదయం నుంచి ఎవరినీ బయటి గ్రామాల నుంచి రాకుండా నియంత్రించారు. పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. పెద్దఎత్తున పోలీసు బలగాల పహారా ఉండగానే సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్థులు, మహిళలు పార్క్ నిర్మాణం ఏర్పాటుపై తమ వ్యతిరేకతను నిర్భయంగా వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని నర్సాపురం రూరల్ పోలీస్టేషన్కు తరలించారు. అరెస్టయిన ఉద్యమకారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పార్క్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. కె.బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాల్లో అడుగడుగున పోలీసులు మోహరించారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా దర్శనిమిస్తున్నాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. ప్రతి గ్రామంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ బయటకు రానివ్వలేదు. -
తుందుర్రు పరిసరాల్లో టెన్షన్ టెన్షన్
-
తుందుర్రు పరిసరాల్లో టెన్షన్ టెన్షన్
తుందుర్రు (పశ్చిమగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు, పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్వాఫుడ్ పార్క్ను వ్యతిరేకిస్తూ 30 గ్రామాల ప్రజలు బుధవారం ఆందోళన బాటపట్టారు. అక్వాఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే ఫ్యాక్టరీ నుంచి విష రసాయనాలు వచ్చి పంట కాలువలు, పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టొద్దని పెద్దఎత్తున నినాదాలు చేశారు. తుందుర్రు గ్రామం పోలీస్ పహారాలో ఉంది. 1100 మంది పోలీసులతో భారీ భద్రతను చేపట్టారు. 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. అక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమానికి ప్రజాసంఘాలు, వైఎస్సార్సీపీ, సీపీఎం మద్దతు తెలిపాయి. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. వందలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నర్సాపురం పోలీస్స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు త్రిమూర్తులు, పెద్దిరాజు, పూర్ణ, పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కె.బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాల్లో అడుగడుగునా పోలీసులను మోహరించారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడే పరిసస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. ప్రతి గ్రామంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ బయటకు రానివ్వలేదు. -
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
విశాఖ: తనకు న్యాయం చేయాలని కోరుతో ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విశాఖ పారిశ్రామికవాడలోని శ్రీహరిపురంలో నివాసముంటున్న ఓ మహిళ తన ఏడేళ్ల పాపతో కలిసి శనివారం భర్త ఇంటి ముందు బైఠాయించింది. దీంతో అత్తింటివారు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆరోపిస్తున్న ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. -
ఎస్బీఐ వద్ద మహిళల ఆందోళన
అనంతపురం: జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక ఎస్బీఐ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రోజుకు రూ.10 వేలు మార్చుకునే వెసులుబాటు కల్పించాలని, అవసరమైనన్ని రూ.100 నోట్లు బ్యాంకులోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ప్రియుడితో వివాహం జరిపించాలని...
కొమరోలు: ప్రియుడు వివాహానికి అంగీకరించలేదని ఓ యువతి కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎన్.పద్మావతి(22) పదో తరగతి వరకు చదువుకుంది. గ్రామానికి చెందిన కొమ్మాలపాటి రామయ్య(25)తో పద్మావతికి ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకుంటానని చెప్పిన రామయ్య ఇటీవల మాటమార్చాడు. దీంతో యువతి తరపు వారు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వ్యవహారం పరిష్కారం కాకపోవటంతో సీపీఎం, మహిళా సంఘాల వారితో కలిసి జాతీయరహదారిపై బైఠాయించింది. గంటపాటు జరిగిన ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సై ప్రభాకర్రెడ్డి అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పి ట్రాఫిక్ను క్రమబద్ధీకించారు. బాధితులను స్టేషన్కు తీసుకెళ్లి, ఇరువర్గాల వారితో మాట్లాడుతున్నారు. -
‘కట్నం తెస్తేనే అమెరికా తీసుకెళ్తా’
- అదనపు కట్నం కోసం భర్త వేధింపులు - అత్తింటి ముందు మహిళ ధర్నా హైదరాబాద్: కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని బీఎన్రెడ్డి నగర్కు చెందిన మధు, శ్రీలత దంపతులకు ఒక కుమార్తె ఉంది. గత కొంత కాలంగా అమెరికాలో ఉద్యోగరీత్యా ఉంటున్న మధు.. భార్య శ్రీలతను కట్నం కోసం వేధిస్తున్నాడు. వివాహ సమయంలో 50 తులాల బంగారంతోపాటు ఎకరం భూమి ఇచ్చినా అతని కట్న దాహం తీరలేదు. ఇంకా కట్నం తెస్తేనే అమెరికా తీసుకెళతానని తెగేసి చెప్పాడు. ఇందుకు అతని తల్లి, తోబుట్టువులు సహకరిస్తున్నారు. దీంతో శ్రీలత శుక్రవారం కుటుంసభ్యులతో కలిసి అత్తింటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. -
మహిళల ఆగ్రహంతో కారు దిగొచ్చిన రాహుల్
అమేథి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. తన నియోజకవర్గం అమేథికి వస్తున్న ఆయనను పలువురు మహిళలు ఘెరావ్ చేశారు. తమ దినసరి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆయన వెళుతున్న కారులో నుంచి దిగి వారి సమస్యలు విని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరహా ఆందోళనను ఎదుర్కోవడం ఇది రాహుల్ గాంధీకి రెండు రోజుల్లో రెండోసారి. రాహుల్ అమేథి పర్యటనకు వస్తున్నారని తెలుసుకొని గౌరీగంజ్ పట్టణానికి చెందిన మహిళలు ఆయన వచ్చే మార్గంలో వేచి ఉండి ఆయన వచ్చే సమయంలో గట్టిగా నినాదాలు చేస్తూ ప్రకంపనలు సృష్టించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా అది విజయవంతం కాలేదు. కారు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రాహుల్ కారు దిగి వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పలువురు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అంతకుముందు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిథి కేఎల్ శర్మను బాధ్యతలనుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు అతడి మద్దతుదారులు ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే -
ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో
మల్యాల: తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మల్యాల మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. కొంపల్లె చెరువు నిండినప్పటికీ తాగునీరు సరఫరా చేయకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిందెలు, బకెట్లతో రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు, నాయకులు తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎసై ్స జమీరొద్దీన్ మహిళలకు నచ్చజñ ప్పినా వారు రాస్తారోకో విరమించలేదు. సర్పంచ్ నేళ్ల అరుణ భర్త నేళ్ల రాజేశ్వర్రెడ్డి ఈ నెల 26 వరకు సీపీడబ్ల్యూ స్కీం ద్వారా నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, యూత్ఫోరం మండల ప్రతినిధి కొక్కుల రఘుబాబు మహిళల రాస్తారోకోకు మద్దతు తెలిపారు. -
మా శవాలపై రోడ్డు వేయండి
నున్న(విజయవాడరూరల్)ః ‘పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో చట్టబద్ధంగా ఈస్థలాలుకొని ఇళ్లు, ప్లాట్లు వేసుకున్నాం. రోడ్డు కోసమని ఇళ్లను కూలగొట్టి మమ్మల్ని రోడ్డున పడేస్తారా?, నమ్మి ఓటేసినందుకు చేసే ఉపకారం ఇదా?‘అని ప్రభుత్వ అరాచక చర్యలను నిరసిస్తూ మహిళలు దుమ్మెత్తి పోశారు. శనివారం నున్న లోకల్ బైపాస్ రోడ్డు నిర్మాణం పనుల కోసమని ఆర్అండ్బీ అధికారులు పోలీసును వెంటేసుకుని ఎలాంటి ముందస్తు సమాచారంలేకుండా ఇళ్ల తొలగింపు చేపట్టడంతో బాధితులు భగ్గుమన్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో నున్న రూరల్ పోలీసులు, అజిత్సింగ్నగర పోలీసులు రంగప్రవేశం చేశారు. గత 20 సంవత్సరాలుగా ఇళ్ళు నిర్మించుకొని జీవిస్తున్న సాతులూరి వెంకటేశ్వరమ్మ,అతని కుమారులు నలుగురిని ఇళ్ళు వదిలివెళ్ళాలని పోలీసులు భయపెట్టారు. 2008 లో హైకోర్టు స్టేటస్కో ఇచ్చిందని రోడ్డు నిర్మాణానికి మా ఇళ్ళను తొలగించబోమని చెప్పిన అధికారులు ఇప్పుడు ఖాళీచేయమని చెప్పడం ఏమిటని వెంకటేశ్వరమ్మ కుమారులు అధికారులను కలిసి కోర్టు ఉత్తర్వులను అందచేశారు. ఆ కుటుంబసభ్యులతో పాటు సమీపంలో ఫ్లాట్లుకొన్నవారు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవిన్యూఅధికారులు, సర్వేయర్ సుబ్బారావులు రోడ్డు ఎలైన్మెంటు ప్రకారం ఆర్అండ్బి అధికారులకు మార్కింగ్ చేసి అప్పగించడంతో వారు రోడ్డు పనులను జేసిబి మిషనుతో ప్రారంభించారు. ఆ సందర్భంలో స్ధలాలున్న మహిళలు మిషనుకు అడ్డుగా కూర్చువడంతో పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వ్యానులోకి ఎక్కించారు. లక్షలాది రూపాయలను అప్పుచేసి స్థలాలను కొనుగోలు చేశామని, ఇంకా అప్పుతీరలేదని మహిళలు బోరున విలపించారు. నష్టపరిహారం చెల్లించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మమ్మల్ని చంపి శవాలపై రోడ్డు నిర్మించుకోండని మహిళలు శాపనార్థాలు పెట్టారు. నిరసన తెలిపిన నిమ్మగడ్డ కుమారి, సునీత, లలితకుమారి, సాంబశివరావు, షేక్ ఖాశీంబి, శంకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుతలను పోలీసుస్టేçÙన్కు తరలించాక ఆర్అండ్బి అధికారులు రోడ్డు పనులను మార్కింగ్ చేసి ప్రారంభించారు. నున్న రూరల్ సీఐ సాహేరాబేగం, అజిత్ సింగ్నగర్ సీఐ ప్రసాదరావుల ఆధ్వర్యంలో భారీబందోబస్తు ఏర్పాౖటెంది. రోడ్డుౖ అలెన్మెంటులో సర్వే నెంబర్ 751/2 లో రెండెకరాల 36 సెంట్లు, 751/1బిలో 90 సెంట్ల భూమి అర్బన్ల్యాండ్ సీలింగ్ భూమని సర్వేయర్ సుబ్బారావు చెప్పారు. ఆర్అండ్బి రోడ్డు నుంచి 430 మీటర్ల ను మార్కింగ్ చేసి భూమిని అప్పగించినట్టు ఆయన చెప్పారు. పుష్కరాలకు రోడ్డు పూర్తి చేస్తాం నున్న లోకల్ బైపాస్రోడ్డు నిర్మాణం పనులను పుష్కరాలకు పూర్తిచేస్తామని ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సత్యనారాయణ చెప్పారు. వంద అడుగుల వెడల్పు,430 మీటర్ల పొడవునా రోడ్డును నిర్మించాల్సివుందన్నారు. – ఆర్అండ్బి ఇఈ -
సీఎం ఉన్నారన్న ధీమాతోనే ఈ అరాచకాలు
విజయవాడ: విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధికారముందని టీడీపీ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, ఏంచేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారనే ధీమాతో అరాచకాలకు పాల్పడుతున్నారని మహిళలు విమర్శించారు. ప్రజల సొమ్ముతో టీడీపీ కార్పొరేటర్లు విహారయాత్రలకు వెళ్లడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మద్యంమత్తులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన చర్యను సమర్థిస్తూ టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టారు. మహిళలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శించారు. -
పిల్లలతో కలిసి ట్యాంక్ ఎక్కిన మహిళ
గోదావరిఖని: తన ఇంటిని బంధువులు ఆక్రమించుకున్నారనే బాధతో ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న భాగ్యలక్ష్మి అనే మహిళ ఇంటిని సమీప బంధువులు ఆక్రమించుకోవడంతో.. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కింది. తనకు న్యాయం చేయాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను కిందకు దించడానికి యత్నిస్తున్నారు. -
ట్రాఫిక్ పీఎస్ ఎదుట యువతి ఆందోళన
-
'గ్రామాల్లో బెల్టుషాపులను నియంత్రించండి'
తాండూరు రూరల్ (రంగారెడ్డి జిల్లా) : గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శకుంతల సోమవారం ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.... గ్రామాల్లో బెల్టుషాపులు నియంత్రించాలని గతంలో అనేకసార్లు వికారాబాద్ సబ్కలెక్టర్, ఎక్సైజ్ అధికారులను కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ బెల్టుషాపుల వలన గ్రామాల్లోని ప్రజలు మద్యం మత్తులో తూగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగి విచక్షణ కొల్పోయి అనేక నేరాలు జరిగాయన్నారు. మొన్నటికి మొన్న యాలాల మండలం అచ్యుతాపూర్లో ఓ మతిస్థిమితంలేని అమ్మాయిపై అత్యాచారం చేశారన్నారు. అలాగే తాండూరు మండలం మల్కాపూర్లో మద్యం మత్తులో ఓ భర్త గొడ్డలితో భార్యను హత్య చేశారని శకుంతల గుర్తుచేశారు. గ్రామాల్లో కొనసాగుతున్న బెల్టు షాపులను అధికారులు నియంత్రించాలని...లేదంటే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ఆమె హెచ్చరించారు. మహిళలపై ఇన్ని సంఘటనలు జరిగినా అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో గౌతపూర్ ఉప సర్పంచు హాకిం, వార్డు సభ్యులు నర్సిములు, గ్రామస్తులు వెంకట్స్వామి, బాలయ్య, మహేష్, నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో నీటి కోసం ఆందోళన
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో తాగునీటి కోసం మహిళలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జిల్లాలోని జిల్లాలోని ప్రొద్దుటూరు మండలంలో గురువారం చోటు చేసుకుంది. తాగునీటి కష్టాలపై అధికారులకు స్థానిక మహిళలు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అధికారులు స్పందించి త్వరలో సమస్య పరిష్కారిస్తామని హామి ఇచ్చారు. ఆందోళన కారణంగా పట్టణంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. -
ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
అట్లూరు (విశాఖపట్నం) : అధికారులు మంచి నీటి సౌకర్యం కల్పించకపోవడంతో 100 మంది మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన గురువారం విశాఖ జిల్లా అట్లూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో తాగునీటి నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో మహిళలు అధికారులకు విన్నవించుకున్నారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఎంపీడీవోను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు. అక్కడ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకొని ఖాళీ బిందెలతో బైఠాయించారు. వెంటనే తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. -
నూతన మద్యంపాలసీకి వ్యతిరేకంగా నిరసన
అనంతపురం : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా అనంతపురం జిల్లా కేంద్రంలో మహిళలు సోమవారం నిరసనకు దిగారు. ఐద్వా ఆధ్వర్యంలో పలువురు మహిళలు మద్యం టెండర్ల కేంద్రాల ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. -
తాగునీటి కోసం మహిళల నిరసన
బి.కోట: చిత్తూరు జిల్లా బి.కోట మండలం గండ్లపల్లి, కొత్తూరు గ్రామాలకు చెందిన మహిళలు తాగునీటి కోసం బుధవారం ఆందోళనకు దిగారు. వందమందికి పైగా మహిళలు ఖాళీ బిందెలతో తరలి వచ్చారు. ముందుగా పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో 219వ నంబరు జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు కల్పించుకుని ఆందోళనను విరమింపజేశారు. తరువాత రహదారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు రాకపోకలు సజావుగా సాగాయి. -
ముగ్గులతో మహిళల నిరసన
నిరసన తెలపడానికి అనేక మార్గాలుంటాయి. కొంత మంది ఉద్యమబాట పడతారు..మరికొంత మంది మౌనప్రదర్శన చేస్తారు.. ఇంకొంతమంది హింసను ఎన్నుకుంటారు. కానీ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు ప్రాంత మహిళలు మాత్రం.. సంక్రాంతి సందర్భంగా ముగ్గులతో తమ నిరసన తెలిపారు. ముగ్గుల ద్వారా తమ మనసులోని భావాలు చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చేది లేదని పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు తెలిపారు. భూములు ఇవ్వం అంటూ రంగురంగుల ముగ్గులతో రాశారు. స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా, ఏపీ సర్కారు మాత్రం మొండిగా భూసేకరణతోనే ముందుకెళ్తోంది. -
నయవంచన పాలనపై జనాగ్రహం
* ‘జన్మభూమి- మా ఊరు’లో జిల్లాపై వరాల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు * రూ.4,500 కోట్లు వెచ్చించి ఏడాదిలోగా హంద్రీ-నీవా పూర్తిచేస్తానంటూ ప్రకటన * బెంగళూరు-అనంతపురం-పలమనేరు-కుప్పం మధ్య రింగ్రోడ్డు ఏర్పాటు చేస్తానని హామీ * ప్రతి గ్రామంలోనూ పశువుల హాస్టల్, మిల్క్జిల్లాగా అభివృద్ధి చేస్తానని ప్రతిన * తంబళ్లపల్లె నియోజకవర్గంలో రూ.50 కోట్లతో రోడ్లను నిర్మిస్తామని వాగ్దానం సాక్షి,చిత్తూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను నిరసిస్తూ బుధవారం జిల్లాలో వైఎస్సార్ సీపీ కదం తొక్కింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయూల ఎదుట రైతులు,మహిళలు నిరసన గళం వినిపించారు. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. ఈ ఆందోళనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పార్టీలకతీతంగా రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛన్దారులు స్వచ్ఛం దంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబు వంచ న పాలనపై దుమ్మెత్తి పోశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన బాబుకు పుట్టగతులుండవంటూ ధ్వజ మెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తహశీల్దారు కార్యాల యాల ఎదుట ఆందోళనలు కొనసాగాయి. రైతు, డ్వాక్రా రుణ మాఫీని తుంగలో తొక్కడంతో పాటు అర్హులైన వారి పింఛన్లలో కోతపెట్టడంపై నాయకులు మండిపడ్డారు. ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి ఓట్లేయించుకుని ఏరుదాటాగ బోడిమల్లన్న అన్న సామెతగా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరులో భారీ నిరసన కార్యక్రమం జరి గింది. తిరుపతిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమ న కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగరిలో భారీ ర్యాలీ, ధర్నా జరిగింది. ఎమ్మెల్యే నారాయణస్వామి గంగాధరనెల్లూరు నియోజకవర్గం లోని పెనుమూరు, గంగాధరనెల్లూరులో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. పార్టీ ప్రజాసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చంద్రగిరి, పలు మండలాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరులో, సదుంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి పలమనేరు,పెద్దపంజాణి, బెరైడ్డిపల్లె తహశీల్దార్ కార్యాలయాల వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ బంగారుపాళెం, తవణంపల్లెలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం వైఎస్సార్సీపీ నేత డాక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. చిత్తూరు తహశీల్దారు కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ నాయకురాలు సామాన్యకిరణ్, మహిళా నాయకురాలు గాయత్రీదేవి పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జరిగిన ఆందోళనల్లో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. -
పోలీస్ బందోబస్తుతో వైన్ షాపు ప్రారంభం!
విశాఖపట్నం: కోర్టు ఆర్డర్తో ఈరోజు ఇక్కడ పోలీస్ బందోబస్తుతో మద్యం షాపును ప్రారంభించారు. మహిళలు దీనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రెల్లి వీధిలో ప్రారంభించిన వినాయక వైన్ షాపును తొలగించాలని మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని రెల్లివీధిలో రాస్తారోకో చేశారు. ** -
జగన్ దీక్షకు మద్దతుగా మహిళల ర్యాలీ
-
జగన్కు మద్దతుగా తిరుపతి మహిళల వినూత్న నిరసన
-
వైఎస్ భారతి,షర్మిలకు రాఖీలు కట్టిన మహిళలు
-
చంచల్గూడ జైలు వద్ద మహిళల నిరసన
హైదరాబాద్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి రాఖీ కట్టేందుకు చంచల్గూడ జైలు వద్ద మహిళలు బారులు తీరారు. పోలీసులు అనుమతించకపోవడంతో వారు నిరసన తెలుపుతున్నారు. తమకు అనుమతి ఇచ్చేవరకు కదిలేదిలేదని అక్కడే భీష్కించుకు కూర్చున్నారు. కనీసం తమలో ఒక్కరికైనా అనుమతి ఇవ్వాలంటూ వాళ్లు ప్రాధేయపడ్డారు. ఫలితంలేదు. దాంతో వారు జైలు ముందు ధర్నా చేస్తున్నారు. జగనన్నకు రాఖీ కడతామని తాము రెండు రోజుల ముందే జైలు అధికారులకు చెప్పినట్లు వారు తెలిపారు. తమని అడ్డుకుంటున్న పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు జైలు గేటు ఎదురుగా జగన్ ఫోటోకు రాఖీ కట్టారు. మరికొందరు మహిళలు జగన్ను కలవడానికి వచ్చిన ఆయన సతీమణి భారతి చేతికి, సోదరి షర్మిల చేతికి రాఖీలు కట్టారు. జగనన్నకే రాఖీ కట్టినట్లు సంబరపడిపోయారు. పోలీసుల వైఖరి మారాలంటూ, వారికి కూడా రాఖీలు కట్టారు.