
పీఏసీ చైర్మన్గా భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సభ్యులతో మూడు ఆర్థిక కమిటీలను నియమించారు. ప్రజా పద్దు ల సమితి (పీఏసీ) చైర్మన్గా భూమా నాగిరెడ్డి నియమితులయ్యారు. అంచనాల కమిటీకి మోదుగుల వేణుగోపాల్రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి కాగిత వెంకట్రావు చైర్మన్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ బులెటిన్ జారీ చేశారు.