హైవేలపై చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు: డీజీపీ | Check Posts on Highways: DGP Prasada Rao | Sakshi
Sakshi News home page

హైవేలపై చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు: డీజీపీ

Published Tue, Mar 11 2014 4:19 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు - Sakshi

రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు

హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ బయ్యారపు ప్రసాదరావు చెప్పారు.  హైవేలపై చెక్‌పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలలో  30 పోలీస్ యాక్ట్, నగరాల్లో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నామినేషన్ల సందర్భంలో  పార్టీలు నిబంధనలు ఉల్లంఘించవద్దని కోరారు.  పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలు, మీటింగ్‌ల కోసం స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరని డిజిపి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement