డెంగ్యూ వ్యాధితో వైఎస్సార్ జిల్లాలో మంగళవారం ఓ బాలుడు మృతిచెందాడు. రాజుపాలెం మండలం వెంగళాయపల్లె గ్రామానికి చెందిన శరత్కుమార్ రెడ్డి(12) డెంగ్యూతో బాధపడుతున్నాడు.
వైఎస్సార్ జిల్లా: డెంగ్యూ వ్యాధితో వైఎస్సార్ జిల్లాలో మంగళవారం ఓ బాలుడు మృతి చెందాడు. రాజుపాలెం మండలం వెంగళాయపల్లె గ్రామానికి చెందిన శరత్కుమార్ రెడ్డి(12) డెంగ్యూతో బాధపడుతున్నాడు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం బాలుడ్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా..మార్గ మధ్యంలో నంద్యాల వద్ద మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.