ఏలూరులో రేపు సీఎం జగన్‌ పర్యటన | CM YS Jagan To launch YSR Vahana Mitra at Eluru On Tomorrow | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 3 2019 11:52 AM | Last Updated on Thu, Oct 3 2019 11:58 AM

CM YS Jagan To launch YSR Vahana Mitra at Eluru On Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు  ఆయన ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేల చొప్పున వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు తదితరులు పర‍్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement