తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో సమగ్ర చర్చ | comprehensive discussion on telangana bill in Parliament | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో సమగ్ర చర్చ

Published Tue, Jan 7 2014 7:58 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

పార్లమెంట్ భవనం - Sakshi

పార్లమెంట్ భవనం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)పై పార్లమెంటులో సమగ్ర చర్చ జరుగుతుందని కేంద్ర హొం శాఖ తెలిపింది. రాష్ట్ర శాసనసభకు  పంపింది ముసాయిదా బిల్లు మాత్రమేనని ఆ శాఖ పేర్కొంది. ఈ మేరకు  కేంద్ర హొం శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

పార్లమెంటులో ప్రవేశపెట్టేదే తుది బిల్లు అని కూడా ఆ లేఖలో తెలిపింది. తుది బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని వివరించింది. బిల్లుపై చర్చ విషయంలో అసెంబ్లీలో  వివాదం నెలకొన్న నేపధ్యంలో కేంద్ర హొం శాఖ ఈ వివరణ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement