విశాఖపట్నం: మావోయిస్టుల పేరుతో షాపుల వారిని బెదిరిస్తున్న నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, ఆ వివరాలను మీడియాకు తెలిపారు. కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఈస్ట్ డివిజన్ కార్యదర్శి గణేష్ అనుచరుమని కొందరు పలువురు మెడికల్ షాపు యజమానులను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముఠాకు చెందిన ఆరుగురుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి 75వేల రూపాయల నగదు, 8 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మావోయిస్టుల పేరుతో బెదిరింపులు
Published Sat, Apr 4 2015 3:29 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement