సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాకు ఆంధ్రప్రదేశ్ అర్హమైనది కాదంటూ ప్రణాళికా సంఘం పేర్కొనడాన్ని సీపీఐ ఆక్షేపించింది. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఫిబ్రవరి 21న నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతారా అని ప్రశ్నించింది. ప్రణాళికా సంఘం చైర్మన్గా వ్యవహరించిన అహ్లూవాలియా పక్షపాతంతో వ్యవహరించారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.