మహిళలను మోసం చేసిన కేసులో మత ప్రబోధకుడు దయాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
విజయనగరం: మహిళలను మోసం చేసిన కేసులో మత ప్రబోధకుడు దయాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. దయాసాగర్ ని కొత్తవలసలో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
నిందితుని పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు . ఇప్పటి వరకు రెండు కేసులు నమోదు చేశామని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా తమను సంప్రదించవచ్చని డీఎస్పీ అన్నారు.