భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం | Donations to Andhra Pradesh CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం సహాయనిధికి భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం

May 14 2020 8:50 PM | Updated on May 14 2020 8:53 PM

Donations to Andhra Pradesh CM Relief Fund - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌  కోటి 82 లక్షల 4వేల 312 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని భీమవరం ప్రజల తరపున సీఎంకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీసివాస్‌ పేర్కొన్నారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement