cm relief fund
-
సీఎంకు చెక్కులు అందజేసిన మెగాస్టార్ చిరంజీవి
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద ధాటికి నష్టపోయిన బాధితులకు సినీతారలు అండగా నిలిచారు. తమవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చిరంజీవి రూ. 50 లక్షలు చెక్ అందించారు. అంతేకాకుండా తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు.కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
‘ఎంఈఐఎల్’ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్/ఖమ్మంవన్టౌన్: ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఈఐఎల్ సంస్థ రూ.5 కోట్ల విరాళంఅందజేసింది. సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి, సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్టీ రావు పాల్గొన్నారు. ఏపీకి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని అందించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రేస్ క్లబ్ తరఫున రూ.2 కోట్లు హైదరాబాద్లోని రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి.. మరో డైరెక్టర్ నరసింహరెడ్డితో కలిసి వరద బాధితుల సహాయార్థం రూ.2 కోట్ల చెక్కును మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. రూ.కోటి చొప్పున.. సీఎం సహాయ నిధికి సైయెంట్ కంపెనీ యాజమాన్యం రూ.కోటి విరాళాన్ని అందజేసింది. అలాగే లలితా జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ రూ.కోటి, మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్, రవికైలాస్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డిని సచివాలయంలో కలిసి చెక్కులను అందజేశారు. సినీ నిర్మాత దిల్ రాజు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు. -
తెలంగాణ సీఎం సహాయనిధికి క్రెడాయ్ భారీ విరాళం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య క్రెడాయ్ (కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) రూ.కోటి విరాళం అందించింది. క్రెడాయ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినింది. పలు జిల్లాలలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారీగా విరాళాలు అందిస్తున్నారు. -
Ravi Raheja: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ విరాళం
హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్ల భారీ విరాళం అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.ఎన్నడూ లేనంతగా ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా కె.రహేజా కార్పొరేషన్ గ్రూప్ అధినేత రవి రహేజా విరాళం అందించారు. ఈ సంస్థకు రియల్ ఎస్టేట్తో పాటు ఇతర విభాగాల్లోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. -
డ్వాక్రా మహిళలు డబ్బులు ఇవ్వాలి లేదంటే శిక్ష తప్పదు..
-
Tollywood: మేము సైతం
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించారు.‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు కలచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో ΄ాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూ΄ాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షలు చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు చిరంజీవి.→ ‘‘అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల రూ΄ాయల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి’’ అని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నాయి.→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు నటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఏపీ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడిన 400 పంచాయితీలకు రూ. 1 లక్ష చొప్పున రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఇలా మొత్తంగా రూ. ఆరు కోట్లను పవన్ కల్యాణ్ విరాళంగా అందించనున్నారు. → తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాన్ని అందజేయనున్నట్లుగా ఆయన సిబ్బంది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూ΄ా యల చొప్పున విరాళం అందించనున్నట్లుగా ప్రభాస్ టీమ్ పేర్కొంది.→ ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూ΄ాయలు విరాళంగా ప్రకటిస్తున్నా’’ అంటూ రామ్చరణ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.→ ‘‘తెలగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూ΄ాయల విరాళం అందిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు అల్లు అర్జున్.→ తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున 20 లక్షలు... అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ .5 లక్షలు.. ఇలా మొత్తంగా రూ. 25లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు సాయిదుర్గా తేజ్.→ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా ΄ాల్గొంటున్నారని సోనూసూద్ తెలి΄ారు. బుధవారం పైన పేర్కొన్న నటులు విరాళం ప్రకటించగా, అంతకుముందు విరాళం ప్రకటించినవారి వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ. 50 లక్షలు చొప్పున కోటి రూ΄ాయలు బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్– ఎస్. రాధాకృష్ణ–ఎస్. నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలి΄ారు. తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల రూ΄ాయల చొప్పున మొత్తంగా రూ. 30 లక్షలు విరాళంగా ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి మొత్తంగా పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు (ఏపీ 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు) విరాళం ప్రకటించారు. దర్శకుడు–నటుడు తల్లాడ సాయికృష్ణ రూ. లక్షా యాభై వేలుని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విరాళంగా ప్రకటించారు. -
ఉద్యోగుల తరఫున రూ.100 కోట్లు
మహబూబాబాద్/సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని, తమ వంతుగా సీఎం సహా య నిధికి ఒక రోజు మూల వేతనాన్ని ప్రకటించినట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మా రం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డిని కలెక్టరేట్లో ఉద్యోగుల జేఏసీ నాయకులు కలిసి ఒకరోజు మూల వేతన తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒక్కరోజు మూల వేతనం ప్రభుత్వ ఖజానాలో జమయ్యేలా చూడాలని సీఎంను కోరారు. సీఎస్కు సమ్మతి పత్రం అందజేత.. వరద బాధితుల సహాయార్థం రాష్ట్రంలోని ఉద్యోగులందరి తరఫున ఒక రోజు వేతనాన్ని ఇవ్వనున్నట్టు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు రూ.100 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి అందజేయాలని కోరుతూ మంగళవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి సమ్మతి పత్రాన్ని అందజేశారు. సీఎస్ను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, నేతలు డాక్టర్ నిర్మల, కె.రాములు, శశిధర్రెడ్డి, దర్శన్గౌడ్, గోపాల్, అశ్వత్థామరెడ్డి, రమాదేవి, రాబర్ట్ బ్రూష్, మహిపాల్రెడ్డి, కె.రామకృష్ణ, ఎస్.రాములు, మహేశ్, తిరుపతి, సంపత్ తదితరులు ఉన్నారు. వరద బాధితులకు ఒక రోజు మూలవేతనం భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకునేందుకు ఒకరోజు మూలవేతనం ఇవ్వా లని నిర్ణయించినట్లు తెలంగాణ ఉద్యోగు ల సంఘం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంది. సమావేశంలో చైర్మన్ పద్మాచారి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మఠం రవీంద్రకుమార్, సీహెచ్ హరీశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.నర్సింగ్రావు, సంఘం నేతలు జాకబ్, కృష్ణారావు, కిశోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము సైతం అంటూ పెన్షనర్ల జేఏసీ... వరద బాధితుల సహయార్థం ఒక రోజు మూల వేతనాన్ని ఇస్తున్నట్లు పెన్షనర్ల జేఏసీ ప్రకటించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు విరాళం ఇచ్చేందుకు ఏకగ్రీవంగా నిర్ణయించామని, ఇది రూ.33 కోట్ల వరకు ఉంటుందని జేఏసీ చైర్మన్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి శుభాకర్రావు తెలిపారు. -
వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?
డార్లింగ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించాడు. రీసెంట్గా కేరళలోని వయనాడ్లో వరద బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే వీళ్లని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, చిరంజీవి-రామ్ చరణ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రభాస్ చేరారు.(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యువ హీరోని కొట్ట చంపారు)కేరళ వరద బాధితుల కోసం అల్లు అర్జున్ రూ.25 లక్షలు ఇవ్వగా.. చిరంజీవి-రామ్ చరణ్ కలిపి రూ.కోటి రూపాయలు అందించారు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా రూ.2 కోట్ల రూపాయల్ని కేరళ సీఎమ్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. దీంతో డార్లింగ్ హీరోని అందరూ మెచ్చుకుంటున్నారు.దక్షిణాది నుంచి సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాజిల్, రష్మిక, నయనతార తదితరులు లక్షల రూపాయలు విరాళాలుగా ప్రకటించారు. అయితే తెలుగు నుంచి ఇప్పటివరకు బన్నీ, చిరు-చరణ్, ప్రభాస్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన యాక్టర్స్ కూడా ఎంతో కొంత విరాళమిస్తే బాగుంటుందని నెటిజన్స్ అంటున్నారు.(ఇదీ చదవండి: నయనతార కాంట్రవర్సీ సినిమా.. ఇప్పుడు మళ్లీ ఓటీటీలోకి) -
వయనాడ్ ఘటన: గౌతమ్ అదానీ భారీ విరాళం
వయనాడ్లో కొండచరియలు విరిగిన ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు మించిన జనం నిరాశ్రయులయ్యారు. ఈ తరుణంలో వీరికి అండగా నిలబడటానికి ప్రముఖ వ్యాపార దిగ్గజం 'గౌతమ్ అదానీ' కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.వయనాడ్ బాధితుల సహాయార్థం గౌతమ్ అదానీ కేరళ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళంగా ప్రకటించారు. వయనాడ్లో జరిగిన ప్రాణనష్టం పట్ల అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు సంఘీభావంగా నిలుస్తోందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 200 కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా సుమారు ఏడువేలకంటే ఎక్కువమంది రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రమాదయినా గురైనవారికి ప్రభుత్వం సాయం కూడా ప్రకటించింది. ఈ సమయంలో పలువురు ప్రముఖులు కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు.Deeply saddened by the tragic loss of life in Wayanad. My heart goes out to the affected families. The Adani Group stands in solidarity with Kerala during this difficult time. We humbly extend our support with a contribution of Rs 5 Cr to the Kerala Chief Minister's Distress…— Gautam Adani (@gautam_adani) July 31, 2024 -
సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు ఇకపై ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో వ్యవహరించాలంటూ సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ను సీఎం రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖ జత చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధిత దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత ఆస్పత్రులకు ఆన్లైన్లోనే పంపించి నిర్ధారించుకున్న తర్వాత అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదించి చెక్ను సిద్ధం చేస్తారు. చెక్పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా నంబర్ ముద్రిస్తారు. (దీనివల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు) ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15వ తేదీ తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https//cmrf.telangana.gov.in/ సైట్లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. -
నిరుపేద కుటుంబంలో వెలుగులు
సాక్షి, అమరావతి: నిరుపేద కుటుంబాన్ని పెద్దకష్టం చుట్టుముట్టింది. ఊహించని ప్రమాదంలో తొమ్మిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడి నోట మాటలేక, శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాలుడి చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బును సమకూర్చలేని నిస్సహాయత వారిది. ఆపద సమయంలో సీఎం జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇవ్వడమే కాకుండా.. ఖరీదైన చికిత్సను చేయించింది. ఆ నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపింది. స్వరపేటిక, శ్వాసనాళం చితికిపోయి.. పల్నాడు జిల్లా నకరికల్లులోని పాతూరుకు చెందిన షేక్ బాజీ, ఖాజాబీ ఇటుక బట్టీల్లో కూలీ పనులు చేసుకుంటుంటారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తొమ్మిదేళ్ల అనాస్ మహమ్మద్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ కిందపడిపోయాడు. ప్రమాదంలో బాలుడి గొంతుకు ఇనుపరాడ్ బలంగా గుచ్చుకుపోయింది. స్వరపేటిక, శ్వాసనాళం పూర్తిగా చితికిపోయాయి. హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వా్రస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరమని నిర్ధారించిన వైద్యులు అంబులెన్స్లో వెంటిలేటర్పై హైదరాబాద్ తరలించారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 3,257 ప్రొసీజర్లతో లక్షలాది మంది బాధితులకు అండగా సీఎం జగన్ నిలిచారు. అక్కడితో ఆగకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని అరుదైన జబ్బుల బారినపడి రూ.లక్షలు, కోట్లలో వైద్యానికి ఖర్చయ్యే వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ విషయంలోనూ సీఎం జగన్ మానవతా ధృక్పథంతో స్పందించారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు హైదరాబాద్లోని ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్చేసి బాలుడి శస్త్ర చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వెంటనే శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. దీంతో వైద్యులు అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్ర చికిత్సను చేపట్టారు. చికిత్స అనంతరం వైద్యుల పరిశీలన ముగించుకుని ఈ నెల 14న బాలుడు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. మరో మూడు నెలల అనంతరం ఇంకొక సర్జరీ చేస్తే బాలుడు ముందులా మాట్లాడగలుగుతాడని వైద్యులు చెబుతున్నారు. ఆపద కాలంలో సీఎం జగన్ చేసిన మేలును ఎప్పటికీ మరువలేమని ఖాజాబీ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ బిడ్డ తమకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యామని భావోద్వేగానికి గురవుతున్నారు. ఒక్క ట్వీట్తో స్పందించిన ప్రభుత్వం దెబ్బతిన్న స్వరపేటిక, శ్వాసనాళానికి అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. ఆ చికిత్స నిర్వహణ, వైద్య పరీక్షలు, మందులకు రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కలు ముక్కలయ్యేలా కష్టం చేసే ఖాజాబీ దంపతులకు అంత పెద్దమొత్తంలో అప్పు పుట్టని పరిస్థితి. వారి నిస్సహాయ స్థితిని చూసిన గ్రామస్తులంతా తలా కొంత ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయినప్పటికీ.. చికిత్సకు సరిపోయేంత డబ్బు సమకూరకపోవడంతో మహమ్మద్ను ఆదుకోవాలంటూ ఓ డాక్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై ఏపీ సీఎంవో అధికారులు స్పందించారు. ఈ విషయాన్నివెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దేవుడిలా ఆదుకున్నారు రోజూ పనికెళ్లి కూలి డబ్బులతో జీవిస్తున్నాం. తెచ్చుకుంటే తినాలి.. లేదంటే పస్తులుండాలి. ఇది మా జీవితం. అలాంటి మాపై ఉపద్రవంలా పెద్ద కష్టం వచ్చిపడింది. వెంటిలేటర్పై బాబును చూసి మాకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యాను. ఆపరేషన్కు రూ.6 లక్షలు ఖర్చవుతుందనగానే నా నోట మాట లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో దేవుడిలా సీఎం జగన్ ఆదుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పారు. ఈ రోజు మా బాబు సీఎం జగన్ దయవల్లే దక్కాడు. – షేక్ ఖాజాబీ, బాలుడి తల్లి మా పిల్లల చదువులకు అండగా నిలిచారు ఆ దేవుడు మా బిడ్డకు జన్మ ఇస్తే. సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబంలో వెలుగులు నింపారు. ఏమిచ్చినా ఆయన రుణం మేం తీర్చుకోలేం. అమ్మ ఒడి రూపంలో మా బిడ్డల చదువులకు చేదోడుగా ప్రభుత్వం నిలిచింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం మాకు ఇంటిస్థలం కూడా మంజూరు చేసింది. – షేక్ బాజీ, బాలుడి తండ్రి -
మా మంచి సీఎం
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయడానికి గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలు కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. ఆపదలో ఉన్నామని.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన వెంటనే మానవతా దృక్పథంతో వారికి ఆర్థిక సాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులును సీఎం ఆదేశించారు. దీంతో వెంటనే కలెక్టర్ బాధితుల వివరాలు తెలుసుకుని 16 మందికి రూ.16.30 లక్షలను సీఎం రిలీఫ్ఫండ్ కింద ఆర్థిక సాయం అందజేశారు. – సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన వారి వివరాలు ► నంద్యాల పట్టణం గాంధీనగర్కు చెందిన లక్కా కేశవ పక్షవాతంతో బాధపడుతుండడంతో చికిత్స నిమి త్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష అందజేశారు. ► నంద్యాల పట్టణం గాంధీనగర్కు చెందిన కె.మార్తమ్మ మూర్ఛ వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అవుకు మండలం సంగపట్నానికి చెందిన షేక్ షరీఫ్ ఫిజియో థెరపీ చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. ► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన ఎస్.గణేష్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష అందజేశారు. ► అవుకు మండలం సింగనపల్లెకు చెందిన ఎ.తారకేశవ్ మాన సిక వికలత్వంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన కాటసాని గణేష్ బ్రెయిన్లో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. బాధితుని చికిత్స కోసం రూ. 50 వేల చెక్కును కలెక్టర్ అందజేశారు. ► బనగానపల్లె మండలం గుండ్ల సింగవరం గ్రామానికి చెందిన కంబగిరి స్వామి మెదడులో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. అతని చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఒద్దిరాళ్ల గ్రామానికి చెందిన సుబ్బరాయుడవ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అతనికి చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అనంతపురం పాతబస్తీకి చెందిన పి.ముష్కస్ బ్యాక్ బోన్ ఫ్యాక్చర్తో బాధపడుతోంది. ఆమెకు చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► రోడ్డు ప్రమాదంలో మోకాలు పోగొట్టుకున్న అనంతపురానికి చెందిన బాధితుడు ఎస్.ఖాజాకు రూ.50 వేల చెక్కును అందజేశారు. ► ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన సి.సోమశేఖర్ పేదరికం కారణంగా గృహ నిర్మా ణం నిమిత్తం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► ప్రకాశం జిల్లా ఓబులంపల్లికి చెందిన బాల గురువయ్య వైద్య ఖర్చుల కోసం అతని భార్యకు రూ.లక్ష చెక్ అందజేశారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. బీకాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా.. సీఎం వెంటనే స్పందించారు. పైచదువులకు 15,000 రూపాయలు, జీవనోపాధికి మరో 15,000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 వేల రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. హరిజన గోరంట్లకు అందజేశారు. బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని.. నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా.. వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ అబ్దుల్ వజీద్కు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. అలాగే అవుకు మండలం వేములపాడు గ్రామ నివాసితుడు బి.మనురాహుల్ తాను 6 సంవత్సరాల నుంచి వికలాంగత్వంతో బాధపడుతున్నానని వ్యాధి చికిత్సకు తగిన ఆర్థిక స్తోమత తమ వద్ద లేదని, సహాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. బనగానపల్లె పట్టణ వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్ తనకు 20 సంవత్సరాల వయసు ఉందని ఇంటర్ ఫెయిల్ అయ్యానని.. నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. డా.కె.శ్రీనివాసులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వ్యాపారం చేసుకునేందుకు 2 లక్షల రూపాయల చెక్కును అబ్దుల్ హజీమ్కు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటివరకు వారు సొంత నిధులతో ఖర్చుపెట్టిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సభా వేదిక, హెలిపాడు ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన 22 మంది అర్జీదారులకు ఆర్థిక సహాయం, పెన్షన్లతో పాటు వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు వారి సొంత నిధులతో వైద్యానికి ఖర్చు పెట్టుకున్న మొత్తానికి పూర్తిస్థాయి రీయింబర్స్మెంట్కు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్కు సంబంధిత అర్జీదారులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీ ఎంపీటీసీ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్
జరుగుమల్లి: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే క్రమంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరోమారు రుజువయింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ బత్తిన మోహనరావు (53) బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురై అనేక ఆస్పత్రులకు తిరిగి దాదాపు రూ. 30 లక్షల వరకు ఖర్చుచేశారు. అయినా ఫలితం లేక గతేడాది నవంబర్లో మరణించారు. ధుఃఖంలో ఉన్న మోహనరావు కుటుంబానికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పార్టీలకు అతీతంగా అండగా నిలిచారు. స్థానిక నాయకులు చుండి శ్రీనివాసరావు, చుండూరి సురేష్ ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 8 లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 19న మోహనరావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. మానవత్వంతో ఆదుకున్నారు మా పెదనాన్న గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనారోగ్యానికి గురవడంతో పలు ఆస్పత్రులకు తిప్పి మా శక్తికి మించి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాం. అయినా ఆయన మాకు దక్కలేదు. ఆ సమయంలో స్థానిక నాయకులు, మంత్రి సురేష్ పార్టీలు చూడకుండా మానవత్వంతో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.8 లక్షలు మంజూరు చేయించి ఇచ్చారు. – బత్తిన శరత్బాబు, మృతుని తమ్ముని కుమారుడు -
గంగపుత్రులపై పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, కాకినాడ: గంగపుత్రులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గత డిసెంబర్ 1న బైరవపాలెం వద్ద నడి సముద్రంలో బోటు దగ్ధమవ్వగా, బోటులో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ బృందం రక్షించింది. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం జగన్.. బోటు యజమాని కాటాడి రామకృష్ణ పరమహంసకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇదీ చదవండి: షర్మిలను నిలదీసిన సామాన్యుడు -
టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం
‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం చివరికి ఎవరికి ఓటు వేసారన్నది కూడా చూడకుండా మంచి చేస్తామని ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో.. ఆ చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను తూచా తప్పకుండా అందరికీ అందించాం. నా వాళ్లు, కాని వాళ్లు అని ప్రజలను విభజించే జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేసి, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ నా వాళ్లే అనే గొప్ప సందేశాన్ని ఈ నాలుగేళ్ల కాలంలో ఇవ్వగలిగాం’. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పారదర్శక పాలన గురించి ఇలా వివరించారు. సంక్షేమ పథకాలే కాదు పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని చెప్పేందుకు నంద్యాలకు చెందిన టీడీపీ కార్యకర్తనే నిదర్శనం. నంద్యాల(అర్బన్): ఆయనొక కరుడుగట్టిన టీడీపీ వీరాభిమాని. అంతటి అభిమానికి గుండె సంబంధిత వ్యాధి సోకింది. పార్టీ కోసం పాటు పడిన కార్యకర్త మృత్యువుతో పోరాడుతున్న విషయం పార్టీ ఇన్చార్జ్లకు తెలిసింది. అయినా సహాయం అందించక పోగా కనీసం పరామర్శకు కూడా రాలేదు. ఆ గుండెకు ఏమి కాకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక సహాయం చేసి ప్రాణాన్ని నిలిపారు. నంద్యాల మండలం అయ్యలూరు మెట్టకు చెందిన దాది నాగేశ్వరరావు కొద్ది నెలల క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ నంద్యాల, కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఈ వ్యాధి పరిధిలోకి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రిని కాపాడుకునేందుకు పార్టీలను పక్కనపెట్టిన కుమారులు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు బసవేశ్వరరెడ్డి, రవికుమార్ రెడ్డిల ద్వారా విషయాన్ని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలు ముఖ్యం కాదని, ఓ ప్రాణాన్ని కాపాడటానికి మానవతా దృక్పథంతో ఆపరేషన్కు అయ్యే ఖర్చు మంజూరయ్యేలా ఎమ్మెల్యే శిల్పా రవి సీఎంఆర్ఎఫ్కు సిఫారసు చేశారు. ఎమ్మెల్యే లెటర్ తీసుకున్న నాగేశ్వరరావు కుమారులు నాగరాజు, నాగార్జున అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే శిల్పారవితో ఫోన్ చేయించుకోవడంతో రూ.8.50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ త్వరితగతిన విడుదల అయ్యింది. సీఎం రిలీఫ్ ఫండ్తో నాగేశ్వరరావుకు ఆగస్టు నెలలో హైదరాబాద్ నిమ్స్లో ఆపరేషన్ చేయించారు. క్షేమంగా ఇంటికి చేరుకున్న ఇంటి పెద్దను చూసి కుటుంబీకులు సంతోషించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగేశ్వరరావు బతికేందుకు సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని అతని భార్య లక్ష్మీదేవి, కుమారులు నాగరాజు, నాగార్జున చెబుతున్నారు. నాగేశ్వరరావు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ పరామర్శించడానికి రాలేదన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వచ్చి భరోసా కల్పించారన్నారు. ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని చెప్పడంతో ఎంతో ధైర్యం వచ్చిందన్నారు. టీడీపీకి చెందిన ఫొటో లను కేసీ కాల్వలో పడేశామని, ప్రస్తుతం తమ కుటుంబానికి జగనన్నే దేవుడు అని చెబుతున్నారు. -
సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం
అమలాపురం రూరల్: బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఆమె వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. బ్రెయిన్ క్యాన్సర్గా వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో తండ్రి రాంబాబు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ దృష్టికి తన బిడ్డ సమస్యను రాంబాబు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా తీసుకువెళ్లారు. ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం ఆ కుటుంబానికి అందజేశారు. చదవండి: దమ్ము లేకనే.. దత్తపుత్రుడు -
టీడీపీ నేతకు లివర్ వ్యాధి.. సీఎం రిలీఫ్ ఫండ్ రూ.20 లక్షలు మంజూరు
తుని: కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ మాజీ సభ్యుడు కె.కృష్ణకు లివర్ వ్యాధి చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.20 లక్షలు మంజూరు అయింది. ఇందుకు సంబంధించిన ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణ భార్య లక్ష్మికి అందజేశారు. కొంతకాలంగా కృష్ణ లివర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఏఎంసీ మాజీ చైర్మన్ మురళి మంత్రి రాజా దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నం మణిపూర్ ఆస్పత్రిలో కృష్ణకు వైద్య సేవలు అందిస్తున్నారు. తమ ప్రభుత్వం పథకాలతో పాటు వైద్య సేవలను పార్టీలకు అతీతంగా అందిస్తున్నదని మంత్రి రాజా అన్నారు. చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం -
జబర్దస్త్ పంచ్ ప్రసాద్ వైద్యానికి సీఎం రిలీఫ్ నుంచి సహాయం
-
పేరుకే బిచ్చగాడు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళం
తిరువళ్లూరు: బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేల నగదును సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడో యచకుడు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్కుళం సమీపంలోని ఆళంగినర్ గ్రామానికి చెందిన యాచకుడు పూల్పాండి(75). భార్య మృతి చెందిన తరువాత తన పిల్లలు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదును విద్య, వైద్యం, ఆనాథ ఆశ్రమాలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదేళ్లలో పాండిచ్చేరితో పాటు చైన్నె, తూత్తుకుడి, కన్యాకుమారి, విల్లుపురం, వేలూరు, సేలం, నీలగిరి, కోయంబత్తూరు సహా వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్లను కలిసి ఇప్పటి వరకు యాచించిన రూ. 5.60 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. తాజాగా రెండు నెలల్లో బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేలను కల్తీసారా తాగి విల్లుపురం చెంగల్పట్టు జిల్లాలో మృతి చెందిన కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. మంగళవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీజాన్వర్గీష్ను కలిసి నగదు అందజేశారు. అనంతరం మీడియాతో పూల్పాండి మాట్లాడుతూ.. డబ్బులు ఉంటే మనఃశాంతి ఉండదని, మనస్సు ఉన్న వారి వద్ద డబ్బులు ఉండడం లేదని తెలిపారు. తాను బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదులో కొంత భాగాన్ని తిండి కోసం ఉపయోగిస్తున్నానని చెప్పారు. తనకు మూడుపూటల ఆహారం, కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే వృద్ధాశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నట్లు పాండి తెలిపారు. -
కరోనాతో పేరెంట్స్ మృతి.. పిల్లలకు 10లక్షలు అందజేత
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కొల్లు శ్రీవాసవి ప్రవళిక, కొల్లు ఉమాశంకర్ అక్కాతమ్ముళ్లకు సీఎం సహాయ నిధి నుండి రూ.10 లక్షల చెక్కులను హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అందజేశారు. కొవ్వూరులోని హోం మంత్రి కార్యాలయంలో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. కాగా.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని జండా పంజా రోడ్డులో నివాసం ఉంటున్న కొల్లు శ్రీ వాసవి ప్రవళిక, ఉమాశంకర్లు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. 2021లో కరోనాతో తండ్రి కొల్లు శ్రీనివాసరావు(47) జూన్ 5 న మరణించగా, తల్లి కొల్లు శ్యామల(41) జూన్ 9న మృతి చెందారు. ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న అక్క తమ్ముళ్లకు సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ ఒకేసారి కోల్పోయి తీవ్ర మనోవేదనలో ఉన్న తమకు ధైర్యాన్ని, భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోం మంత్రి తానేటి వనితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి సాయం అందించడానికి హోం మంత్రి చేసిన కృషి, చొరవ ఎప్పటికీ మరువలేనిదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసం, ఆపద కాలంలో వారికి అండగా ఉండడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందని తెలిపారు. -
భిక్షాటనతో వచ్చిన రూ.10 వేలు..
తమిళనాడు: ఓ వృద్ధుడు భిక్షాటన ద్వారా వచ్చిన రూ.10 వేలును మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చాడు. వివరాలు.. పెరంబలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మంగళవారం తూత్తుకుడి జిల్లా సాత్తాంగుళం తాలూకా అలంగినారు ప్రాంతానికి చెందిన భూల్ పాండియన్ (73) వచ్చాడు. తన భిక్షాటన ద్వారా తనకు వచ్చిన రూ.10 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని కలెక్టర్ కార్యాలయ అధికారుల వద్దకు వెళ్లాడు. తరువాత వాటిని బ్యాంకుల ద్వారా ప్రభుత్వ నిధుల్లోకి జమ చేయమని సూచించారు. దీంతో బ్యాంకుకు వెళ్లి తన పొదుపు సొమ్ము రూ.10 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. -
టీడీపీ నేత కుటుంబానికి రూ.5 లక్షల ప్రభుత్వ సాయం
శాంతిపురం: చిత్తూరు జిల్లా చెంగుబళ్ల పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు, గతంలో జన్మభూమి కమిటీ సభ్యుడిగా ఉన్న మునిసిబ్ గారి ప్రసాద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసింది. చెంగుబళ్ల పంచాయతీ పరిధిలోని సోగడబళ్లలో ఆదివారం ఎమ్మెల్సీ భరత్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ప్రసాద్ కుమారుడు మోహన్కు ఎమ్మెల్సీ భరత్ అందజేశారు. ప్రసాద్ భార్య రూప తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆమె వైద్యానికి అయిన ఖర్చులను ప్రభుత్వం మంజూరు చేసిందని భరత్ చెప్పారు. -
ఆ దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణప్రాయంగా వదిలేస్తా: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్కల్యాణ్లా ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు నేను చేయను అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు మంజూరైన పరిహారంలో రూ.2లక్షలు తీసుకునే దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణపాయంగా వదిలేస్తానని మంత్రి అంబటి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించాం. ఆగస్టు 20న మృతి చెందినవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా చంద్రబాబు జేబు పార్టీ నాపై ఆరోపణలు చేస్తే నేనెలా ఊరుకుంటా?. నాపై తప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. జనసేన అభిమాని చనిపోతే కనీసం పలకరించని కుసంస్కారం పవన్ది' అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చదవండి: (బాపట్ల జిల్లా యడ్లపల్లిలో పర్యటించనున్న సీఎం జగన్) -
కడపలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
-
ఆపద్బంధు.. సీఎం సహాయ నిధి
భీమవరం(ప్రకాశం చౌక్): పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నాడు–నేడులో భాగంగా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేస్తోంది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం వర్తించని కేసులకు సంబంధించి రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. వారి పాలిట ఆపన్నహస్తంలా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీలో వైద్యం లేని వ్యాధులకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందిన పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యానికి లక్షలు ఖర్చు చేసిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ఆర్థిక భరోసా అందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధుల చేతులమీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నారు. రూ.10 కోట్లకు పైగా.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన 2019 నుంచి ఇప్పటివరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో బాధితులకు సుమారు రూ.10 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందించారు. సుమారు 2 వేల మంది వరకు ఈ సాయం అందినట్టు అంచనా. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న రోగులకు ఆస్పత్రిలో అయిన ఖర్చును బట్టి రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు సాయం అందిస్తున్నారు. బాసటగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్న బాధితులకు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బాసటగా నిలుస్తున్నారు. నేరుగా వారి వద్దకు వచ్చినా లేదా గ్రామాల పర్యటన సందర్భంగా గుర్తించిన కేసులకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా కృషిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను వారి కార్యాలయాల నుంచి పంపించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. సర్వత్రా హర్షం సీఎం రిలీఫ్ ఫండ్ సాయంపై లబ్ధిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు సంబంధించి సాయం అందించడం అభినందనీయమని అంటున్నారు. రూ.10 లక్షలు ఇచ్చారు మా అబ్బాయికి కాలేయ సమస్య రావడంతో హైదరాబాద్లో వైద్యం చేయించాం. విషయాన్ని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.10 లక్షలు వచ్చేలా సాయపడ్డారు. నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా మా అబ్బాయికి పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంది. సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్కు కృతజ్ఞతలు. – పచ్చిపాల మూర్జా, గూట్లపాడు పేదలకు వరంలా.. మా మనవడు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రిలో సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించాం. తర్వాత శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా ఇటీవల రూ.5.20 లక్షల సాయం అందించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా మారింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – ఎం.రామకృష్ణ, విస్సాకోడేరు -
బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు
ఆత్మకూరు : నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అందజేశారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో శనివారం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి చేతుల మీదుగా 38 మంది బాధితులకు రూ.40.17 లక్షల చెక్కులను అందజేశారు. ఓ వైపు ఆరోగ్యశ్రీ పథకంతో ఎందరో పేదలు ఉచిత వైద్య సేవలు పొందుతుంటే, సీఎంఆర్ఎఫ్ కింద మరింత మందికి బాసటగా నిలవడం దేశంలో ఎక్కడా లేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. -
బాలిక లివర్ మార్పిడికి సీఎం సహాయ నిధి సాయం
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని డిప్యూటీ సీఎం అంజద్బాషా సోదరుడు, హరూన్ గ్రూప్ సంస్థల ఎండీ ఎస్బి అహ్మద్బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కడప నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక సయ్యద్ షబానా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సీఎం సహాయ ని«ధి నుంచి మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి అందజేశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న సయ్యద్ షబానా చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారని చెప్పారు. అంత ఖర్చు భరించలేని బాలిక కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం అంజద్బాషాను ఆశ్రయించడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడి సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స వ్యయం రూ.17.50 లక్షలు మంజూరు చేయించారన్నారు. డిప్యూటీ సీఎం అందుబాటులో లేనందున ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి తాను అందిస్తున్నట్లు వివరించారు. షబానా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తన లివర్ను దానం చేస్తున్న బాధితురాలి తల్లితోపాటు శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలియచేశారు. -
సీఎం జగన్ను కలిసిన జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) భారీ విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ.కోటి ఐదు లక్షల డీడీని అందించారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్ ఆర్.వీరమణి సీఎంకు వివరించారు. సీఎం జగన్ను కలిసిన వారిలో జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రెవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) రూ. 1,05,00,000 విరాళం. కోవిడ్ – 19 నివారణకు తీసుకున్న సమర్ధవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని సీఎంకి వివరించిన కంపెనీ చైర్మన్ ఆర్. వీరమణి. pic.twitter.com/V5kW0YADcc — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 16, 2022 చదవండి: (3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్) -
సీఎం సహాయనిధికి విరాళం అందించిన APDMC
-
వరద బాధితుల సహాయార్థం ఏపీఎండీసీ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం అందజేసింది. విరాళానికి సంబంధించిన చెక్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు. చదవండి: మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు -
బాలిక వైద్యానికి రూ.15 లక్షల సాయం.. సీఎం జగన్కు కృతజ్ఞతలు
దేవరపల్లి: కాలిన గాయాలతో విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక అన్వికను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన గొల్లపల్లి రాకేష్ నాలుగేళ్ల కుమార్తె ఇంటి వద్ద ఆటలాడుకుంటూ వేడి సాంబారు గిన్నెలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఎమ్మెల్యే తలారి వెంకట్రావును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే వెంకట్రావు కోరారు. ఈ మేరకు సీఎం సహాయనిధి నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంకు, ఎమ్మెల్యేకు బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవరపల్లి మండలం గొల్లగూడెం దివ్యాంగుల, వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షుడు కాగిత భాస్కరరావు బాలిక వైద్యఖర్చులకు రూ.5,116 సాయం అందజేశారు. చదవండి: (గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!) -
పసి ప్రాణానికి అండగా ‘సీఎం సహాయనిధి’.. రూ.10 లక్షలు మంజూరు
గన్నవరం రూరల్: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ అండగా నిలిచింది. గంటల వ్యవధిలోనే ఆపరేషన్కు అవసరమైన రూ.10 లక్షలు మంజూరు కావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడేనికి చెందిన మెట్లపల్లి రాఘవరావు వ్యవసాయ కూలీ. అతని భార్య నాగలక్ష్మి గృహిణి. వీరికి గతేడాది నవంబర్ 6న మగబిడ్డ జన్మించాడు. అయితే బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించి చివరికి హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, రూ.10 లక్షలకు పైగానే ఖర్చవుతుందని, వెంటనే చేయకపోతే ప్రమాదమని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం ఇక చేసేది లేక చంటి బిడ్డతో ఇంటికి తిరిగొచ్చేశారు. సోమవారం గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామ వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రూ.10 లక్షలు మంజూరు వైఎస్సార్సీపీ నేతలు బాలుడి విషయాన్ని ఫోన్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రెయిన్బో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి చిన్నారి చికిత్సకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి వివరాలు పంపి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. కేవలం గంటల వ్యవధిలో చిన్నారి చికిత్సకు రూ.10 లక్షలు మంజూరు కావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంజూరైన రూ.10 లక్షల చెక్కును బుధవారం వీరపనేనిగూడెం గ్రామ సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మేచినేని బాబు, పడమట సురేష్, కైలే శివకుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్రాణి, సర్పంచ్ జేజమ్మ, ఎంపీటీసీ పద్మావతి, ఉప సర్పంచ్ నాగసాంబిరెడ్డి, సహకార బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు బాధిత కుటుంబానికి అందించారు. -
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు.. అల్లు అర్జున్ రూ.25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో వరదల కారణంగా నష్టపోయినవారికి తన వంతు సాయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సాయంగా రూ.25 లక్షల విరాళం అందించారు. వరదల కారణంగా నష్టపోయిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. (చదవండి: AP Rain Alert: బలపడిన వాయుగుండం) -
ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్ల భారీ విరాళాలు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు వరదలకు గురైన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో చిక్కుకుని కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరూ ఆర్థికంగా నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పడు తక్షణ చర్యలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. 🙏@ysjagan @AndhraPradeshCM — Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2021 ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలకు భయంకరమైన విపత్తు వచ్చింది. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వారికి చేయూతగా ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతు సాయంగా రూ. 25 లక్షలు విరాళం అందిస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను’ అంటూ చేతులు జోడించిన ఏమోజీని జత చేశారు. Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ — Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021 అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ వరదల విపత్తు బాధిత కుటుంబాలకు నా వంతూ సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery. — Jr NTR (@tarak9999) December 1, 2021 -
సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నమూసిన సంగతి తెలిసిందే. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ.. నవంబర్ 24న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం సిరివెన్నెల మృతి చెందారు. ఈ క్రమంలో సిరివెన్నెల కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: సిరివెన్నెల గారు అలా నా జీవితాన్ని దిశా నిర్ధేశం చేశారు: రాజమౌళి) ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులు. ఆస్పత్రి ఖర్చుల భారం సిరివెన్నెల కుటుంబంపై పడకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలానే సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు) ఇటువంటి సమయంలో సీఎం జగన్ తమకు అండగా నిలిబడినందుకు గాను సిరివెన్నెల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం -
ఏపీ: అపోలో రూ.2 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయ నిధికి అపోలో హస్పిటల్స్ గ్రూపు కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రాకు మరో కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. మొత్తంగా రూ.2 కోట్ల విరాళాలకు సంబంధించిన చెక్కులను గురువారం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి, ప్రెసిడెంట్ (ప్రొక్యూర్మెంట్ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్) నరోత్తమ్ రెడ్డి, సీఈఓ (ఏహెచ్ఈఆర్ఎఫ్) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్ వెర్టికల్) శివరామకృష్ణన్లు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్కు అందజేశారు. ఇవీ చదవండి: పవర్ ‘ఫుల్ ఆదా’ ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -
చిన్నారి చికిత్సకు సీఎం రూ.17.5 లక్షల సాయం
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): బిడ్డకు పచ్చకామెర్లు.. ఒళ్లంతా దద్దుర్లు.. జన్యుపరమైన లివర్ సమస్య.. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి.. దీనికి తోడు భారీ ఖర్చు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి స్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని ఆదుకుని రూ.17.5 లక్షలు విడుదల చేయడంతో చిన్నారి ప్రాణాలు నిలిచాయి. దీంతో ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డితో కలిసి వారు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారానికి చెందిన జగదీష్, లక్ష్మి దంపతులకు మునీశ్వర్ (10 నెలలు) అనే బాబు ఉన్నాడు. చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డిని కలిసి సహాయం కోరారు. ఆయన వెంటనే స్పందించి వారిని చెన్నైలోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి పంపారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు జన్యుపరమైన లివర్ సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయాల్సి వస్తుందని, అందుకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఎమ్మెల్యే చొరవ, చిన్నారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.17.5 లక్షలకు ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బియ్యపు సీఎం జగన్మోహన్రెడ్డికి విన్నవించగా ఆయన వెంటనే రూ.17.5 లక్షలను ఆస్పత్రికి చెల్లించడానికి అధికారులకు అనుమతి ఇచ్చారు. వైద్యులు చిన్నారి తండ్రి నుంచి 20 శాతం లివర్ తీసుకుని.. చిన్నారికి లివర్ మార్పిడి చేశారు. 12 గంటలపాటు శ్రమించి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు సీఎం వైఎస్ జగన్కు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎంఆర్ఎఫ్కు సన్ నెట్వర్క్ రూ.3 కోట్లు విరాళం
సాక్షి, హైదరాబాద్: సీఎం సహాయ నిధికి సన్ నెట్వర్క్ రూ.3 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. మంత్రి కేటీఆర్ను జెమినీ టీవీ బాధ్యులు పి.కిరణ్ శుక్రవారం ప్రగతిభవన్లో కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కోవిడ్ సమ యంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ‘సన్’ ఉదారతను మంత్రి అభినందించారు. -
సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానంటోన్న ప్రముఖ కమెడియన్
ప్రముఖ హాస్యనటుడు వడివేలు సీఎం కరోనా నివారణ నిధికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి చెక్కు అందించారు. అనంతరం వడివేలు మీడియాతో మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రపంచాన్నే విస్మయ పరచారని పేర్కొన్నారు. పరిపాలనలో ఆయన తండ్రి పేరును నిలబెట్టుకున్నారని అన్నారు. కొంగునాడు విభజనపై జరుగుతున్న ప్రచారం గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. ఇప్పుడు కొంగునాడు అంటూ విభజననే ఊహించలేం అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేయరాదని వడివేలు అన్నారు. తాను మళ్లీ చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వడివేలు ఈ సందర్భంగా తెలిపారు. -
కత్తి మహేశ్ చికిత్సకు ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ చికిత్స కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నుంచి లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)నుంచి ఈ నగదు అందించారు. ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
కోవిడ్ నివారణకు విశాఖ పరిశ్రమల విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,05,50,000 చెక్ను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం రీజినల్ ఆఫీస్ పరిధిలోని పరిశ్రమలు అందజేశాయి. సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్ను కలిసి ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ విజయ్కుమార్, ఏపీపీసీబీ విశాఖపట్నం రీజినల్ ఆఫీసర్ ప్రమోద్కుమార్ రెడ్డి చెక్ను అందజేశారు. -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన సిక్మా ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) ప్రతినిధులు కలిశారు. కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల విలువైన 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ను కలిసి వివరాలు అందజేసిన వారిలో ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్, మార్కెటింగ్, భారతీ సిమెంట్స్), డాక్టర్ ఎస్.ఆనంద్ రెడ్డి (ఎండీ, సాగర్ సిమెంట్స్), ఇంజేటి గోపినాథ్ (సీఈవో, సిక్మా) ఉన్నారు. చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’ థర్డ్వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక -
కరోనా నివారణ నిధికి రూ.కోటి విరాళం
చెన్నై: కరోనా నివారణకు విరాళాలు ఇవ్వాలన్న సీఎం విజ్ఞప్తికి బాగా స్పందన వస్తోంది. ప్రముఖ సినీ నిర్మాత, శ్రీ గోకులం చిట్ఫండ్ అండ్ ఫైనాన్స్ అధినేత గోపాలన్ రూ.కోటి విరాళంగా అందించారు. ఆయన గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి చెక్కు అందజేశారు. ఆయన వెంట చిట్ఫండ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైజూ గోకుల్, డైరెక్టర్ ఆపరేషన్స్ ప్రవీణ్ ఉన్నారు. -
సీఎం సహాయనిధికి హాస్యనటుడు సూరి విరాళం
సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రముఖ హాస్యనటుడు సూరి సీఎం రిలీఫ్ ఫండ్ నిధికి తన వంతుగా రూ.10 లక్షలు, తన కొడుకు సర్వాన్, కూతురు వెన్నెల పేరుతో మరో రూ.25వేలను విరాళంగా అందించారు. ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ను కలిసిన సూరి రూ.10 లక్షలు చెక్కు రూపంలోనూ, రూ.25వేలు నగదును అందించారు. ప్రజలకు కోవిడ్ వైద్యం, ఆక్సిజన్, వ్యాక్సిన్ సదుపాయాలను సమకూర్చడానికి దాతలు సీఎం సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు తమ వంతు విరాళాలను అందించారు. -
విరాళాల వెల్లువ.. నిర్మాత ఐసరి గణేష్ కోటి విరాళం
చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు మేరకు పలువురు సినీ, రాజకీయ నాయకులు కరోనా నివారణ నిధికి విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. వేల్స్ విద్యాలయం కులపతి, సినీ నిర్మాత డాక్టర్ ఐసరి గణేష్ కరోనా నివారణ నిధికి రూ.కోటి ప్రకటించారు. ఆయన సతీమణి ఆర్తి గణేష్, కుమార్తె ప్రీతా గణేష్తో కలిసి మంగళవారం సాయంత్రం సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి స్టాలిన్కు చెక్కు అందజేశారు. -
సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్ –19 నివారణలో భాగంగా సీఎం సహాయనిధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ గోయెల్, వైస్ ప్రెసిడెంట్(కార్పొరేట్ రిలేషన్స్) కె.సత్యనారాయణ బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఉన్నారు. -
చిన్నతనం లో మానవత్వాన్నీ చాటుకుంటున్న అభిరామ్ రోషన్
-
సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షల విరాళం
హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): ముఖ్యమంత్రి సహాయనిధికి దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గుడివాడలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని కలసి రూ.50 లక్షల చెక్కును అందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సుబ్రహ్మణ్యం కోరారు. చదవండి: ఏపీ: జూన్ 22న వైఎస్సార్ చేయూత పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం -
కోవిడ్ బాధితుల కోసం సౌందర్య రజనీకాంత్ రూ. కోటి విరాళం
కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు కోలీవుడ్ నడుంబిగించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజరోజుకు లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో సమయానికి బాధితులకు వైద్య సదుపాయం, ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. ఇక బాధితులను రక్షించేందుకు ప్రభుత్వాలు, వైద్య సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి అండగా పలువురు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తమవంతు సాయంగా కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివ కుమార్లు కలిసి సీఎం స్టాలిన్కు కోటి రూపాయల చెక్ విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ సైతం విరాళం ఇచ్చింది. ఆమె భర్త విశాగన్ వనంగముడి, మామ ఎస్ఎస్ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు కోటి రూపాయల చెక్ను అందించింది. తమ ఫార్మా కంపెనీ అపెక్స్ లాబోరేటరీ నుంచి ఈ విరాళం అందించినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆమె భర్త విశాగన్ రాష్ట్రానికి కొత్త సీఎంగా ఎన్నికైన ఎంకే స్టాలిన్కు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక హీరో అజిత్ సైతం రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, హీరో ఉదయనిధి స్టాలిన్లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. -
సీఎం స్టాలిన్ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం
సాక్షి, చెన్నై: కరోనా నివారణ నిధికి సీనియర్ నటుడు శివకుమార్ కుటుంబం రూ.కోటి విరాళంగా అందించింది. రాష్ట్రంలోని ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ లేమి నెలకొన్న నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధిని సేకరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సేవా కార్యక్రమాలకు ముందుండే నటుడు శివ కుమార్ కుటుంబం సీఎం విజ్ఞప్తికి స్పందించి రూ. కోటి విలువైన చెక్కును సీఎం స్టాలిన్కు అందించారు. శివకుమార్ ఆయన కొడుకులైన నటులు సూర్య, కార్తీ హాజరై కరోనాపై పోరులో తమ మద్దతును ప్రభుత్వానికి తెలియజేశారు. #ActorSivakumar @Suriya_offl @Karthi_Offl handed over the Cheque for 1Cr to Hon’ble Chief Minister @mkstalin #TNCMReliefFund @rajsekarpandian pic.twitter.com/sKZ6U52LsJ — BARaju (@baraju_SuperHit) May 12, 2021 -
కరోనా కట్టడికి ఏపీఎండీసీ రూ.100 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) భారీ సాయం అందించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.100 కోట్లు విరాళం అందించింది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి రూ.90 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ.10 కోట్లు అందజేసింది. గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టీడీపీ నేతకు అండగా నిలిచిన సీఎం రిలీఫ్ ఫండ్
హిందూపురం: సంక్షేమ పథకాల అమలులో, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడమని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో కష్టాల్లో ఉన్న ఓ టీడీపీ నేతను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తిమ్మారెడ్డి కొంతకాలంగా పక్షవాతానికి గురై.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఇటీవల తిమ్మారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడే కొంత ఆర్థిక సాయం చేసిన ఇక్బాల్.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తిమ్మారెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం తిమ్మారెడ్డికి రూ.2.70 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును బుధవారం ఎమ్మెల్సీ కార్యాలయంలో తిమ్మారెడ్డి కుమారుడు వెంకటేష్, కుమార్తె తేజస్విని అందుకున్నారు. అలాగే నియోజకవర్గానికి చెందిన 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరవ్వగా.. వారందరికీ చెక్కులు పంపిణీ చేశారు. -
Kerala: బీడీ కార్మికుని ఉదారత.. సీఎం రిలీఫ్ ఫండ్కు..
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనా సునామీని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ దీని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ఉపాధిని సైతం కోల్పోయారు. మరికొందరు పొట్టకూటి కోసం చిన్నాచితకా పనులు చేస్తూ బతుకు బండిని లాగిస్తున్నారు. అయితే, ఇక్కడో వ్యక్తి.. తాను చేసేది చిన్న పనే అయినా.. సీఎం సహయ నిధికి పెద్ద మొత్తంలో విరాళం పంపి గొప్ప మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కన్నూర్కు చెందిన ఓ బీడీ కార్మికుడు కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 లక్షలు పంపించాడు. తన సొమ్మును వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించాలని కోరాడు. ఇలా డబ్బులు పంపిన తర్వాత అతని అకౌంట్లో కేవలం రూ.850 మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం. అయితే, బీడీకార్మికుడు బ్యాంక్ అధికారుల దగ్గరకు వెళ్లి తన అకౌంట్లోని రూ.2 లక్షలను సీఎం సహయ నిధికి బదిలీ చేయాలని కోరగానే బ్యాంకు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. నీ అకౌంట్లో తక్కువ మొత్తంలో డబ్బు ఉందని తెలిపారు. దాన్ని కూడా విరాళంగా ఇచ్చేస్తే ఎలా జీవనం సాగిస్తావని ప్రశ్నించారు. దీనికి అతను.. ఇక మీదటకూడా బీడీలు చుట్టి బతుకుతానని తెలిపాడు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ బీడీవర్కర్ ఉదార స్వభావాన్నిసోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడిది వైరల్గా మారింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ ట్విటర్ వేదికగా స్పందించారు. బీడి కార్మికుడి ఉదార స్వభావాన్ని మెచ్చకున్నారు. నెటిజన్లు సైతం ‘మీ మానవత్వానికి హ్యట్సాఫ్... మీరు చాలా మందికి ఆదర్శం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
Anupama Parameswaran: కేరళ సీఎం ఫండ్కు అనుపమ విరాళం
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. సామాన్య జనం నుంచి సినీ రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతోంది. రోజుకు వేలల్లో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంది. అక్కడ ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉండటంతో సామాన్య ప్రజలకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వానికి తోడుగా సినీ నటీనటులు, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందిస్తున్నారు. తాజా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ‘చీఫ్ మినిస్టర్స్ డిస్స్ట్రెస్ రీలీఫ్ ఫండ్ కేరళ’(సీఎండీఆర్ఎఫ్కే)కు తన వంతు సాయంగా విరాళం అందించారు. అనుపమ విరాళం ఇచ్చినట్లుగా సీఎండీఆర్ఎఫ్కే సర్టిఫికెట్ను జారీ చేసింది. ఆ సర్టిఫికెట్ ఫొటోను ట్విటర్లో అనుపమ షేర్ చేస్తూ అందరిని విరాళం ఇవ్వాల్సిందిగా పిలుపు నిచ్చారు. ‘నా వంతు విధిని నిర్వర్తించాను.. ప్లీజ్ మీరు కూడా కాస్తా సాయం చేయండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. Have done my part... pls contribute that little you can !!! https://t.co/aExMt4W5h4 pic.twitter.com/BzuM87TliO — Anupama Parameswaran (@anupamahere) April 25, 2021 -
సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నియంత్రణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళం వచ్చింది. ఈ విరాళం ఇచ్చిన వారిలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. విరాళాలు అందజేసిన సంస్థల్లో కొన్ని ► ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్, విజయవాడ రూ. 14,20,000 ► ఏపీ ఆయిల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పీవీఎస్ఎస్ మూర్తి రూ. 15,00,000 ► కాళేశ్వరీ రిఫైనరీ అండ్ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్ రూ. 25,00,000 ► కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ రూ. 1,00,000 ► భవాని కాస్టింగ్స్ ప్రై.లిమిటెడ్ రూ. 5,00,000 ► వేద సీడ్ సైన్స్ ప్రై.లిమిటెడ్ రూ. 10,00,000 వీటితో పాటు మరికొన్ని సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేసిన వాటిలో ఉన్నాయి. -
అవినీతి గని.. నాటి సీఎం రిలీఫ్ నిధి
రోగుల ప్రాణాలతో ఏవైనా ఆస్పత్రులు చెలగాటం ఆడుతుంటే శిక్షించాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహించింది.. పేద రోగుల ఆశలను కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, సీఎంఆర్ఎఫ్ సిబ్బంది కలిసి సొమ్ము చేసుకున్నారు.. వైద్యం చేయకుండానే కొన్ని ఆస్పత్రులు బిల్లులు పెట్టి డబ్బు దండుకున్నాయి.. ఒకరు దరఖాస్తు చేసుకుంటే, మరొకరికి వైద్యం అందించాయి మరికొన్ని ఆస్పత్రులు. అవినీతికి పాల్పడేందుకు ఉన్న అడ్డదారులన్నీ ఉపయోగించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కాస్త అసహాయ నిధిగా, అంతకు మించి అవినీతి నిధిగా మారిపోయింది. (గుండం రామచంద్రారెడ్డి, సాక్షి, అమరావతి): గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అవినీతి గనిగా మారింది. దోచుకున్న వారికి దోచుకున్నంత.. అన్న చందంగా ఇష్టారాజ్యంగా అక్రమార్కులకు నిలయమైంది. అసలైన బాధితులకు మొండి చేయి చూపుతూ.. అయిన వారికి అప్పనంగా కోట్లు కట్టబెట్టింది. పేదలకు జబ్బు చేసినప్పుడు వైద్యం చేయించుకోలేక, అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వైపు ఆశగా చూస్తారు. ఈ సొమ్ము వస్తే ప్రాణాలతో బయట పడతామని కొండంత ఆశతో దరఖాస్తు చేసుకుంటారు. స్వయానా ముఖ్యమంత్రి విచక్షణ మేరకు విడుదల చేసే ఈ నిధుల్లో కూడా కోట్లకు కోట్లు కొల్లగొట్టిన వైనం 2014–19 మధ్య కాలంలో తవ్వే కొద్దీ బయటపడుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులు, సీఎంఓ కార్యాలయం సిబ్బంది కుమ్మకైసీఎంఆర్ఎఫ్ నిధులు అందినకాడికి దోచుకున్నారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ సరిగా అమలు కానందున, కనీసం సీఎం అయినా కనికరించి ఆర్థిక సాయం చేస్తే వైద్యం చేయించుకుందామన్న రోగుల ఆశలను ఆస్పత్రులు, అప్పటి సీఎంఆర్ఎఫ్ సిబ్బంది కలిసి మొగ్గలోనే చిదిమేశారు. వేలాది కుటుంబాలకు నిరాశ మిగిల్చారు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక ఎల్ఓసీలా! సాధారణంగా పేషెంట్కు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు లేదా డిశ్చార్జికి ముందు ఎల్ఓసీకి దరఖాస్తు చేస్తారు. ఎల్ఓసీలో అనుమతుల మేరకు చికిత్స తర్వాత ఆ సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ డిశ్చార్జి తర్వాత అయితే రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని వేల కేసులకు సంబంధించి పేషెంట్ డిశ్చార్జి అయిన నెలకు ఎల్ఓసీల కోసం దరఖాస్తు చేసుకుని, క్లెయిమ్ చేసుకున్నారు. ఇందులో మరో కోణమేంటంటే ట్రీట్మెంట్ పూర్తయ్యాక బిల్లుకు రెండు రెట్లు ఎక్కువగా ఎల్ఓసీ తెచ్చుకుని నిధులు పొందారు. సెక్రటరీ సంతకాలు లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చూడటానికి ప్రత్యేక అధికారి ఉంటారు. ప్రతి ఫైలునూ క్షుణ్ణంగా పరిశీలించాకే ఆమోదిస్తారు. ఇతన్ని అసిస్టెంట్ సెక్రటరీ (ఏఎస్) టు సీఎం అంటారు. ఇతను సంతకం చేశాకే ఆ ఫైలు రెవెన్యూ శాఖకు వెళుతుంది. అక్కడ నుంచి చెక్కు ఆస్పత్రికి వెళుతుంది. కానీ ఇక్కడ ఏఎస్ టు సీఎం సంతకం లేకుండానే ఫైళ్లు రెవెన్యూ శాఖకు వెళ్లాయి. కనీసం డాక్టర్ పరిశీలన కూడా లేకుండా వెళ్లినట్టు వెల్లడైంది. ఆస్పత్రులు నేరుగా రెవెన్యూ శాఖ అధికారులతో కుమ్మక్కై పని చేయించుకున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఇలా వందలాది ఫైళ్లు సెక్రటరీ సంతకాలు లేకుండానే రెవెన్యూ శాఖ అనుమతికి వెళ్లినట్టు తేలింది. ఇలాంటి వాటిలో ఎక్కువగా విజయవాడ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం చెక్కులున్నట్టు స్పష్టమైంది. జబ్బు ఒకటి.. చికిత్స మరొకటి ఆస్పత్రి ఎస్టిమేషన్లో విధిగా జబ్బు, దాని చికిత్సకు అయ్యే ఖర్చు గురించి విపులంగా ఇస్తారు. కానీ కొన్ని వందల బిల్లుల్లో ఎల్ఓసీలో ఒక జబ్బు రాసి ఉంటే.. డిశ్చార్జి సమ్మరిలో మరో జబ్బును పేర్కొని లక్షలకు లక్షలు బిల్లు వేశారు. ‘సాక్షి’ పరిశీలనలోనూ ఇలాంటి నిజాలు వెల్లడయ్యాయి. ఇలా ఎల్ఓసీలో ఇచ్చిన జబ్బులు కాదని ఇతర జబ్బులున్నాయంటూ వైద్యం చేసి బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారు. ఆరా తీస్తుంటే పలు అంశాలు బయటికి వస్తున్నాయి. 9 వేల చెక్కులకు బ్యాంకులు హానర్ చెయ్యలేదు 2019 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీనికి కొద్దిరోజుల ముందు రమారమి 9 వేలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను విడుదల చేశారు. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్కటీ పాస్ కాలేదంటే అప్పటి సీఎంఆర్ఎఫ్ తీరు ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇష్టారాజ్యంగా చెక్కులు విడుదల చేయడం, అవి పాస్ కాకపోవడంతో బాధితులు అష్టకష్టాలు పడ్డారు. 2019లోనే 9 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఎన్నికల కోసమే చెక్కులు ఇచ్చి రోగులను మోసం చేశారు. 2019కి ముందు కూడా మరో 4 వేల చెక్కులు చెల్లలేదు. సీఎం సహాయ నిధి చెక్కులే పెండింగులో పడితే.. ఏ లెక్కన ఇష్టారాజ్యంగా చెక్కులిచ్చారో తెలుస్తోంది. సీఎంఓ కార్యాలయం కీలక పాత్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఒక అసిస్టెంట్ సెక్రటరీ, మరో డాక్టర్.. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులతో కుమ్మకై కోట్లకు కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. మెజారిటీ చెక్కులు ఏఎస్ సంతకం లేకుండా వెళ్లాయంటే రెవెన్యూ, సీఎంఓ, కార్పొరేట్ ఆస్పత్రులు.. ఈ ముగ్గురూ కుమ్మక్కయ్యారనేది స్పష్టమవుతోంది. రూ.1,300 కోట్లలో సగం పక్కదారి! 2014 జూలై నుంచి 2019 మార్చి వరకు గత ప్రభుత్వంలో రోగులకు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేశారు. నెలకు సగటున రూ.24 కోట్ల చొప్పున 57 నెలల్లో రూ.1368 కోట్లు మంజూరు చేశారు. ఆ ఐదేళ్లలో చోటుచేసుకున్న అవకతవకలు పరిశీలిస్తే ఇందులో సగానికి పైగా సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకటా.. రెండా.. ఎన్నెన్నో అక్రమాలు ♦రూప్సింగ్ అనే వ్యక్తి 2017లో వైద్యం కోసం ఎల్ఓసీకి దరఖాస్తు చేశారు. ఎల్ఓసీ నంబర్ 17047/సీఎంఓ/ఎల్/2017. ఈ దరఖాస్తుకు రూ.50 వేలు ఎల్ఓసీ మంజూరైంది. కానీ వైద్యం చేయించుకున్నది నాంచారయ్య అనే వ్యక్తి. ♦వట్టికొండ సూర్యవతి అనే మహిళ 2018లో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసింది. రూ.1,22,000 మంజూరు చేస్తూ ఎల్ఓసీ (108238/సీఎంఓ/ఎల్/2018) ఇచ్చారు. కానీ ఆస్పత్రి రికార్డులో వేరే పేరు చూపించారు. ♦2018లో గరిమెళ్ల వెంకట రమణమ్మ అనే మహిళ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా, రూ.1.08 లక్షలు మంజూరు చేస్తూ ఎల్ఓసీ (83122/సీఎంఓ/ఎల్/2018 ఇచ్చారు. ఈమెకు వైద్యం అందివ్వకుండానే ఎల్ఓసీ క్లెయిమ్ చేశారు. ♦వడ్లవల్లి ప్రసన్న అనే మహిళ..వైద్యానికి దరఖాస్తు చేసుకోగా ఎల్ఓసీ (149707/సీఎంఓ/ఎల్/2019) ఇస్తూ.. రూ.2.78 లక్షలు మంజూరు చేశారు. కానీ పేషెంట్తో సొమ్ము కట్టించుకుని, ఎల్ఓసీని సీఎంఓకు క్లెయిమ్ చేశారు. ♦తిమ్మారెడ్డి శివమ్మ అనే మహిళ హైదరాబాద్లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసింది. రూ.8 లక్షలకు ఎల్ఓసీ (127161/సీఎంఓ/ఎల్/2018) ఇచ్చారు. కానీ ఈ పేషెంట్ వద్ద నుంచి డబ్బు వసూలు చేశారు. ఎల్ఓసీ క్లెయిమ్కు పంపించగా, ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక దాన్ని పెండింగ్లో పెట్టింది. ♦వై.రాము అనే వ్యక్తి మంగళగిరిలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేశారు. రూ.4.50 లక్షలకు ఎల్ఓసీ (172231/సీఎంఓ/ఎల్/2019) ఇచ్చారు. విచిత్రమేమంటే ఇతనికి 2018 జూలైలో ట్రీట్మెంట్ జరిగ్గా... 2019 మార్చిలో ఎల్ఓసీకి దరఖాస్తు చేశారు. ప్రస్తుత సీఎంఓ అధికారులు బిల్లును పెండింగ్లో పెట్టారు. చదవండి: గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా.. రెచ్చిపోతున్న ఆన్లైన్ మోసగాళ్లు.. -
వలంటీర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, శ్రీకాకుళం: రెండు రోజుల క్రితం జిల్లాలోని పలాసలో కరోనా వ్యాక్సిన్ వికటించి వలంటీర్ పిల్లా లలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వలంటీర్ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. కానీ లాభం లేకపోయింది. అస్వస్థతకు గురైన లలిత ఫిబ్రవరి 8(సోమవారం) తెల్లవారుజామున మృతి చెందారు. -
‘కవితమ్మ.. మీ వల్లే మా కొడుకు బతికాడు’
రాయికల్ (జగిత్యాల): ‘మా కొడుకు ప్రాణాలు నిలిపిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..’అంటూ ఓ బాలుడి తల్లిదండ్రులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలసి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్కు చెందిన టేక్ సాగర్ (13) పుట్టినప్పటి నుంచే కాలేయ సమస్యతో బాధపడుతుండేవాడు. దీంతో 2017లో ఎంపీగా ఉన్న కవితను సాగర్ తల్లిదండ్రులు కలసి తమ కొడుకును కాపాడాలని వేడుకోగా.. సీఎం సహాయ నిధి నుంచి రూ.26 లక్షల ఎల్వోసీని ఆమె మంజూరు చేయించారు. అలాగే ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి బాలుడి చికిత్సపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ప్రస్తుతం ఆ బాలుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. గురువారం కవిత జగిత్యాల పర్యటనకు వచి్చన విషయాన్ని తెలుసుకున్న సాగర్ తల్లిదండ్రులు రాయికల్లో ఆమెను కలిశారు. తమ కొడుకుకు ప్రాణభిక్ష పెట్టింది మీరేనంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. -
సీఎం సహాయనిధికి రూ.51 లక్షల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను పలువురు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వ్యాపారవేత్తలు, సొసైటీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తరపున రూ.51 లక్షల 86 వేల రూపాయల విరాళాన్ని అందించారు. విరాళం చెక్కును సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అందజేశారు. (చదవండి: కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం) -
ఆన్లైన్ మోసగాడి అరెస్ట్
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): సీఎం సహాయనిధి నుంచి నగదు సాయం ఇప్పిస్తానంటూ ఆపదలో ఉన్న వారి నుంచి నగదు వసూలు చేస్తున్న ఆన్లైన్ మోసగాడిని సీఎంవో అధికారుల ఫిర్యాదుతో నెల్లూరు నవాబుపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నెల్లూరు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు. నెల్లూరులోని జాకీర్హుస్సేన్ నగర్కు చెందిన ఎస్కే సైలాఫ్ 17 ఏళ్ల కుమారుడు గౌస్ మొహిద్దీన్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం రూ.4 లక్షలు అప్పు చేశాడు. వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నట్టు సైలాఫ్ ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పెద్దసముద్రం మండలం దువ్వూరు నారాయణపల్లికి చెందిన సందీప్రెడ్డి ఫేస్బుక్లో పరిచయమై బాధితుడికి ఫోన్ చేశాడు. రూ.10 వేలు ఇస్తే సీఎం సహాయనిధి నుంచి రూ.1.50 లక్షలు ఇప్పిస్తానని నమ్మించడంతో సైలాఫ్ ఆన్లైన్ ద్వారా రూ.3,600, మరోసారి రూ.1,500 పంపించాడు. కాగా సీఎం కార్యాలయ అధికారులు సైలాఫ్కు ఫోన్ చేసి అతడి కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో తాను సందీప్రెడ్డికి నగదు ఇచ్చినట్లు చెప్పడంతో అధికారులు, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వేమారెడ్డి, ఎస్సైలు రమేష్బాబు, శివప్రకాష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సందీప్రెడ్డిని అరెస్ట్ చేశారు. -
తోడుగా ఉందాం
వర్ష బీభత్సం వల్ల హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటి ముంపుకి గురయ్యాయి. హైదరాబాద్ని మళ్లీ మామూలుగా మార్చేందుకు మనందరం సహాయంగా నిలబడదాం అని స్టార్స్ అనుకున్నారు. సీయం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం బాలకృష్ణ కోటిన్నర, చిరంజీవి కోటి, మహేశ్ బాబు కోటి, నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్ 50 లక్షలు, రామ్ 25 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు, హరీష్ శంకర్ 5 లక్షలు, అనిల్ రావిపూడి 5 లక్షలు, నిర్మాత యస్. రాధాకృష్ణ 10 లక్షలు ప్రకటించారు. బుధవారం పవన్ కల్యాణ్ 1 కోటి, దర్శకులు ఎన్. శంకర్ 10 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50 వేలు ప్రకటించారు. -
ఔదార్యం చాటుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు
సాక్షి, సిద్ధిపేట : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబు 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేశాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు సంబంధిత చెక్కును అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు ఎంతో నష్టపోయారని వారికి తన వంతు సహాయం అందించానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సంపూర్ణేష్ బాబును అభినందించారు.సిద్దిపేట బిడ్డగా, సినీ ఆర్టిస్టుగా మానవత్వం చాటుకున్నారని ప్రశంసించారు. (హైదరాబాద్ వరదలు : ప్రభాస్ భారీ విరాళం ) గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నేలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రభాస్ సహా పలువురు ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్కి భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. (హైదరాబాద్ వరదలు: నాగార్జున విరాళం) -
విరాళాలు ప్రకటిస్తున్న ప్రముఖులు
-
వరదలు : ప్రభాస్ భారీ విరాళం
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలను అందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు చెరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. (చదవండి : భారీ వరదలు: టాలీవుడ్ స్టార్స్ విరాళాలు) వీరితో పాటు అక్కినేని నాగార్జున రూ.50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణలో వరద నష్టానికి సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్తో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్ర చేయనున్నాడు. [ చదవండి : అత్యవసరంగా డబ్బులు కావాలా? అయితే ఇలా చేయండి ] -
హైదరాబాద్ వరదలు; స్పందించిన నాగార్జున
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నేలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సినీ హీరో నాగార్జున అక్కినేని స్పందిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేగాక సీఎం సహాయ నిధికి తన వంతు సాయాన్ని ప్రకటిస్తూ మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: సిటీలో మళ్లీ వాన: ప్రజలకు హెచ్చరిక) Heavy rains and floods have devastated the life of people in Hyderabad. Appreciate the efforts of Telangana Govt in releasing 550 crores for immediate relief. Standing by the cause, will contribute 50 lakhs to Telangana CM relief fund.#TelanganaCMO 🙏 — Nagarjuna Akkineni (@iamnagarjuna) October 20, 2020 ‘ప్రస్తుతం హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలు వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు విడుదల చేయడాన్ని అభినందిస్తున్న. బాధితుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ధన్యవాదాలు. అదే విధంగా నావంతు సాయంగా సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షలు ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేగాక వరద బాధితులను ఆదుకునేందుకు పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ముందుకు వస్తున్నాయి. నిన్న(సోమవారం) తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు ప్రకటించగా.. ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సీఎం సహాయ నిధికి రూ. 15 కోట్లు ప్రకటించారు. (చదవండి: తెలంగాణకు రూ.15 కోట్ల సాయం ప్రకటించిన ఢిల్లీ సీఎం) -
CMRF నకిలీ చెక్కుల కేసు విచారణ ప్రారంభించిన ఏపీ సీఐడీ
-
నకిలీ చెక్కులపై సీఎం జగన్ సీరియస్
-
‘నకిలీ చెక్కుల’పై ఏసీబీ విచారణ
సాక్షి, అమరావతి/ తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాలనే పెద్ద కుట్రతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠాతోపాటు దాని వెనుక ఉన్న అదృశ్య శక్తుల నిగ్గుతేల్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ బాగోతాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ముఠా గుట్టురట్టు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించారు. ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠా పాత్రధారులతోపాటు దీని వెనుక సూత్రధారులను కూడా పట్టుకోవాలన్నారు. (బెడిసికొట్టిన బడా మోసం) దీంతో ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి దోషులను పట్టుకోవాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఆదివారం లేఖ రాశారు. మరోవైపు.. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)లోని సీఎంఆర్ఎఫ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం ఉన్నందున దీని నుంచి చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆమె బ్యాంకు మేనేజరుకు లేఖ రాశారు. అలాగే, బ్యాంకు అధికారుల అప్రమత్తతవల్ల నిధులు విడుదల కాలేదని.. కుట్ర చాలా పెద్దదైనందున విచారణ లోతుగా జరిపి దోషులను తేల్చాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు రాష్ట్రాలల్లో వేర్వేరు పేర్లతో.. ఏపీకి చెందిన సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టేందుకు ఒకేసారి న్యూఢిల్లీ, కోల్కత, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ చేయడం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా? లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్ఎఫ్ విభాగాల్లోని వారు ఎవరైనా సహకరించారా? అనేది కూడా తేల్చనున్నారు. అద్వైతా వీకే హాలో బ్లాక్స్ అండ్ ఇంటర్లాక్స్, మల్లాబ్పూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, శర్మ ఫోర్జింగ్ పేర్లతో ఈ నకిలీ చెక్కులు జారీ అయ్యాయి. పక్కా స్కెచ్తోనే.. సీఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేయాలనే భారీ కుట్రతో ఆ ముఠా పక్కా స్కెచ్తోనే యత్నించిందని ఉన్నతాధికారులు అంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు చెక్కులు ఇచ్చారంటే ఆ కంపెనీలు బోర్డుకే పరిమితమైనవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ బృందాలు మూడుచోట్లకు వెళ్లి విచారణ చేయనున్నాయి. తుళ్లూరులో కేసు నమోదు కాగా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పేరిట భారీగా నగదు విత్డ్రా చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సచివాలయం రెవెన్యూ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ పి.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తుళ్ళూరు–1 సీఐ ధర్మేంద్రబాబు కేసు నమోదు చేశారు. కాగా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ.16 వేలు, రూ.45 వేలు, రూ.45 వేలు చొప్పున ముగ్గురు వ్యక్తులకు జారీచేసిన చెక్కుల స్థానంలో రూ.117.15 కోట్లు విత్డ్రా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు సృష్టించి ఈ ఘరానా మోసానికి యత్నించారు. -
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్
-
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నకిలీ చెక్కుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టే కుట్ర వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కర్ణాటక, ఢిల్లీ, కోల్కతాలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధి నుంచి డబ్బులు కొట్టేసేందుకు కుట్రలు పన్నగా.. బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో విషయం వెలుగు చూసింది. కాగా, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఏసీబీ డైరెక్టర్కు లేఖ రాశారు. మరోవైపు ఫాబ్రికేటెడ్ చెక్కులపై తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది. రెవిన్యూ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడ్బద్రి శాఖకు రూ.52.65 కోట్ల చెక్కు, ఢిల్లీలోని సీసీపీసీఐకి రూ.39,85,95,540 చెక్కు, కోల్కతా సర్కిల్లోని మోగ్రాహత్ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఆయా బ్యాంకుల్లో సమర్పించారు. వాటిపై సీఎంఆర్ఎఫ్, రెవెన్యూశాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్ స్టాంపులు కూడా ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా సర్కిళ్లకు చెందిన.. బ్యాంకు అధికారులు వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచికి ఫోన్ చేయడంతో కుంభకోణం బట్టబయలైంది. (చదవండి: బెడిసికొట్టిన బడా మోసం) -
బెడిసికొట్టిన బడా మోసం
-
బెడిసికొట్టిన బడా మోసం
సాక్షి, అమరావతి: నకిలీ బ్యాంకు చెక్కులతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మూడు బ్యాంకుల ద్వారా ఏకంగా రూ.117.15 కోట్లు కొల్లగొట్టాలన్న కొందరి ఘరానా మోసం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో ఆయా బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో భారీ మోసానికి అడ్డుకట్ట పడింది. ఒకేసారి మూడు రాష్ట్రాల నుంచి సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టడానికి పకడ్బందీ పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ముఠాతోపాటు కొందరు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అటు ఎస్బీఐ ఉన్నతాధికారులను ఇటు సీఎంఆర్ఎఫ్ అధికారులను విస్మయానికి గురిచేసిన ఈ పన్నాగం వివరాలిలా ఉన్నాయి.. మూడు చెక్లు.. రూ.117.15 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచిలో బ్యాంకు ఖాతా ఉంది. సీఎంఆర్ఎఫ్ విభాగం జారీచేసిన రూ.52,65,00,000 విలువైన ఎస్బీఐ చెక్ను కర్ణాటకలోని మంగుళూరు బ్రాంచిలో డ్రా చేసేందుకు శుక్రవారం ఓ వ్యక్తి సమర్పించాడు. అంత పెద్ద మొత్తం కావడంతో ఆ చెక్ను పాస్ చేస్తున్న మిగతా బ్యాంకు అధికారికి చివరి నిమిషంలో సందేహం వచ్చింది. దాంతో ఆయన వెంటనే వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచ్ అధికారులను.. వారు సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను వాకబు చేశారు. అంత మొత్తంతో తాము ఎవరికీ చెక్ ఇవ్వలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ చెక్ను పాస్ చేయొద్దని మంగుళూరులోని బ్రాంచి అధికారులను ఆదేశించారు. దాంతో ఎస్బీఐ అధికారులు తమ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రాంతీయ కార్యాలయాలనూ అప్రమత్తం చేశారు. ఇదే తరహాలో ఢిల్లీలోని ఎస్బీఐ సీసీపీసీ–1 బ్రాంచ్లో శనివారం రూ.39,85,95,540 విలువైన సీఎంఆర్ఎఫ్ ఖాతా నుంచి ఎస్బీఐ చెక్ను డ్రా చేసేందుకు సమర్పించారు. ఆ బ్యాంకు అధికారులు కూడా ఆ చెక్ను నిర్ధారించుకునేందుకు వెలగపూడి ఎస్బీఐ శాఖను వాకబు చేశారు. ఆ చెక్ కూడా తాము జారీచేయలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పారు. దాంతో ఆ చెక్ను కూడా పాస్ చేయకుండా బ్యాంకు అధికారులు నిలుపుదల చేశారు. ఇక కోల్కతలోని మోగ్రాహట్ ఎస్బీఐ బ్రాంచిలో కూడా రూ.24,65,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్ను డ్రా చేసేందుకు శనివారం సమర్పించారు. దానిపై ఆరా తీయగా అది కూడా నకిలీ చెక్ అనే నిర్ధారణ అయ్యింది. దాంతో మూడు వేర్వేరు చెక్ల ద్వారా రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు వేసిన పన్నాగాన్ని బ్యాంకు అధికారులు సమర్థంగా నిలువరించగలిగారు. ప్రొఫెషనల్ ముఠా పనే? కేవలం రెండ్రోజుల్లో మూడు వేర్వురు రాష్ట్రాల నుంచి మూడు నకిలీ చెక్లతో ఏకంగా రూ.117కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు యత్నించడం ఎస్బీఐ, సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను కలవరపరుస్తోంది. ఇంత పకడ్బందీగా పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ప్రొఫెషనల్ ముఠానే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆ చెక్లు వారికి ఎలా వచ్చాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా ఉద్యోగులు ఇందుకు సహకరించి ఉంటారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తే ఈ ఘరానా మోసం గుట్టు వీడుతుంది. అందుకే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. -
పవన్ అభిమానికి సీఎం జగన్ ఆర్థిక సాయం
-
పవన్ అభిమానికి సీఎం జగన్ ఆర్థిక సాయం
సాక్షి తాడేపల్లి: పవన్కల్యాణ్ అభిమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్ కల్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం జగన్ పవన్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు. (వర్షం కురుస్తున్నా టాప్ లేని వాహనంలోనే.. ) This case came to CM @ysjagan sir notice. On his instructions we immediately spoke to hospital authorities and they agreed to treat at 10Lakhs. CM sir immediately sanctioned 10L & Stem cell therapy treatment started already and he is responding well. We are also in constant touch https://t.co/UGhdvjCgMf pic.twitter.com/jIEnLsUsx2 — Dr Hari Krishna (@HariKrishnaCMO) August 15, 2020 -
ఏపీ సీఎం రిలీఫ్ ఫ్ండ్కు ఖజానా జూవెల్లర్స్ 4 కోట్ల విరాళం
-
నిర్వహణ లోపంతోనే అగ్ని ప్రమాదం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/విశాఖ సిటీ: నిర్వహణ లోపంతోనే విశాఖ జిల్లా పరవాడ మండలంలోని విశాఖ సాల్వెంట్స్ లిమిటెడ్లో అగ్ని ప్రమాదం సంభవించిందని నిపుణుల కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్లాంట్ రియాక్టర్లో ‘డై మిథైయిల్ సల్ఫాక్సైడ్’ డిస్టిలేషన్ ప్రక్రియ కొసాగుతుండగా ప్రమాదం సంభవించిందని తెలిపింది. ► ఈ దుర్ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందడంతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడిన ఈ ప్రమాదంపై విచారణకు విశాఖ జిల్లా కలెక్టర్ ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ► ఈ కమిటీ రియాక్టర్ను పరిశీలించి మంగళవారం కలెక్టర్కు నివేదిక సమర్పించింది. ► రియాక్టర్లో పరిమితికి మించి వాక్యూమ్ పెరగడం.. రసాయన మిశ్రమాల్లో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రమాదానికి దారితీసింది. మంటలు పూర్తిగా అదుపులోకి.. కాగా, సోమవారం రాత్రి ఉవ్వెత్తున లేచిన మంటలను మంగళవారం ఉ.6గంటలకల్లా పూర్తిస్థాయిలో అదుపుచేశారు. ► ప్రమాద సమయంలో రియాక్టరు వద్దనున్న కాండ్రేగుల శ్రీనివాస్ అనే కార్మికుడు అగ్నికి ఆహుతైనట్లు మంగళవారం గుర్తించారు. ► అతని కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.15 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.35 లక్షలు ఇచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం అంగీకరించింది. ► అలాగే, ప్రమాదంలో మల్లేశ్ అనే మరో కార్మికుడికి గాయాలయ్యాయి. అతనికి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. వైద్యానికయ్యే ఖర్చుతో పాటు రూ.20 లక్షల పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. ► ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి సుచరిత, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆరా తీశారు. ► విచారణ కమిటీ తుది నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినయ్చంద్ తెలిపారు. ► ప్రమాదంపై పరవాడ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. పేలుడు సంభవించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం గంటల వ్యవధిలో పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడంతో మంగళవారం ఫార్మాసిటీలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. -
సీఎం సహాయనిధికి సీసీఎల్ ప్రొడక్ట్స్ విరాళం
కోవిడ్ –19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ రూ.1,11,00,011 (కోటీ 11 లక్షల 11 రూపాయలు) విరాళం అందజేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సి.రాజేంద్రప్రసాద్ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. -
సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/ఆమదాలవలస: కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు స్పీకర్ తమ్మినేని సీతారాం, వాణీ సీతారాంలు కలిసి రూ.35లక్షలు విరాళం సీఎం జగన్మోహన్రెడ్డికి అందజేశారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ చెక్కును ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమదాలవలసలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస ప్రాజెక్ట్ నిర్మాణాలను గురించి ప్రస్తావించారు. సీఎంను కలిసిన మంతి కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలిశారు. జిల్లాలోని పరిస్థితులు, పలు అభివృద్ధి పనులను వివరించారు. ఈ నెల 8న చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేసిన స్థలాల వివరాలను తెలియజేశారు. తిలక్ రూ.50 లక్షల విరాళం టెక్కలి: టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజల తరఫున వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఆర్అండ్బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో సీఎం జగన్మోహన్రెడ్డికి క్యాంపు కార్యాలయంలో విరాళం అందజేశారు. టెక్కలిలో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంతబొమ్మాళి, కోటబొమ్మాళిలో మండలాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు, ఆఫ్షోర్ రిజర్వాయర్ సమస్య, రావివలస మెట్కోర్ పరిశ్రమ కార్మికుల సమస్య, నందిగాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులు, గెస్ట్ లెక్చరర్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ 1108 జీఓ రద్దు చేసి ఉద్యమంలో కేసుల బారిన పడిన వారిని విముక్తి చేయాలని కోరారు. -
తుపాకుల స్వాతికి కేటీఆర్ చేయూత
ఖమ్మం, నేలకొండపల్లి: ఓ ప్రమాదం కారణంగా మహిళకు రెండు చేతులు పని చేయడం లేదు. ఒక కాలు సగం వరకు తీసేశారు. వారి గోడును ఓ ట్రస్టు సభ్యుడు కేటీఆర్కు ట్విటర్లో వివరాలను తెలిపాడు. స్పందించిన మంత్రి కేటీఆర్ వైద్య ఖర్చుల కోసం రూ.లక్షను మంజూరు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన తుపాకుల స్వాతి 9 నెలల కిందట విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమెకు రెండు చేతులు చచ్చుబడ్డాయి. నిరుపేద కుటంబం కావడంతో కష్టాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి వెల్ఫేర్ డెవలప్మెంట్ ట్రస్టు సభ్యుడు శ్రావణ్ విషయాన్ని రెండు రోజుల కిందట మంత్రి కేటీఆర్కు ట్విటర్ ద్వారా తెలిపాడు. కేటీఆర్ స్పందించి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.లక్ష మంజూరు చేయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సదరు యువకుడికి శుక్రవారం ఫోన్ వచ్చింది. మహిళకు వైద్యం చేయించేందుకు రూ.లక్ష మంజూరు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో హైదరాబాద్లోని వి.కేర్ వైద్యశాలలో చేర్పించాలని సూచించారు. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన శ్రావణ్ను పలువురు అభినందించారు. స్వాతి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్కు చికిత్స కోసం వెళ్లేందుకు బాధిత మహిళకు ఆర్థిక సాయం చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం సభ్యుడు, స్థానిక ఎమ్మేల్యే కందాల ఉపేందర్రెడ్డిని కలిసి కోరారు. వెంటనే కొంత ఆర్థిక సాయం చేశారు. ఆమెకు పింఛన్ అందించాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పసుమర్తి శ్రీనివాస్, గండికోట వెంకటలక్ష్మి, వున్నం బ్రహ్మయ్య, కోటి సైదారెడ్డి ఉన్నారు. -
కరోనా పోరాటంలో ప్రభుత్వానికి అండగా....
సాక్షి, అమరావతి: కరోనా వైరస్పై చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా నిలవడానికి సామాన్యుల నుంచి పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సీఎం సహాయ నిధికి తమ వంతుగా సాయాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగానే కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వరరావు, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎ.బాలసుబ్రమణ్యం, ఫార్మర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జే.మోహన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పార్ధసారధి పాల్గొన్నారు. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వ్యాపారవేత్తలు, స్వచ్ఛందసంస్ధలు,వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు తరపున కరోనా వైరస్పై పోరాడటానికి సీఎం సహాయ నిధికి 64 లక్షల 50వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ చెక్కులను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్కు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యానారాయణ రెడ్డి, ఎస్.కృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీకృష్ణారెడ్డి అందజేశారు. (బట్టతల వారికి కరోనా వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకంటే) -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన ప్రొబేషనరీ ఆఫీసర్స్
సాక్షి, అమరావతి : 2018 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన యువ ఐఎఫ్ఎస్ అధికారుల్లో సుమన్ బెనీవాల్, వినీత్ కుమార్, జి. విఘ్నేష్ అప్పారావులు ఉన్నారు. కాగా వీరి వెంట రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఎస్. ప్రతీప్ కుమార్ కూడా ఉన్నారు.(మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్) ఎస్ఎస్ఎల్ గ్రూఫ్ రూ. 50 లక్షల విరాళం అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఎన్ ఎస్ ఎల్ గ్రూఫ్ రూ.50 లక్షలు విరాళమందించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎల్ గ్రూఫ్ చైర్మన్ ఎం. ప్రభాకర్రావు క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసి చెక్కును అందించారు. ఆయన వెంట ఎండీ ఎం. వెంకరామచౌదరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అంతేగాక కోటి రూపాయల విలువైన శానిటైజర్లు పంపిణీ చేయనున్నట్లు ఎన్ఎస్ఎల్ గ్రూఫ్ పేర్కొంది. -
సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు
సాక్షి, అమరావతి : కోవిడ్ - 19 నివారణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు సమకూరుతున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిసి లక్షా 10వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. కాగా వనిత వెంట కొవ్వూరు నియోజకవర్గ సహకార సంఘాలు, నీటి సంఘాలు, అంగన్వాడికి చెందిన మహిళలు, అభిమానులు ఉన్నారు. ►తాడికొండ ఎమ్యెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తన నియోజకవర్గ నాయకులు, అభిమానులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి రూ. 25 లక్షలు విరాళం అందజేశారు. ►కోవిడ్ - 19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విశాఖపట్టణం అల్లిపురంకి చెందిన కల్వరి బాప్టిస్ట్ చర్చి రూ. 10లక్షలు, ఏయూ అఫిలియేటెడ్ బిఈడీ కాలేజెస్ ఆఫ్ విశాఖపట్టణం, విజయనగరం డిస్టిక్ట్స్ రూ. 3లక్షల 65 వేలు, ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్ అసోసియేషన్, విజయనగరం జిల్లా రూ. లక్ష, ఎన్బిఎమ్ లా కాలేజి(విశాఖపట్టణం) రూ. 25 వేలు, విశాఖపట్టణం రుషికొండ వుడా హరిత టౌన్షిప్ రెసిడెంట్స్, ఫ్లాట్ ఒనర్స్ రూ. లక్ష విరాళంగా అందించారు. ►వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వైఎస్ జగన్ను కలిసి సీఎం సహాయనిధి కింద అందిన చెక్కులు, డీడీలను అందజేశారు. ►కోవిడ్ - 19 నివారణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 25 లక్షల విరాళం -
సీఎం సహాయనిధికి విశాఖ పోర్ట్ ట్రస్ట్ భారీ విరాళం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ. 75,00,000 విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కే. రామమోహన్ రావు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ని కలిసి అందజేశారు. చదవండి: భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగానే ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రూ. 50,00,000 విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో హోం మంత్రి సుచరిత సమక్షంలో సీఎం వైఎస్ జగన్ని కలిసిన ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రామచంద్రా రెడ్డి, ప్రతినిధులు తులసి విష్ణుప్రసాద్, ఎంవీ రావు, ఎంఎస్ఎన్ రెడ్డి, విజయ్ విరాళం చెక్కును అందజేశారు. చదవండి: సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కోటి విరాళం -
భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోటి 82 లక్షల 4వేల 312 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని భీమవరం ప్రజల తరపున సీఎంకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీసివాస్ పేర్కొన్నారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డికి అందజేశారు. -
సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కోటి విరాళం
సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లలిత జ్యువెలర్ సీఎండీ కిరణ్కుమార్ బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విరాళం చెక్కును అందచేశారు. ►అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ జీ. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి రూ. 50,00,000 విరాళం ఇచ్చారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సమక్షంలో డాక్టర్ శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి (గుండ్లకుంట), డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి (జమ్ములమడుగు) విరాళం చెక్కును సీఎం జగన్కు అందచేశారు. ►కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ బ్యాంక్ రూ. 30,00,000 విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన డీడీని సీఎం జగన్కు ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్ అందించారు. ►అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ. 17,00,000 విరాళం ప్రకటించింది. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామకృష్ణ విరాళానికి సంబంధించిన డీడీని ముఖ్యమంత్రి అందచేశారు. ►మరోవైపు ముఖ్యమంత్రి సహాయనిధికి అసోసియేషన్ ఆఫ్ ఫార్మర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు (ఏపీ, తెలంగాణ) రూ. 6,15,000 విరాళం ఇచ్చింది. -
సానియాకు ‘ఫెడ్ కప్ హార్ట్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిబద్ధత, గుండెధైర్యం ప్రదర్శిస్తూ గొప్ప విజయాలు అందించినందుకుగాను భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తగిన గుర్తింపు లభించింది. 2020 సంవత్సరానికిగాను ఆసియా ఓసియానియా జోన్లో సానియా మీర్జాకు ఫెడ్ కప్ హార్ట్ పురస్కారం దక్కింది. ఈ అవార్డు గెల్చుకున్న తొలి భారత టెన్నిస్ ప్లేయర్గా సానియా నిలిచింది. ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్షిప్ ఫెడ్ కప్ టోర్నీలో భాగంగా... దుబాయ్లో మార్చిలో జరిగిన ఆసియా ఓసియానియా జోన్ క్వాలిఫయర్స్లో భారత్ రన్నరప్గా నిలిచి, తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించడంలో సానియా మీర్జా కీలకపాత్ర పోషించింది. ఏడాదిన్నర వయస్సున్న తనయుడు ఇజ్హాన్ను వెంటేసుకొని ఈ టోర్నీలో పాల్గొన్న సానియా మూడు డబుల్స్ మ్యాచ్ల్లో భారత్కు విజయాలను అందించింది. 2016 తర్వాత సానియా ఫెడ్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. దక్షిణ కొరియా, ఇండోనేసియా, చైనీస్ తైపీ, ఉజ్బెకిస్తాన్, చైనా జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ రన్నరప్గా నిలిచింది. 17 వేల మంది టెన్నిస్ అభిమానులు ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను ఎంపిక చేశారు. సానియాతోపాటు క్వాలిఫయర్స్ విభాగంలో అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా), అమెరికా జోన్లో ఫెర్నాండా గోమెజ్ (మెక్సికో), యూరప్/ఆఫ్రికా జోన్లో అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) ‘ఫెడ్ కప్ హార్ట్’ అవార్డులు గెల్చుకున్నారు. క్వాలిఫయర్స్ విభాగం విజేతకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 27 వేలు)... మిగతా మూడు విభాగాల విజేతలకు 2 వేల డాలర్ల (రూ. లక్షా 51 వేలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. అయితే ఈ ప్రైజ్మనీని విజేతలు తమకు నచ్చిన చారిటీ సంస్థకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. తొలి భారతీయురాలిగా ఫెడ్ కప్ హార్ట్ అవార్డు గెల్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదో పెద్ద గౌరవం. ఈ అవార్డును దేశానికి, నా అభిమానులకు అంకితం ఇస్తున్నాను. భవిష్యత్లోనూ భారత్కు నేను మరెన్నో విజయాలు అందిస్తానని ఆశిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా లభించిన ప్రైజ్మనీ మొత్తాన్ని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నాను. – సానియా మీర్జా -
కరోనా: సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, తాడేపల్లి: కరోనా మమ్మారిపై చేస్తోన్న యుద్దంలో చాలా మంది ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నారు. తాము చేయగలిగినంత సాయం చేస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే కోవిడ్-19 నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీస్ మేనేజిమెంట్ అసోసియేషన్ బుధవారం రూ. 2,56,00,000 విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ప్రతినిధులు ఆలూరు సాంబశివారెడ్డి, ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, మిట్టపల్లి కోటేశ్వరరావు, దాడి రత్నాకర్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు అందించారు. (కరోనా : సీఎం సహాయనిధికి విరాళాలు) దీనికి తోడు నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ నాయకులు, అభిమానులు కోటి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ( రూ. 1,00,29,000) విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును,డీడీని ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించారు. సివీఎస్ కృష్ణమూర్తి చారిటీస్ ఇరవై ఐదు లక్షలు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించింది. వీరితో పాటు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, నియోజకవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డాక్టర్లు, నాయకులు రూ. 89,86,222 విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్కు అందజేశారు. (సీఎం సహాయ నిధికి వాణిజ్య సంఘాల విరాళాలు) -
కరోనా: సింగరేణి 40 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఉండటం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు. (7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు) తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం లలితా జ్యువెల్లర్స్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును లలిత జ్యువెల్లర్స్ సిఎండి డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా చెరో కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విరాళమిచ్చిన ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు. (‘అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవు’ ) -
సీఎం సహాయనిధికి విరాళాలు
సాక్షి, అమరావతి: కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, నియోజకవర్గ నాయకులు,అభిమానులు రూ.1,00,25,000 విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, గంగసాని హుస్సేన్ రెడ్డి, డాక్టర్ పెరుగు మురళీకృష్ణ విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి పర్చూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ రావి రామనాథం బాబు, నియోజకవర్గ నాయకులు,అభిమానులు రూ.1,02,50,019 విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్చూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ రావి నామనాథం బాబు, బత్తుల బ్రహ్మనందరెడ్డి, లీలాకృష్ణ విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్కు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, నియోజకవర్గ నాయకులు, అభిమానులు రూ.90 లక్షలు విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్కు అందించారు. -
మానవత్వం చాటుకున్న బాలవ్వ..
గజ్వేల్: కరోనా నేపథ్యంలో మన సంస్కృతి గొప్పదనం ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం గజ్వేల్లోని ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి వేద బ్రాహ్మణులకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పూర్వకాలం నుంచి దేశంలో చేతులు జోడించి నమస్కారం చేసే పద్ధతి అమలులో ఉందని, అదే విధంగా ఆరోగ్య పరిరక్షణకు యోగాలో అనేక రకాలైన పద్ధతులు పూర్వకాలం నుంచి పాటిస్తూ వస్తున్నామని తెలిపారు. కరోనా మున్నెన్నడూ లేని పరిస్థితులను సృష్టించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మూతపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. వేద బ్రాహ్మణులకు అండగా నిలవాలనే సంకల్పంతో నిత్యావసరాల పంపిణీకి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీపీజే ఫౌండేషన్, శ్రేయోభిలాషుల సహకారంతో జరిగిన కార్యక్రమంలో “గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ సభ్యుడు మల్లేశం, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్చైర్మన్ జకియొద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్వీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ గజ్వేల్ మండలశాఖ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, “గడా’ ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. దాతలు ముందుకు రావాలి : మంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్: కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు దృష్ట్యా ప్రభుత్వానికి చేయూతగా దాతలు ముందుకు వస్తున్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి నివాసంలో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్కు చెందిన ఎన్నారైలు పంపించిన చెక్కును స్థానిక కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్, ఏలూరి సతీష్లు రూ. లక్ష చెక్కును మంత్రికి అందించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్, అంతటిగౌడ్, ప్రదాన కార్యదర్శి రంగుల సుధాకర్గౌడ్, ఫౌండర్ గంప వేణుగోపాల్, ప్రనీత్రెడ్డి, రంగు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్కు మరో స్ప్రే యంత్రం... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. మంగళవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన రూ.12 లక్షల విలువైన స్ప్రే మిషన్ను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అన్ని విధులల్లో స్ప్రే మిషన్తో పారిశుధ్యం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సెన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ సహాయ నిధికి విరాళాలు... కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వానికి చేయూతగా నిలిచేందుకు టీహెచ్ఆర్ సేన చింతమడక గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని మంత్రి నివాసంలో రూ. 22,616లను మంత్రికి అందించారు. మానవత్వం చాటుకున్న మహిళ.. అలాగే చింతమడక గ్రామానికి చెందిన చాకలి బాలవ్వ అనే మహిళ తన రజక వృత్తి నిర్వహించగా వచ్చిన రూ.3వేలను ప్రభుత్వానికి అందించి చేయూతగా నిలిచింది. కరోనా కట్టడి ప్రజల సహకారంతోనే సాధ్యం కొండపాక(గజ్వేల్): కరోనా వైరస్ కట్టడి ప్రజల సహకారంతోనే సాధ్యపడుతుందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మండల పరిదిలోని వెలికట్ట గ్రామ శివారులో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లులో పని చేస్తున్న 200 మంది వలస కూలీలకు, గ్రామ ఆటో డ్రైవర్లకు అమరనాథ్ నిత్యాన్నధాన సేవా సమితీ ఆధ్వర్యంలోమంగళవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్, రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్, మండల కన్వీనర్ రాగల్ల దుర్గయ్య, అమరనాథ్ సేవా సమితి ప్రతినిధులు చీకోటి మధుసూదన్, కాశీనాథ్, నందిని శ్రీనివాస్, అయిత కరుణాకర్, అనిల్, శ్రీనివాస్, భాస్కర్, వెంకటేశం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ఐదైనా చాలు
ఎక్కడా డబ్బు పుట్టడం లేదు. లాక్డౌన్.. లూటీ చేసేసింది! ఏదో ఉంటున్నామంతే.. ఏదో తింటున్నామంతే.. ఇదీ.. సిట్యుయేషనల్ సాంగ్. ఇంత కాటకంలో కూడా.. ఓ చిన్నారి పాట డబ్బుని సృష్టిస్తోంది. ‘ఐదైనా చాలు’ అని రిలీఫ్నిస్తోంది. దేవాంకిత దగ్గర మొదట పదివేలు ఉండేవి. కిడ్డీ బ్యాంకులో తను దాచుకున్న డబ్బు అది. హుండీని తెరచి చూసేవరకు అంత మొత్తం ఉందని తనకూ తెలీదు. అయితే తను చేయబోతున్న పనికి అది చాలా చిన్న మొత్తంగానే అనిపించింది దేవాంకితకు. ఆ పదివేలను సీఎం కోవిద్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చేసింది ఆరేళ్ల ఆ చిన్నారి! దేవాంకిత చక్కగా పాడుతుంది. దేవగానమే. అమ్మానాన్నతో కలిసి ‘సోరై’లకు (సాయంత్రపు వేడుకలకు) వెళ్లినప్పుడు దేవాంకితను అంతా పాడమనేవారు. ఆ ‘పసి’డి గాత్రానికి ముగ్ధులై.. ముద్దులు, నగదు బహుమతులు ఇచ్చేవారు. అలా సమకూరిందే దేవాంకిత కిడ్డీ బ్యాంకులోని డబ్బంతా. దేవాంకిత తల్లి పరోమా బెనర్జీ గృహిణి. సంగీతం అంటే ఇష్టం. ఈ వేసవిలో కూతుర్ని సంగీతం క్లాసులకు పంపించాలని అనుకున్నారు కూడా. ఈలోపే లాక్డౌన్! కరోనా రిలీఫ్ ఫండ్కు విరాళంగా తను ఇచ్చిన పదివేల రూపాయలు చాలా చిన్న మొత్తం అని దేవాంకితకు అనిపించడానికి కారణం.. టీవీలో ఆమె విన్న మమతా బెజర్జీ ప్రసంగం. ‘‘మీరిచ్చేది ఎంత అని కాదు. ఐదు రూపాయలు ఇవ్వగలినా.. కరోనాను తరిమికొట్టే ఈ యుద్ధంలో అది పెద్ద మొత్తమే అవుతుంది’’ అన్నారు మమత. అది పడిపోయింది దేవాంకిత మనసులో. ఆ యుద్ధానికి తను ఇంకా.. ఇంకా ఇవ్వాలనుకుంది. తన గొంతు బాగుంటుందని అందరూ అంటారు. బయటికి వెళ్లి పాటలు పాడితే? రిలీఫ్ ఫండ్ కోసం పాట పాడుతున్నాను.. మీకు పాట నచ్చితే, మీరు ఇవ్వగలినంతే ఇవ్వండి. మీరిచ్చేది ఐదు రూపాయలే అయినా కరోనాను తరిమికొట్టే ఈ యుద్ధంలో అది పెద్ద మొత్తమే అవుతుంది’’.. అని ముఖ్యమంత్రి గారు విజ్జప్తి చేసినట్లు అడిగితే?! ఈమాటే తల్లితో చెబితే.. ‘గుడ్ ఐడియా’ అని మురిపెంగా కూతుర్ని దగ్గరకు లాక్కుంది. తండ్రికి కూడా ఆ ఆలోచన నచ్చింది. ‘మమ్మల్ని కూడా కలుపుకుంటావా?’’ అన్నారు నవ్వుతూ. లాక్డౌన్ ఉన్నప్పటికీ ఉదయంపూట కొన్ని గంటలు కోల్కతాలోని మార్కెట్ కూడళ్లలో సడలింపు ఉంది. ఆ సమయాన్ని ఎంచుకున్నారు ముగ్గురూ. అక్కడ పాడేది దేవాంకిత. పాటకు ముందు.. లాక్డౌన్ మన మంచి కోసమేనని, కరోనా తో ఫైట్ చేసేందుకు ప్రతి ఒక్కరం ప్రభుత్వానికి ఆయుధం అవ్వాలని తోచిన మాటల్లో చెప్పేది. తర్వాత పాడేది. పాడే ముందు అచ్చు మమత లానే ‘ఐదైనా చాలు’ అని విజ్ఞప్తి చేసేది. పాటయ్యాక చప్పట్లు వినిపించేవి. ఆ కరతాళ ధ్వనుల్లోంచి విరాళాలూ వచ్చేసేవి.అలా వారం పది రోజులకే డెబ్భైవేలు జమ అయ్యాయి. వెంటనే వాటిని రిలీఫ్ ఫండ్కి చేర్పించింది దేవాంకిత. ఈ పౌరురాలి స్వశక్తి విరాళం మొత్తం ఎనభై వేలు! దేవాంకిత ఒకటో తరగతి చదువుతోంది. టీవీల్లో న్యూస్ చూస్తుంటుంది. పాడేందుకు వెళ్లినప్పుడు టీవీలో తను చూసిన లాక్డౌన్ ఉల్లంఘనల గురించి కూడా మాట్లాడుతూ.. అలా చేయడం తప్పు అని చెబుతోంది. ‘‘ఈ పిల్లకు ఇంత తెలివి ఏమిటని ఆశ్చర్యపోవడమే మేమిప్పుడు చేస్తున్నది’’ అంటున్నారు దేవాంకిత తల్లీతండ్రి. -
పాకెట్ మనీ కరోనా బాధితుల కోసం..
సంగారెడ్డి అర్బన్: కరోనా బాధితులకు తన వంతు సహాయంగా చిన్నారి పెద్ద మనస్సుతో కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న రూ.3,826 సీఎం సహాయ నిధికి అందజేసింది. ఆదివారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్రావును సంగారెడ్డికి చెందిన సాయినాథ్, స్వాతి దంపతుల కూతురు శ్రీముఖి కలిశారు. 11 నెలలుగా తాను దాచుకున్న డబ్బులను అందజేయడంతో చిన్నారి ఔదార్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శం కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం గా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. బసవేశ్వర 887వ జయంతి సందర్భంగా జిల్లా వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు దుస్తులు పం పిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలను సీఎం కేసీఆర్ గుర్తించారని తెలిపారు. కరోనా కట్టడికి వైద్యులు, పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని కోరారు. ఆపద సమయంలో ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, 74 లక్షల మందికి రూ.1500 చొప్పున అందజేసినట్లు తెలిపారు. అకౌంట్లు లేని 6 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా డబ్బులు అందచేస్తామని హరీశ్ చెప్పారు. -
సీఎం సహాయనిధికి విరాళాలు
కరోనా నిర్మూలనకుగాను సీఎంఆర్ఎఫ్కు శుక్రవారం పలువురు విరాళాలు ఇచ్చారు. ► కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం రైతులు, వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యా సంస్ధలు రూ.2,02,02,112 ► గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రూ.కోటి ► రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ – వైజాగ్ స్టీల్స్) రూ. కోటి ► కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.కోటి ► గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు, వివిధ సంస్థలు రూ.36,50,000 ► గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) రూ.25 లక్షలు ► బండి సాహితిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రూ.25 లక్షలు ► లోటస్ ట్రేడింగ్ కంపెనీ, డాల్ఫిన్ పాలిమర్స్ తరఫున రూ. 25 లక్షలు ► కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ముంగర నరసింహారావు రూ.5 లక్షలు, కైకలూరు ఫిష్ ఫీడ్స్ అసోసియేషన్ రూ.5 లక్షలు ► కృష్ణా జిల్లా చౌటపల్లి గ్రామస్తులు రూ.1,04,000 ► వేద సీడ్స్ ఆధ్వర్యంలో రూ.10 లక్షలు ► తెనాలి హోల్సేల్ ఆయిల్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు రూ.51 వేలు ► విశాఖతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు ఇచ్చిన రూ.2, 97,23,975 విలువైన చెక్కులను సీఎంకు వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డి అందజేశారు. -
ఏపీ సీఎం సహాయనిధికి విరాళాలు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం రైతులు, వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యా సంస్ధల తరపున 2 కోట్ల 2 లక్షల 2 వేల 112 రూపాయల విరాళం అందింది. దీంతో పాటు లోటస్ ట్రేడింగ్ కంపెనీ, డాల్ఫిన్ పాలిమర్స్ తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి మరో 25 లక్షల రూపాయలు విరాళం అందింది. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళాలకు సంబంధించిన చెక్కులను కైకలూరు ఎమ్మెల్యే డి.నాగేశ్వరరావు, డి.వినయ్, డి.శ్యామ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు. గుంటూరు : జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) తరపున రూ.25 లక్షలు విరాళం అందింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును డీసీఎంఎస్ ఛైర్ పర్సన్ కె హెనీ క్రిస్టినా, కె సురేష్ కుమార్లు సీఎం జగన్కు అందజేశారు . ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవిలు పాల్గొన్నారు. ► బండి సాహితి రెడ్డి ఛారిటబుల్ ట్రస్టు తరపున రూ.25 లక్షలు విరాళం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును బండి సాహితి రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ బండి అశోక్ రెడ్డి, బండి సుధావాణి, బి మల్లేశ్వరరెడ్డి(ఏపీటీఎఫ్, అధ్యక్షుడు), పి మల్లీశ్వరిలు ముఖ్యమంత్రికి అందజేశారు. ► కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు, వివిధ సంస్ధల తరపున 36 లక్షల 50 వేల రూపాయల విరాళం అందింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కులను హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అందజేశారు. -
సీఎం సహాయనిధికి శివానీ, శివాత్మికా విరాళం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ (కోవిడ్ –19) నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు లక్షలు విరాళంగా ఇచ్చారు. 'దొరసాని' సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక పుట్టినరోజు (ఏప్రిల్ 22) సందర్భంగా ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ...విరాళం చెక్ను అందించారు. (అన్నయ్యా.. వదినకు చాన్స్ ఇస్తున్నవా? ) అనంతరం శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి. మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. స్టే హోమ్. స్టే సేఫ్’ అని అన్నారు. ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. (సీఎం సహాయ నిధికి రూ.4.70 కోట్ల విరాళం) -
ఏపీ సీఎం రిలీఫ్ఫండ్కు విరాళాలు
-
సీఎం సహాయనిధికి విరాళాలు
కరోనా వ్యాప్తి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలు సంఘాలు, పలువురు ప్రముఖులు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. ► కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2 కోట్లు ► ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రూ.కోటి, ఉద్యోగుల తరఫున రూ.7,77,979 ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) తరఫున రూ.1.16 కోట్లు, ఆ సంస్థ ఉద్యోగుల తరఫున రూ.4,32,506 ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (ఏపీ మార్క్ ఫెడ్) రూ.కోటి, ఉద్యోగుల తరఫున రూ.1,07,000 ► ఏపీ ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ ఆయిల్ ఫెడ్) రూ.50 లక్షలు, ఉద్యోగుల ఒక రోజు విరాళం రూ.1,86,936 ► మైక్రో ఇరిగేషన్ కంపెనీలు రూ.50,66,000 ► శ్రీకాకుళం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్రూ.30,11,000, శ్రీకాకుళం జిల్లా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల తరపున రూ.30 లక్షలు ► వైఎస్సార్ జిల్లా కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం రూ.2 లక్షలు -
ఏపీ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలు సంస్థలు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. విరాళం మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా సహాయనిధికి బదిలీ చేశారు. ఆ సంస్థ ఎండీ సమీర్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ విరాళానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించారు. వారితో పాటు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ►కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏపీ ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్(ఏపీ ఆయిల్ ఫెడ్) రూ.50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. దీంతో పాటు ఆ సంస్థ ఉద్యోగుల ఒక రోజు వేతనం లక్షా 86 వేల 936 రూపాయలను విరాళంగా అందించింది. ఆ సంస్థ చైర్మన్ వై.మధుసూదన్రెడ్డి, ఎండీ శ్రీకంఠనాధరెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. వారితో పాటు మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ►సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (ఏపీ మార్క్ఫెడ్) కోటి రూపాయల విరాళం ప్రకటించింది. దీంతో పాటు ఏపీ మార్క్ఫెడ్ ఉద్యోగుల తరపున లక్షా 7వేల రూపాయలను అందించింది. మార్క్ఫెడ్ చైర్మన్ వై.మధుసూదన్రెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ►సీఎం సహాయనిధికి ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. దీంతో పాటు ఆ సంస్థ ఉద్యోగుల తరపున 7లక్షల 77వేల 979 రూపాయల విరాళాన్ని అందించింది. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ వై.భానుప్రకాష్ విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ►ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (ఆప్కాబ్) కోటి 16 లక్షల విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఉద్యోగుల తరపున కూడా 4 లక్షల 32 వేల 506 రూపాయలను విరాళంగా అందజేసింది. ఆ సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్ జి.వాణీమోహన్, ఆప్కాబ్ ఎండీ డాక్టర్ ఆర్ఎస్ రెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించారు. వారితో పాటు మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ►ముఖ్యమంత్రి సహాయనిధికి మైక్రో ఇరిగేషన్ కంపెనీలు రూ.50 లక్షల 66వేల రూపాయలు ప్రకటించాయి. ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీవో హరినాథ్రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. వారితో పాటు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. -
భారీ విరాళం ప్రకటించిన భారత్ యూనివర్శిటీ
చెన్నై: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఇంతక ముందు ఎన్నడు ఎదుర్కోని సంక్షోభాన్ని అన్నిదేశాలు ఎదుర్కొంటున్నాయి. కరోనా భారత్లోకి కూడా ప్రవేశించడంతో దానిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ ఆ తరువాత దానిని మే3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దినసరి కూలీలు, వలస కూలీలు, నిరాశ్రయుల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు కొన్ని వాణిజ్య సంస్థలు, సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. (కరోనా : సీఎం సహాయనిధికి విరాళాలు) ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెన్నైలోని భారత్ యూనివర్సిటీ రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది. కరోనా కష్టకాలంలో భారత్ యూనివర్సిటీ డీన్, అడ్మిషన్ మార్కెటింగ్ డైరెక్టర్ యం. రాజశేఖర్ రెడ్డి అండ్ టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందచేయనున్నామని ప్రకటించారు. రూ. 5 లక్షలు తెలంగాణకు, రూ. 5లక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నామని వారు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సేఫ్గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటిలో చాలామంది తెలుగు విద్యార్ధులు చదువుతున్నారని, ఆ యూనివర్శిటిలు, కాలేజీలు కూడా తెలుగు విద్యార్థుల కోసం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తమకు తోచిన విధంగా ఎంతో కొంత సాయం చేయాలని ఆయా కాలేజీల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు లాక్డౌన్ను పాటిస్తూ కరోనా కాలంలో ఎంతో కొంత సహాయం అందించాలని ఆయన రాజశేఖర్ రెడ్డి సూచించారు. (కరోనా : విరాళాలు ప్రకటించిన కంపెనీలు) -
నెల్లూరు జిల్లా విడవలూరు రైతుల ఔదార్యం
-
సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాల వెల్లువ
-
సీఎం సహాయనిధికి విరాళాలు
కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి శుక్రవారం పలువురు విరాళాన్ని అందజేశారు. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) తరఫున రూ.10 కోట్లు ► ఏపీఎస్బీసీఎల్ ఉద్యోగుల రెండురోజుల వేతనం రూ.86,05,384 ► బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ రూ.75 లక్షలు ► కేపీసీ ప్రాజెక్ట్స్ రూ.25 లక్షలు ► కాకినాడలోని రమ్య ఆస్పత్రి రూ.25 లక్షలు ► గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పుల శివరామిరెడ్డి రూ.1,62,000 ► ఫిరంగిపురానికి చెందిన యెండ్రెడ్డి ఎల్లారెడ్డి రూ.లక్ష ► అల్లంవారిపాలెంకు చెందిన కొమ్మారెడ్డి ప్రశాంత్రెడ్డి (ఎన్ఆర్ఐ) రూ.లక్ష ► మునగపాడుకు చెందిన షేక్ సలీం రూ.లక్ష ► 113 తాళ్లూరుకు చెందిన పాలపాటి రఘు రూ.50 వేలు ► రేపూడికి చెందిన బద్దూరి శ్రీనివాసరెడ్డి రూ.25 వేలు ► ఫిరంగిపురానికి చెందిన పెరికల జేమ్స్ ఇన్నయ్య రూ.25 వేలు (మొత్తం రూ.5.62 లక్షల మొత్తాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి చెక్కుల రూపంలో అందజేత) ► రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్కుగానూ మంత్రి కొడాలి నానికి రూ.1.50 లక్షలు అందజేత -
ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు,సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఏపీబీసీఎల్ ఉద్యోగుల తరపున కూడా రెండు రోజుల వేతనం 86 లక్షల 5384 రూపాయలను విరాళంగా అందించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, ఏపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పియూష్కుమార్ విరాళం చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. (కరోనా కాలంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం) ►ముఖ్యమంత్రి సహాయనిధికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.75 లక్షలు, కేసీపీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.25 లక్షలు విరాళాలు ప్రకటించాయి. మంత్రి అనిల్కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షుడు పంకజ్ రెడ్డి, కేసీపీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ కె. అనిల్ కుమార్ మొత్తం రూ.కోటి రూపాయల చెక్కును సీఎం వైఎస్ జగన్కు అందించారు. ►కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి కాకినాడ రమ్య ఆసుపత్రి రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రి ఎండీ డాక్టర్ పితాని అన్నవరం, డైరెక్టర్ డాక్టర్ ప్రభావతి విరాళం చెక్కును సీఎం వైఎస్ జగన్కు అందజేశారు. -
కరోనా పోరు: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం అందించారు. విరాళ చెక్కును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. అలాగే దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల 55 వేలు విరాళం ఇచ్చారు. ఇలా అనేకమంది ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. వారి వివరాలు.. పశ్చిమ గోదావరి : జిల్లాకు చెందిన శ్రీ వైష్టవి స్పింటెక్స్(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ రూ.50 లక్షలు విరాళం అందించారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ వైష్టవి స్పింటెక్స్(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ ఛైర్మన్ రెడ్డి శ్రీనివాస్, రెడ్డి రంగబాబు(ఎండీ) విరాళ చెక్కును సీఎం జగన్కు అందించారు. ► వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు(ఏపి ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్) ఒక రోజు వేతనాన్ని రూ. 75,50,600 విరాళంగా అందజేశారు. చెక్కుకు సంబంధించిన వివరాలను యూనియన్ గౌరవ అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. సీఎం జగన్కు అందజేశారు. ► తణుకు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 58,47,833 లను విరాళంగా అందించారు. ఈ చెక్కును ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సీఎం జగన్కు అందించారు. ►ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులు రూ.50 లక్షలు విరాళం. ఈ చెక్కును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. అనంతరాము, స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, సీఈఓ అర్జా శ్రీకాంత్.. ముఖ్యమంత్రికి అందించారు విశాఖ : కరోనా నియంత్రణకు ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 21.30 లక్షల చెక్కును కలెక్టర్ వినయ్ చంద్కు అందించారు. అలాగే మాడుగుల నియోజకవర్గం ప్రజల కూడా ముప్పై లక్షల 7 వేలు చెక్కును కలెక్టర్కు అందించారు. ►రేసపువాణిపాలెం ఎక్స్- సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ. 27200 విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కును విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అందజేశారు. వైఎస్సార్ కడప: పోరుమామిళ్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మదర్ థెరీసా ఫౌండేషన్ స్వచ్చంద సంస్థ వాళ్లు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చేతుల మీదుగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 వేల చొప్పున విరాళం ఇచ్చారు. అనంతపురం : రాయదుర్గం పట్టణ మహిళా సంఘాల సమాఖ్య తరపున మెప్మా సంఘాలు .. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డికి లక్ష రూపాయల చెక్కను అందజేశారు. తూర్పుగోదావరి(కాకినాడ) : ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ పరుచూరి కృష్ణారావు రూ. 5 లక్షలు, పోలీసు శాఖకు రూ. 2 లక్షలు విరాళం అందజేశారు. అలాగే రాజమండ్రి హర్షవర్ధన విద్యాసంస్థల చైర్మన్ హరి ప్రసాద్.. లక్ష రూపాయలు సహాయాన్ని ఎంపీ భరత్రామ్కు అందజేశారు. కృష్ణా: కైకలూరు మండలం గోకర్ణపురం గ్రామ పెద్దలు 50వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకి అందజేశారు. -
కరోనా కట్టడి..సీఎం సహాయనిధికి విరాళాలు
-
సీఎం సహాయనిధికి విరాళాలు
కరోనా వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు బుధవారం సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. ► ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) రూ.10 కోట్లు. ► రాష్ట్రంలో 110 పట్టణ ప్రాంతాల్లోని 2.33 లక్షల స్వయం సహాయ సంఘాలు రూ.కోటి విరాళం. ► తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, ప్రాధమిక సహకార సంఘాలు, ఉద్యోగుల ఒక రోజు వేతం రూ.60 లక్షలు ► పశ్చిమగోదావరి జిల్లా కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సొసైటీలు, ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ.45 లక్షలు ► గుంటూరుకు చెందిన వ్యాపారవేత్తలు పాములపాటి చంద్రయ్య రూ.5 లక్షలు, బి.జగన్మోహన్రెడ్డి రూ.లక్ష, బి.ప్రసాద్రెడ్డి రూ.లక్ష ► ఏపీ బార్ కౌన్సిల్ తరఫున రూ.3.25 లక్షలు ► తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీంపు హేచరీస్ అసోసియేషన్ తరఫున సంఘం కాకినాడ అధ్యక్షుడు వీర్రెడ్డి, కార్యదర్శి హరినారాయణ రూ.30 లక్షలు ► గుంటూరు జిల్లాకు చెందిన బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ రూ.10 లక్షలు ► గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో నిర్మాణంలో ఉన్న మాతా అమృతానందమయి విశ్వ విద్యాపీఠం, అమృత డీమ్డ్ యూనివర్సిటీ రూ.5 లక్షలు ఇతర విరాళాలు ► హెటేరో ఫౌండేషన్ ప్లూవిర్–75 ఎంజీ 50 వేల ట్యాబ్లెట్లు, రిటోకామ్ 50 వేలకుపైగా ట్యాబ్లెట్లు, హెచ్సీక్యూ రకం 97 వేల ట్యాబ్లెట్లతోపాటు లక్ష మాస్క్లు ప్రభుత్వానికి అందజేసింది. ► ఎచ్చెర్లలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల తరఫున రూ.10 లక్షలు విరాళం కలెక్టర్ జె.నివాస్కు అందజేశారు. ► తిరుమలలోని ప్రతివాద భయంకర్ మఠం ప్రతినిధులు సీఎంఆర్ఎఫ్కు రూ.2,11,111లు విరాళాన్ని డీడీల రూపంలో ఈవోకు ఇచ్చారు. -
సీఎం సహాయనిధికి విరాళాలు
కరోనా వ్యాప్తి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలు సంస్థలు, పలువురు ప్రముఖులు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు. ► సీఎం సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. విరాళం ఇచ్చిన రియలన్స్ ఇండస్ట్రీస్ను ప్రశంసిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ► సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ రీజియన్ రూ.8.60 కోట్లు ► ఆదానీ ఫౌండేషన్ రూ. 2 కోట్లు. ► శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ రూ.2 కోట్లు ► అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1.45 కోట్లు ► దేవి ఫిషరీస్ లిమిటెడ్ రూ.కోటి ► మాధవి ఎడిబుల్ బ్రాన్ ఆయిల్స్ లిమిటెడ్ రూ.20 లక్షలు ► గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. సంగం డెయిరీ తరఫున రూ. 50 లక్షలు ► గుంటూరు జిల్లా పెద్ద పలకలూరుకు చెందిన జేఎల్ఈ సినిమా మెనేజ్మెంట్ తరఫున ఎండీ పోలిశెట్టి రాము రూ.5 లక్షలు. ► గుంటూరు జిల్లాకు చెందిన కొల్లి సాంబిరెడ్డి రూ.లక్ష, మధుబాబు రూ.లక్ష ► గుంటూరు జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన ఈశ్వరరావు రూ.లక్ష -
రిలయన్స్కు ధన్యవాదాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి సాయపడేందుకు వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 నివారణ చర్యలు చేపట్టేందుకు రూ.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్లైన్ ద్వారా ఆ మొత్తం జమచేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉదారతను ప్రశంసిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. కోవిడ్ నివారణ చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపారు. కరోనా పోరాటంలో రియలన్స్ పాత్ర కోవిడ్-19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేసిన రియలన్స్ ఇండస్ట్రీస్ .. పీఎం కేర్స్కు ఇప్పటికే రూ. 530 కోట్లకు పైగా అందించింది. వైరస్ సవాళ్లను ఎదుర్కోవడంలో దేశానికి సాయం చేసేందుకు సదా సిద్ధమని ప్రకటించింది. ఆ దిశగా కోవిడ్కు చెక్ పెట్టేందుకు రిలయన్స్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో 100 పడకల ఆస్పత్రిని కోవిడ్-19 సేవలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అందించింది. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉచిత భోజనం అందించే కార్యక్రమాలు చేపట్టింది. ఆరోగ్య కార్యకర్తలు, సంరక్షకుల కోసం రోజూ లక్ష మాస్కులు, వేలాది పీపీఈ కిట్లను ఉత్పత్తి చేసి ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వాహనాలకు ఉచితంగా ఇంధనం అందిస్తోంది. రిలయన్స్ రిటైల్ ద్వారా ప్రతిరోజూ లక్షలాది భారతీయులకు నిత్యావసరాలను ఇంటికే సరఫరా చేస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ.. ►కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.8.60 కోట్ల విరాళం ప్రకటించింది. సీఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ప్రతినిధులు రూ.8.60 కోట్ల చెక్కును సీఎం వైఎస్ జగన్కు అందజేశారు. ►సీఎం సహాయనిధికి అదానీ ఫౌండేషన్ రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ ఆన్లైన్లో విరాళాన్ని జమ చేశారు. ►సీఎం సహాయ నిధికి శ్రీ విజయ విశాఖ మిల్క్ కంపెనీ రూ.2 కోట్లను విరాళం ప్రకటించింది. డెయిరీ ట్రస్ట్ సీఈవో ఆనంద్ రూ.2 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అందజేశారు. ►సీఎం సహాయనిధికి దేవి ఫిషరీస్ లిమిటెడ్ రూ.కోటి రూపాయల విరాళం ప్రకటించింది. మంగళవారం సీఎం వైఎస్ జగన్ను కలిసిన ఆ సంస్థ డైరెక్టర్స్ సురేంద్ర,వీర్రాజు రూ.కోటి చెక్కును అందించారు. ►సీఎం సహాయనిధికి మాధవి ఎడిబుల్ బ్రాన్ ఆయిల్స్ లిమిటెడ్ రూ.20 లక్షల విరాళం ప్రకటించింది. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ మాధవిబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పట్టాభిరామచౌదరి రూ.20 లక్షల నగదును చెక్కు రూపంలో సీఎం వైఎస్ జగన్కు అందజేశారు. -
కరోనా: హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ. 5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ. 5 కోట్లు విరాళం అందజేసింది. ఈ సందర్భంగా హెటిరో గ్రూపు ఎండీ వంశీ కృష్ణ.. విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. దీంతోపాటు కోటి రూపాయలతో పీపీఈ కిట్స్, మందులు, మాస్క్లు అందజేశారు. విశాఖ జిల్లా కలెక్టర్కు సీఎస్ఆర్ ఫండ్స్తో పాటు నక్కపల్లిలో శానిటైజేషన్, మందులు, నిత్యావసర సరుకుల పంపిణీకి మరో రెండు కోట్లు అందజేశామని హెటిరో డ్రగ్స్ ప్రతినిధులు తెలిపారు. (అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం ) రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భాగంగా దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేసింది. ఈ మేరకు దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ బ్రహ్మనందరం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చెక్కును అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం నందలూరు రాయల్ మెడికల్స్ ప్రొప్రైటర్ అరిగే మని.. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 100000/- లక్ష రూపాయలు పంపారు. (సీసీసీకి వైజయంతీ మూవీస్ రూ. 5 లక్షలు విరాళం) అమరావతి : కరోనా వ్యతిరేక పోరాటానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని రూ. 83 లక్షల 86 వేల 747 విరాళంగా అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు ఈ విరాళానికి సంబంధించిన డీడీను అందజేశారు. (నన్నే ఆపేస్తారా.. లేదు అరెస్టు చేస్తాం! ) -
సీఎం సహాయనిధికి విరాళాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న కార్యక్రమాల కోసం తమవంతు సాయంగా ప్రముఖులు, పలు కంపెనీల ప్రతినిధులు శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు అందించారు. రాంకీ ఎన్విరో ఇంజనీరింగ్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎమ్.గౌతమ్ రెడ్డి, ఆళ్ల శరణ్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. సైంట్ కంపెనీ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి, సీఈఓ బి.కృష్ణా సీఎంఆర్ఎఫ్కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. రాజా ధనరాజ్గిర్ ఎస్టేట్స్ చైర్మన్ అరుణ్ మహేందర్ గిర్ కోటి రూపాయల చెక్కును సీఎంకు విరాళంగా ఇచ్చారు. -
సీఎం సహాయ నిధికి రూ.4.70 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శనివారం సుమారు 30 మంది దాతలు రూ.4.70 కోట్ల చెక్కులను మంత్రి కేటీఆర్కు ప్రగతిభవన్లో అందజేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.50 లక్షలు, మల్లారెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన మరో రూ.47 లక్షలు విలువ చేసే 36 చెక్కులను కేటీఆర్కు అందజేశారు. వీటితో పాటు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ తరపున మరో రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. ► హెచ్ఈఎస్ ఇన్ఫ్రా ఎండీ ఐవీఆర్ కృష్ణంరాజు రూ.50 లక్షలు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి సేకరించిన రూ.40 లక్షలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద కేటీఆర్కు అందజేశారు. వోక్సెన్ బిజినెస్ స్కూల్ ఎండీ విన్ పూల, రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆర్ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్, ఎన్.ఎస్. ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎంఆర్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ► ఆజాద్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 21 లక్షలు, అక్యురేట్ గ్రీన్ వీడియోస్ రూ.15 లక్షలు, స్కైస్ బిజినెస్ సర్వీసెస్ రూ.11 లక్షలు, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ యుగంధర్ రావు రూ.10 లక్షలు, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ.10 లక్షలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సెయింట్ మార్టిస్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, టెక్ సిస్టమ్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 లక్షల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్కు అందజేశారు. ► పడాల రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.6 లక్షలు, లహరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరిస్టా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్, జోగినిపల్లి చంద్రశేఖరరావు, జోగినిపల్లి సుధీర్ రూ. 5 లక్షల చొప్పున సీఎంఆర్ఎఫ్కి విరాళంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ ఆఫ్ సెయింట్ అన్నె రూ.5 లక్షల చెక్కులను కేటీఆర్కు అందజేసింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జి.రాజేశంగౌడ్ రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు -
సీఎం సహాయనిధికి విరాళాలు
► కరోనా వైరస్ నియంత్రణ కోసం తమ వంతు సాయంగా పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. ► మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జె.రంజిత్రావు రూ.3 కోట్లు ► మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ రూ.కోటి ► రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల రూ.కోటి ► నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ తరఫున ఎండీ సి.శ్రీధర్ రూ.కోటి ► గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్ నిధుల నుంచి రూ.30 లక్షలు. ► విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ ఒక నెల గౌరవవేతనం, ఆ బ్యాంక్ ఉద్యోగుల ఒక రోజు జీతం, విశాఖ డీసీసీబీ రూ.13 లక్షలు, విశాఖ జిల్లాలో 98 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సమకూర్చిన రూ.9 లక్షలు ఇలా మొత్తం తరఫున రూ.25 లక్షలు ► గుంటూరు జిల్లా మేడికొండూరు మండల పరిధిలోని డోకిపర్రు వద్ద ఉన్న జోసిల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జాగర్లమూడి మురళీమోహన్ రూ.25 లక్షలు. ► కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన కాటన్ మర్చంట్స్ అసోసియేషన్ రూ.10 లక్షలు ► గుంటూరు జిల్లాకు చెందిన యోగి వేమారెడ్డి సమితి రూ.లక్ష -
లారెన్స్... లక లక లక
పదిహేనేళ్ల క్రితం రజనీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ చిత్రం విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుని సూపర్హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కనుంది. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే సీక్వెల్ను తెరకెక్కించనున్నారు. ఈ రెండో భాగంలో నటించనున్నట్లు దర్శక–నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ తెలిపారు. అయితే పార్ట్1లో రజనీ లక లక లక అంటే పార్ట్2లో లారెన్స్ లక లక లక అంటారన్నమాట. ‘‘రజనీకాంత్గారి అనుమతితో పి. వాసుగారు దర్శకత్వం వహించనున్న ‘చంద్రముఖి 2’ చిత్రంలో నేను నటించబోతున్నాను. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు’’ అని లారెన్స్ పేర్కొన్నారు. మూడు కోట్లు విరాళం మూడు కోట్ల రూపాయలను కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్గా ఇస్తున్నట్లు వెల్లడించారు లారెన్స్. ఈ మూడు కోట్ల రూపాయల్లో యాభై లక్షలను పీఎమ్ కేర్స్ ఫండ్కు, యాభై లక్షలను తమిళనాడు ముఖ్య మంత్రి సహాయనిధికి, ఎఫ్ఈఎఫ్ఎస్ఐ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా)కు యాభై లక్షలను విరాళంగా ప్రకటించారు లారెన్స్. ఇంకా డ్యాన్సర్స్ యూనియన్కు 50లక్షలు, దివ్యాంగులకు పాతిక లక్షలు, తన స్వస్థలమైన రాయపురం దేశియానగర్లోని ప్రజలకు, దినసరి కార్మికులకు 75 లక్షలను విరాళంగా ఇవ్వబోతున్నారు. -
తెలంగాణ సీఎం సహాయనిధికి రిలయన్స్ విరాళం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు అందుతున్నాయి. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ సీఎం సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసింది. రిలయన్స్ జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి, ఆర్ఐఎల్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్లపల్లి శుక్రవారం మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. విరాళం అందజేసినందుకు మంత్రి కేటీఆర్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి, ప్రతినిధి కేసీ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే పీఎం కేర్స్కు రిలయన్స్ రూ. 530 కోట్ల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. (ఏపీలో మొత్తం 133 రెడ్ జోన్లు) -
ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి మై హోమ్ ఇండస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఎండీ కె.రంజిత్రావు రూ. 3 కోట్లను చెక్కు రూపంలో సీఎం వైఎస్ జగన్కు అందించారు. (కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్) ఏపీ సీఎం సహాయనిధికి మెడికోవర్ గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఛైర్మన్ డా. అనిల్కృష్ణ సీఎం జగన్ను కలిసి రూ.కోటి రూపాయల చెక్కును అందజేశారు. రెయిన్ బో హాస్పటల్స్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ ఆసుపత్రి సీఎండీ డాక్టర్ కె.రమేష్ రూ.కోటి రూపాయల చెక్కును సీఎం జగన్కు అందించారు. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఎండీ సి.శ్రీధర్ రూ.కోటి రూపాయల చెక్కు సీఎం జగన్కు అందజేశారు. (ఏపీ గవర్నర్ వినూత్న నిర్ణయం) -
ఏపీ గవర్నర్ వినూత్న నిర్ణయం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పిలుపు మేరకు తన జీతంలో సంవత్సరం పాటు ముప్పయి శాతం కోతకు ఇప్పటి కే ముందుకు రాగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరునిగా తనకున్న విచక్షణ అధికారాలను సద్వినియోగపరుస్తూ, 30 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా సమకూర్చారు. రాజ్ భవన్ బడ్జెట్ కు సంబంధించి నిధుల వినియోగంలో గవర్నర్ కు విశేష విచక్షణ అధికారాలు ఉంటాయి. ఈ మేరకు గవర్నర్ తరపున రాజ్ భవన్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. (కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్) కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను చేపడుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలకు ఆర్థిక పరమైన వెసులుబాటు కోసం రాష్ట్ర రాజ్యాంగ అధినేత ఈ చర్యకు ఉపక్రమించారు. ముప్పయి లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి సమకూర్చిన తరుణంలో ఆ మేరకు రాజ్ భవన్ లో పొదుపు చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శి ముకేష్ కుమార్ మీనాను గవర్నర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల రాజ్ భవన్ లకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని, స్వయంగా తన ఖర్చులను తగ్గించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చడం స్ఫూర్తి నిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
సీఎం సహాయనిధికి వరుణ్ గ్రూప్ విరాళం
సాక్షి, అమరావతి : కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు విరాళాలు అందచేశాయి. తాజాగా వరుణ్ గ్రూప్ గురువారం సీఎం సహాయనిధికి రూ.2కోట్లు విరాళం ఇచ్చింది. విరాళానికి సంబంధించిన చెక్ను వరుణ్ గ్రూప్ చైర్మన్ వి.ప్రభు కిషోర్, ఎండీ వి.వరుణ్ దేవ్ ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందచేశారు. ►కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన వైద్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలు తరపున 1 కోటి 18 వేల 227 రూపాయలు విరాళమందించారు. ►నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్ అందజేశారు.మెట్టిపల్లి రమేష్,దానారెడ్డి, ఎం.బి.వి.సత్యన్నారాయణ పాల్గొన్నారు. ►సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సీఈఓ వెంకట్ జాస్తి విరాళం చెక్ను అందజేశారు. ►విజయవాడ రోమన్ కేథలిక్ డయోసిస్ : రూ.25 లక్షలు విరాళం ►గుంటూరు రోమన్ కేథలిక్ డయోసిస్ : రూ.25 లక్షలు విరాళం ►దొడ్ల డెయిరీ : రూ.25 లక్షలు విరాళం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును వైయస్.జగన్కు దొడ్ల డెయిరీ తరపున పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
► రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ రూ.3 కోట్లు ► మిడ్వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. కోటి ► ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ రూ.కోటి ► సీఎం సహాయ నిధికి మౌరి టెక్ ఫౌండేషన్ రూ. 50 లక్షలు విరాళం అందజేసింది. ► పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత పానెం హనిమిరెడ్డి రూ.25 లక్షలు ► నాగార్జున గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రూ.30 లక్షలు ► గండ్లూరు వీరప్రతాప్ రెడ్డి సీఎం సహాయ నిధికి రూ. 30 లక్షలు ఇచ్చారు ► ఆక్వా రైతు జంపన రామ లింగరాజు రూ. 2 లక్షలు ► కైకలూరు మండలం ఆల పాడుకు చెందిన ఐశ్వర్య ఇమ్ ఫెక్స్ మేనేజ్మెంట్ రూ.2 లక్షలు ► ఆంధ్రా లయోలా వాకర్స్ అసోసియేషన్ రూ.2 లక్షలు ► మచిలీపట్నం ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం రూ.లక్ష ► వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ రూ.లక్ష ► కీర్తి గ్యాస్ కంపెనీ అధినేత మామిడి వరప్రసాద్ రూ.లక్ష పీఎం సహాయ నిధికి రాష్ట్ర న్యాయవ్యవస్థ విరాళం కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల నిమిత్తం పీఎం సహాయనిధికి రాష్ట్ర న్యాయ వ్యవస్థ విరాళం ఇవ్వాలని నిర్ణయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి చొరవ తీసుకుని ఈ నెల 6న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిగిలిన న్యాయమూర్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి రూ. 50 వేలు, న్యాయమూర్తులు ఒక్కొక్కరు రూ. 25 వేల చొప్పున విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. హైకోర్టు రిజిస్ట్రా్టర్లు, ఓఎస్డీలు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జీలు, అదనపు జిల్లా జడ్జీలు ఒక్కొక్కరు రూ. 20 వేలు, సీనియర్ సివిల్ జడ్జీలు ఒక్కొక్కరు రూ. 15 వేలు, జూనియర్ సివిల్ జడ్జీలు ఒక్కొక్కరు రూ. 12 వేలు, గెజిటెడ్ హోదా అధికారులు ఒక్కొక్కరు రూ. 10 వేలు, ఎన్జీవోలు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు రూ. 5 వేలు, ఇతర సబార్డినేట్ సిబ్బంది, డ్రైవర్లు రూ. 1,000 చొప్పున విరాళం ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రా్టర్ జనరల్ రాజశేఖర్ కోరారు. విరాళం ఇవ్వదలచిన వారు ఈ నెల 15 కల్లా తమ విరాళాలను హైకోర్టుకు అందేలా చూడాలని కోరారు. -
కరోనా : సీఎం సహాయనిధికి విరాళాలు
-
కరోనా : సీఎం సహాయనిధికి విరాళాలు
సాక్షి,అమరావతి : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ మూడు కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం.గౌతమ్ రెడ్డి, ఆళ్ల శరణ్ సీఎం జగన్ను కలిసి చెక్కును అందజేశారు. దీంతో పాటు రెండు కోట్ల విలువైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి మిడ్వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బుధవారం మిడ్వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రామచంద్ర కొల్లారెడ్డి, కె రాఘవరెడ్డి కలిసి విరాళానికి సంబంధించిన చెక్ను అందచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ టెక్ట్స్టైల్ మిల్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. సీఎం జగన్ను కలిసిన వారిలో ఛైర్మన్ లంకా రఘురామిరెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, అసోసియేషన్ సభ్యులు వసంతకృష్ణప్రసాద్, మద్దాల గిరి ఉన్నారు. సాగర్ సిమెంట్స్ కోటి విరాళం ముఖ్యమంత్రి నివాసంలో నిన్న (మంగళవారం) సీఎం వైఎస్ జగన్కు సాగర్ సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఆనంద్రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.శ్రీకాంత్ రెడ్డి విరాళం చెక్ను అందచేశారు. -
దెబ్బతిన్న ఏపీని ఆదుకోండి : విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం : కరోనా వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం తరపున ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తక్షణమే రూ. 6200 కోట్ల సాయాన్ని ఏపీకి అందించేలా చూడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా ,19 రాష్ట్రాలలో 78 హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించారన్నారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా హాట్స్పాట్లు ఉన్న ప్రాంతాలలో లాక్డౌన్ కొనసాగించాలని.. మిగిలిన ప్రాంతాలలో దశల వారీగా ఎత్తివేయాలని కోరామన్నారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారికి కరోనా టెస్టులు చేసి నెగటివ్ వచ్చిన వారిని స్వస్ధలాలకి పంపాలని కోరినట్లు తెలిపారు. డొమెస్టిక్ శానిటేషన్ పద్దతులపై ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాలు రూపొందించాలని కోరామన్నారు. డ్వాక్రా మహిళలకి మాస్క్ లు, గ్లౌవ్స్ ఏ విధంగా తయారు చేయాలనేది టీవీల ద్వారా శిక్షణ ఇవ్వాలని సూచించామన్నారు. మన రాష్ట్రానికి ప్రధాని మోదీ అందిస్తున్న సాయానికి ప్రభుత్వం తరపున కృతజ్ణతలు తాను కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ గతంలోనే ప్రారంభించిన స్వచ్చ భారత్ కార్యక్రమం వల్ల చాలా మేలు జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల రెండు సంవత్సరాల జీతాన్ని మన రాష్ట్ర సిఎం సహాయనిధికి అందించేలా సూచించినట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఏపీకి అవసరమైన అన్ని వైద్య పరికరాలని సమకూర్చమని కోరారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న1.50 కోట్ల కార్డుల రేషన్ పంపిణీలో రూ.900 కోట్లు అదనంగా భారం పడుతుందన్నారు. అలాగే వెయ్యి రూపాయిల పంపిణీ ద్వారా మరో 500 కోట్ల లోటు కనిపిస్తుందన్నారు. మొత్తం రూ.1400కోట్లు సాయం చేయడంతో పాటు నెలవారీగా కోల్పోయిన రూ. 4800 కోట్ల ఆదాయాన్ని ఆర్థికంగా సాయం అందించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
► డాక్టర్ రెడ్డీస్ సంస్థ రూ.5 కోట్లు, 10 వేల కుటుంబాలకు సరిపడా నిత్యావసరాలు ► ది ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు రూ.2.85 కోట్లు ► జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోటీ నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు ► సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ రూ.కోటి ► కళ్లం గ్రూప్ సంస్థల అధినేత కళ్లం హరనాథరెడ్డి రూ.25 లక్షలు ► ది ఇండియన్ టొబాకో అసోసియేషన్ (ఐటీఏ) రూ.15 లక్షలు, ► ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూ.6.50 లక్షలు. ► సార్థక్ డెవలపర్స్ సంస్థ రూ.2 లక్షలు, ► స్నేహ సుధ చిట్ఫండ్ప్రైవేట్ లిమిటెడ్ యజమాని అక్కెన జనార్థన నాయుడు రూ.2 లక్షలు ► సురక్ష సొసైటీ అధినేత సుశీల్కుమార్ రూ.లక్ష ► పెదనందిపాడు మండలం వరగాని గ్రామానికి చెందిన కూరేటి భూషయ్య రూ.లక్ష ► టైనీథాట్స్ స్కూలు అధినేతలు రూ.లక్ష ► శ్రీ కృష్ణ చైతన్య విద్యాసంస్థలు రూ.లక్ష ► చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు రూ.లక్ష ► పూజిత రైస్ మిల్ నిర్వాహకులు రూ.లక్ష ► అపోలో సుగర్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.జయప్రకాశ్సాయి రూ.25 వేలు ఇతర విరాళాలు ► ప్రధానమంత్రి సహాయనిధికి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి ► డీజీపీ సహాయనిధికి కిమ్స్ హాస్పిటల్స్ యాజమాన్యం రూ.50 లక్షలు ► ది ఇండియన్ టొబాకో అసోసియేషన్ (ఐటీఏ) ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.30 లక్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.15 లక్షలు -
సీఎంఆర్ఎఫ్కు విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా మంగళవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)కు విరాళాలు అందజేశారు. కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు మొత్తం రూ.75 లక్షల రూపాయల నగదు, రూ.1కోటి విలువైన మందులు, వైద్య పరికరాలను విరాళంగా ప్రకటించారు. ఇందులో కరీంనగర్ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రూ.50 లక్షల చెక్కును సంస్థ ప్రతినిధులు పొన్నంనేని గంగాధర్రావు, ప్రెసిడెంట్ శ్రీధర్ ముఖ్యమంత్రికి అందించారు. మార్వాడీ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ తరఫున రూ.25 లక్షల చెక్కును ఆ సంస్థ యజమానులు గోపీ మహేశ్వరి, రాజేశ్ అగర్వాల్, ముఖేశ్ పర్వాల్ ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్కు మరో రూ.6.80 కోట్ల విరాళాలు ప్రగతిభవన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు రూ.6.80 కోట్ల విలువ చేసే చెక్కులను 25 మంది దాతలు అందజేశారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో విజ్ రియల్టర్స్ కోటి రూపాయల చెక్కును అందజేసింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్సైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పెన్నా సిమెంట్స్, రత్నదీప్ ప్రైవేటు లిమిటెడ్ రూ.1 కోటి చొప్పున చెక్కులను సీఎంఆర్ఎఫ్కు అందజేశారు. సుజన చారిటబుల్ ట్రస్టు రూ.50 లక్షలు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి సీఎం సహాయ నిధి పేరిట కేటీఆర్కు చెక్కును అందజేశారు. దొడ్ల డెయిరీ లిమిటెడ్, ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, వశిష్ట కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, గాయత్రి గ్రానైట్స్ రూ.25 లక్షల చొప్పుల విరాళం అందజేశాయి. అగ్రసేన్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ.21 లక్షలు, నీరూస్ ఎన్సెంబుల్స్ రూ.20 లక్షలు, రిజెనెసిస్ ఇండస్ట్రీస్ రూ.10లక్షలు అందజేసింది. హైదరాబాద్లోని పీఓటి మార్కెట్లో వృత్తి పనిచేసే స్వర్ణ కారులు 39 మంది రూ.7.32లక్షల చెక్కులను మంత్రి కేటీఆర్కు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ విరాళం అందజేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు రూ.50వేల చొప్పున విరాళాన్ని చెక్కు రూపంలో పంపించారు. ఫ్రీడం ఆయిల్ రూ.2.5కోట్ల విరాళం ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ తయారీదారు జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల చెక్కును అందజేసింది. కరోనాపై కేంద్రం, రాష్ట్రాలు జరుపుతున్న పోరాటానికి సంఘీభావంగా ఇప్పటివరకు రూ.2.5 కోట్ల విరాళాన్ని అందజేసిట్లు సంస్థ ఎండీ ప్రదీప్ చౌదరి ప్రకటించారు. -
కరోనా: సీఎం సహాయ నిధికి రూ.2 కోట్లు
సాక్షి, ఖమ్మం: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలపాలని, సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇచ్చిన పిలుపునకు భారీగా విరాళాలు వచ్చాయి. ఖమ్మం నుంచి వివిధ రంగాల వ్యాపారులు, విద్య, వైద్య సంస్థలు, వర్తక వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రూ.1.75 కోట్లను మంత్రికి అందించారు. మమత వైద్య విద్యాసంస్థ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భారీ మొత్తంలో రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఆ మొత్తం రూ.2 కోట్లకు సంబంధించి మంత్రి అజయ్కుమార్ సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను నేరుగా కలిసి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్కుమార్ను సీఎం కేసీఆర్ అభినందించారు. అనంతరం ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలను మంత్రి సీఎంకు వివరించారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం జరిపే పోరాటానికి అండగా నిలవడంలో దాతల సహాయం ఎంతో తోడ్పడగలదన్నారు. సీఎం పిలుపుతో తాను చేసిన విన్నపం మేరకు ఖమ్మం జిల్లాలో ముందుకొచ్చి విరాళాలను అందించిన దాతలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి మార్గ నిర్దేశాలతో కరోనా నియంత్రణకు డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు తెలంగాణ సమాజం మొత్తం హ్యాట్సప్ చెబుతోందన్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
► నాట్కో ఫార్మా లిమిటెడ్ రూ.2.5 కోట్లు ► పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు, వ్యాపార వేత్తలు, వర్తక, వాణిజ్య సంఘాలు రూ.1.4 కోట్లు ► శ్రీ చైతన్య విద్యాసంస్థలకు చెందిన శ్రీధర్ రూ.కోటి ► కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బి.భాస్కర్రావు రూ.కోటి ► కల్లాం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ.25 లక్షలు ► కలీశువరి రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు ► డక్కన్ టుబాకో కంపెనీ గ్రూప్ డైరెక్టర్ షఫీఖాన్ రూ.25 లక్షలు ► ది కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరే టివ్ సొసైటీ లిమిటెడ్ రూ.20 లక్షలు ► చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రూ.15.62 లక్షలు ► నరసరావుపేటకు చెందిన ఎన్ఆర్ఐ వెంకటేశ్వరరావు రూ.5 లక్షలు ► అజంతా స్పిన్టెక్స్ లిమిటెడ్ ప్రతినిధులు ఇప్పల దానారెడ్డి, కృష్ణారెడ్డి రూ.5 లక్షలు ► వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థులు రూ.5 లక్షలు. ► ఎస్ఈపీఎల్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.3 లక్షలు ► కొండపల్లికి చెందిన శ్రీనివాస్ ఎడిపై ప్రైవేట్ లిమిటెడ్ రూ.3 లక్షలు ► వై.వి.రత్నం రూ.3 లక్షలు ► సాయితేజ కన్స్ట్రక్షన్ బిల్డర్ బీవీ సుబ్బారెడ్డి రూ.2 లక్షలు ► ఏ వన్ కాంట్రాక్టర్ డి.అనిల్కుమార్ రూ.2 లక్షలు ► డాక్యుమెంట్ రైటర్ పి.అజీజ్ రూ.లక్ష ► రావూరి వెంకటేశ్వరరెడ్డి, ఉజ్వల దంపతులు రూ.లక్ష ► సెయింట్ మేరీ హైస్కూలు ప్రిన్సిపల్ డి.జోజయ్య రూ.లక్ష ► ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్.రాజగోపాలరెడ్డి రూ.లక్ష ► లక్ష్మీసాయి కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు రూ.లక్ష ► వినాయక కన్స్ట్రక్షన్స్ రూ.లక్ష ► రొంపిచర్ల మండల వైఎస్సార్ సీపీ నేత గాడిపర్తి రామాంజనేయులు రూ.లక్ష ► సెయింట్ జోసెఫ్ స్కూలు ప్రతినిధులు రూ.లక్ష ► సింధు విద్యాసంస్థల అధినేతలు కేవీ రామకృష్ణ, ఆర్.నరసింహారావు రూ.లక్ష ► లక్ష్మీఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి రవికిరణ్ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.38 లక్షలు -
ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. ► తెలంగాణ ఐకేపీ వీఓఏలు 1,72,61,000 రూపాయలను విరాళంగా అందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్.రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి, కోశాధికారి తిరుపతిలు ఈ విరాళాన్ని సీఎం కేసీఆర్కు అందించారు. ► రాష్ట్ర మహిళా సమాఖ్యలకు చెందిన స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తరుఫున స్త్రీనిధి అధ్యక్షురాలు ఎస్.అనిత కోటి రూపాయల చెక్కును సీఎం కేసీఆర్కు అందించారు. ► తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి సీఎంకు అందించారు. ► తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ జి.రంజిత్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ► యూనిక్ ట్రీస్ రూ.25 లక్షల విరాళం అందించింది. యూనిక్ ట్రీస్ అధ్యక్షుడు రామ్ దేవ్ చెక్కును సీఎంకు అందించారు ► తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు (టెస్కాబ్) కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవిందర్ రావు, వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ కోటి రూపాయల్లో 88 లక్షల రూపాయలు బ్యాంకు విరాళం కాగా, 8.5 లక్షలు బ్యాంకు ఉద్యోగులు, 3.5 లక్షల రూపాయలు రవిందర్ రావు అందించారు. ► డీసీసీబీలు, సింగిల్ విండోలు కలిపి 76 లక్షల రూపాయలు అందించాయి. డీసీసీబీ చైర్మన్లు ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున, సింగిల్ విండో చైర్మన్లు 5వేల రూపాయల చొప్పున, ఉద్యోగులు ఒక రోజు వేతనం చొప్పున అందించారు. ► రెడ్డీస్ ల్యాబ్స్ 5 కోట్ల రూపాయల విలువైన మందులు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీశ్, ఎండీ జీవీ ప్రసాద్ ముఖ్యమంత్రికి అందించారు. ► ఎమ్ఎస్ఎన్ ల్యాబ్స్ 5 కోట్ల రూపాయల మందులు, ఇతర మెడికల్ సామగ్రి అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ను ల్యాబ్స్ చైర్మన్ ఎమ్.సత్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ► ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని దాతలు ‘గుడ్ సమరిటాన్స్ ఆఫ్ ఖమ్మం’పేరిటి ఏర్పడి రూ. రెండు కోట్ల విరాళాలు సేకరించారు. ఇందులో రూ. కోటి 75 లక్షలు విరాళాలు రాగా, రూ. 25 లక్షలను మమత వైద్య విద్యా సంస్థలు అందించారు. రెండు కోట్ల రూపాయల చెక్కును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎంకు అందించారు. ► అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఎ.జలంధర్ రెడ్డి రూ.50 లక్షలు, డీఈసీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అనిరుధ్ గుప్తా 50 లక్షల రూపాయల చెక్కును సీఎంకు అందించారు ► కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ కె.అనిల్ కుమార్ 50 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ► ఎస్ఎల్ఎంఐ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ బి.వెంకటరెడ్డి రూ.25 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు. ► శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ ఎండీ ఎం.రవీందర్ రెడ్డి రూ.25 లక్షల చెక్కును సీఎం కేసీఆర్కు అందించారు. ► సీల్ వెల్ కార్పొరేషన్ ఎండీ బంగారు సుబ్బారావు రూ. 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ► జీవీకే బయో తరపున కంపెనీ వైస్ చైర్మన్ సంజయ్రెడ్డి రూ.5 కోట్లు, సాగర్ సిమెంట్స్, వెల్జన్ డెనిజన్స్, రహేజా కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ కోటి రూపాయల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్కు అందజేశారు. ► శ్రీ ఆదిత్య హోమ్స్, తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ అర్చ్ డైకోసిస్ ఎడ్యుకేషన్ సొసైటీ, కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, తెలంగాణ స్పిన్నింగ్ అండ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని మంత్రి కేటీఆర్కు అందజేశాయి. ► పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, యూనిక్ ఇన్ప్లేటబుల్స్ లిమిటెడ్, జీఎస్జీ బిల్డర్స్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, సప్తగిరి కాంఫర్ ప్రైవేట్ లిమిటెడ్, సరళ ప్రాజెక్ట్ వర్క్స్ లిమిటెడ్, వెలిజన్ హైడ్రాయిర్ లిమిటెడ్, దివ్య శక్తి పేపర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రెండ్ సెట్ బిల్డర్స్, ఎలగన్స్ డెవలపర్స్ రూ.25 లక్షల చొప్పున విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంత్రి కేటీఆర్కు అందజేశాయి. ► ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.31 లక్షలు సీఎంఆర్ఎఫ్కు ప్రకటించగా, గ్రీన్ సిటీ ఎస్టేట్, సూర్య శంకర రెడ్డి గుండేటి, నిజాం క్లబ్ రూ.15 లక్షల చొప్పున విరాళాన్ని కేటీఆర్కు అందజేశారు. ► సాకేత్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేష్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్, ధనలక్ష్మీ ఐరన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హారిక, హాసిని క్రియేషన్స్, ఏ.శ్రీనివాస్, జై రాజ్ ఇస్పాత్ లిమిటెడ్, దేవ శ్రీ ఇస్పాత్ లిమిటెడ్, హైదరాబాద్ జింఖానా క్లబ్, నవ తేజ్ ఇన్ ఫ్రా లిమిటెడ్, ఆర్ బీవీ ఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ, వీరమణి బిస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, డాల్ఫిన్ ఫుడ్స్, సంజీవని చారిటబుల్ ట్రస్ట్ రూ.10 లక్షల చొప్పున విరాళాలకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్ కి అందించారు. -
కరోనా : విరాళాలు ప్రకటించిన కంపెనీలు
సాక్షి, అమరావతి : కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించింది. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కర్రావు చెక్కును అందజేశారు. అలాగే కరోనా నివారణ చర్యల కోసం తమ వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు శ్రీ చైతన్య యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీధర్ సీఎం జగన్ను కలిసి చెక్కును అందజేశారు. నాట్కో ఫార్మా లిమిటెడ్ కంపెనీ రూ.2.5 కోట్లు విరాళాన్ని అందజేసింది. ఆర్టీజీఎస్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి నాట్కో ఫార్మా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ నన్నపనేని విరాళాన్ని అందజేశారు. దీంతో పాటు రూ.1.5 కోట్లు విలువ చేసే మందులు, పర్సన్ ప్రొటక్షన్ ఎక్విప్మెంట్ను కూడా అందించారు. ఇక కరోనా నివారణ చర్యల్లో భాగంగా కల్లాం గ్రూపు ఆఫ్ కంపెనీస్ 25 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. -
కరోనా: సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.కోటి విరాళం
సాక్షి, అమరావతి: కరోనా నివారణ చర్యల కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు, వ్యాపార వేత్తలు, వర్తక, వాణిజ్య సంఘాలు సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించాయి. ఈమేరకు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి 1 కోటి 4 లక్షల 7 వేల 838 రూపాయల చెక్కును అందజేశారు. ప్రధానమంత్రి సహాయ నిధికి.. ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వేములపల్లి రవి కిరణ్ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.38 లక్షల విరాళం ప్రకటించారు. ఈమేరకు విజయవాడలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.విద్యాసాగర్ను కలిసి ముప్పై ఎనిమిది లక్ష రూపాయల చెక్కును అందించారు. క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాణరంగ కార్మికుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని రవికిరణ్ అన్నారు. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
► ఏయూ టీచింగ్, నాన్ టీచింగ్తో పాటు కాంట్రాక్ట్, అడ్హాక్ ఉద్యోగులు ఒక రోజు జీతం రూ.91.48 లక్షలు. ► ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రూ. 2.72 లక్షలు ► గుంటూరులోని సింగెంటా సంస్థ ప్రతినిధులు రూ.25 లక్షలు, నరసరావుపేటలోని న్యూ మధు లైటింగ్ సంస్థల ప్రతినిధులు రూ.2 లక్షలు ► శ్రీ లక్ష్మీ గాయత్రి నగర్ రూ.లక్ష , విక్టరీ డిగ్రీ కళాశాల ప్రతినిధులు రూ.లక్ష, కొత్తూరు గోపి రూ.లక్ష, వాసవీ డిగ్రీ కళాశాల ప్రతినిధులు రూ.లక్ష, వైఎస్సార్సీపీ సీనియర్ నేత షేక్ ఖాజావలి రూ.లక్ష, ఉప్పలపాడు వాసి శనివారపు శివారెడ్డి రూ.లక్ష, వి.సాంబశివరావు రూ.లక్ష, బీరం భాస్కరరెడ్డి రూ.50 వేలు, మద్ది రామబ్రహ్మానందరావు రూ.50 వేలు, రెడ్క్రాస్ సంస్థ ప్రతినిధి బత్తుల మురళీ రూ.21,216, డాక్టర్ నరసింహారెడ్డి, కాసింరెడ్డి, రామారావు కలిపి రూ.2 లక్షలు. ► నరసరావుపేటకి చెందిన సాయి సూర్య డెవలపర్స్ మేనేజింగ్ పార్టనర్ రూ.2 లక్షలు, వాగ్దేవి విద్యాసంస్థల డైరెక్టర్లు రూ.లక్ష, కృష్ణవేణి విద్యాసంస్థలు, ఎంఏఎం విద్యాసంస్థలు సంయుక్తంగా రూ.4 లక్షలు, వ్యవసాయ శాఖ విశ్రాంత ఉద్యోగి కొల్లి సాంబిరెడ్డి రూ.లక్ష , కాలిఫోర్నియాలో ఉంటున్న ఆయన కుమారుడు మధుబాబు రూ.లక్ష , వ్యవసాయ శాఖ మాజీ ఉద్యోగి అవుతు ప్రకాష్రెడ్డి రూ.40 వేలు, బాపట్ల కు చెందిన వ్యాపారి ప్రవీణ్కుమార్ రూ.లక్ష , వరుణ్ హేచరీస్ రూ.లక్ష, ఆక్వా కల్చర్ రూ.లక్ష , సీబీజెడ్ చర్చి రూ.లక్ష. ► మొవ్వ వ్యవసాయ కమిటీ పూర్వపు చైర్మన్ చీకటిమర్ల శివరామప్రసాద్ రూ.లక్ష ► విజయవాడ వాకర్స్ అసోసియేషన్ రూ.లక్ష ► హైకోర్టులో ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న స్టాండింగ్ కౌన్సిళ్లు రూ.7.80 లక్షలు, హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులందరూ రూ.5.80 లక్షలు. -
సీఎం సహాయ నిధికి విరాళాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఆదివారం పలువురు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. పోకర్న గ్రూప్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును గ్రూప్ చైర్మన్ గౌతమ్ జైన్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. అలాగే నాష్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.కోటి విరాళాన్ని అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ బీఎస్ఎన్ రెడ్డి, డైరెక్టర్ వీవీఎస్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్కు మమత వైద్య విద్యా సంస్థ రూ.25 లక్షల విరాళం
ఖమ్మం మయూరి సెంటర్: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మమత వైద్య విద్యా సంస్థ చైర్మన్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సీఎంఆర్ఎఫ్కు రూ.25 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు ఆదివారం ప్రకటించారు. అలాగే మంత్రి పువ్వాడ పిలుపు మేరకు గత ఐదు రోజులుగా ఖమ్మంలోని పలువురు ప్రముఖులు, వ్యాపారులు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యులు, కాంట్రాక్టర్లు ఇప్పటివరకు రూ.1.75 కోట్ల వరకు విరాళాలు అందజేశారు. వీటితోపాటు తాను ప్రకటించిన రూ.25 లక్షల విరాళంతో కలిపి మొత్తం రూ.2 కోట్లను సీఎం కేసీఆర్కు మంత్రి అజయ్కుమార్ అందజేయనున్నారు. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
► కరోనా నివారణలో భాగంగా సీఎం సహాయనిధికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు చెందిన ఆర్జే రత్నాకర్ రాజు రూ.5 కోట్లు, గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్ రూ.5 కోట్లు. ► పెన్నా సిమెంట్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ పెన్నా ప్రతాప్రెడ్డి రూ.2 కోట్లు. ► ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్లు తమ రెండు రోజుల వేతనమైన రూ.1.15 కోట్లు. ► ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బి.సాంబశివారెడ్డి, రాష్ట్ర మౌలిక, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డిలు ఏపీ మెడికల్ కౌన్సిల్ తరఫున రూ.కోటి. ► ఆంధ్రా ఆర్గానిక్స్ ఎండీ ఎం నారాయణరెడ్డి రూ. కోటి విరాళం. ► కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరులోని దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 లక్షలు. ► చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలు రూ.15 లక్షలు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీ.విజయానందరెడ్డి, ఎస్ఆర్పురం మండల నాయకుడు గురవారెడ్డిలు కలిసి రూ.15 లక్షలు, సత్యవేడు మండలంలోని సెవెన్హిల్స్ ఎంటర్ప్రైజస్ క్వారీ సిబ్బంది రూ.2 లక్షలు, లలిత్ రియల్టర్స్ సిబ్బంది రూ.లక్ష , వెంకట పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాల యాజమాన్యం రూ.1.2 లక్షలు, కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో) రూ.20 లక్షలు, శ్రీవాణి విద్యా సంస్థల నిర్వాహకులు, రాష్ట్ర జూనియర్ కళాశాలల సంఘం ఉపాధ్యక్షులు క్రిష్ణమూర్తి రెడ్డి రూ.లక్ష. ► ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు చెందిన గుంటూరు జిల్లా నరసరావుపేట వైద్యులు రూ.10.12 లక్షలు. ► గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థల తరపున రూ.8 లక్షలు ► మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి తనకు వచ్చే ఏడాది పెన్షన్ రూ.3.5 లక్షలను సీఎంఆర్ఎఫ్, ప్రధానమంత్రి సహాయనిధికి, సత్యాగ్రూపు విద్యాసంస్థల తరఫున సీఎంఆర్ఎఫ్కు రూ.లక్ష , ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.లక్ష , బొత్స గురునాయుడు స్మారక విద్యాసంస్థల తరఫున కలెక్టర్ సహాయ నిధికి రూ.లక్ష. ► కృష్ణా జిల్లా ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ సభ్యులు ఎస్.వీరభద్రరావు, బి.నారాయణరావులు రూ.3 లక్షలు. ► ఏపీ టెక్స్టైల్స్ ప్రెసిడెంట్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ఆయన సోదరుడు వెంకటరెడ్డి కలిసి రూ.2 లక్షలు. ► గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పాండురంగ మెడికల్ గ్రూప్ రూ.2 లక్షలు. ► ప్రకాశం జిల్లా వేముల గ్రామానికి చెందిన బైలడుగు కృష్ణ పీఎం సహాయ నిధికి రూ.2 లక్షలు, సీఎం సహాయ నిధికి రూ.లక్ష, పుల్లలచెరువు మండలం ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఎంపీడీవో శ్రీనివాసులు రూ.లక్ష, ఎరువుల వ్యాపారి గజ్వల్లి భాస్కర్రావు రూ.50 వేలు, మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామానికి చెందిన ఏర్వ శ్రీనివాసరెడ్డి రూ.50 వేలు. -
సీఎం సహాయ నిధికి గీతం రూ. 25 లక్షల విరాళం
పటాన్చెరు: కరోనా బాధితులకు చేయూతనిచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయనిధికి, గీతం యూనివర్సిటీ (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) రూ.25 లక్షల విరాళాన్ని ఇచ్చింది. గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ శనివారం ఈ చెక్కును మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్కు అందించారు. ఈ మేరకు రుద్రారంలోని హైదరాబాద్ గీతం యూనివర్సిటీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కేటీఆర్ను కలసిన వారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, గీతం హైదరాబాద్ అడిషనల్ వీసీ ప్రొ.ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఉన్నారు. గీతం విద్యాసంస్థల వితరణను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. -
రూ. 50 లక్షల విరాళమిచ్చిన ‘ఫ్రీడం’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్పై చేస్తున్న పోరుకు సహకారంగా ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ తయారీదారు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా సంస్థ ప్రధానమంత్రి సహా యనిధికి రూ. 50 లక్షల విరాళాన్ని అందజేసినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ ఉద్యోగులు 640మంది సైతం ముందుకు వచ్చి వారి ఒక రోజు వేతనం రూ. 9.25 లక్షలను పీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారని పేర్కొంది. -
సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధికి శుక్రవారం పలువురు విరాళాలు అందజేశారు. పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు విరాళాలకు సంబంధించిన చెక్కులను ప్రగతిభవన్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు అందజేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేసిన వారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పరిశ్రమల సమాఖ్య తరఫున అధ్యక్షుడు సుధీర్రెడ్డి రూ. 1.22 కోట్లు, సాయి లైఫ్ సైన్సెస్, హువావే ఇండియా లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్, జీఎస్జీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆవ్రా ల్యాబొరేటరీ కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేశారు. బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ తరఫున రూ. 50 లక్షల రూపాయల చెక్కును సినీనటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అందజేశారు. టీఎస్టీసీ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, వెన్సా ఫౌండేషన్, రవి ఫుడ్స్, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ రూ.25 లక్షల చొప్పున చెక్కులను విరాళంగా అందజేశారు. వేసెళ్ళ మీడోస్, సికింద్రాబాద్ క్లబ్ రూ.20 లక్షల చొప్పున, జలవిహార్ ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ రూ.15 లక్షల చొప్పున చెక్కులను కేటీఆర్కు అందించారు. సామ్రాట్ ఐరన్స్, పుష్పభూమి ఎస్టేట్ డెవలపర్స్, మహేశ్వరి భవన్ ట్రస్ట్, గ్రీన్రిచ్ ఎస్టేట్స్, ఫెయిర్ మౌంట్ బిల్డర్స్ 11 లక్షలు అందజేశాయి. అభిరుచి స్వగృహ ఫుడ్స్, వంశీరామ్ హోమ్స్, త్రివేణి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎన్.సాయిబాబా అండ్ కంపెనీ, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, జెమ్ అవెన్యూస్, పట్నం మహేందర్రెడ్డి హాస్పిటల్, టీఎస్ఐసీ ఎంప్లాయీస్, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.10 లక్షల చొప్పున విరాళాలకు సంబంధించిన చెక్కులను అందించాయి. -
కరోనా: గంగవరం పోర్టు యాజమాన్యం విరాళం
సాక్షి, అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గంగవరం పోర్టు తరపున రూ.3 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోర్టు చైర్మన్ డివిఎస్ రాజు, సీఈఓ,మాజీ డీజీపీ ఎన్ సాంబశివరావులు కలిసి అందజేశారు. దీంతోపాటు గంగవరం పోర్టులో షేర్ హోల్డర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.16.25 కోట్లు ఇంటర్మ్ డివిడెండ్ చెక్ను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. (చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ) కర్నూలు : ►ముఖ్యమంత్రి సహాయనిధి కింద రిటైర్డ్ డీఆర్వో సుబ్బారెడ్డి రూ. లక్ష చెక్కును నంద్యాల ఆర్డీవో రామకృష్ణరెడ్డికి అందజేశారు. ►ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. లక్షా యాబై వేల చెక్కును ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డికి నంద్యాల మెడిసేవ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి అందించారు. ►ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రజలకు కరుణ వ్యాధిపై నియంత్రణ చర్యలపై ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అవగాహన కలిగించారు. తర్వాత ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. గుంటూరు : ►వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ►ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో తెనాలిలోని తూర్పు కాల్వకట్టపై ఉన్న పేదలకు ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ►ఎమ్మెల్యే విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో 350 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. ►ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 2వేల మాస్కులు అందజేశారు. ప్రకాశం జిల్లా : ►ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ తన సొంత నిధులతో కనిగిరి కాశి రెడ్డి నగర్ ఎస్టీ కాలనీలో 1000 కుటుంబాలకు ఉచిత బియ్యం, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. ►కరోన వైరస్ నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో దర్శి ఆటోనగర్లో పేదలకు నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేశారు. హైదరాబాద్ : కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ విద్యా సంస్థల చైర్మన్ ఎమ్. భరత్ కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలని, ప్రజలు అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
సాక్షి, తాడేపల్లి : కరోనా నేపథ్యంలో సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి గ్రామ సచివాలయాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. గ్రామాల్లో పారిశుద్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఇక నుంచి కూడా సీఎం సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వాలని పెద్దిరెడ్డి కోరారు. సీఎం సహాయనిధికి అందిన విరాళాలు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల విరాళం : రూ. 200.11 కోట్లు ఏపీఎండీసీ విరాళం : రూ. 10.62 కోట్లు మైన్స్ అండ్ జియాలజీ శాఖ విరాళం : రూ. 56 లక్షలు ఉపాధి హామీ, వాటర్షెడ్ శాఖ విరాళం : రూ. 1.50 కోట్లు సెర్ఫ్ఉద్యోగుల విరాళం : రూ. 50 లక్షలు -
భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం
-
భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థలు ఏపీకి భారీ విరాళాలు ప్రకటించగా..తాజగా భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) తనవంతు సహాయాన్ని అందించింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే భారతి సిమెంట్స్ ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. వర్షిని చారిటబుల్ ట్రస్ట్ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది. కాగా, రాష్ట్రలో గురువారం ఉదయం 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132 కి చేరాయి. (చదవండి: సీఎంఆర్ఎఫ్కు విరాళాల వెల్లువ) -
ఏడాది జీతాన్ని విరాళంగా ప్రకటించిన సీఎం
సాక్షి, బెంగళూరు : కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. ఈ మహమ్మారి వల్ల దేశ దేశాలై స్తంభించిపోయాయి. భారత్లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనాపై యుద్ధం కోసం చాలామంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తున్నారు. సామాన్యులు, సెలబ్రీటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకు దోచిన సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తన ఏడాది జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బుధవారం ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు మనం చాలా కష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి కరోనా మహమ్మారితో పోరాడాలి. వ్యక్తిగతంగా, నేను నా ఏడాది జీతాన్ని ముఖ్యమంత్రి సహాయకనిధికి ఇస్తున్నాను. కరోనాపై పోరుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. మీకు తోచిన సహయం చేయమని అభ్యర్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. మరోవైపు కరోనా రక్కసి కన్నడనాట నిరంతరాయంగా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య వందకు దగ్గరగా చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఒక్క మంగళవారమే కొత్తగా 13 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మరణించగా, మరో ఆరుమంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. -
సీఎంఆర్ఎఫ్కు విరాళాల వెల్లువ
► కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రామోజీ ఫౌండేషన్ రూ.10 కోట్లు విరాళం ఇచ్చింది. ► ఏపీ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూ.7.87 కోట్లు, ట్రాన్స్కో, జెన్కో, తూర్పు, దక్షిణ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేశారు. ► దివీస్ ల్యాబ్ లిమిటెడ్ రూ.5 కోట్లు, ఎన్సీపీ లిమిటెడ్ రూ.కోటి అందజేశాయి. ► ఏపీలోని పౌల్ట్రీ అసోసియేషన్లు, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) సభ్యులు కలిపి రూ.60 లక్షలు, గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని రాజధాని గ్రామమైన పెనుమాక నివాసి, రైతు కళ్లం నరేంద్రరెడ్డి రూ.1,00,116 విరాళం. సీఎంఆర్ఎఫ్కుగానూ సీఎస్కు రూ.5 కోట్ల చెక్ను ఇస్తున్న దివీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ దివి, రూ.కోటి చెక్ను అందిస్తున్న ఎన్సీపీ లిమిటెడ్ సంస్థ సంచాలకులు ఎఆర్కే సూర్య ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రూ.44 లక్షల 52 వేలు. ► గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేసే ఎల్1, ఎల్2 కేటగిరి ఉద్యోగులతో పాటు మండల స్థాయి సమాఖ్యలో పనిచేసే సిబ్బంది మొత్తం తమ ఒక్క రోజు వేతనమైన రూ.33 లక్షలు విరాళమిచ్చారు. ► గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు రూ.25 లక్షలు. ► కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లోని కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు రూ.17 లక్షలు. ► పాపులర్ షూమార్ట్ మేనేజింగ్ పార్ట్నర్లు చుక్కపల్లి అరుణ్కుమార్, విజయ్కుమార్ రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తంలో సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు, ప్రధానమంత్రి నిధికి రూ.5 లక్షలు అందజేశారు. ► అనంతపురం జిల్లాలోని సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.5 లక్షలు. ► శ్రీకాకుళం జిల్లాకి చెందిన యడ్ల గోపాలరావు రూ.2 లక్షలు, బగ్గు సరోజినీదేవి ఆసుపత్రి అధినేత డా.బగ్గు శ్రీనివాసరావు రూ.లక్ష, రాజాంకు చెందిన కల్కి జ్యుయెలరీ షాపు యజమాని కె.మధుసూదనరావు రూ.లక్ష విరాళమిచ్చారు. -
సీఎంఆర్ఎఫ్కు విరాళాలు పంపాలనుకుంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మీ వంతు సహకారం అందించాలని అనుకుంటున్నారా? చిన్న మొత్తం పెద్ద మొత్తం అనే తేడా లేకుండా మీకు తోచినంతగా విరాళాలు అందించి అండగా నిలవాలని భావిస్తున్నారా? అయితే సులువుగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పంపవచ్చు. ఈ కింద పేర్కొన్న సీఎం సహాయ నిధి బ్యాంకు ఖాతా (కరెంట్ అకౌంట్)కు మీరు డిపాజిట్/ట్రాన్స్ఫర్/చెక్కుల ద్వారా డబ్బులు పంపవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. CM RELIEF FUND, TELANGANA STATE, Account No. 62354157651, IFSC code: SBIN0020077 Current Account, SBI, Secretariat Branch Hyderabad. లేకుంటే ఈ కింద పేర్కొన్న లింక్ ద్వారా మీ–సేవ వెబ్సైట్ను తెరిచి సీఎం రిలీఫ్ ఫండ్కు ఆన్లైన్లో విరాళాలు పంపించవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ ఏర్పాట్లు చేసింది. https:// ts. meeseva. telangana.gov. in/Covid/ CovidContribution.htm -
సీఎం సహాయనిధికి రూ.8.72 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి మంగళవారం రూ. 8.72 కోట్ల విరాళం అందింది. పలువురు దాతలు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిసి విరాళాల చెక్కులు అందజేశారు. సమాజం ఆపదలో ఉన్న సమయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వచ్చిన సంస్థలు, దాతలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దివీస్ లేబొరేటరీస్ రూ. 5 కోట్లు, గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విర్చో పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల చొప్పున విరాళం అందజేశాయి. ఐఆర్ఏ రియల్టీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, సుచిర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ 25 లక్షల చొప్పున విరాళం ఇచ్చాయి. ఎంజీబీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, మానవీయ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ. 20 లక్షలు చొప్పున అందజేశాయి. మాధవరం కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సింథోకెమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓషన్ స్పార్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, భూపతిరాజు హెల్పింగ్ హ్యాండ్స్, మిరియాల చిన్న రాఘవరావు రూ.10 లక్ష లు చొప్పున సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. వీరితోపాటు మహేశ్వరి మైనింగ్ అండ్ ఎనర్జీ రూ.5 లక్షలు, నిఖిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 2 లక్షల చెక్కులను మంత్రి కేటీఆర్కు అందజేశాయి. -
తెలుగు రాష్ట్రాలకు నాటా విరాళం
-
‘సీఎం రిలీఫ్ ఫండ్కు విరివిగా విరాళాలివ్వండి’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా మహమ్మారిని నిరోధించి బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె. జవహర్రెడ్డి కోరారు. విపత్కర పరిస్థితుల్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘CHIEF MINISTER RELIEF FUND, ANDHRA PRADESH’ పేరున చెక్కులివ్వాన్నారు. ఆన్లైన్ ద్వారా ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్కు విరాళాలు పంపవచ్చన్నారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా apcmrf.ap.gov.inకు పంపవచ్చునని సూచించారు. దాతలు తమ పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్, ఈమేయిల్ అడ్రస్, విరాళాల ఉద్దేశం, చెక్కులు లేదా ఆన్లైన్ చెల్లింపు వంటి వివరాలను Special Officer to Hon'ble Chief Minister, Ground Floor, 1st Block, A.P. Secretariat, Velagapudi (e-mail: splofficer-cm@ap.gov.in) కు అందజేయాలి. విరాళాలందజేసిన దాతలు సీఎం కార్యాలయం నుంచి లేఖ, రసీదు, వంద శాతం ఆదాయపు పన్ను మినహాయింపు, ధృవపత్రం మొదలైన వాటిని apcmrf.ap.ov.inవెబ్ సైట్ ద్వారా పొందవచ్చు. విరాళాలు పంపాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు: ఖాతాపేరు : సీఎంఆర్ఎఫ్ SBI Ac/No - 38588079208 Velagapudi Secretariat Branch IFSC Code: SBIN0018884 ఖాతాపేరు : సీఎంఆర్ఎఫ్ Andhra Bank Account No - 110310100029039.. Velagapudi Secretariat Branch, IFSC Code: ANDB0003079 -
కష్టకాలంలో పెద్ద మనసు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్కు అందించారు. ► హెటెరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం అందించింది. దీంతోపాటు రూ.5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, లోపినవిర్, ఒసెల్టమివిర్) కూడా ప్రభుత్వానికి అందించారు. చెక్కును ముఖ్యమంత్రికి, మందులను వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు హెటెరో చైర్మన్ పార్థసారథి రెడ్డి, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి అందించారు. ► తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ రూ.1.5 కోట్ల విరాళం అందిం చారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ అధ్య క్షుడు కె.పాపారావు తదితరులు సీఎం కేసీఆర్కు అందించారు. ► సువెన్ ఫార్మా రూ.కోటి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సువెన్ ఫార్మా చైర్మన్ వెంకట్ జాస్తి ముఖ్యమంత్రికి అందించారు. ► రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగులు ఒక రోజు వేతనం సుమారు రూ.12 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. ఉద్యోగుల తరఫున తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సోమవారం విద్యుత్ సౌధలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావును కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. ► ఎన్సీసీ లిమిటెడ్ రూ.కోటి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ ఎ.రంగరాజు ముఖ్యమంత్రికి అందించారు. ► శ్రీ చైతన్య విద్యాసంస్థలు రూ.కోటి విరాళం అందించాయి. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ డైరెక్టర్ వై.శ్రీధర్ ముఖ్యమంత్రికి అందించారు. ► తెలంగాణ రైస్ మిల్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ నాయకులు నాగేందర్, మోహన్ రెడ్డి తదితరులు సీఎంకు అందించారు. ► జేఎన్టీయూ బోధన, బోధనేతర, కాంట్రాక్టు సిబ్బంది, పెన్షనర్లు ఒకరోజు మూల వేతనం సుమారు రూ.12 లక్షలు సీఎంఆర్ఎఫ్కు విరాళంగా అందజేయనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. మంత్రి కేటీఆర్కు పలువురు అందజేసిన విరాళాల వివరాలివీ ► వాల్యూ ల్యాబ్స్ సంస్థ రూ.5.25 కోట్లు ► జీవీపీఆర్ ఇంజనీర్స్ సంస్థ రూ.కోటి ► అమర్రాజా బ్యాటరీస్ రూ.కోటి ► ఐసీఎఫ్ఏఐ సొసైటీ రూ.కోటి ► వంశీ రామ్ బిల్డర్స్ రూ.కోటి ► సిగ్నిటి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.50లక్షలు ► యునైటెడ్ స్టేట్స్ ఫార్మా కోపియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 లక్షలు ► భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 లక్షలు ► విమల ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు ► ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రూ.25 లక్షలు ► స్వస్తిక్ మిర్చ్ స్టోర్ రూ.21 లక్షలు ► గురునానక్ ఎడ్యుకేషన్ సొసైటీ రూ.11 లక్షలు ► బీహెచ్ఆర్ డెవలపర్స్ రూ.10 లక్షలు ► సీఎస్కే రియల్టర్స్ లిమిటెడ్ రూ.10 లక్షలు ► సాయిసూర్య డెవలపర్స్ రూ.10 లక్షలు ► నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) రూ.10 లక్షలు ► సీ5 ఇన్ఫ్రా లిమిటెడ్ రూ.10 లక్షలు ► జగత్ స్వల్ప రియల్టర్స్ రూ.10 లక్షలు ► శ్రీసాయి రూరల్ ఫ్లోర్ మిల్ రూ.10 లక్షలు ► చల్లా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.10 లక్షలు ► హైదరాబాద్ బోట్స్ క్లబ్ తరఫున రూ.10 లక్షలను సంస్థ అధ్యక్షుడు చెన్నాడి సుధాకర్ రావు అందించారు ► తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం రూ.10 లక్షలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రూ.10 లక్షలు ఇచ్చారు. ► సీఎస్కే రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్, జాన్సన్ గ్రామర్ స్కూల్ స్కూల్ చెరో రూ.5 లక్షలు ► జాన్సన్ గ్రామర్ స్కూల్(సీబీఎస్ఈ) చైర్మన్ సురేశ్ కుమార్ రూ.5 లక్షలు -
మ్యాన్కైండ్ ఫార్మా భారీ విరాళం
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ మహమ్మారిపై పోరాటానికి మ్యాన్కైండ్ పార్మా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 51 కోట్లు విరాళంగా ప్రకటించింది. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు మ్యాన్కైండ్ ఫార్మా వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మందులను విరాళంగా ఇవ్వనుంది. కరోనాపై పోరాటంలో తెలంగాణా, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, యూపీ, ఉత్తరాఖండ్, బిహార్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాలతో కలిసిపనిచేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ విపత్తు అత్యంత సవాల్తో కూడుకున్నదని, వైరస్ బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టడంతో పాటు ఆయా రాష్ట్రాలకు తమ వంతు సాయం అందచేస్తామని మ్యాన్కైండ్ ఫార్మా చైర్మన్ ఆర్సీ జునేజా పేర్కొన్నారు. వెంటిలేటర్ల సరఫరా, వైరస్తో పోరాడుతున్న వైద్య సిబ్బంది రక్షణకు అవసరమైన పరికరాల కోసం తాము ఈ నిధిని వెచ్చిస్తామని చెప్పారు. తమ ఆస్పత్రులను వైరస్ బాధితులకు చికిత్స అందించేలా దీటుగా మలుస్తామని పేర్కొన్నారు. చదవండి :కరోనా వార్డులో సేవలందిస్తోన్న నటి -
సీఎం సహాయ నిధికి పలువురి విరాళాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు, ఈ విపత్తు నుంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు వచ్చి ఏపీ ముఖ్య మంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్)కు విరాళాలు అందజేయవలసినదిగా ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్ త్రిపాఠి ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ విరాళాలు సమకూర్చు వారికి నూటికి నూరు శాతం ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. చెక్కు రూపంలో పంపదలచుకున్న దాతలు ‘చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్’ పేరున పంపాలని కోరారు. ఆన్లైన్లో పంపదలచిన వారు: ► ఎస్బీఐ ఖాతా నెంబరు 38588079208, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచి, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0018884 ► ఆంధ్రాబ్యాంకు ఖాతా నెంబరు: 110310100029039, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచి, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏఎన్డీబీ0003079 ► ఏపీసీఎంఆర్ఎఫ్ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా పంపవచ్చు. చెక్కుల రూపంలో విరాళాలను అందచేయాలని అనుకున్న ఢిల్లీ –ఎన్సీఆర్ ప్రాంతాలలోని దాతలు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ రిసెప్షన్లో అంద జేయగలరని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి పలువురి విరాళాలు ► కరోనా వైరస్పై పోరాటానికిగాను భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షల విరాళమిచ్చారు. ► కరోనా వైరస్ నివారణ చర్యల కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.42 లక్షలు విరాళంగా అందజేశారు. ► ముఖ్యమంత్రి సహాయనిధికి చిత్తూరు జిల్లా చౌడేపల్లెకు చెందిన విజయవాణి ప్రింటర్స్, విద్యాసంస్థల అధినేత ఎన్.సుధాకరమూర్తి రూ.5 లక్షలు విరాళమిచ్చారు. ► ముఖ్యమంత్రి సహాయనిధికి చిలకలూరిపేట ఆర్యవైశ్య విద్యానిధి సంఘం రూ.25 వేలు విరాళమిచ్చింది. చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణుడు డాక్టర్ నల్లూరి కోటేశ్వర్, డాక్టర్ మైథిలీ రాణి దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేలు ఇచ్చారు. నరసరావుపేట వాసవీ షాపింగ్మాల్ ప్రతినిధులైన మండవ చంద్రశేఖర గుప్తా, డాక్యుమెంట్ రైటర్ పిల్లుట్ల రమణమూర్తి, న్యాయవాది కేసరి శ్రీనివాసరెడ్డిలు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 లక్ష విరాళమిచ్చారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఎండీ నారా భువనేశ్వరి రూ.30 లక్షల చొప్పున విరాళమిచ్చారు. అలాగే, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు సీఎంఆర్ఎఫ్లకు రూ.10 లక్షల చొప్పున విరాళమిచ్చారు. ► కరోనా నిర్మూలనా చర్యల్లో భాగంగా ప్రజారోగ్య కార్యక్రమాల నిర్వహణకు అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి తమ నిధుల నుంచి రూ.కోటి కేటాయించారు. ► కరోనా నివారణకు శ్రీచైతన్య విద్యాసంస్థల తరఫున రూ. 4 కోట్లు విరాళమిస్తున్నట్లు ఆ సంస్థల అధినేత డా. బీఎస్ రావు పేర్కొన్నారు. దీనిలో ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 1.5 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయనిధులకు చెరో కోటి రూపాయలు, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రుల సహా యనిధులకు చెరో రూ. 25 లక్షలను విరాళమిస్తునట్లు ఓ ప్రకటనలో బీఎస్ రావు తెలిపారు. -
కరోనాపై పోరుకు విరాళాల వెల్లువ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల కోసం పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను ప్రకటిస్తున్నాయి. ► రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో తమ ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఆదివారం డీజీపీ మహేందర్రెడ్డి సీఎం కేసీఆర్కు చెక్కును అందజేశారు. ► అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.3 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ► ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ రిటైర్డ్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ రూ. 1 కోటి విరాళం ప్రకటించింది. తమ పెన్షన్ల నుంచి ‘ఒకరోజు పెన్షన్’ను మినహాయించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్కు అసోసియేషన్ సభ్యులు సూచించారు. ► తెలంగాణ విద్యా వలంటీర్ల సంఘం.. రా ష్ట్ర వ్యాప్తంగా గల 15,681 మంది వలంటీర్ల ఒక రోజు వేతనం కింద రూ.62,72,400 సీ ఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు చెక్కును ఆర్థిక మంత్రి హరీశ్రావుకు అందచేశారు. ప్రధాని సహాయ నిధి పేరుతో నకిలీ ఖాతాలు సాక్షి,హైదరాబాద్: కరోనా ఒకపక్క వణికి స్తోంటే, మరోవైపు సైబర్ నేరగాళ్లు వినూత్న మోసాలకు దిగుతున్నారు. ప్రధానమంత్రి సహాయనిధికి పలువురు పౌరులు స్వచ్ఛం దంగా విరాళాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా పలువురు నకిలీ ఖాతాలు సృ ష్టించి, స్వాహా చేస్తున్నారని తెలంగాణ పోలీ సులు హెచ్చరిస్తున్నారు. పీఎం సహాయనిధి కి విరాళాలిచ్చేవారు అన్ని వివరాలు తనిఖీ చేసుకోవాలని సూచించారు. ‘పీఎం కేర్స్’ పే రిట ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఖా తాలో అక్షరాలను మార్చి, అమాయకులను ఏమారుస్తున్నారని పోలీసులు తెలిపారు.