cm relief fund
-
సీఎంకు చెక్కులు అందజేసిన మెగాస్టార్ చిరంజీవి
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద ధాటికి నష్టపోయిన బాధితులకు సినీతారలు అండగా నిలిచారు. తమవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చిరంజీవి రూ. 50 లక్షలు చెక్ అందించారు. అంతేకాకుండా తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు.కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
‘ఎంఈఐఎల్’ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్/ఖమ్మంవన్టౌన్: ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఈఐఎల్ సంస్థ రూ.5 కోట్ల విరాళంఅందజేసింది. సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి, సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్టీ రావు పాల్గొన్నారు. ఏపీకి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని అందించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రేస్ క్లబ్ తరఫున రూ.2 కోట్లు హైదరాబాద్లోని రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి.. మరో డైరెక్టర్ నరసింహరెడ్డితో కలిసి వరద బాధితుల సహాయార్థం రూ.2 కోట్ల చెక్కును మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. రూ.కోటి చొప్పున.. సీఎం సహాయ నిధికి సైయెంట్ కంపెనీ యాజమాన్యం రూ.కోటి విరాళాన్ని అందజేసింది. అలాగే లలితా జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ రూ.కోటి, మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్, రవికైలాస్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డిని సచివాలయంలో కలిసి చెక్కులను అందజేశారు. సినీ నిర్మాత దిల్ రాజు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు. -
తెలంగాణ సీఎం సహాయనిధికి క్రెడాయ్ భారీ విరాళం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య క్రెడాయ్ (కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) రూ.కోటి విరాళం అందించింది. క్రెడాయ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినింది. పలు జిల్లాలలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారీగా విరాళాలు అందిస్తున్నారు. -
Ravi Raheja: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ విరాళం
హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్ల భారీ విరాళం అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.ఎన్నడూ లేనంతగా ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా కె.రహేజా కార్పొరేషన్ గ్రూప్ అధినేత రవి రహేజా విరాళం అందించారు. ఈ సంస్థకు రియల్ ఎస్టేట్తో పాటు ఇతర విభాగాల్లోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. -
డ్వాక్రా మహిళలు డబ్బులు ఇవ్వాలి లేదంటే శిక్ష తప్పదు..
-
Tollywood: మేము సైతం
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించారు.‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు కలచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో ΄ాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూ΄ాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షలు చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు చిరంజీవి.→ ‘‘అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల రూ΄ాయల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి’’ అని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నాయి.→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు నటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఏపీ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడిన 400 పంచాయితీలకు రూ. 1 లక్ష చొప్పున రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఇలా మొత్తంగా రూ. ఆరు కోట్లను పవన్ కల్యాణ్ విరాళంగా అందించనున్నారు. → తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాన్ని అందజేయనున్నట్లుగా ఆయన సిబ్బంది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూ΄ా యల చొప్పున విరాళం అందించనున్నట్లుగా ప్రభాస్ టీమ్ పేర్కొంది.→ ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూ΄ాయలు విరాళంగా ప్రకటిస్తున్నా’’ అంటూ రామ్చరణ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.→ ‘‘తెలగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూ΄ాయల విరాళం అందిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు అల్లు అర్జున్.→ తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున 20 లక్షలు... అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ .5 లక్షలు.. ఇలా మొత్తంగా రూ. 25లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు సాయిదుర్గా తేజ్.→ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా ΄ాల్గొంటున్నారని సోనూసూద్ తెలి΄ారు. బుధవారం పైన పేర్కొన్న నటులు విరాళం ప్రకటించగా, అంతకుముందు విరాళం ప్రకటించినవారి వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ. 50 లక్షలు చొప్పున కోటి రూ΄ాయలు బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్– ఎస్. రాధాకృష్ణ–ఎస్. నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలి΄ారు. తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల రూ΄ాయల చొప్పున మొత్తంగా రూ. 30 లక్షలు విరాళంగా ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి మొత్తంగా పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు (ఏపీ 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు) విరాళం ప్రకటించారు. దర్శకుడు–నటుడు తల్లాడ సాయికృష్ణ రూ. లక్షా యాభై వేలుని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విరాళంగా ప్రకటించారు. -
ఉద్యోగుల తరఫున రూ.100 కోట్లు
మహబూబాబాద్/సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని, తమ వంతుగా సీఎం సహా య నిధికి ఒక రోజు మూల వేతనాన్ని ప్రకటించినట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మా రం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డిని కలెక్టరేట్లో ఉద్యోగుల జేఏసీ నాయకులు కలిసి ఒకరోజు మూల వేతన తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒక్కరోజు మూల వేతనం ప్రభుత్వ ఖజానాలో జమయ్యేలా చూడాలని సీఎంను కోరారు. సీఎస్కు సమ్మతి పత్రం అందజేత.. వరద బాధితుల సహాయార్థం రాష్ట్రంలోని ఉద్యోగులందరి తరఫున ఒక రోజు వేతనాన్ని ఇవ్వనున్నట్టు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు రూ.100 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి అందజేయాలని కోరుతూ మంగళవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి సమ్మతి పత్రాన్ని అందజేశారు. సీఎస్ను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, నేతలు డాక్టర్ నిర్మల, కె.రాములు, శశిధర్రెడ్డి, దర్శన్గౌడ్, గోపాల్, అశ్వత్థామరెడ్డి, రమాదేవి, రాబర్ట్ బ్రూష్, మహిపాల్రెడ్డి, కె.రామకృష్ణ, ఎస్.రాములు, మహేశ్, తిరుపతి, సంపత్ తదితరులు ఉన్నారు. వరద బాధితులకు ఒక రోజు మూలవేతనం భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకునేందుకు ఒకరోజు మూలవేతనం ఇవ్వా లని నిర్ణయించినట్లు తెలంగాణ ఉద్యోగు ల సంఘం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంది. సమావేశంలో చైర్మన్ పద్మాచారి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మఠం రవీంద్రకుమార్, సీహెచ్ హరీశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.నర్సింగ్రావు, సంఘం నేతలు జాకబ్, కృష్ణారావు, కిశోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము సైతం అంటూ పెన్షనర్ల జేఏసీ... వరద బాధితుల సహయార్థం ఒక రోజు మూల వేతనాన్ని ఇస్తున్నట్లు పెన్షనర్ల జేఏసీ ప్రకటించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు విరాళం ఇచ్చేందుకు ఏకగ్రీవంగా నిర్ణయించామని, ఇది రూ.33 కోట్ల వరకు ఉంటుందని జేఏసీ చైర్మన్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి శుభాకర్రావు తెలిపారు. -
వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?
డార్లింగ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించాడు. రీసెంట్గా కేరళలోని వయనాడ్లో వరద బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే వీళ్లని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, చిరంజీవి-రామ్ చరణ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రభాస్ చేరారు.(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యువ హీరోని కొట్ట చంపారు)కేరళ వరద బాధితుల కోసం అల్లు అర్జున్ రూ.25 లక్షలు ఇవ్వగా.. చిరంజీవి-రామ్ చరణ్ కలిపి రూ.కోటి రూపాయలు అందించారు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా రూ.2 కోట్ల రూపాయల్ని కేరళ సీఎమ్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. దీంతో డార్లింగ్ హీరోని అందరూ మెచ్చుకుంటున్నారు.దక్షిణాది నుంచి సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాజిల్, రష్మిక, నయనతార తదితరులు లక్షల రూపాయలు విరాళాలుగా ప్రకటించారు. అయితే తెలుగు నుంచి ఇప్పటివరకు బన్నీ, చిరు-చరణ్, ప్రభాస్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన యాక్టర్స్ కూడా ఎంతో కొంత విరాళమిస్తే బాగుంటుందని నెటిజన్స్ అంటున్నారు.(ఇదీ చదవండి: నయనతార కాంట్రవర్సీ సినిమా.. ఇప్పుడు మళ్లీ ఓటీటీలోకి) -
వయనాడ్ ఘటన: గౌతమ్ అదానీ భారీ విరాళం
వయనాడ్లో కొండచరియలు విరిగిన ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు మించిన జనం నిరాశ్రయులయ్యారు. ఈ తరుణంలో వీరికి అండగా నిలబడటానికి ప్రముఖ వ్యాపార దిగ్గజం 'గౌతమ్ అదానీ' కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.వయనాడ్ బాధితుల సహాయార్థం గౌతమ్ అదానీ కేరళ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళంగా ప్రకటించారు. వయనాడ్లో జరిగిన ప్రాణనష్టం పట్ల అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు సంఘీభావంగా నిలుస్తోందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 200 కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా సుమారు ఏడువేలకంటే ఎక్కువమంది రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రమాదయినా గురైనవారికి ప్రభుత్వం సాయం కూడా ప్రకటించింది. ఈ సమయంలో పలువురు ప్రముఖులు కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు.Deeply saddened by the tragic loss of life in Wayanad. My heart goes out to the affected families. The Adani Group stands in solidarity with Kerala during this difficult time. We humbly extend our support with a contribution of Rs 5 Cr to the Kerala Chief Minister's Distress…— Gautam Adani (@gautam_adani) July 31, 2024 -
సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు ఇకపై ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో వ్యవహరించాలంటూ సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ను సీఎం రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖ జత చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధిత దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత ఆస్పత్రులకు ఆన్లైన్లోనే పంపించి నిర్ధారించుకున్న తర్వాత అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదించి చెక్ను సిద్ధం చేస్తారు. చెక్పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా నంబర్ ముద్రిస్తారు. (దీనివల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు) ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15వ తేదీ తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https//cmrf.telangana.gov.in/ సైట్లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. -
నిరుపేద కుటుంబంలో వెలుగులు
సాక్షి, అమరావతి: నిరుపేద కుటుంబాన్ని పెద్దకష్టం చుట్టుముట్టింది. ఊహించని ప్రమాదంలో తొమ్మిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడి నోట మాటలేక, శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాలుడి చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బును సమకూర్చలేని నిస్సహాయత వారిది. ఆపద సమయంలో సీఎం జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇవ్వడమే కాకుండా.. ఖరీదైన చికిత్సను చేయించింది. ఆ నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపింది. స్వరపేటిక, శ్వాసనాళం చితికిపోయి.. పల్నాడు జిల్లా నకరికల్లులోని పాతూరుకు చెందిన షేక్ బాజీ, ఖాజాబీ ఇటుక బట్టీల్లో కూలీ పనులు చేసుకుంటుంటారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తొమ్మిదేళ్ల అనాస్ మహమ్మద్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ కిందపడిపోయాడు. ప్రమాదంలో బాలుడి గొంతుకు ఇనుపరాడ్ బలంగా గుచ్చుకుపోయింది. స్వరపేటిక, శ్వాసనాళం పూర్తిగా చితికిపోయాయి. హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వా్రస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరమని నిర్ధారించిన వైద్యులు అంబులెన్స్లో వెంటిలేటర్పై హైదరాబాద్ తరలించారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 3,257 ప్రొసీజర్లతో లక్షలాది మంది బాధితులకు అండగా సీఎం జగన్ నిలిచారు. అక్కడితో ఆగకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని అరుదైన జబ్బుల బారినపడి రూ.లక్షలు, కోట్లలో వైద్యానికి ఖర్చయ్యే వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ విషయంలోనూ సీఎం జగన్ మానవతా ధృక్పథంతో స్పందించారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు హైదరాబాద్లోని ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్చేసి బాలుడి శస్త్ర చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వెంటనే శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. దీంతో వైద్యులు అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్ర చికిత్సను చేపట్టారు. చికిత్స అనంతరం వైద్యుల పరిశీలన ముగించుకుని ఈ నెల 14న బాలుడు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. మరో మూడు నెలల అనంతరం ఇంకొక సర్జరీ చేస్తే బాలుడు ముందులా మాట్లాడగలుగుతాడని వైద్యులు చెబుతున్నారు. ఆపద కాలంలో సీఎం జగన్ చేసిన మేలును ఎప్పటికీ మరువలేమని ఖాజాబీ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ బిడ్డ తమకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యామని భావోద్వేగానికి గురవుతున్నారు. ఒక్క ట్వీట్తో స్పందించిన ప్రభుత్వం దెబ్బతిన్న స్వరపేటిక, శ్వాసనాళానికి అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. ఆ చికిత్స నిర్వహణ, వైద్య పరీక్షలు, మందులకు రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కలు ముక్కలయ్యేలా కష్టం చేసే ఖాజాబీ దంపతులకు అంత పెద్దమొత్తంలో అప్పు పుట్టని పరిస్థితి. వారి నిస్సహాయ స్థితిని చూసిన గ్రామస్తులంతా తలా కొంత ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయినప్పటికీ.. చికిత్సకు సరిపోయేంత డబ్బు సమకూరకపోవడంతో మహమ్మద్ను ఆదుకోవాలంటూ ఓ డాక్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై ఏపీ సీఎంవో అధికారులు స్పందించారు. ఈ విషయాన్నివెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దేవుడిలా ఆదుకున్నారు రోజూ పనికెళ్లి కూలి డబ్బులతో జీవిస్తున్నాం. తెచ్చుకుంటే తినాలి.. లేదంటే పస్తులుండాలి. ఇది మా జీవితం. అలాంటి మాపై ఉపద్రవంలా పెద్ద కష్టం వచ్చిపడింది. వెంటిలేటర్పై బాబును చూసి మాకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యాను. ఆపరేషన్కు రూ.6 లక్షలు ఖర్చవుతుందనగానే నా నోట మాట లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో దేవుడిలా సీఎం జగన్ ఆదుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పారు. ఈ రోజు మా బాబు సీఎం జగన్ దయవల్లే దక్కాడు. – షేక్ ఖాజాబీ, బాలుడి తల్లి మా పిల్లల చదువులకు అండగా నిలిచారు ఆ దేవుడు మా బిడ్డకు జన్మ ఇస్తే. సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబంలో వెలుగులు నింపారు. ఏమిచ్చినా ఆయన రుణం మేం తీర్చుకోలేం. అమ్మ ఒడి రూపంలో మా బిడ్డల చదువులకు చేదోడుగా ప్రభుత్వం నిలిచింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం మాకు ఇంటిస్థలం కూడా మంజూరు చేసింది. – షేక్ బాజీ, బాలుడి తండ్రి -
మా మంచి సీఎం
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయడానికి గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలు కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. ఆపదలో ఉన్నామని.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన వెంటనే మానవతా దృక్పథంతో వారికి ఆర్థిక సాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులును సీఎం ఆదేశించారు. దీంతో వెంటనే కలెక్టర్ బాధితుల వివరాలు తెలుసుకుని 16 మందికి రూ.16.30 లక్షలను సీఎం రిలీఫ్ఫండ్ కింద ఆర్థిక సాయం అందజేశారు. – సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన వారి వివరాలు ► నంద్యాల పట్టణం గాంధీనగర్కు చెందిన లక్కా కేశవ పక్షవాతంతో బాధపడుతుండడంతో చికిత్స నిమి త్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష అందజేశారు. ► నంద్యాల పట్టణం గాంధీనగర్కు చెందిన కె.మార్తమ్మ మూర్ఛ వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అవుకు మండలం సంగపట్నానికి చెందిన షేక్ షరీఫ్ ఫిజియో థెరపీ చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. ► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన ఎస్.గణేష్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష అందజేశారు. ► అవుకు మండలం సింగనపల్లెకు చెందిన ఎ.తారకేశవ్ మాన సిక వికలత్వంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన కాటసాని గణేష్ బ్రెయిన్లో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. బాధితుని చికిత్స కోసం రూ. 50 వేల చెక్కును కలెక్టర్ అందజేశారు. ► బనగానపల్లె మండలం గుండ్ల సింగవరం గ్రామానికి చెందిన కంబగిరి స్వామి మెదడులో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. అతని చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఒద్దిరాళ్ల గ్రామానికి చెందిన సుబ్బరాయుడవ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అతనికి చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అనంతపురం పాతబస్తీకి చెందిన పి.ముష్కస్ బ్యాక్ బోన్ ఫ్యాక్చర్తో బాధపడుతోంది. ఆమెకు చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► రోడ్డు ప్రమాదంలో మోకాలు పోగొట్టుకున్న అనంతపురానికి చెందిన బాధితుడు ఎస్.ఖాజాకు రూ.50 వేల చెక్కును అందజేశారు. ► ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన సి.సోమశేఖర్ పేదరికం కారణంగా గృహ నిర్మా ణం నిమిత్తం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► ప్రకాశం జిల్లా ఓబులంపల్లికి చెందిన బాల గురువయ్య వైద్య ఖర్చుల కోసం అతని భార్యకు రూ.లక్ష చెక్ అందజేశారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. బీకాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా.. సీఎం వెంటనే స్పందించారు. పైచదువులకు 15,000 రూపాయలు, జీవనోపాధికి మరో 15,000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 వేల రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. హరిజన గోరంట్లకు అందజేశారు. బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని.. నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా.. వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ అబ్దుల్ వజీద్కు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. అలాగే అవుకు మండలం వేములపాడు గ్రామ నివాసితుడు బి.మనురాహుల్ తాను 6 సంవత్సరాల నుంచి వికలాంగత్వంతో బాధపడుతున్నానని వ్యాధి చికిత్సకు తగిన ఆర్థిక స్తోమత తమ వద్ద లేదని, సహాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. బనగానపల్లె పట్టణ వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్ తనకు 20 సంవత్సరాల వయసు ఉందని ఇంటర్ ఫెయిల్ అయ్యానని.. నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. డా.కె.శ్రీనివాసులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వ్యాపారం చేసుకునేందుకు 2 లక్షల రూపాయల చెక్కును అబ్దుల్ హజీమ్కు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటివరకు వారు సొంత నిధులతో ఖర్చుపెట్టిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సభా వేదిక, హెలిపాడు ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన 22 మంది అర్జీదారులకు ఆర్థిక సహాయం, పెన్షన్లతో పాటు వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు వారి సొంత నిధులతో వైద్యానికి ఖర్చు పెట్టుకున్న మొత్తానికి పూర్తిస్థాయి రీయింబర్స్మెంట్కు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్కు సంబంధిత అర్జీదారులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీ ఎంపీటీసీ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్
జరుగుమల్లి: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే క్రమంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరోమారు రుజువయింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ బత్తిన మోహనరావు (53) బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురై అనేక ఆస్పత్రులకు తిరిగి దాదాపు రూ. 30 లక్షల వరకు ఖర్చుచేశారు. అయినా ఫలితం లేక గతేడాది నవంబర్లో మరణించారు. ధుఃఖంలో ఉన్న మోహనరావు కుటుంబానికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పార్టీలకు అతీతంగా అండగా నిలిచారు. స్థానిక నాయకులు చుండి శ్రీనివాసరావు, చుండూరి సురేష్ ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 8 లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 19న మోహనరావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. మానవత్వంతో ఆదుకున్నారు మా పెదనాన్న గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనారోగ్యానికి గురవడంతో పలు ఆస్పత్రులకు తిప్పి మా శక్తికి మించి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాం. అయినా ఆయన మాకు దక్కలేదు. ఆ సమయంలో స్థానిక నాయకులు, మంత్రి సురేష్ పార్టీలు చూడకుండా మానవత్వంతో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.8 లక్షలు మంజూరు చేయించి ఇచ్చారు. – బత్తిన శరత్బాబు, మృతుని తమ్ముని కుమారుడు -
గంగపుత్రులపై పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, కాకినాడ: గంగపుత్రులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గత డిసెంబర్ 1న బైరవపాలెం వద్ద నడి సముద్రంలో బోటు దగ్ధమవ్వగా, బోటులో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ బృందం రక్షించింది. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం జగన్.. బోటు యజమాని కాటాడి రామకృష్ణ పరమహంసకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇదీ చదవండి: షర్మిలను నిలదీసిన సామాన్యుడు -
టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం
‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం చివరికి ఎవరికి ఓటు వేసారన్నది కూడా చూడకుండా మంచి చేస్తామని ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో.. ఆ చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను తూచా తప్పకుండా అందరికీ అందించాం. నా వాళ్లు, కాని వాళ్లు అని ప్రజలను విభజించే జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేసి, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ నా వాళ్లే అనే గొప్ప సందేశాన్ని ఈ నాలుగేళ్ల కాలంలో ఇవ్వగలిగాం’. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పారదర్శక పాలన గురించి ఇలా వివరించారు. సంక్షేమ పథకాలే కాదు పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని చెప్పేందుకు నంద్యాలకు చెందిన టీడీపీ కార్యకర్తనే నిదర్శనం. నంద్యాల(అర్బన్): ఆయనొక కరుడుగట్టిన టీడీపీ వీరాభిమాని. అంతటి అభిమానికి గుండె సంబంధిత వ్యాధి సోకింది. పార్టీ కోసం పాటు పడిన కార్యకర్త మృత్యువుతో పోరాడుతున్న విషయం పార్టీ ఇన్చార్జ్లకు తెలిసింది. అయినా సహాయం అందించక పోగా కనీసం పరామర్శకు కూడా రాలేదు. ఆ గుండెకు ఏమి కాకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక సహాయం చేసి ప్రాణాన్ని నిలిపారు. నంద్యాల మండలం అయ్యలూరు మెట్టకు చెందిన దాది నాగేశ్వరరావు కొద్ది నెలల క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ నంద్యాల, కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఈ వ్యాధి పరిధిలోకి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రిని కాపాడుకునేందుకు పార్టీలను పక్కనపెట్టిన కుమారులు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు బసవేశ్వరరెడ్డి, రవికుమార్ రెడ్డిల ద్వారా విషయాన్ని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలు ముఖ్యం కాదని, ఓ ప్రాణాన్ని కాపాడటానికి మానవతా దృక్పథంతో ఆపరేషన్కు అయ్యే ఖర్చు మంజూరయ్యేలా ఎమ్మెల్యే శిల్పా రవి సీఎంఆర్ఎఫ్కు సిఫారసు చేశారు. ఎమ్మెల్యే లెటర్ తీసుకున్న నాగేశ్వరరావు కుమారులు నాగరాజు, నాగార్జున అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే శిల్పారవితో ఫోన్ చేయించుకోవడంతో రూ.8.50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ త్వరితగతిన విడుదల అయ్యింది. సీఎం రిలీఫ్ ఫండ్తో నాగేశ్వరరావుకు ఆగస్టు నెలలో హైదరాబాద్ నిమ్స్లో ఆపరేషన్ చేయించారు. క్షేమంగా ఇంటికి చేరుకున్న ఇంటి పెద్దను చూసి కుటుంబీకులు సంతోషించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగేశ్వరరావు బతికేందుకు సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని అతని భార్య లక్ష్మీదేవి, కుమారులు నాగరాజు, నాగార్జున చెబుతున్నారు. నాగేశ్వరరావు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ పరామర్శించడానికి రాలేదన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వచ్చి భరోసా కల్పించారన్నారు. ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని చెప్పడంతో ఎంతో ధైర్యం వచ్చిందన్నారు. టీడీపీకి చెందిన ఫొటో లను కేసీ కాల్వలో పడేశామని, ప్రస్తుతం తమ కుటుంబానికి జగనన్నే దేవుడు అని చెబుతున్నారు. -
సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం
అమలాపురం రూరల్: బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఆమె వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. బ్రెయిన్ క్యాన్సర్గా వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో తండ్రి రాంబాబు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ దృష్టికి తన బిడ్డ సమస్యను రాంబాబు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా తీసుకువెళ్లారు. ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం ఆ కుటుంబానికి అందజేశారు. చదవండి: దమ్ము లేకనే.. దత్తపుత్రుడు -
టీడీపీ నేతకు లివర్ వ్యాధి.. సీఎం రిలీఫ్ ఫండ్ రూ.20 లక్షలు మంజూరు
తుని: కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ మాజీ సభ్యుడు కె.కృష్ణకు లివర్ వ్యాధి చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.20 లక్షలు మంజూరు అయింది. ఇందుకు సంబంధించిన ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణ భార్య లక్ష్మికి అందజేశారు. కొంతకాలంగా కృష్ణ లివర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఏఎంసీ మాజీ చైర్మన్ మురళి మంత్రి రాజా దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నం మణిపూర్ ఆస్పత్రిలో కృష్ణకు వైద్య సేవలు అందిస్తున్నారు. తమ ప్రభుత్వం పథకాలతో పాటు వైద్య సేవలను పార్టీలకు అతీతంగా అందిస్తున్నదని మంత్రి రాజా అన్నారు. చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం -
జబర్దస్త్ పంచ్ ప్రసాద్ వైద్యానికి సీఎం రిలీఫ్ నుంచి సహాయం
-
పేరుకే బిచ్చగాడు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళం
తిరువళ్లూరు: బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేల నగదును సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడో యచకుడు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్కుళం సమీపంలోని ఆళంగినర్ గ్రామానికి చెందిన యాచకుడు పూల్పాండి(75). భార్య మృతి చెందిన తరువాత తన పిల్లలు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదును విద్య, వైద్యం, ఆనాథ ఆశ్రమాలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదేళ్లలో పాండిచ్చేరితో పాటు చైన్నె, తూత్తుకుడి, కన్యాకుమారి, విల్లుపురం, వేలూరు, సేలం, నీలగిరి, కోయంబత్తూరు సహా వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్లను కలిసి ఇప్పటి వరకు యాచించిన రూ. 5.60 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. తాజాగా రెండు నెలల్లో బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేలను కల్తీసారా తాగి విల్లుపురం చెంగల్పట్టు జిల్లాలో మృతి చెందిన కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. మంగళవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీజాన్వర్గీష్ను కలిసి నగదు అందజేశారు. అనంతరం మీడియాతో పూల్పాండి మాట్లాడుతూ.. డబ్బులు ఉంటే మనఃశాంతి ఉండదని, మనస్సు ఉన్న వారి వద్ద డబ్బులు ఉండడం లేదని తెలిపారు. తాను బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదులో కొంత భాగాన్ని తిండి కోసం ఉపయోగిస్తున్నానని చెప్పారు. తనకు మూడుపూటల ఆహారం, కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే వృద్ధాశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నట్లు పాండి తెలిపారు. -
కరోనాతో పేరెంట్స్ మృతి.. పిల్లలకు 10లక్షలు అందజేత
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కొల్లు శ్రీవాసవి ప్రవళిక, కొల్లు ఉమాశంకర్ అక్కాతమ్ముళ్లకు సీఎం సహాయ నిధి నుండి రూ.10 లక్షల చెక్కులను హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అందజేశారు. కొవ్వూరులోని హోం మంత్రి కార్యాలయంలో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. కాగా.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని జండా పంజా రోడ్డులో నివాసం ఉంటున్న కొల్లు శ్రీ వాసవి ప్రవళిక, ఉమాశంకర్లు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. 2021లో కరోనాతో తండ్రి కొల్లు శ్రీనివాసరావు(47) జూన్ 5 న మరణించగా, తల్లి కొల్లు శ్యామల(41) జూన్ 9న మృతి చెందారు. ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న అక్క తమ్ముళ్లకు సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ ఒకేసారి కోల్పోయి తీవ్ర మనోవేదనలో ఉన్న తమకు ధైర్యాన్ని, భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోం మంత్రి తానేటి వనితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి సాయం అందించడానికి హోం మంత్రి చేసిన కృషి, చొరవ ఎప్పటికీ మరువలేనిదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసం, ఆపద కాలంలో వారికి అండగా ఉండడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందని తెలిపారు. -
భిక్షాటనతో వచ్చిన రూ.10 వేలు..
తమిళనాడు: ఓ వృద్ధుడు భిక్షాటన ద్వారా వచ్చిన రూ.10 వేలును మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చాడు. వివరాలు.. పెరంబలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మంగళవారం తూత్తుకుడి జిల్లా సాత్తాంగుళం తాలూకా అలంగినారు ప్రాంతానికి చెందిన భూల్ పాండియన్ (73) వచ్చాడు. తన భిక్షాటన ద్వారా తనకు వచ్చిన రూ.10 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని కలెక్టర్ కార్యాలయ అధికారుల వద్దకు వెళ్లాడు. తరువాత వాటిని బ్యాంకుల ద్వారా ప్రభుత్వ నిధుల్లోకి జమ చేయమని సూచించారు. దీంతో బ్యాంకుకు వెళ్లి తన పొదుపు సొమ్ము రూ.10 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. -
టీడీపీ నేత కుటుంబానికి రూ.5 లక్షల ప్రభుత్వ సాయం
శాంతిపురం: చిత్తూరు జిల్లా చెంగుబళ్ల పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు, గతంలో జన్మభూమి కమిటీ సభ్యుడిగా ఉన్న మునిసిబ్ గారి ప్రసాద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసింది. చెంగుబళ్ల పంచాయతీ పరిధిలోని సోగడబళ్లలో ఆదివారం ఎమ్మెల్సీ భరత్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ప్రసాద్ కుమారుడు మోహన్కు ఎమ్మెల్సీ భరత్ అందజేశారు. ప్రసాద్ భార్య రూప తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆమె వైద్యానికి అయిన ఖర్చులను ప్రభుత్వం మంజూరు చేసిందని భరత్ చెప్పారు. -
ఆ దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణప్రాయంగా వదిలేస్తా: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్కల్యాణ్లా ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు నేను చేయను అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు మంజూరైన పరిహారంలో రూ.2లక్షలు తీసుకునే దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణపాయంగా వదిలేస్తానని మంత్రి అంబటి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించాం. ఆగస్టు 20న మృతి చెందినవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా చంద్రబాబు జేబు పార్టీ నాపై ఆరోపణలు చేస్తే నేనెలా ఊరుకుంటా?. నాపై తప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. జనసేన అభిమాని చనిపోతే కనీసం పలకరించని కుసంస్కారం పవన్ది' అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చదవండి: (బాపట్ల జిల్లా యడ్లపల్లిలో పర్యటించనున్న సీఎం జగన్) -
కడపలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
-
ఆపద్బంధు.. సీఎం సహాయ నిధి
భీమవరం(ప్రకాశం చౌక్): పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నాడు–నేడులో భాగంగా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేస్తోంది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం వర్తించని కేసులకు సంబంధించి రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. వారి పాలిట ఆపన్నహస్తంలా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీలో వైద్యం లేని వ్యాధులకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందిన పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యానికి లక్షలు ఖర్చు చేసిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ఆర్థిక భరోసా అందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధుల చేతులమీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నారు. రూ.10 కోట్లకు పైగా.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన 2019 నుంచి ఇప్పటివరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో బాధితులకు సుమారు రూ.10 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందించారు. సుమారు 2 వేల మంది వరకు ఈ సాయం అందినట్టు అంచనా. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న రోగులకు ఆస్పత్రిలో అయిన ఖర్చును బట్టి రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు సాయం అందిస్తున్నారు. బాసటగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్న బాధితులకు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బాసటగా నిలుస్తున్నారు. నేరుగా వారి వద్దకు వచ్చినా లేదా గ్రామాల పర్యటన సందర్భంగా గుర్తించిన కేసులకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా కృషిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను వారి కార్యాలయాల నుంచి పంపించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. సర్వత్రా హర్షం సీఎం రిలీఫ్ ఫండ్ సాయంపై లబ్ధిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు సంబంధించి సాయం అందించడం అభినందనీయమని అంటున్నారు. రూ.10 లక్షలు ఇచ్చారు మా అబ్బాయికి కాలేయ సమస్య రావడంతో హైదరాబాద్లో వైద్యం చేయించాం. విషయాన్ని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.10 లక్షలు వచ్చేలా సాయపడ్డారు. నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా మా అబ్బాయికి పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంది. సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్కు కృతజ్ఞతలు. – పచ్చిపాల మూర్జా, గూట్లపాడు పేదలకు వరంలా.. మా మనవడు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రిలో సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించాం. తర్వాత శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా ఇటీవల రూ.5.20 లక్షల సాయం అందించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా మారింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – ఎం.రామకృష్ణ, విస్సాకోడేరు -
బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు
ఆత్మకూరు : నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అందజేశారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో శనివారం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి చేతుల మీదుగా 38 మంది బాధితులకు రూ.40.17 లక్షల చెక్కులను అందజేశారు. ఓ వైపు ఆరోగ్యశ్రీ పథకంతో ఎందరో పేదలు ఉచిత వైద్య సేవలు పొందుతుంటే, సీఎంఆర్ఎఫ్ కింద మరింత మందికి బాసటగా నిలవడం దేశంలో ఎక్కడా లేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. -
బాలిక లివర్ మార్పిడికి సీఎం సహాయ నిధి సాయం
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని డిప్యూటీ సీఎం అంజద్బాషా సోదరుడు, హరూన్ గ్రూప్ సంస్థల ఎండీ ఎస్బి అహ్మద్బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కడప నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక సయ్యద్ షబానా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సీఎం సహాయ ని«ధి నుంచి మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి అందజేశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న సయ్యద్ షబానా చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారని చెప్పారు. అంత ఖర్చు భరించలేని బాలిక కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం అంజద్బాషాను ఆశ్రయించడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడి సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స వ్యయం రూ.17.50 లక్షలు మంజూరు చేయించారన్నారు. డిప్యూటీ సీఎం అందుబాటులో లేనందున ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి తాను అందిస్తున్నట్లు వివరించారు. షబానా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తన లివర్ను దానం చేస్తున్న బాధితురాలి తల్లితోపాటు శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలియచేశారు. -
సీఎం జగన్ను కలిసిన జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) భారీ విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ.కోటి ఐదు లక్షల డీడీని అందించారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్ ఆర్.వీరమణి సీఎంకు వివరించారు. సీఎం జగన్ను కలిసిన వారిలో జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రెవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) రూ. 1,05,00,000 విరాళం. కోవిడ్ – 19 నివారణకు తీసుకున్న సమర్ధవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని సీఎంకి వివరించిన కంపెనీ చైర్మన్ ఆర్. వీరమణి. pic.twitter.com/V5kW0YADcc — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 16, 2022 చదవండి: (3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్) -
సీఎం సహాయనిధికి విరాళం అందించిన APDMC
-
వరద బాధితుల సహాయార్థం ఏపీఎండీసీ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం అందజేసింది. విరాళానికి సంబంధించిన చెక్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు. చదవండి: మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు -
బాలిక వైద్యానికి రూ.15 లక్షల సాయం.. సీఎం జగన్కు కృతజ్ఞతలు
దేవరపల్లి: కాలిన గాయాలతో విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక అన్వికను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన గొల్లపల్లి రాకేష్ నాలుగేళ్ల కుమార్తె ఇంటి వద్ద ఆటలాడుకుంటూ వేడి సాంబారు గిన్నెలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఎమ్మెల్యే తలారి వెంకట్రావును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే వెంకట్రావు కోరారు. ఈ మేరకు సీఎం సహాయనిధి నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంకు, ఎమ్మెల్యేకు బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవరపల్లి మండలం గొల్లగూడెం దివ్యాంగుల, వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షుడు కాగిత భాస్కరరావు బాలిక వైద్యఖర్చులకు రూ.5,116 సాయం అందజేశారు. చదవండి: (గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!) -
పసి ప్రాణానికి అండగా ‘సీఎం సహాయనిధి’.. రూ.10 లక్షలు మంజూరు
గన్నవరం రూరల్: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ అండగా నిలిచింది. గంటల వ్యవధిలోనే ఆపరేషన్కు అవసరమైన రూ.10 లక్షలు మంజూరు కావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడేనికి చెందిన మెట్లపల్లి రాఘవరావు వ్యవసాయ కూలీ. అతని భార్య నాగలక్ష్మి గృహిణి. వీరికి గతేడాది నవంబర్ 6న మగబిడ్డ జన్మించాడు. అయితే బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించి చివరికి హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, రూ.10 లక్షలకు పైగానే ఖర్చవుతుందని, వెంటనే చేయకపోతే ప్రమాదమని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం ఇక చేసేది లేక చంటి బిడ్డతో ఇంటికి తిరిగొచ్చేశారు. సోమవారం గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామ వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రూ.10 లక్షలు మంజూరు వైఎస్సార్సీపీ నేతలు బాలుడి విషయాన్ని ఫోన్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రెయిన్బో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి చిన్నారి చికిత్సకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి వివరాలు పంపి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. కేవలం గంటల వ్యవధిలో చిన్నారి చికిత్సకు రూ.10 లక్షలు మంజూరు కావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంజూరైన రూ.10 లక్షల చెక్కును బుధవారం వీరపనేనిగూడెం గ్రామ సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మేచినేని బాబు, పడమట సురేష్, కైలే శివకుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్రాణి, సర్పంచ్ జేజమ్మ, ఎంపీటీసీ పద్మావతి, ఉప సర్పంచ్ నాగసాంబిరెడ్డి, సహకార బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు బాధిత కుటుంబానికి అందించారు. -
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు.. అల్లు అర్జున్ రూ.25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో వరదల కారణంగా నష్టపోయినవారికి తన వంతు సాయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సాయంగా రూ.25 లక్షల విరాళం అందించారు. వరదల కారణంగా నష్టపోయిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. (చదవండి: AP Rain Alert: బలపడిన వాయుగుండం) -
ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్ల భారీ విరాళాలు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు వరదలకు గురైన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో చిక్కుకుని కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరూ ఆర్థికంగా నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పడు తక్షణ చర్యలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. 🙏@ysjagan @AndhraPradeshCM — Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2021 ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలకు భయంకరమైన విపత్తు వచ్చింది. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వారికి చేయూతగా ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతు సాయంగా రూ. 25 లక్షలు విరాళం అందిస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను’ అంటూ చేతులు జోడించిన ఏమోజీని జత చేశారు. Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ — Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021 అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ వరదల విపత్తు బాధిత కుటుంబాలకు నా వంతూ సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery. — Jr NTR (@tarak9999) December 1, 2021 -
సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నమూసిన సంగతి తెలిసిందే. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ.. నవంబర్ 24న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం సిరివెన్నెల మృతి చెందారు. ఈ క్రమంలో సిరివెన్నెల కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: సిరివెన్నెల గారు అలా నా జీవితాన్ని దిశా నిర్ధేశం చేశారు: రాజమౌళి) ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులు. ఆస్పత్రి ఖర్చుల భారం సిరివెన్నెల కుటుంబంపై పడకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలానే సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు) ఇటువంటి సమయంలో సీఎం జగన్ తమకు అండగా నిలిబడినందుకు గాను సిరివెన్నెల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం -
ఏపీ: అపోలో రూ.2 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయ నిధికి అపోలో హస్పిటల్స్ గ్రూపు కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రాకు మరో కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. మొత్తంగా రూ.2 కోట్ల విరాళాలకు సంబంధించిన చెక్కులను గురువారం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి, ప్రెసిడెంట్ (ప్రొక్యూర్మెంట్ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్) నరోత్తమ్ రెడ్డి, సీఈఓ (ఏహెచ్ఈఆర్ఎఫ్) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్ వెర్టికల్) శివరామకృష్ణన్లు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్కు అందజేశారు. ఇవీ చదవండి: పవర్ ‘ఫుల్ ఆదా’ ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -
చిన్నారి చికిత్సకు సీఎం రూ.17.5 లక్షల సాయం
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): బిడ్డకు పచ్చకామెర్లు.. ఒళ్లంతా దద్దుర్లు.. జన్యుపరమైన లివర్ సమస్య.. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి.. దీనికి తోడు భారీ ఖర్చు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి స్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని ఆదుకుని రూ.17.5 లక్షలు విడుదల చేయడంతో చిన్నారి ప్రాణాలు నిలిచాయి. దీంతో ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డితో కలిసి వారు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారానికి చెందిన జగదీష్, లక్ష్మి దంపతులకు మునీశ్వర్ (10 నెలలు) అనే బాబు ఉన్నాడు. చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డిని కలిసి సహాయం కోరారు. ఆయన వెంటనే స్పందించి వారిని చెన్నైలోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి పంపారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు జన్యుపరమైన లివర్ సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయాల్సి వస్తుందని, అందుకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఎమ్మెల్యే చొరవ, చిన్నారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.17.5 లక్షలకు ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బియ్యపు సీఎం జగన్మోహన్రెడ్డికి విన్నవించగా ఆయన వెంటనే రూ.17.5 లక్షలను ఆస్పత్రికి చెల్లించడానికి అధికారులకు అనుమతి ఇచ్చారు. వైద్యులు చిన్నారి తండ్రి నుంచి 20 శాతం లివర్ తీసుకుని.. చిన్నారికి లివర్ మార్పిడి చేశారు. 12 గంటలపాటు శ్రమించి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు సీఎం వైఎస్ జగన్కు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎంఆర్ఎఫ్కు సన్ నెట్వర్క్ రూ.3 కోట్లు విరాళం
సాక్షి, హైదరాబాద్: సీఎం సహాయ నిధికి సన్ నెట్వర్క్ రూ.3 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. మంత్రి కేటీఆర్ను జెమినీ టీవీ బాధ్యులు పి.కిరణ్ శుక్రవారం ప్రగతిభవన్లో కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కోవిడ్ సమ యంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ‘సన్’ ఉదారతను మంత్రి అభినందించారు. -
సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానంటోన్న ప్రముఖ కమెడియన్
ప్రముఖ హాస్యనటుడు వడివేలు సీఎం కరోనా నివారణ నిధికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి చెక్కు అందించారు. అనంతరం వడివేలు మీడియాతో మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రపంచాన్నే విస్మయ పరచారని పేర్కొన్నారు. పరిపాలనలో ఆయన తండ్రి పేరును నిలబెట్టుకున్నారని అన్నారు. కొంగునాడు విభజనపై జరుగుతున్న ప్రచారం గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. ఇప్పుడు కొంగునాడు అంటూ విభజననే ఊహించలేం అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేయరాదని వడివేలు అన్నారు. తాను మళ్లీ చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వడివేలు ఈ సందర్భంగా తెలిపారు. -
కత్తి మహేశ్ చికిత్సకు ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ చికిత్స కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నుంచి లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)నుంచి ఈ నగదు అందించారు. ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
కోవిడ్ నివారణకు విశాఖ పరిశ్రమల విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,05,50,000 చెక్ను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం రీజినల్ ఆఫీస్ పరిధిలోని పరిశ్రమలు అందజేశాయి. సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్ను కలిసి ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ విజయ్కుమార్, ఏపీపీసీబీ విశాఖపట్నం రీజినల్ ఆఫీసర్ ప్రమోద్కుమార్ రెడ్డి చెక్ను అందజేశారు. -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన సిక్మా ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) ప్రతినిధులు కలిశారు. కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల విలువైన 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ను కలిసి వివరాలు అందజేసిన వారిలో ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్, మార్కెటింగ్, భారతీ సిమెంట్స్), డాక్టర్ ఎస్.ఆనంద్ రెడ్డి (ఎండీ, సాగర్ సిమెంట్స్), ఇంజేటి గోపినాథ్ (సీఈవో, సిక్మా) ఉన్నారు. చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’ థర్డ్వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక -
కరోనా నివారణ నిధికి రూ.కోటి విరాళం
చెన్నై: కరోనా నివారణకు విరాళాలు ఇవ్వాలన్న సీఎం విజ్ఞప్తికి బాగా స్పందన వస్తోంది. ప్రముఖ సినీ నిర్మాత, శ్రీ గోకులం చిట్ఫండ్ అండ్ ఫైనాన్స్ అధినేత గోపాలన్ రూ.కోటి విరాళంగా అందించారు. ఆయన గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి చెక్కు అందజేశారు. ఆయన వెంట చిట్ఫండ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైజూ గోకుల్, డైరెక్టర్ ఆపరేషన్స్ ప్రవీణ్ ఉన్నారు. -
సీఎం సహాయనిధికి హాస్యనటుడు సూరి విరాళం
సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రముఖ హాస్యనటుడు సూరి సీఎం రిలీఫ్ ఫండ్ నిధికి తన వంతుగా రూ.10 లక్షలు, తన కొడుకు సర్వాన్, కూతురు వెన్నెల పేరుతో మరో రూ.25వేలను విరాళంగా అందించారు. ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ను కలిసిన సూరి రూ.10 లక్షలు చెక్కు రూపంలోనూ, రూ.25వేలు నగదును అందించారు. ప్రజలకు కోవిడ్ వైద్యం, ఆక్సిజన్, వ్యాక్సిన్ సదుపాయాలను సమకూర్చడానికి దాతలు సీఎం సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు తమ వంతు విరాళాలను అందించారు. -
విరాళాల వెల్లువ.. నిర్మాత ఐసరి గణేష్ కోటి విరాళం
చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు మేరకు పలువురు సినీ, రాజకీయ నాయకులు కరోనా నివారణ నిధికి విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. వేల్స్ విద్యాలయం కులపతి, సినీ నిర్మాత డాక్టర్ ఐసరి గణేష్ కరోనా నివారణ నిధికి రూ.కోటి ప్రకటించారు. ఆయన సతీమణి ఆర్తి గణేష్, కుమార్తె ప్రీతా గణేష్తో కలిసి మంగళవారం సాయంత్రం సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి స్టాలిన్కు చెక్కు అందజేశారు. -
సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్ –19 నివారణలో భాగంగా సీఎం సహాయనిధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ గోయెల్, వైస్ ప్రెసిడెంట్(కార్పొరేట్ రిలేషన్స్) కె.సత్యనారాయణ బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఉన్నారు. -
చిన్నతనం లో మానవత్వాన్నీ చాటుకుంటున్న అభిరామ్ రోషన్
-
సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షల విరాళం
హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): ముఖ్యమంత్రి సహాయనిధికి దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గుడివాడలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని కలసి రూ.50 లక్షల చెక్కును అందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సుబ్రహ్మణ్యం కోరారు. చదవండి: ఏపీ: జూన్ 22న వైఎస్సార్ చేయూత పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం -
కోవిడ్ బాధితుల కోసం సౌందర్య రజనీకాంత్ రూ. కోటి విరాళం
కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు కోలీవుడ్ నడుంబిగించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజరోజుకు లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో సమయానికి బాధితులకు వైద్య సదుపాయం, ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. ఇక బాధితులను రక్షించేందుకు ప్రభుత్వాలు, వైద్య సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి అండగా పలువురు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తమవంతు సాయంగా కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివ కుమార్లు కలిసి సీఎం స్టాలిన్కు కోటి రూపాయల చెక్ విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ సైతం విరాళం ఇచ్చింది. ఆమె భర్త విశాగన్ వనంగముడి, మామ ఎస్ఎస్ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు కోటి రూపాయల చెక్ను అందించింది. తమ ఫార్మా కంపెనీ అపెక్స్ లాబోరేటరీ నుంచి ఈ విరాళం అందించినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆమె భర్త విశాగన్ రాష్ట్రానికి కొత్త సీఎంగా ఎన్నికైన ఎంకే స్టాలిన్కు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక హీరో అజిత్ సైతం రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, హీరో ఉదయనిధి స్టాలిన్లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. -
సీఎం స్టాలిన్ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం
సాక్షి, చెన్నై: కరోనా నివారణ నిధికి సీనియర్ నటుడు శివకుమార్ కుటుంబం రూ.కోటి విరాళంగా అందించింది. రాష్ట్రంలోని ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ లేమి నెలకొన్న నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధిని సేకరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సేవా కార్యక్రమాలకు ముందుండే నటుడు శివ కుమార్ కుటుంబం సీఎం విజ్ఞప్తికి స్పందించి రూ. కోటి విలువైన చెక్కును సీఎం స్టాలిన్కు అందించారు. శివకుమార్ ఆయన కొడుకులైన నటులు సూర్య, కార్తీ హాజరై కరోనాపై పోరులో తమ మద్దతును ప్రభుత్వానికి తెలియజేశారు. #ActorSivakumar @Suriya_offl @Karthi_Offl handed over the Cheque for 1Cr to Hon’ble Chief Minister @mkstalin #TNCMReliefFund @rajsekarpandian pic.twitter.com/sKZ6U52LsJ — BARaju (@baraju_SuperHit) May 12, 2021 -
కరోనా కట్టడికి ఏపీఎండీసీ రూ.100 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) భారీ సాయం అందించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.100 కోట్లు విరాళం అందించింది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి రూ.90 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ.10 కోట్లు అందజేసింది. గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టీడీపీ నేతకు అండగా నిలిచిన సీఎం రిలీఫ్ ఫండ్
హిందూపురం: సంక్షేమ పథకాల అమలులో, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడమని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో కష్టాల్లో ఉన్న ఓ టీడీపీ నేతను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తిమ్మారెడ్డి కొంతకాలంగా పక్షవాతానికి గురై.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఇటీవల తిమ్మారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడే కొంత ఆర్థిక సాయం చేసిన ఇక్బాల్.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తిమ్మారెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం తిమ్మారెడ్డికి రూ.2.70 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును బుధవారం ఎమ్మెల్సీ కార్యాలయంలో తిమ్మారెడ్డి కుమారుడు వెంకటేష్, కుమార్తె తేజస్విని అందుకున్నారు. అలాగే నియోజకవర్గానికి చెందిన 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరవ్వగా.. వారందరికీ చెక్కులు పంపిణీ చేశారు. -
Kerala: బీడీ కార్మికుని ఉదారత.. సీఎం రిలీఫ్ ఫండ్కు..
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనా సునామీని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ దీని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ఉపాధిని సైతం కోల్పోయారు. మరికొందరు పొట్టకూటి కోసం చిన్నాచితకా పనులు చేస్తూ బతుకు బండిని లాగిస్తున్నారు. అయితే, ఇక్కడో వ్యక్తి.. తాను చేసేది చిన్న పనే అయినా.. సీఎం సహయ నిధికి పెద్ద మొత్తంలో విరాళం పంపి గొప్ప మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కన్నూర్కు చెందిన ఓ బీడీ కార్మికుడు కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 లక్షలు పంపించాడు. తన సొమ్మును వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించాలని కోరాడు. ఇలా డబ్బులు పంపిన తర్వాత అతని అకౌంట్లో కేవలం రూ.850 మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం. అయితే, బీడీకార్మికుడు బ్యాంక్ అధికారుల దగ్గరకు వెళ్లి తన అకౌంట్లోని రూ.2 లక్షలను సీఎం సహయ నిధికి బదిలీ చేయాలని కోరగానే బ్యాంకు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. నీ అకౌంట్లో తక్కువ మొత్తంలో డబ్బు ఉందని తెలిపారు. దాన్ని కూడా విరాళంగా ఇచ్చేస్తే ఎలా జీవనం సాగిస్తావని ప్రశ్నించారు. దీనికి అతను.. ఇక మీదటకూడా బీడీలు చుట్టి బతుకుతానని తెలిపాడు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ బీడీవర్కర్ ఉదార స్వభావాన్నిసోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడిది వైరల్గా మారింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ ట్విటర్ వేదికగా స్పందించారు. బీడి కార్మికుడి ఉదార స్వభావాన్ని మెచ్చకున్నారు. నెటిజన్లు సైతం ‘మీ మానవత్వానికి హ్యట్సాఫ్... మీరు చాలా మందికి ఆదర్శం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
Anupama Parameswaran: కేరళ సీఎం ఫండ్కు అనుపమ విరాళం
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. సామాన్య జనం నుంచి సినీ రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతోంది. రోజుకు వేలల్లో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంది. అక్కడ ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉండటంతో సామాన్య ప్రజలకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వానికి తోడుగా సినీ నటీనటులు, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందిస్తున్నారు. తాజా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ‘చీఫ్ మినిస్టర్స్ డిస్స్ట్రెస్ రీలీఫ్ ఫండ్ కేరళ’(సీఎండీఆర్ఎఫ్కే)కు తన వంతు సాయంగా విరాళం అందించారు. అనుపమ విరాళం ఇచ్చినట్లుగా సీఎండీఆర్ఎఫ్కే సర్టిఫికెట్ను జారీ చేసింది. ఆ సర్టిఫికెట్ ఫొటోను ట్విటర్లో అనుపమ షేర్ చేస్తూ అందరిని విరాళం ఇవ్వాల్సిందిగా పిలుపు నిచ్చారు. ‘నా వంతు విధిని నిర్వర్తించాను.. ప్లీజ్ మీరు కూడా కాస్తా సాయం చేయండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. Have done my part... pls contribute that little you can !!! https://t.co/aExMt4W5h4 pic.twitter.com/BzuM87TliO — Anupama Parameswaran (@anupamahere) April 25, 2021 -
సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నియంత్రణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళం వచ్చింది. ఈ విరాళం ఇచ్చిన వారిలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. విరాళాలు అందజేసిన సంస్థల్లో కొన్ని ► ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్, విజయవాడ రూ. 14,20,000 ► ఏపీ ఆయిల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పీవీఎస్ఎస్ మూర్తి రూ. 15,00,000 ► కాళేశ్వరీ రిఫైనరీ అండ్ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్ రూ. 25,00,000 ► కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ రూ. 1,00,000 ► భవాని కాస్టింగ్స్ ప్రై.లిమిటెడ్ రూ. 5,00,000 ► వేద సీడ్ సైన్స్ ప్రై.లిమిటెడ్ రూ. 10,00,000 వీటితో పాటు మరికొన్ని సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేసిన వాటిలో ఉన్నాయి. -
అవినీతి గని.. నాటి సీఎం రిలీఫ్ నిధి
రోగుల ప్రాణాలతో ఏవైనా ఆస్పత్రులు చెలగాటం ఆడుతుంటే శిక్షించాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహించింది.. పేద రోగుల ఆశలను కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, సీఎంఆర్ఎఫ్ సిబ్బంది కలిసి సొమ్ము చేసుకున్నారు.. వైద్యం చేయకుండానే కొన్ని ఆస్పత్రులు బిల్లులు పెట్టి డబ్బు దండుకున్నాయి.. ఒకరు దరఖాస్తు చేసుకుంటే, మరొకరికి వైద్యం అందించాయి మరికొన్ని ఆస్పత్రులు. అవినీతికి పాల్పడేందుకు ఉన్న అడ్డదారులన్నీ ఉపయోగించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కాస్త అసహాయ నిధిగా, అంతకు మించి అవినీతి నిధిగా మారిపోయింది. (గుండం రామచంద్రారెడ్డి, సాక్షి, అమరావతి): గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అవినీతి గనిగా మారింది. దోచుకున్న వారికి దోచుకున్నంత.. అన్న చందంగా ఇష్టారాజ్యంగా అక్రమార్కులకు నిలయమైంది. అసలైన బాధితులకు మొండి చేయి చూపుతూ.. అయిన వారికి అప్పనంగా కోట్లు కట్టబెట్టింది. పేదలకు జబ్బు చేసినప్పుడు వైద్యం చేయించుకోలేక, అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వైపు ఆశగా చూస్తారు. ఈ సొమ్ము వస్తే ప్రాణాలతో బయట పడతామని కొండంత ఆశతో దరఖాస్తు చేసుకుంటారు. స్వయానా ముఖ్యమంత్రి విచక్షణ మేరకు విడుదల చేసే ఈ నిధుల్లో కూడా కోట్లకు కోట్లు కొల్లగొట్టిన వైనం 2014–19 మధ్య కాలంలో తవ్వే కొద్దీ బయటపడుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులు, సీఎంఓ కార్యాలయం సిబ్బంది కుమ్మకైసీఎంఆర్ఎఫ్ నిధులు అందినకాడికి దోచుకున్నారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ సరిగా అమలు కానందున, కనీసం సీఎం అయినా కనికరించి ఆర్థిక సాయం చేస్తే వైద్యం చేయించుకుందామన్న రోగుల ఆశలను ఆస్పత్రులు, అప్పటి సీఎంఆర్ఎఫ్ సిబ్బంది కలిసి మొగ్గలోనే చిదిమేశారు. వేలాది కుటుంబాలకు నిరాశ మిగిల్చారు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక ఎల్ఓసీలా! సాధారణంగా పేషెంట్కు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు లేదా డిశ్చార్జికి ముందు ఎల్ఓసీకి దరఖాస్తు చేస్తారు. ఎల్ఓసీలో అనుమతుల మేరకు చికిత్స తర్వాత ఆ సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ డిశ్చార్జి తర్వాత అయితే రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని వేల కేసులకు సంబంధించి పేషెంట్ డిశ్చార్జి అయిన నెలకు ఎల్ఓసీల కోసం దరఖాస్తు చేసుకుని, క్లెయిమ్ చేసుకున్నారు. ఇందులో మరో కోణమేంటంటే ట్రీట్మెంట్ పూర్తయ్యాక బిల్లుకు రెండు రెట్లు ఎక్కువగా ఎల్ఓసీ తెచ్చుకుని నిధులు పొందారు. సెక్రటరీ సంతకాలు లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చూడటానికి ప్రత్యేక అధికారి ఉంటారు. ప్రతి ఫైలునూ క్షుణ్ణంగా పరిశీలించాకే ఆమోదిస్తారు. ఇతన్ని అసిస్టెంట్ సెక్రటరీ (ఏఎస్) టు సీఎం అంటారు. ఇతను సంతకం చేశాకే ఆ ఫైలు రెవెన్యూ శాఖకు వెళుతుంది. అక్కడ నుంచి చెక్కు ఆస్పత్రికి వెళుతుంది. కానీ ఇక్కడ ఏఎస్ టు సీఎం సంతకం లేకుండానే ఫైళ్లు రెవెన్యూ శాఖకు వెళ్లాయి. కనీసం డాక్టర్ పరిశీలన కూడా లేకుండా వెళ్లినట్టు వెల్లడైంది. ఆస్పత్రులు నేరుగా రెవెన్యూ శాఖ అధికారులతో కుమ్మక్కై పని చేయించుకున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఇలా వందలాది ఫైళ్లు సెక్రటరీ సంతకాలు లేకుండానే రెవెన్యూ శాఖ అనుమతికి వెళ్లినట్టు తేలింది. ఇలాంటి వాటిలో ఎక్కువగా విజయవాడ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం చెక్కులున్నట్టు స్పష్టమైంది. జబ్బు ఒకటి.. చికిత్స మరొకటి ఆస్పత్రి ఎస్టిమేషన్లో విధిగా జబ్బు, దాని చికిత్సకు అయ్యే ఖర్చు గురించి విపులంగా ఇస్తారు. కానీ కొన్ని వందల బిల్లుల్లో ఎల్ఓసీలో ఒక జబ్బు రాసి ఉంటే.. డిశ్చార్జి సమ్మరిలో మరో జబ్బును పేర్కొని లక్షలకు లక్షలు బిల్లు వేశారు. ‘సాక్షి’ పరిశీలనలోనూ ఇలాంటి నిజాలు వెల్లడయ్యాయి. ఇలా ఎల్ఓసీలో ఇచ్చిన జబ్బులు కాదని ఇతర జబ్బులున్నాయంటూ వైద్యం చేసి బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారు. ఆరా తీస్తుంటే పలు అంశాలు బయటికి వస్తున్నాయి. 9 వేల చెక్కులకు బ్యాంకులు హానర్ చెయ్యలేదు 2019 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీనికి కొద్దిరోజుల ముందు రమారమి 9 వేలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను విడుదల చేశారు. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్కటీ పాస్ కాలేదంటే అప్పటి సీఎంఆర్ఎఫ్ తీరు ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇష్టారాజ్యంగా చెక్కులు విడుదల చేయడం, అవి పాస్ కాకపోవడంతో బాధితులు అష్టకష్టాలు పడ్డారు. 2019లోనే 9 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఎన్నికల కోసమే చెక్కులు ఇచ్చి రోగులను మోసం చేశారు. 2019కి ముందు కూడా మరో 4 వేల చెక్కులు చెల్లలేదు. సీఎం సహాయ నిధి చెక్కులే పెండింగులో పడితే.. ఏ లెక్కన ఇష్టారాజ్యంగా చెక్కులిచ్చారో తెలుస్తోంది. సీఎంఓ కార్యాలయం కీలక పాత్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఒక అసిస్టెంట్ సెక్రటరీ, మరో డాక్టర్.. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులతో కుమ్మకై కోట్లకు కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. మెజారిటీ చెక్కులు ఏఎస్ సంతకం లేకుండా వెళ్లాయంటే రెవెన్యూ, సీఎంఓ, కార్పొరేట్ ఆస్పత్రులు.. ఈ ముగ్గురూ కుమ్మక్కయ్యారనేది స్పష్టమవుతోంది. రూ.1,300 కోట్లలో సగం పక్కదారి! 2014 జూలై నుంచి 2019 మార్చి వరకు గత ప్రభుత్వంలో రోగులకు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేశారు. నెలకు సగటున రూ.24 కోట్ల చొప్పున 57 నెలల్లో రూ.1368 కోట్లు మంజూరు చేశారు. ఆ ఐదేళ్లలో చోటుచేసుకున్న అవకతవకలు పరిశీలిస్తే ఇందులో సగానికి పైగా సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకటా.. రెండా.. ఎన్నెన్నో అక్రమాలు ♦రూప్సింగ్ అనే వ్యక్తి 2017లో వైద్యం కోసం ఎల్ఓసీకి దరఖాస్తు చేశారు. ఎల్ఓసీ నంబర్ 17047/సీఎంఓ/ఎల్/2017. ఈ దరఖాస్తుకు రూ.50 వేలు ఎల్ఓసీ మంజూరైంది. కానీ వైద్యం చేయించుకున్నది నాంచారయ్య అనే వ్యక్తి. ♦వట్టికొండ సూర్యవతి అనే మహిళ 2018లో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసింది. రూ.1,22,000 మంజూరు చేస్తూ ఎల్ఓసీ (108238/సీఎంఓ/ఎల్/2018) ఇచ్చారు. కానీ ఆస్పత్రి రికార్డులో వేరే పేరు చూపించారు. ♦2018లో గరిమెళ్ల వెంకట రమణమ్మ అనే మహిళ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా, రూ.1.08 లక్షలు మంజూరు చేస్తూ ఎల్ఓసీ (83122/సీఎంఓ/ఎల్/2018 ఇచ్చారు. ఈమెకు వైద్యం అందివ్వకుండానే ఎల్ఓసీ క్లెయిమ్ చేశారు. ♦వడ్లవల్లి ప్రసన్న అనే మహిళ..వైద్యానికి దరఖాస్తు చేసుకోగా ఎల్ఓసీ (149707/సీఎంఓ/ఎల్/2019) ఇస్తూ.. రూ.2.78 లక్షలు మంజూరు చేశారు. కానీ పేషెంట్తో సొమ్ము కట్టించుకుని, ఎల్ఓసీని సీఎంఓకు క్లెయిమ్ చేశారు. ♦తిమ్మారెడ్డి శివమ్మ అనే మహిళ హైదరాబాద్లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసింది. రూ.8 లక్షలకు ఎల్ఓసీ (127161/సీఎంఓ/ఎల్/2018) ఇచ్చారు. కానీ ఈ పేషెంట్ వద్ద నుంచి డబ్బు వసూలు చేశారు. ఎల్ఓసీ క్లెయిమ్కు పంపించగా, ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక దాన్ని పెండింగ్లో పెట్టింది. ♦వై.రాము అనే వ్యక్తి మంగళగిరిలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేశారు. రూ.4.50 లక్షలకు ఎల్ఓసీ (172231/సీఎంఓ/ఎల్/2019) ఇచ్చారు. విచిత్రమేమంటే ఇతనికి 2018 జూలైలో ట్రీట్మెంట్ జరిగ్గా... 2019 మార్చిలో ఎల్ఓసీకి దరఖాస్తు చేశారు. ప్రస్తుత సీఎంఓ అధికారులు బిల్లును పెండింగ్లో పెట్టారు. చదవండి: గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా.. రెచ్చిపోతున్న ఆన్లైన్ మోసగాళ్లు.. -
వలంటీర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, శ్రీకాకుళం: రెండు రోజుల క్రితం జిల్లాలోని పలాసలో కరోనా వ్యాక్సిన్ వికటించి వలంటీర్ పిల్లా లలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వలంటీర్ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. కానీ లాభం లేకపోయింది. అస్వస్థతకు గురైన లలిత ఫిబ్రవరి 8(సోమవారం) తెల్లవారుజామున మృతి చెందారు. -
‘కవితమ్మ.. మీ వల్లే మా కొడుకు బతికాడు’
రాయికల్ (జగిత్యాల): ‘మా కొడుకు ప్రాణాలు నిలిపిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..’అంటూ ఓ బాలుడి తల్లిదండ్రులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలసి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్కు చెందిన టేక్ సాగర్ (13) పుట్టినప్పటి నుంచే కాలేయ సమస్యతో బాధపడుతుండేవాడు. దీంతో 2017లో ఎంపీగా ఉన్న కవితను సాగర్ తల్లిదండ్రులు కలసి తమ కొడుకును కాపాడాలని వేడుకోగా.. సీఎం సహాయ నిధి నుంచి రూ.26 లక్షల ఎల్వోసీని ఆమె మంజూరు చేయించారు. అలాగే ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి బాలుడి చికిత్సపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ప్రస్తుతం ఆ బాలుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. గురువారం కవిత జగిత్యాల పర్యటనకు వచి్చన విషయాన్ని తెలుసుకున్న సాగర్ తల్లిదండ్రులు రాయికల్లో ఆమెను కలిశారు. తమ కొడుకుకు ప్రాణభిక్ష పెట్టింది మీరేనంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. -
సీఎం సహాయనిధికి రూ.51 లక్షల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను పలువురు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వ్యాపారవేత్తలు, సొసైటీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తరపున రూ.51 లక్షల 86 వేల రూపాయల విరాళాన్ని అందించారు. విరాళం చెక్కును సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అందజేశారు. (చదవండి: కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం) -
ఆన్లైన్ మోసగాడి అరెస్ట్
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): సీఎం సహాయనిధి నుంచి నగదు సాయం ఇప్పిస్తానంటూ ఆపదలో ఉన్న వారి నుంచి నగదు వసూలు చేస్తున్న ఆన్లైన్ మోసగాడిని సీఎంవో అధికారుల ఫిర్యాదుతో నెల్లూరు నవాబుపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నెల్లూరు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు. నెల్లూరులోని జాకీర్హుస్సేన్ నగర్కు చెందిన ఎస్కే సైలాఫ్ 17 ఏళ్ల కుమారుడు గౌస్ మొహిద్దీన్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం రూ.4 లక్షలు అప్పు చేశాడు. వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నట్టు సైలాఫ్ ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పెద్దసముద్రం మండలం దువ్వూరు నారాయణపల్లికి చెందిన సందీప్రెడ్డి ఫేస్బుక్లో పరిచయమై బాధితుడికి ఫోన్ చేశాడు. రూ.10 వేలు ఇస్తే సీఎం సహాయనిధి నుంచి రూ.1.50 లక్షలు ఇప్పిస్తానని నమ్మించడంతో సైలాఫ్ ఆన్లైన్ ద్వారా రూ.3,600, మరోసారి రూ.1,500 పంపించాడు. కాగా సీఎం కార్యాలయ అధికారులు సైలాఫ్కు ఫోన్ చేసి అతడి కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో తాను సందీప్రెడ్డికి నగదు ఇచ్చినట్లు చెప్పడంతో అధికారులు, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వేమారెడ్డి, ఎస్సైలు రమేష్బాబు, శివప్రకాష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సందీప్రెడ్డిని అరెస్ట్ చేశారు. -
తోడుగా ఉందాం
వర్ష బీభత్సం వల్ల హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటి ముంపుకి గురయ్యాయి. హైదరాబాద్ని మళ్లీ మామూలుగా మార్చేందుకు మనందరం సహాయంగా నిలబడదాం అని స్టార్స్ అనుకున్నారు. సీయం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం బాలకృష్ణ కోటిన్నర, చిరంజీవి కోటి, మహేశ్ బాబు కోటి, నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్ 50 లక్షలు, రామ్ 25 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు, హరీష్ శంకర్ 5 లక్షలు, అనిల్ రావిపూడి 5 లక్షలు, నిర్మాత యస్. రాధాకృష్ణ 10 లక్షలు ప్రకటించారు. బుధవారం పవన్ కల్యాణ్ 1 కోటి, దర్శకులు ఎన్. శంకర్ 10 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50 వేలు ప్రకటించారు. -
ఔదార్యం చాటుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు
సాక్షి, సిద్ధిపేట : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబు 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేశాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు సంబంధిత చెక్కును అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు ఎంతో నష్టపోయారని వారికి తన వంతు సహాయం అందించానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సంపూర్ణేష్ బాబును అభినందించారు.సిద్దిపేట బిడ్డగా, సినీ ఆర్టిస్టుగా మానవత్వం చాటుకున్నారని ప్రశంసించారు. (హైదరాబాద్ వరదలు : ప్రభాస్ భారీ విరాళం ) గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నేలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రభాస్ సహా పలువురు ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్కి భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. (హైదరాబాద్ వరదలు: నాగార్జున విరాళం) -
విరాళాలు ప్రకటిస్తున్న ప్రముఖులు
-
వరదలు : ప్రభాస్ భారీ విరాళం
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలను అందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు చెరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. (చదవండి : భారీ వరదలు: టాలీవుడ్ స్టార్స్ విరాళాలు) వీరితో పాటు అక్కినేని నాగార్జున రూ.50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణలో వరద నష్టానికి సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్తో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్ర చేయనున్నాడు. [ చదవండి : అత్యవసరంగా డబ్బులు కావాలా? అయితే ఇలా చేయండి ] -
హైదరాబాద్ వరదలు; స్పందించిన నాగార్జున
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నేలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సినీ హీరో నాగార్జున అక్కినేని స్పందిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేగాక సీఎం సహాయ నిధికి తన వంతు సాయాన్ని ప్రకటిస్తూ మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: సిటీలో మళ్లీ వాన: ప్రజలకు హెచ్చరిక) Heavy rains and floods have devastated the life of people in Hyderabad. Appreciate the efforts of Telangana Govt in releasing 550 crores for immediate relief. Standing by the cause, will contribute 50 lakhs to Telangana CM relief fund.#TelanganaCMO 🙏 — Nagarjuna Akkineni (@iamnagarjuna) October 20, 2020 ‘ప్రస్తుతం హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలు వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు విడుదల చేయడాన్ని అభినందిస్తున్న. బాధితుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ధన్యవాదాలు. అదే విధంగా నావంతు సాయంగా సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షలు ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేగాక వరద బాధితులను ఆదుకునేందుకు పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ముందుకు వస్తున్నాయి. నిన్న(సోమవారం) తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు ప్రకటించగా.. ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సీఎం సహాయ నిధికి రూ. 15 కోట్లు ప్రకటించారు. (చదవండి: తెలంగాణకు రూ.15 కోట్ల సాయం ప్రకటించిన ఢిల్లీ సీఎం) -
CMRF నకిలీ చెక్కుల కేసు విచారణ ప్రారంభించిన ఏపీ సీఐడీ
-
నకిలీ చెక్కులపై సీఎం జగన్ సీరియస్
-
‘నకిలీ చెక్కుల’పై ఏసీబీ విచారణ
సాక్షి, అమరావతి/ తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాలనే పెద్ద కుట్రతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠాతోపాటు దాని వెనుక ఉన్న అదృశ్య శక్తుల నిగ్గుతేల్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ బాగోతాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ముఠా గుట్టురట్టు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించారు. ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠా పాత్రధారులతోపాటు దీని వెనుక సూత్రధారులను కూడా పట్టుకోవాలన్నారు. (బెడిసికొట్టిన బడా మోసం) దీంతో ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి దోషులను పట్టుకోవాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఆదివారం లేఖ రాశారు. మరోవైపు.. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)లోని సీఎంఆర్ఎఫ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం ఉన్నందున దీని నుంచి చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆమె బ్యాంకు మేనేజరుకు లేఖ రాశారు. అలాగే, బ్యాంకు అధికారుల అప్రమత్తతవల్ల నిధులు విడుదల కాలేదని.. కుట్ర చాలా పెద్దదైనందున విచారణ లోతుగా జరిపి దోషులను తేల్చాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు రాష్ట్రాలల్లో వేర్వేరు పేర్లతో.. ఏపీకి చెందిన సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టేందుకు ఒకేసారి న్యూఢిల్లీ, కోల్కత, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ చేయడం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా? లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్ఎఫ్ విభాగాల్లోని వారు ఎవరైనా సహకరించారా? అనేది కూడా తేల్చనున్నారు. అద్వైతా వీకే హాలో బ్లాక్స్ అండ్ ఇంటర్లాక్స్, మల్లాబ్పూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, శర్మ ఫోర్జింగ్ పేర్లతో ఈ నకిలీ చెక్కులు జారీ అయ్యాయి. పక్కా స్కెచ్తోనే.. సీఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేయాలనే భారీ కుట్రతో ఆ ముఠా పక్కా స్కెచ్తోనే యత్నించిందని ఉన్నతాధికారులు అంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు చెక్కులు ఇచ్చారంటే ఆ కంపెనీలు బోర్డుకే పరిమితమైనవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ బృందాలు మూడుచోట్లకు వెళ్లి విచారణ చేయనున్నాయి. తుళ్లూరులో కేసు నమోదు కాగా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పేరిట భారీగా నగదు విత్డ్రా చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సచివాలయం రెవెన్యూ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ పి.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తుళ్ళూరు–1 సీఐ ధర్మేంద్రబాబు కేసు నమోదు చేశారు. కాగా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ.16 వేలు, రూ.45 వేలు, రూ.45 వేలు చొప్పున ముగ్గురు వ్యక్తులకు జారీచేసిన చెక్కుల స్థానంలో రూ.117.15 కోట్లు విత్డ్రా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు సృష్టించి ఈ ఘరానా మోసానికి యత్నించారు. -
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్
-
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నకిలీ చెక్కుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టే కుట్ర వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కర్ణాటక, ఢిల్లీ, కోల్కతాలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధి నుంచి డబ్బులు కొట్టేసేందుకు కుట్రలు పన్నగా.. బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో విషయం వెలుగు చూసింది. కాగా, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఏసీబీ డైరెక్టర్కు లేఖ రాశారు. మరోవైపు ఫాబ్రికేటెడ్ చెక్కులపై తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది. రెవిన్యూ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడ్బద్రి శాఖకు రూ.52.65 కోట్ల చెక్కు, ఢిల్లీలోని సీసీపీసీఐకి రూ.39,85,95,540 చెక్కు, కోల్కతా సర్కిల్లోని మోగ్రాహత్ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఆయా బ్యాంకుల్లో సమర్పించారు. వాటిపై సీఎంఆర్ఎఫ్, రెవెన్యూశాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్ స్టాంపులు కూడా ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా సర్కిళ్లకు చెందిన.. బ్యాంకు అధికారులు వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచికి ఫోన్ చేయడంతో కుంభకోణం బట్టబయలైంది. (చదవండి: బెడిసికొట్టిన బడా మోసం) -
బెడిసికొట్టిన బడా మోసం
-
బెడిసికొట్టిన బడా మోసం
సాక్షి, అమరావతి: నకిలీ బ్యాంకు చెక్కులతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మూడు బ్యాంకుల ద్వారా ఏకంగా రూ.117.15 కోట్లు కొల్లగొట్టాలన్న కొందరి ఘరానా మోసం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో ఆయా బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో భారీ మోసానికి అడ్డుకట్ట పడింది. ఒకేసారి మూడు రాష్ట్రాల నుంచి సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టడానికి పకడ్బందీ పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ముఠాతోపాటు కొందరు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అటు ఎస్బీఐ ఉన్నతాధికారులను ఇటు సీఎంఆర్ఎఫ్ అధికారులను విస్మయానికి గురిచేసిన ఈ పన్నాగం వివరాలిలా ఉన్నాయి.. మూడు చెక్లు.. రూ.117.15 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచిలో బ్యాంకు ఖాతా ఉంది. సీఎంఆర్ఎఫ్ విభాగం జారీచేసిన రూ.52,65,00,000 విలువైన ఎస్బీఐ చెక్ను కర్ణాటకలోని మంగుళూరు బ్రాంచిలో డ్రా చేసేందుకు శుక్రవారం ఓ వ్యక్తి సమర్పించాడు. అంత పెద్ద మొత్తం కావడంతో ఆ చెక్ను పాస్ చేస్తున్న మిగతా బ్యాంకు అధికారికి చివరి నిమిషంలో సందేహం వచ్చింది. దాంతో ఆయన వెంటనే వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచ్ అధికారులను.. వారు సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను వాకబు చేశారు. అంత మొత్తంతో తాము ఎవరికీ చెక్ ఇవ్వలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ చెక్ను పాస్ చేయొద్దని మంగుళూరులోని బ్రాంచి అధికారులను ఆదేశించారు. దాంతో ఎస్బీఐ అధికారులు తమ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రాంతీయ కార్యాలయాలనూ అప్రమత్తం చేశారు. ఇదే తరహాలో ఢిల్లీలోని ఎస్బీఐ సీసీపీసీ–1 బ్రాంచ్లో శనివారం రూ.39,85,95,540 విలువైన సీఎంఆర్ఎఫ్ ఖాతా నుంచి ఎస్బీఐ చెక్ను డ్రా చేసేందుకు సమర్పించారు. ఆ బ్యాంకు అధికారులు కూడా ఆ చెక్ను నిర్ధారించుకునేందుకు వెలగపూడి ఎస్బీఐ శాఖను వాకబు చేశారు. ఆ చెక్ కూడా తాము జారీచేయలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పారు. దాంతో ఆ చెక్ను కూడా పాస్ చేయకుండా బ్యాంకు అధికారులు నిలుపుదల చేశారు. ఇక కోల్కతలోని మోగ్రాహట్ ఎస్బీఐ బ్రాంచిలో కూడా రూ.24,65,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్ను డ్రా చేసేందుకు శనివారం సమర్పించారు. దానిపై ఆరా తీయగా అది కూడా నకిలీ చెక్ అనే నిర్ధారణ అయ్యింది. దాంతో మూడు వేర్వేరు చెక్ల ద్వారా రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు వేసిన పన్నాగాన్ని బ్యాంకు అధికారులు సమర్థంగా నిలువరించగలిగారు. ప్రొఫెషనల్ ముఠా పనే? కేవలం రెండ్రోజుల్లో మూడు వేర్వురు రాష్ట్రాల నుంచి మూడు నకిలీ చెక్లతో ఏకంగా రూ.117కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు యత్నించడం ఎస్బీఐ, సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను కలవరపరుస్తోంది. ఇంత పకడ్బందీగా పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ప్రొఫెషనల్ ముఠానే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆ చెక్లు వారికి ఎలా వచ్చాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా ఉద్యోగులు ఇందుకు సహకరించి ఉంటారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తే ఈ ఘరానా మోసం గుట్టు వీడుతుంది. అందుకే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. -
పవన్ అభిమానికి సీఎం జగన్ ఆర్థిక సాయం
-
పవన్ అభిమానికి సీఎం జగన్ ఆర్థిక సాయం
సాక్షి తాడేపల్లి: పవన్కల్యాణ్ అభిమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్ కల్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం జగన్ పవన్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు. (వర్షం కురుస్తున్నా టాప్ లేని వాహనంలోనే.. ) This case came to CM @ysjagan sir notice. On his instructions we immediately spoke to hospital authorities and they agreed to treat at 10Lakhs. CM sir immediately sanctioned 10L & Stem cell therapy treatment started already and he is responding well. We are also in constant touch https://t.co/UGhdvjCgMf pic.twitter.com/jIEnLsUsx2 — Dr Hari Krishna (@HariKrishnaCMO) August 15, 2020 -
ఏపీ సీఎం రిలీఫ్ ఫ్ండ్కు ఖజానా జూవెల్లర్స్ 4 కోట్ల విరాళం
-
నిర్వహణ లోపంతోనే అగ్ని ప్రమాదం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/విశాఖ సిటీ: నిర్వహణ లోపంతోనే విశాఖ జిల్లా పరవాడ మండలంలోని విశాఖ సాల్వెంట్స్ లిమిటెడ్లో అగ్ని ప్రమాదం సంభవించిందని నిపుణుల కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్లాంట్ రియాక్టర్లో ‘డై మిథైయిల్ సల్ఫాక్సైడ్’ డిస్టిలేషన్ ప్రక్రియ కొసాగుతుండగా ప్రమాదం సంభవించిందని తెలిపింది. ► ఈ దుర్ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందడంతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడిన ఈ ప్రమాదంపై విచారణకు విశాఖ జిల్లా కలెక్టర్ ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ► ఈ కమిటీ రియాక్టర్ను పరిశీలించి మంగళవారం కలెక్టర్కు నివేదిక సమర్పించింది. ► రియాక్టర్లో పరిమితికి మించి వాక్యూమ్ పెరగడం.. రసాయన మిశ్రమాల్లో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రమాదానికి దారితీసింది. మంటలు పూర్తిగా అదుపులోకి.. కాగా, సోమవారం రాత్రి ఉవ్వెత్తున లేచిన మంటలను మంగళవారం ఉ.6గంటలకల్లా పూర్తిస్థాయిలో అదుపుచేశారు. ► ప్రమాద సమయంలో రియాక్టరు వద్దనున్న కాండ్రేగుల శ్రీనివాస్ అనే కార్మికుడు అగ్నికి ఆహుతైనట్లు మంగళవారం గుర్తించారు. ► అతని కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.15 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.35 లక్షలు ఇచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం అంగీకరించింది. ► అలాగే, ప్రమాదంలో మల్లేశ్ అనే మరో కార్మికుడికి గాయాలయ్యాయి. అతనికి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. వైద్యానికయ్యే ఖర్చుతో పాటు రూ.20 లక్షల పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. ► ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి సుచరిత, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆరా తీశారు. ► విచారణ కమిటీ తుది నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినయ్చంద్ తెలిపారు. ► ప్రమాదంపై పరవాడ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. పేలుడు సంభవించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం గంటల వ్యవధిలో పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడంతో మంగళవారం ఫార్మాసిటీలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. -
సీఎం సహాయనిధికి సీసీఎల్ ప్రొడక్ట్స్ విరాళం
కోవిడ్ –19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ రూ.1,11,00,011 (కోటీ 11 లక్షల 11 రూపాయలు) విరాళం అందజేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సి.రాజేంద్రప్రసాద్ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. -
సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/ఆమదాలవలస: కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు స్పీకర్ తమ్మినేని సీతారాం, వాణీ సీతారాంలు కలిసి రూ.35లక్షలు విరాళం సీఎం జగన్మోహన్రెడ్డికి అందజేశారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ చెక్కును ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమదాలవలసలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస ప్రాజెక్ట్ నిర్మాణాలను గురించి ప్రస్తావించారు. సీఎంను కలిసిన మంతి కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలిశారు. జిల్లాలోని పరిస్థితులు, పలు అభివృద్ధి పనులను వివరించారు. ఈ నెల 8న చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేసిన స్థలాల వివరాలను తెలియజేశారు. తిలక్ రూ.50 లక్షల విరాళం టెక్కలి: టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజల తరఫున వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఆర్అండ్బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో సీఎం జగన్మోహన్రెడ్డికి క్యాంపు కార్యాలయంలో విరాళం అందజేశారు. టెక్కలిలో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంతబొమ్మాళి, కోటబొమ్మాళిలో మండలాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు, ఆఫ్షోర్ రిజర్వాయర్ సమస్య, రావివలస మెట్కోర్ పరిశ్రమ కార్మికుల సమస్య, నందిగాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులు, గెస్ట్ లెక్చరర్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ 1108 జీఓ రద్దు చేసి ఉద్యమంలో కేసుల బారిన పడిన వారిని విముక్తి చేయాలని కోరారు. -
తుపాకుల స్వాతికి కేటీఆర్ చేయూత
ఖమ్మం, నేలకొండపల్లి: ఓ ప్రమాదం కారణంగా మహిళకు రెండు చేతులు పని చేయడం లేదు. ఒక కాలు సగం వరకు తీసేశారు. వారి గోడును ఓ ట్రస్టు సభ్యుడు కేటీఆర్కు ట్విటర్లో వివరాలను తెలిపాడు. స్పందించిన మంత్రి కేటీఆర్ వైద్య ఖర్చుల కోసం రూ.లక్షను మంజూరు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన తుపాకుల స్వాతి 9 నెలల కిందట విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమెకు రెండు చేతులు చచ్చుబడ్డాయి. నిరుపేద కుటంబం కావడంతో కష్టాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి వెల్ఫేర్ డెవలప్మెంట్ ట్రస్టు సభ్యుడు శ్రావణ్ విషయాన్ని రెండు రోజుల కిందట మంత్రి కేటీఆర్కు ట్విటర్ ద్వారా తెలిపాడు. కేటీఆర్ స్పందించి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.లక్ష మంజూరు చేయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సదరు యువకుడికి శుక్రవారం ఫోన్ వచ్చింది. మహిళకు వైద్యం చేయించేందుకు రూ.లక్ష మంజూరు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో హైదరాబాద్లోని వి.కేర్ వైద్యశాలలో చేర్పించాలని సూచించారు. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన శ్రావణ్ను పలువురు అభినందించారు. స్వాతి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్కు చికిత్స కోసం వెళ్లేందుకు బాధిత మహిళకు ఆర్థిక సాయం చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం సభ్యుడు, స్థానిక ఎమ్మేల్యే కందాల ఉపేందర్రెడ్డిని కలిసి కోరారు. వెంటనే కొంత ఆర్థిక సాయం చేశారు. ఆమెకు పింఛన్ అందించాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పసుమర్తి శ్రీనివాస్, గండికోట వెంకటలక్ష్మి, వున్నం బ్రహ్మయ్య, కోటి సైదారెడ్డి ఉన్నారు.