సాక్షి,అమరావతి : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ మూడు కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం.గౌతమ్ రెడ్డి, ఆళ్ల శరణ్ సీఎం జగన్ను కలిసి చెక్కును అందజేశారు. దీంతో పాటు రెండు కోట్ల విలువైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా అందించనున్నట్టు ప్రకటించారు.