ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఐదో రోజుకు చేరింది.
అనంతపురం: ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జల్లాలో ఐదో రోజుకు చేరింది. ఆయన గురువారం ఉదయం పామిడి నుంచి రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన రైతులు, మహిళలు, వృద్ధులు వైఎస్ జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్యపడవద్దని, మీకు అండగా నేనున్నానని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి రైతు కుటుంబాల్లో ధైర్యం నింపారు.