
ఎన్ కౌంటర్ కేసు విచారణ ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్:శేషాచలం అడవుల్లో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. శేషాచలం ఎన్ కౌంటర్ లో మృతిచెందిన వారికి సంబంధించిన పోస్ట్ మార్టం వివరాలను ఈ రోజు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. అయితే ఎల్లుండి లోపు రీ పోస్ట్ మార్టం వివరాలను కూడా అందించాలని కోర్టు పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ నెల మొదటి వారంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.