హైదరాబాద్ : తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ కేసుపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు మృతులకు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు బుధవారం ఆ నివేదికను కోర్టుకు సమర్పించారు. అంతకుముందు నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో మృతదేహాలకు మరోసారి శవపరీక్ష నిర్వహించారు.
ఆ పోస్టుమార్టం నివేదికను తమకు మాత్రమే ఇవ్వాలన్న ఆదేశాల మేరకు సీల్డు కవర్లో నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళనాడుకు చెందిన కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.