గుంటూరు: సరస్వతి భూముల విషయంలో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. అందుకు నిరసనగా దాదాపు ఐదు వందల మంది రైతులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు గుంటూరు బయలుదేరారు. ఆ క్రమంలో పిడుగురాళ్ల సమీపంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతులు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల చర్యకు నిరసనగా రైతులు రహదారిపై బఠాయించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.