గూడ్స్ రైలులో మంటలు | Goods train fires | Sakshi
Sakshi News home page

గూడ్స్ రైలులో మంటలు

Published Tue, Jan 14 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

Goods train fires

  •     బొగ్గుతో వెళ్తుండగా ప్రమాదం
  •      యలమంచిలి స్టేషన్‌లో గుర్తించిన గార్డు
  •      మూడు గంటలు శ్రమించి అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  •  
    యలమంచిలి, న్యూస్‌లైన్: బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు రేగడంతో సిబ్బంది సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించారు. యలమంచిలి రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో గూడ్స్ రైలులో మొదటిబోగీ నుంచి మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుంచి కొండపల్లి బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు సిగ్నల్ లేకపోవడంతో యలమంచిలి రైల్వేస్టేషన్ లో  నిలిపారు.  
     
    ఆ సమయంలో బోగీనుంచి పొగలు వస్తున్నట్టు గార్డు ఏ.ఆడమ్ గుర్తించారు. వెంటనే స్టేషన్ సూపరింటెండెంట్‌కు తెలిపారు. ఆయన ద్వారా సమాచారం అందుకున్న యలమంచిలి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి రైలు బోగీలో మంటలను అదుపు చేశారు. సుమారు 3 గంటలపాటు మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది గునపాలతో బొగ్గును పైకి తీస్తూ పెద్దయెత్తున నీటిని వినియోగించారు. రైలు ప్రయాణంలో బొగ్గు రాపిడి వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని రైల్వేశాఖ సిబ్బంది తెలిపారు.  అయితే ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement