Coal
-
అక్కడ ఉత్పత్తి ఆపొద్దు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఏర్పడుతున్న విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (ఇంపోర్టెడ్ కోల్) మీద ఆధారపడి నడుస్తున్న థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆపొద్దని కేంద్రం స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా దిగుమతి చేసుకున్న బొగ్గు టన్ను ధర రూ.15,535 వరకు పలుకుతోంది. విదేశీ బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి యూనిట్కు దాదాపు రూ.10 ఖర్చు అవుతుంది. విద్యుత్ ఉత్పత్తిదారులు ఈ వ్యయాన్ని వినియోగదారుల నుంచి రాబట్టుకునేందుకు కూడా కేంద్రం అనుమతించింది. దేశంలో 17.. మన రాష్ట్రంలో ఒకటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) వివరాల ప్రకారం... దేశవ్యాప్తంగా సొంత బొగ్గు గనులున్న థర్మల్ కేంద్రాలు 18 మాత్రమే. దేశీయ బొగ్గుపై ఆధారపడి నడిచేవి 155 ఉన్నాయి. ఈ మొత్తం 173 ప్లాంట్లు ఉత్పత్తి సామర్థ్యం 2,03,347 మెగావాట్లు. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే ప్లాంట్లు 17 ఉండగా, వాటి పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 17,225 మెగావాట్లు. వీటిలో మన రాష్ట్రంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (ఎస్డీఎస్టీపీఎస్–కృష్ణపట్నం) ఒకటి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవిలో రోజుకు 270 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. మన రాష్టంలో 260 మిలియన్ యూనిట్లకు డిమాండ్ చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 237 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇందులో ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లు 110 మిలియన్ యూనిట్లు సమకూరుస్తున్నాయి. అందులో 40శాతం కృష్ణపట్నంలోని ఎస్డీఎస్టీపీఎస్లో ఉన్న 2,400 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్ల నుంచి వస్తోంది. మూడు రోజులకే బొగ్గు నిల్వలు ప్రస్తుతం కృష్ణపట్నం ఎస్డీఎస్టీపీఎస్లో 79,450 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ ఒక రోజు విద్యుత్ ఉత్పత్తికి 29 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుత నిల్వలు దాదాపు మూడు రోజులు మాత్రమే వస్తాయి. విద్యుత్ చట్టం సెక్షన్–11 ప్రకారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు (ఇంపోర్టెడ్ కోల్)తో నడిచే విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తిని కేంద్రం తప్పనిసరి చేసింది. నిబంధనల ప్రకారం ఒక ప్లాంటులో 24 రోజులకు సరిపడా బొగ్గు ఉండాలి. ఎస్డీఎస్టీపీఎస్లో మాత్రం మూడు రోజులకు మించి బొగ్గు నిల్వలు ఉండటం లేదు. -
అదానీ ఎంటర్ప్రైజెస్కు బొగ్గు సెగ
న్యూఢిల్లీ: బొగ్గు అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) నికర లాభం ఏకంగా 97 శాతం క్షీణించింది. రూ. 58 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ నికర లాభం రూ. 1,888 కోట్లుగా నమోదైంది. ప్రధాన వినియోగదారయిన విద్యుత్ రంగంలో పునరుత్పాదక వనరుల వాటా పెరిగి బొగ్గుకు డిమాండ్ తగ్గడంతో అమ్మకాల పరిమాణం ఏకంగా 42 శాతం మేర క్షీణించింది. ఇక ఆ్రస్టేలియా కార్యకలాపాలకు సంబంధించి విదేశీ మారకంపరంగా నష్టాలు నమోదు కావడం కూడా తాజా పనితీరుకు కారణమయ్యాయి. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 9 శాతం తగ్గి రూ. 22,848 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఆదాయం 6 శాతం పెరిగి రూ. 72,763 కోట్లకు చేరగా, నికర లాభం 17 శాతం వృద్ధి చెంది రూ. 3,254 కోట్లకు ఎగిసింది. గురువారం బీఎస్ఈలో ఏఈఎల్ షేరు సుమారు మూడు శాతం క్షీణించి రూ. 2,253 వద్ద క్లోజయ్యింది. -
కొత్తగా బొగ్గు గనుల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం మూడు కంపెనీలకు బొగ్గు గనులకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్జెడ్కోలకు గనులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల 40,560 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్కు ఒడిశాలోని ముచ్చకట, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్జెడ్కో కంపెనీలకు వరుగా ఒడిశాలోని అంగుల్ జిల్లా పరిధిలోని కుదనాలి లూబ్రి, సఖిగోపాల్-బి కకుర్హి బొగ్గు గనులను కేంద్రం కేటాయించింది. ఈ మూడు బొగ్గు గనుల సంచిత పీక్ రేటెడ్ కెపాసిటీ (పీఆర్సీ) 30 ఎంటీపీఏ(మిలియన్ టన్స్ పర్ యానమ్)గా నిర్ణయించారు. అయితే ఈ గనుల మొత్తం కెపాసిటీ 2,194.10 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. వీటి ద్వారా వార్షిక ఆదాయం రూ.2,991.20 కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కంపెనీలకు కేటాయించిన పీఆర్సీ ఆధారంగా రూ.4,500 కోట్ల పెట్టుబడి సమకూరే అవకాశం ఉంటుందని పేర్కొంది. అందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,560 మందికి ఉపాధి లభిస్తుందని వివరించింది.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..ఇటీవల జారీ అయిన బొగ్గు గనుల కేటాయింపు ఉత్తర్వులతో కలిపి మొత్తం 95 గనుల నుంచి బొగ్గు వెలికి తీస్తున్నారు. వాటి మొత్తం పీఆర్సీ సామర్థ్యం 202.50 ఎంటీపీఏగా ఉంది. దీనివల్ల రూ.29,516.84 కోట్ల వార్షిక ఆదాయం సమకూరుతుంది. ఈ గనుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,73,773 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. -
ఇనుప బట్టీలతో బయోచార్ : బెట్ట నుంచి రక్షణ, 15శాతం అదనపు పంట!
పంట కోతలు పూర్తయ్యాక పత్తి, కంది, సోయా తదితర పంటల కట్టెకు నిప్పుపెట్టి పర్యావరణానికి హాని చేసే కన్నా.. ఆ కట్టెతో కట్టె బొగ్గు (బయోచార్) తయారు చేసి, తిరిగి భూములను సారవంతం చేసుకోవచ్చు. ఎకరానికి టన్ను బయోచార్ కం΄ోస్టు వాడితే పంటలు బెట్టను తట్టుకుంటాయి. తద్వారా పంట దిగుబడులను 12–15% వరకు పెంచుకోవచ్చని మహారాష్ట్రలో ఓ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనుభవం చాటి చెబుతోంది..పంట వ్యర్థాలను తగులబెట్టటం పరిపాటి. ఇది పర్యావరణానికి హాని చేసే పని. పత్తి కట్టె, కంది కట్టె వంటి పంట వ్యర్థాలను కాలబెట్టటం వల్ల గాలి కలుషితమై కార్బన్డయాక్సయిడ్ శాతం పెరిగిపోతంది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. ఫలితంగా సాగుభూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. మట్టికి నీటిని పట్టి ఉంచే శక్తి లోపించటం, వాన నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం తగ్గి΄ోవటం, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయి. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో 4 లక్షల హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో కంది పంటలను రైతు సాగు చేస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత రైతులు పత్తి, కంది కట్టెను కాల్చివేస్తారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా భూమికి తిరిగి అందాల్సిన సేంద్రియ పదార్థం అందకుండా పోతోంది. బిఎఐఎఫ్ (బైఫ్) డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పుణేకు చెందిన స్వచ్ఛంద సంస్థ యవత్మాల్ రైతులతో కలసి పనిచేసి ఈ పరిస్థితిలో విజయవంతంగా మార్పుతెచ్చింది. పత్తి, కంది కట్టెను వట్టిగా కాలబెట్టకుండా.. ఒక పద్ధతి ప్రకారం (దీన్నే పైరోలిసిస్ అంటారు) కాల్చితే బొగ్గుగా మారుతుంది. దీన్నే బయోచార్ అంటారు. దీన్ని సేంద్రియ ఎరువులతో కలిపి బయోచార్ కంపోస్టుగా మార్చి భూమిలో చల్లితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంతతి పెరిగి భూసారం మెరుగవుతుంది. బయోచార్ కంపోస్టు వాడకం వల్ల ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ నేలలకు బెట్టను తట్టుకునే శక్తిని పెంపొందిస్తాయి. బయోచార్ కంపోస్టు తయారు చేయాలంటే.. బయోచార్ను ఉత్పత్తి చేసే ఇనుప బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత చిన్న రైతులకు విడిగా ఉండదు. అందుకని బైఫ్ ఫౌండేషన్ రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్.పి.ఓ.ని) 2019లో రిజిస్టర్ చేయించింది. 220 మంది రైతులను కూడగట్టి ఒక్కొక్క రైతు నుంచి రూ. వెయ్యి షేర్ ధనంతో ఎఫ్.పి.ఓ.ను రిజిస్టర్ చేయించారు. పత్తి, కంది కట్టెను కాల్చవద్దని, దీనితో ఎఫ్పిఓ తరఫున బయోచార్ తయారు చేసుకొని పంటలకు వాడుకుంటే బెట్టను తట్టుకొని మంచి దిగుబడులు పొందవచ్చని బైఫ్ ఫౌండేషన్ సిబ్బంది రైతులకు ఆలోచన కలిగించారు. 2021 జనవరిలో ఎఫ్పిఓ పత్తి కట్టెను రైతుల నుంచి కిలో రూ. 2.5–3లు చెల్లించి కొనుగోలు చేసింది. రూ. 60 వేల ఖర్చుతో బ్యాచ్కు 200 కిలోల కట్టెను కాల్చే ఇనుప బట్టీని ఎఫ్పిఓ కొనుగోలు చేసింది. ఈ బట్టీ ద్వారా పైరోలిసిస్ పద్ధతిలో ఈ కట్టెను కాల్చి బొగ్గును తయారు చేసింది. బొగ్గును పొడిగా మార్చి గోనె సంచుల్లో నింపి ఎఫ్పిఓ తిరిగి రైతులకే అమ్మింది. మార్కెట్ ధర కన్నా కిలోకి రూ. 2, 3 తగ్గించి అమ్మింది. 2021–22లో ఎఫ్పిఓ విజయవంతంగా 100 టన్నుల పత్తి కట్టెతో 25 టన్నుల బయోచార్ను ఉత్పత్తి చేయగలిగింది. ఎఫ్పిఓ బయోచార్ ఉత్పత్తిని చేపట్టటం వల్ల చాలా మందికి పని దొరికింది. కాల్చేసే పత్తి కట్టెను రైతు అమ్ముకొని ఆదాయం పొందాడు. కట్టెను సేకరించటంలో కూలీలకు పని దొరికింది. వాహనదారులకు కట్టెను బట్టీ దగ్గరకు చేర్చే పని దొరికింది. చివరికి బయోచార్ను రైతులే తిరిగి తక్కువ ధరకు కొనుక్కోగలిగారు. అంతిమంగా కాలబెడితే ఆవిరైపోయే పత్తి కట్టె.. ఎఫ్పిఓ పుణ్యాన భూమిని సుదీర్ఘకాలం పాటు సారవంతం చేసే బయోచార్గా మారి తిరిగి ఆ పొలాలకే చేరటం విశేషం. హెక్టారుకు 2.5 టన్నుల బయోచార్ కంపోస్టును దుక్కిలో వేశారు. ఏటేటా పంట దిగుబడులు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2% మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23%ని, హెక్టారుకు సగటున 16% టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకుపోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కా΄ాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు.ఎకరానికి టన్ను బయోచార్ కంపోస్టుయవత్మాల్ జిల్లాలోని 0.5% కన్నా తక్కువగా ఉండే వర్షాధార పత్తి తదితర పంటలు పండించే నేలలను బయోచార్ కంపోస్టు పోషకవంతం చేయటమే కాకుండా నీటిని పట్టి ఉంచే సామర్ధ్యాన్ని, కరువును తట్టుకునే శక్తిని పెంపొదించింది. బయోచార్ను ఎంత మోతాదులో వేయాలనే దాన్ని ఇంకా ప్రామాణీకరించాల్సి ఉంది. హెక్టారుకు 1 నుంచి 10 టన్నుల వరకు సూచిస్తున్న సందర్భాలున్నాయి. రైతుకు మరీ భారం కాకుండా వుండేలా హెక్టారుకు 2.5 టన్నుల (ఎకరానికి టన్ను) చొప్పున బయోచార్ కంపోస్టును వేయించాం. బొగ్గు పొడితో వర్మీకంకంపోస్టు, అజొటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులను కలిపి బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని పంట పొలాల్లో వాడాం. ఆ సంవత్సరంలోనే పత్తి, సోయా వంటి పంటల దిగుబడి 12–15% పెరిగింది. పోషకాలను నిదానంగా దీర్ఘకాలం పాటు పంటలకు అందించేందుకు, బెట్టను తట్టుకునేందుకు బయోచార్ ఉపకరిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రైతులు పూర్తిగా గుర్తించేలా ప్రచారం చేయటానికి ప్రభుత్వ మద్దుతు అవసరం ఉంది. ఎఫ్పిఓలు తయారు చేసే బయోచార్ కంపోస్టుకు ప్రభుత్వం మార్కెటింగ్కు అవకాశాలు పెంపొందించాలి.– గణేశ్ (98601 31646), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణే -
సింగరేణి పూర్వ వైభవం కోసం కిషన్ రెడ్డి గారు కృషి చేయాలి
-
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్సీసీఎల్లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?
పూర్వం కాలం కట్టెల పొయ్యి, బొగ్గు మీద చేసిన వంటకాలు తినేవారు. ఎందుకంటే..? అప్పుడూ ఇలా ఎల్పీజీ గ్యాస్లు అందుబాటులో లేకపోవడంతో కట్టెలతో నానాపాట్లు పడేవారు. కట్టెలు కాల్చగానే వచ్చే పొగతో తెగ ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. నాటి పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోడం, ఆర్థిక పరిస్థితి తదితర కారణాల రీత్య వాటిపైనే ఆధారపడేవారు. అయితే ప్రస్తత కాలంలో వంటకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా జనాలు కట్టెలు, బొగ్గులు మీద చేసిన వంటకాలంటేనే తెగ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రిల్ చికెన్, పైనాపిల్ గ్రిల్, పన్నీర్ గ్రిల్ , రొయ్యలు గ్రిల్ వంటివి తెగ లొట్టలేసుకు తింటున్నారు. కానీ నిపుణుల మాత్రం రుచిగా ఉన్నా అలాంటివి అస్సలు దగ్గరకు రానియ్యొద్దని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. చాలా మంది కట్టెల పొయ్యి , బొగ్గుల మీద కాల్చిన వంటలు చాలా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే . కానీ కట్టెల పొయ్యి వంట వద్దు..బొగ్గుల మీద కాల్చినవి అస్సలు తినొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వేడివేడిగా మనముందే ఇచ్చే గ్రిల్ ఫుడ్ ఐటెమ్స్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత డబైనా ఖర్చు పెట్టి మరీ గ్రిల్ వంటకాలు లొంటలు వేసుకుని మరీ లాగించేస్తాం. వాటివల్ల క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకనే పూర్వమే బొగ్గుల పొయ్యి మీద వంటలు మానేశారని అన్నారు. అంతేగాదు కట్టెల పొయ్యి మీ వంటల చేసేటప్పుడు వచ్చే పొగకు శ్వాససంబంధిత వ్యాధులు వస్తున్నాయనే గ్యాస్పై వంటలు చేయడం మొదలయ్యింది. ఇటీవల కాలంలో భారత్ ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి వైపే అడుగులు వేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకు నిదర్ననం ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిన క్యాన్సర్ బాధితుల సంఖ్యే. మరోవైపు యువత ఇలాంటి డీప్ ఫ్రైలు, కాల్చిన ఫుడ్స్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల చిన్నారుల్లో దీర్ఘకాలిక కేన్సర్లు పుట్టుకొస్తాయి. దీంతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతారు యువత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందులో ఉపయోగించే టేస్టింగ్ సాల్ట్స్, షుగర్ లెవెల్స్ పెంచే ఫుడ్స్ ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తాయని చెప్పారు. ఎంతలా యువత వీటికి దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే మైక్రో ఓవెన్లో చేసిన వంటకాలకు కూడా దూరంగా ఉండమంటున్నారు. సాధ్యమైనంత మేర కూరగాయాలు 70 శాంత ఉడికించినవి, మాంసం పూర్తి స్థాయిలో ఉడికించి తినడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్గా స్టూడెంట్..ఆమె సంపద విలువ..!) -
బొగ్గు దిగుమతి ఆపొద్దు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్ భారీగా పెరగనున్నందున విదేశీ బొగ్గు దిగుమతులను ఆపొద్దని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ వరకూ విదేశీ బొగ్గు దిగుమతులను కొనసాగించాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వచ్చే మే నెలలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా రోజుకు 250 గిగావాట్లు ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. ఇంత భారీ డిమాండ్ను తట్టుకోవాలంటే విద్యుత్ ఉత్పత్తి కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. నిజానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను దశల వారీగా మూసేయాలని కేంద్రం కొంతకాలం క్రితం సూచించింది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత మంచి నిర్ణయం కాదని కేంద్రం భావిస్తోంది. థర్మల్ కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో నడపాలంటే బొగ్గు చాలా అవసరం. దీంతో అన్ని థర్మల్ కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలని గతేడాది అక్టోబర్లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది. దిగుమతి చేసుకున్న బొగ్గులో స్వదేశీ బొగ్గును కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. ఏపీకి ఇబ్బంది లేదు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడి అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం, ఇంధన శాఖ ముందస్తు వ్యూహాల కారణంగా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో వీటీపీఎస్కి రోజుకు 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,34,563 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. ఆర్టీపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా..90,003 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంట్కు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా..1,14,858 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో రోజుకు 19,200 మెట్రిక్ టన్నులు వాడుతుండగా, 1,17,375 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు రెండు రోజుల నుంచి ఆరు రోజులకు సరిపోతాయి. నిల్వలు తరిగిపోయి థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది తలెత్తకుండా సింగరేణి కాలరీస్, మహానది కోల్ఫీల్డ్స్ నుంచి బొగ్గు సరఫరా సకాలంలో జరిగేలా చర్యలు చేపట్టాయి. -
అసలే వేసవికాలం.. కరెంట్ సరఫరా ప్రశ్నార్థకం!
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఏసీ, కూలర్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాల వాడకం పెరుగుతోంది. రానున్న రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే వాటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పీక్ అవర్స్లో సరఫరా చేసేందుకు సరిపడా విద్యుత్ మాత్రం తయారుకావడం లేదని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు థర్మల్ విద్యుత్తయారీ కేంద్రాలకు బొగ్గుకొరత ఉందని కేంద్రం ఇటీవల సూచించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొంది. ఫలితంగా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కావడం లేదు. రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగాలంటే.. వాటిలో ఎప్పుడూ 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. కానీ, ఈ నెల 8 నాటికి అందులో 68 శాతమే అంటే 4.65 కోట్ల టన్నులే ఉన్నట్లు కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) తెలిపింది. ముందస్తు నిల్వల్లో తగ్గుదల తెలంగాణలోని థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ముందస్తు నిల్వల కోటా 16.34 లక్షల టన్నులు ఉండాల్సి ఉండగా.. 8.61 లక్షల టన్నులే (53 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. అన్ని చోట్ల కనీస ఉత్పత్తి జరిగేందుకు వీలుగా ప్రతి విద్యుత్కేంద్రంలో వినియోగించే బొగ్గులో 6 శాతం వచ్చే జూన్ వరకూ విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో సింగరేణి గనులుండటంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోబోమని రాష్ట్ర జెన్కో చెబుతోంది. ఇదీ చదవండి: ‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’ సింగరేణిలో అంతంతమాత్రంగానే.. సింగరేణి సంస్థ నుంచి తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు 2.40 లక్షల టన్నులు పంపాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది. అంతకన్నా పాతిక వేల టన్నుల దాకా ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆమేరకు సంస్థ సరఫరా చేయలేకపోతోంది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్కేంద్రానికి సంస్థ రోజుకు 21,900 టన్నుల బొగ్గు ఇవ్వాలి. ఈ కేంద్రంలో కనీసం 26 రోజులకు అవసరమైనంత ముందస్తు నిల్వ కోటా కింద 5,68,500 టన్నులు ఉండాలి. ప్రస్తుతం 2,24,800 టన్నులే ఉన్నాయి. -
మూసిన బొగ్గు గనుల్లో తరగని విద్యుత్..?
సంప్రదాయేతర విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశీయంగా విద్యుత్తులో అధికంగా థర్మల్ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల సౌర, పవన తదితర సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తిని పెంచుతూ, థర్మల్ కేంద్రాలను క్రమంగా తగ్గించాలని కేంద్రం ఆశిస్తోంది. ఇప్పటికే మూసివేసిన బొగ్గు గునులను రెన్యూవబుల్ ఎనర్జీ తయారీకి వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సోలార్ పార్క్లు, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. విజన్ 2047 లో భాగంగా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న ప్రభుత్వం ఇందుకోసం వివిధ చర్యలు తీసుకుంటోంది. సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పనులు నిర్వహించాలని చూస్తోంది. ఇందులో కోల్ ఇండియా రూ.24 వేల కోట్లు సమకూర్చనుందని కొందరు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.6 వేల కోట్ల కోసం ప్రైవేట్ సెక్టార్ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కోల్ గ్యాసిఫికేషన్ (కోల్ను ఫ్యూయల్ గ్యాస్గా మార్చడం) వంటి సస్టయినబుల్ విధానాలతో పర్యావరణానికి హాని కలిగించకుండా చూస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా సేకరించిన ఫ్యూయల్ గ్యాస్ను హైడ్రోజన్, మీథేన్, మిథనాల్, ఇథనాల్ వంటి ఇంధనాల తయారీ కోసం వాడుకోవచ్చని తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం రూ.6 వేల కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాన్ కింద 2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్ను గ్యాస్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. -
తాను నడుపుతున్న లారీ.. తనకే మృత్యు శకటమై..
కరీంనగర్: గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గోదావరిఖని–మంథని ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఎండీ మన్సూర్ ఆలం(48) దుర్మరణం చెందాడు. తాను నడుపుతున్న లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మన్సూర్ ఆలం భూపాలపల్లిలో నివాసం ఉంటున్నాడు. లారీ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఓసీపీ–3 సీహెచ్పీ వద్ద బొగ్గు డంప్చేసి గోదావరిఖని నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రామగిరి మండలం సుందిళ్ల గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీ బ్రేకులు ఆగిపోయాయి. దీన్ని గమనించని డ్రైవర్ మన్సూర్ ఆలం లారీ ఆపలేదు. దీంతో ముందు ఉన్న మరోలారీని ఢీకొట్టుకున్నాడు. ఈప్రమాదంలో మన్సూర్ ఆలం క్యాబిన్ నుంచి కిందపడ్డాడు. తాను నడుపుతున్న లారీ కిందనే పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇవి చదవండి: మాటామాట పెరిగి తలపై రాడ్తో దారుణంగా.. -
బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి?
చాలామంది కూలీలు ఉపాధి కోసం బొగ్గు గనుల్లో పనులు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను పక్కనపెట్టి ఈ పనుల్లో పాల్గొంటారు. గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం బొగ్గు గనుల మూసివేత కారణంగా 9,90,200 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రపంచంలోని పలు బొగ్గు గనులు 2035కు ముందుగానే మూసివేయనున్నారు. బొగ్గు గనుల మూసివేత ప్రభావం ముఖ్యంగా భారత్, చైనాలపై అధికంగా ఉండనుంది. దీని గరిష్ట ప్రభావం చైనాలోని షాంగ్సీలో కనిపించనుంది. 2050 నాటికి బొగ్గు తవ్వకాలకు సంబంధించి దాదాపు 2,41,900 ఉద్యోగాలు మాయం కానున్నాయి. మన దేశంలో మొత్తం 3,37,000 మంది కార్మికులు బొగ్గు తవ్వకాల పనుల్లో పాల్గొంటున్నారు. కార్మికుల తొలగింపుల విషయానికొస్తే కోల్ ఇండియా కంపెనీ పేరు ముందంజలో వస్తుంది. ఇది రాబోయే ఐదేళ్లలో 73,800 మంది కార్మికులను తొలగించనుందని సమాచారం. శిలాజ ఇంధనాల కాలుష్య స్థాయిలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను ఆపడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ముందడుగు వేస్తూ బొగ్గు వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని భారతదేశం గతంలో హామీ ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోల్ ఇండియా పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించే లక్ష్యంతో పని చేస్తోంది. ఇదిలావుండగా 2022 నాటికి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సుమారు 9.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలుస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇందులో కేవలం 4.66 లక్షల మంది జలవిద్యుత్లో ఉపాధి పొందుతుండగా, సోలార్ పివిలో 2.82 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బొగ్గు గనుల్లో పని చేసే కూలీలు ఉపాధి కోల్పోక ముందుగానే వారికి ఇతర ఉపాధి పనులను నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తద్వారా వారు జీవనోపాధి పొందగలుగుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పెన్షన్ సొమ్ము కోసం భర్తకు నిప్పు! -
కొత్త గనులు రాకపోతే కష్టమే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మనుగుడపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్త బొగ్గు గనుల ప్రస్తావన లేకపోవడంతో మరో ఇరవై ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటని సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. విలియమ్ కింగ్ అనే శాస్త్రవేత్త 1870 సంవత్సరంలో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. ఆనాటి లెక్కల ప్రకారం సుమారు 11వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఏ సమస్య ఎదురుకాకుండా తీసే బొగ్గు 3వేల మిలియన్ టన్నులు మాత్రమేనని తేల్చారు. ఇప్పటివరకు సింగరేణి సుమారు 1,600 మిలియన్ టన్నులు వెలికి తీయగలిగింది. ప్రస్తుతానికి సింగరేణి సంస్థ జియాలజికల్ విభాగ లెక్కల ప్రకారం మరో 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలే ఉన్నాయి. ఈ బొగ్గు తీసేందుకు ఇంకో ఇరవై ఏళ్ల సమయం పడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త గనులు ప్రారంభిస్తూ వెళితే ఈ కాలపరిమితి పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నా, రకరకాల కారణాలతో ఈ వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనడం లేదు. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. వేలంలో పాల్గొంటే మరో 300 మిలియన్ టన్నులు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ విధానంలో భాగంగా ఎవరైనా సరే వేలంలో పాల్గొంటేనే బొగ్గు గనులు దక్కుతాయి. అయితే సింగరేణి యాజమాన్యం రూ.25 లక్షలు వెచ్చించి టెండర్ ఫారాలు ఖరీదు చేసినా వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం ఓసీ–3, శ్రావణపల్లి ఓసీతో పాటు సత్తుపల్లి ఓసీలు దూరమయ్యాయి. ఒకవేళ ఇవి దక్కించుకుంటే సుమారు 300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు సింగరేణికి అందుబాటులోకి ఉండేవి. ఈ మూడు గనుల్లో బొగ్గు నిల్వల గుర్తింపు, ఇతర పనులకు సింగరేణి యాజమాన్యం రూ.60 కోట్లు ఖర్చు చేసినా, వేలంలో మాత్రం పాల్గొనలేదు. భూగర్భగనులతో నష్టం వస్తుందని.. భూగర్భ గనుల ఏర్పాటుతో బొగ్గు ఉత్పత్తికి ఎక్కువ ఖర్చువుతుందని చెబుతున్న యాజమాన్యం ఓసీల ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది. ఓసీల ద్వారా అత్యధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని, భూగర్భగనుల్లో అలా సాధ్యం కాకపోవడంతో అటువైపు దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో 8, 9, 10, 11వ గనుల్లో మిగిలిన సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గును జీకే ఓసీ ద్వారా 1994 నుంచి 30 ఏళ్ల కాలంలో వెలికి తీయడం పూర్తిచేశారు. ఓసీల ద్వారా ఇంత వేగంగా బొగ్గు తీయడం సాధ్యమవుతున్నా, ఓసీల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిసి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. పదేళ్లలో ఒక్క గనీ లేదు.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా, కొత్తగా ఒక్క గనిని కూడా ప్రారంభించలేదు. గతంలో బొగ్గు తీసిన భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్(ఓసీ)లుగా మార్చా రే తప్ప కొత్త ఓసీలు, భూగర్భ గనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. రూ.60 కోట్లు వెచ్చించి సర్వే లు, డ్రిల్లింగ్లు వేయించడంతో అధికారులు, కార్మికులు శ్రమదోపిడీకి గురయ్యారే తప్ప ఫలితం రాలే దు. తెలంగాణ వస్తే ఓసీలు ఉండవు..భూగర్భగనులే ఉంటాయని తొలినాళ్లలో చెప్పినా, 2018లో వర్చువల్గా ప్రారంభించిన రాంపురం గనిలోనూ ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తి మొదలుకాలేదు. -
బొగ్గు ఉత్పత్తి పెంపునకు కృషి
న్యూఢిల్లీ: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. 2070 నాటికి 50 శాతం విద్యుత్ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఎనిమిదో విడత వాణిజ్య స్థాయిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని మంత్రి బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘‘ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 240 గిగావాట్లకు చేరుకుంది. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందన్న అంచనా ఉంది. ఇంధన వనరుల్లో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గొచ్చు. కానీ, మొత్తం మీద బొగ్గు విద్యుదుత్పత్తి ప్రస్తుత స్థాయి నుంచి పెరుగుతుంది’’అని వివరించారు. బొగ్గు మైనింగ్లో సుస్థిరతాభివృద్ధి సూత్రాలను అమలు చేయడంతోపాటు సంయుక్త కృషి ద్వారా పెరుగుతున్న డిమాండ్ను చేరుకోగలమన్నారు. 3 లక్షల మందికి ఉపాధి ప్రస్తుతం వేలం వేస్తున్న బొగ్గు గనులకు సంబంధించి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. ‘‘వాణిజ్య బొగ్గు మైనింగ్ ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభిస్తున్న నేడు ప్రత్యేకమైన రోజు. మొత్తం 39 బొగ్గు గనులను వేలానికి ఉంచాం. ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే నేడు గిరిజనుల గౌరవ దినోత్సవం’’అని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బొగ్గు రంగానికి, గిరిజనులకు లోతైన అనుబంధం ఉందన్నారు. వేలంలో ఉంచిన బొగ్గు గనుల్లో ఉత్పత్తి మొదలైతే గిరిజనులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఏడు విడతల వేలంలో మొత్తం 91 బొగ్గు గనులను వేలం వేసినట్టు గుర్తు చేశారు. -
బొగ్గును మించిన నల్లని నది ఏది? కారణమేమిటి?
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వందల కొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో కొన్ని నదుల నీరు శుభ్రంగా ఉంటుంది. మరికొన్ని నదుల నీరు మురికిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బొగ్గుకన్నా నల్లగా ఉండే నది గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరొందింది. ఈ నదిలో బొగ్గు కన్నా నల్లటి నీరు ప్రవహించడం వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో రుకీ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలోని నీరు నల్లగా కనిపించడానికి కారణం.. ఆ నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డెయిలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రుకీ నదిలోని నీటితో కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు ఈ నదికి సంబంధించిన తమ శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచానికి అందించారు. నదిలోని నీటికి నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి, ఈ నీటిలో కలవడమేనని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆఫ్రికన్ దేశమైన కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైన డ్రైనేజీ బేసిన్ ఉంది. దీనిలో కుళ్ళిన చెట్లు, మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. ఇవి వర్షాలు, వరదల కారణంగా నదులలోకి చేరుకుంటున్నాయి. నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డార్క్ టీ మాదిరిగా కనిపిస్తుంది. దీనికితోడు రుకీ నది.. అమెజాన్ రియో నెగ్రా కంటే 1.5 రెట్లు లోతుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల నీటి నదిగా పేరొందింది. రుకీ బేసిన్ దిగువన పెద్ద మొత్తంలో పీట్ బోగ్ మట్టి ఉంది. కాంగో బేసిన్లోని పీట్ బోగ్లలో సుమారు 29 బిలియన్ టన్నుల కార్బన్ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా? -
2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు
శిలాజ ఇంధనాల క్షీణత, ముడిచమురు ధరల్లో అస్థిరత, కఠినమైన పర్యావరణ నిబంధనలు వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు, బొగ్గుకు గరిష్ఠ స్థాయిలో డిమాండ్ నెలకొనడం చరిత్రలో ఇదే మొదటిసారి. గ్లోబల్గా శిలాజ ఇంధన డిమాండ్ 2030 నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) 2023 నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అణు, సౌర, పవన విద్యుత్తుకు అధిక గిరాకీ ఉంటుందని నివేదిక తెలియజేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, అణుశక్తి తరిగిపోయే శక్తివనరులు. వాటిని ఒకసారి వినియోగిస్తే, మళ్లీ ఉపయోగించడం కుదరదు. నీరు, గాలి, సూర్యరశ్మి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి తదితరాలు ఎన్నటికీ తరిగిపోనివి. అందుకే వాటిన సంప్రదాయేతర లేదా తరిగిపోని ఇంధన వనరులు అంటారు. శాస్త్రవిజ్ఞానం, నవీన ఆవిష్కరణల ద్వారా వాటి వినియోగాన్ని పెంచుతున్నారు. (ఇదీ చదవండి: రూ.240కే ‘ఎక్స్’ సబ్స్క్రిప్షన్.. ఫీచర్లు ఇవే..) తగ్గుతున్న శిలాజ ఇంధన డిమాండ్ బొగ్గు, చమురు, సహజ వాయువులను శిలాజ ఇంధనాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలవారీగా వీటి డిమాండ్ ఆధారపడుతుంది. అనేక దశాబ్దాలుగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా, పారిశ్రామిక అవసరాలకు వీటిని వాడుతున్నారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా వీటికి మరింత డిమాండ్ పెరిగింది. కానీ వీటిని మండించడం ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. 2030 నాటికి శిలాజ ఇంధనాలకు గరిష్ట స్థాయిలో డిమాండ్ ఉంటుందని అంచనా. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కొన్ని విధానల ద్వారా క్రమంగా వీటి వాడకం తగ్గనుంది. వీటిస్థానే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీవైపు అడుగులు వేసే అవకాశం ఉంది. క్షీణిస్తున్న బొగ్గువాడకం ప్రపంచ బొగ్గు డిమాండ్ అనేది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపై ఆధారపడుతుంది. ఇతర మార్గాల ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంటే క్రమంగా బొగ్గుకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 65శాతం బొగ్గును ప్రస్తుతం కరెంట్ తయారీకే వాడుతున్నారు. థర్మల్పవర్ ప్లాంట్లు సిస్టమ్ సేవలు ఉపయోగిస్తున్నాయి. దాంతో బొగ్గు వినియోగం కొంతమేర తగ్గుతుంది. అయితే పారిశ్రామిక డిమాండ్, ఉక్కు తయారీ, సిమెంట్ పరిశ్రమల కోసం వాడే బొగ్గు వినియోగం స్థిరంగా ఉంది. పునరుత్పాదక వనరులపై మక్కువ సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఏర్పడింది. వాటిని వినియోగించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 140కి పైగా దేశాలు వీటిని విరివిగా వాడుతున్నాయి. 2010తో పోలిస్తే 2022 వరకు సౌరశక్తి వల్ల 90శాతం, పవనశక్తి ద్వారా 70శాతం, ఆఫ్షోర్ విండ్ ద్వారా 60శాతం విద్యుత్ ధరలు తగ్గాయి. (ఇదీ చదవండి: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..) క్లీన్ ఎనర్జీ వైపు..ప్రపంచం చూపు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ విస్తరణ వల్ల సౌర, పవన శక్తి వాడకం ఎక్కువైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలు తగ్గనున్నాయి. 2030 వరకు సోలార్ఎనర్జీ వల్ల దాదాపు 3 గిగాటన్నుల ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్డుపై ఉన్న అన్ని కార్ల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానం. పవన శక్తి వల్ల మరో రెండు గిగాటన్నుల ఉద్గారాలు తగ్గనున్నాయి. -
Fact Check: నాడు ఒప్పు.. నేడు తప్పా..!
సాక్షి, అమరావతి: ఎందుకేడుస్తున్నావురా అంటే.. ఏదో ఒకటి ఏడవాలిగా.. అన్నాడటొకడు. కరెంటు కోసం కొనే విదేశీ బొగ్గుపై ఓ కథ అచ్చేసిన ఈనాడు తీరూ ఇలానే ఉంది. వాస్తవాలతో పని లేకుండా, ఏదో ఒకటి బురద జల్లడమే పనిగా ఈనాడు మరో తప్పుడు కథనం అచ్చేసింది. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ సమకూరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బరద జల్లే ప్రయత్నం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ విదేశీ బొగ్గును అడ్డగోలుగా కొన్న విషయాన్ని మరుగున పెట్టింది. ఇప్పుడు వీలైనంత తక్కువ ధరతో అత్యంత నాణ్యమైన హైగ్రేడ్ విదేశీ బొగ్గు కొంటుంటే అదే తప్పయినట్లు ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. పైపెచ్చు 4 శాతం విదేశీ బొగ్గు తప్పనిసరిగా వాడాలని కేంద్రం కూడా నిబంధన విధించింది. చంద్రబాబు హయాంలో ఇలాంటి కేంద్ర నిబంధనలేమీ లేకపోయినా విదేశీ బొగ్గు కొన్నప్పటికీ, రామోజీ కిమ్మనలేదు. రామోజీ ఈ కుట్రపూరిత రాతలను రాష్ట్ర ఇంధన శాఖ, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్), ఏపీజెన్కో ఖండించాయి. వాస్తవాలను ‘సాక్షి’కి వివరించాయి. విదేశీ బొగ్గు తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అన్నీ 4 శాతం విదేశీ బొగ్గు తప్పనిసరిగా వాడాలని ఈ నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు జనవరి నెలలో కూడా 6 శాతం విదేశీ బొగ్గు కొనాలంటూ కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను కాదని ముందుకు వెళ్లే అవకాశం రాష్ట్రాలకు లేదు. ఎందుకంటే.. స్వదేశీ బొగ్గు సరఫరా అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. స్వదేశీ బొగ్గు ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలో కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది. కేంద్రం చెప్పిన మేరకు విదేశీ బొగ్గు కొనకపోతే స్వదేశీ బొగ్గులో కోత విధిస్తుంది. బయట కూడా కొనలేం. అదే జరిగితే రాష్ట్రానికి వచ్చే బొగ్గు తగ్గిపోయి, విద్యుత్ ఉత్పత్తి పడిపోతుంది. పైగా, దేశీయ బొగ్గుకు కూడా కొరత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సరిపడినంత బొగ్గు దొరకకపోతే రాష్ట్రం అంధకారమే అవుతుంది. ఇలా రాష్ట్రానికి అన్ని విధాలా నష్టమే కలుగుతుంది. మన రాష్ట్రమే కాదు.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎనీ్టపీసీ, ప్రైవేటు సంస్థలు కూడా కేంద్రం ఆదేశాలను పాటించి విదేశీ బొగ్గు కొంటున్నాయి. అయితే, ఈనాడుకు, టీడీపీకి విద్యుత్ ఉత్పత్తికంటే రాష్ట్రంలో అంధకారం నెలకొనడమే ఇష్టంలా ఉంది. అందుకే ఓ విషపు కథనాన్ని ఈనాడు అచ్చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో అడ్డగోలుగా కొనుగోళ్లు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇటువంటి నిబంధనలేమీ లేకుండానే భారీ మొత్తంలో విదేశీ బొగ్గు కొనుగోలు చేశారు. ఇష్టానుసారం టెండర్లు పిలిచి, సరఫరా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనివల్ల అప్పట్లో తక్కువ ధరకు బొగ్గు లభించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఎక్కువ ధరకే బొగ్గు కొన్నారు. 2015–16 నుంచి 2018–19 మధ్య రివర్స్ టెండరింగ్ లేకుండానే ఏపీపీడీసీఎల్ విదేశీ బొగ్గు కొనుగోలు చేసింది. 2015–16లో 1,24,361 టన్నులు, 2016–17లో 7,67,505 టన్నులు, 2017–18లో 3,80,049 టన్నులు, 2018–19లో 8,31,632 టన్నులు.. ఇలా మొత్తంగా ఆ ఐదేళ్లలో 21.03 లక్షల టన్నుల విదేశీ బొగ్గును బాబు ప్రభుత్వం కొన్నది. ఈ కొనుగోళ్లలో ఎక్కడా పారదర్శకత అన్నది లేదు. రివర్స్ టెండరింగ్ లేదు. దొంగ లెక్కలతో ఇష్టానుసారం టెండర్లు పిలిచి, ఇష్టమొచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. తక్కువ ధరకు బొగ్గు లభించే అవకాశమున్నా, ఎక్కువ ధర చెల్లించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్కు విదేశీ బొగ్గు తప్పనిసరి రాష్ట్రంలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ –1 కింద నిర్మించిన రెండు యూనిట్లకు విదేశీ బొగ్గునే వాడాలి. 70:30 నిష్పత్తిలో స్వదేశీ, విదేశీ హైగ్రేడ్ బొగ్గు వాడాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ రెండు యూనిట్లకు ఇది తప్పనిసరి. అందువల్లే హైగ్రేడ్ విదేశీ బొగ్గు కోసం ఏపీపీడీసీఎల్ టెండర్లు పిలిచింది. విదేశీ బొగ్గుతో ప్రజలకూ లాభమే ముడి సరకుల ధరలు పెరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం, సరఫరా ఖర్చులు పెరిగితే ఆ భారాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయాలి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సు ప్రకారమే ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దేశీయ బొగ్గుతో పోల్చితే విదేశీ బొగ్గు ధర ఎక్కువ ఉండవచ్చు. కానీ దేశీయ బొగ్గుకు విదేశీ హైగ్రేడ్ బొగ్గు 70:30 నిష్పత్తిలో కలపడంవల్ల అధిక ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తి వ్యయం యూనిట్కు రూ. 3.14 మాత్రమే అవుతుంది. బహిరంగ మార్కెట్ ధరతో పోల్చితే ఇది సగం కూడా ఉండదు. చాలాసార్లు మూడో వంతు మాత్రమే. విదేశీ బొగ్గు వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను రాష్ట్ర ప్రజలకు సరఫరా చేస్తారు. ఆమేరకు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనాల్సిన భారం తగ్గి ప్రజలకు అంతిమంగా లాభమే చేకూరుతుంది. తెలంగాణతో పోలికేమిటి? తెలంగాణ ప్రభుత్వానికి సొంతంగా సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. అందువల్ల ఆ రాష్టానికి విదేశీ బొగ్గు అవసరం లేదు. బొగ్గు గనులు లేని ఆంధ్రప్రదేశ్ను తెలంగాణతో పోల్చడానికి వీలు లేదు. ఈ తేడా చూడండి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, రివర్స్ టెండరింగ్ విధానంతో తక్కువ ధరకు విదేశీ బొగ్గు కొనుగోలు చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా సరఫరా సంస్థలకు ప్రాధా న్యత ఇవ్వడంలేదు. దొంగ రేట్లు నిర్ణయించడంలేదు. కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది విదేశీ బొగ్గు కోసం పిలిచిన టెండర్లను నాలుగు సార్లు రద్దు చేయడమే ఇందుకు నిదర్శనం. 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం ఏపీపీడీసీఎల్ ఈ ఏడాది టెండర్లు పిలిచింది. ధర ఎక్కువగా ఉండటంతో నాలు గు సార్లు వాటిని రద్దు చేసింది. అయిదోసారి తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు లభిస్తుండటంతో ఆ టెండర్లు ఖరారు చేసింది. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా మరింత తక్కువ ధరతో హైగ్రేడ్ విదేశీ బొగ్గు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అన్నీ కలుపుకొని ప్లాంటు వరకు చేర్చేలా టన్నుకు రూ. 13,219 చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇదే హైగ్రేడ్ విదేశీ బొగ్గుకు ఎనీ్టపీసీ రూ.18,509కి కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నాణ్యమైన బొగ్గును ఎంత తక్కువ ధరకు కొంటోందో, ఎంత ఆదా చేస్తోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. దీనిద్వారా ఉత్పత్తి వ్యయమూ తగ్గి, వినియోగదారులకు లాభమూ కలుగుతుంది. ఎవరైనా టెండర్లు వేయొచ్చు 7.5 లక్షల టన్నుల హ్రైగ్రేడ్ విదేశీ బొగ్గు సరఫరా చేసే సంస్థలు బిడ్లు దాఖలు చేయాలంటూ ఏపీపీడీసీఎల్ అత్యంత పారదర్శకంగా గ్లోబల్ టెండర్లు పిలిచింది. నిబంధనల ప్రకారం ఏ సంస్థ అయినా టెండర్లలో పాల్గొని బిడ్లు వేసి కాంట్రాక్టు దక్కించుకోవచ్చు. అత్యంత నాణ్యమైన హైగ్రేడ్ బొగ్గు సరఫరా చేయవచ్చు. ఇందులో ప్రత్యేకంగా అదానీ సంస్థకు ప్రయోజనం కలిగించే ప్రశ్నే ఉత్పన్నమవదు. టెండర్లలో హడావుడి ఏముంది? ఈ ఏడాది జనవరిలో 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు సరఫరాకు ఏపీపీడీసీఎల్ టెండరు ఖరారు చేసింది. అందులో ఇప్పటికే 6.30 లక్షల టన్నులు సరఫరా అయింది. రావాల్సింది 1.20 లక్షల టన్నులు మాత్రమే. ప్రస్తుత అవసరాల్లో అది స్వల్ప పరిమాణమే. అందువల్లే మళ్లీ టెండర్లు పిలిచింది. టెండరు ఖరారు అనేది సుదీర్ఘ ప్రక్రియ. నోటిఫికేషన్ జారీ నుంచి రివర్స్ టెండరింగ్, సంప్రదింపుల ద్వారా ధర తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇదంతా సవ్యంగా పూర్తయ్యాకే ఒప్పందం చేసుకోవాలి. అందువల్ల హడావుడిగా టెండర్లు పిలిచిందనడంలో ఏమాత్రం వాస్తవంలేదు. టెండర్లలో అర్హత ఉన్న ఏ సంస్థలైనా పాల్గొనవచ్చు. ఏ సంస్థలు పాల్గొంటాయన్నది ఎవరూ ముందుగా చెప్పలేరు. ఒకవేళ ఏ సంస్థా టెండర్లలో పాల్గొనలేదంటే లాభదాయకం కాదని అర్థం. అలాంటప్పుడు ఏదో ఒక సంస్థకు ప్రయోజనమని ఎలా చెప్పగలం? టెండరు నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ సంస్థలైనా బిడ్లు దాఖలు చేస్తాయి. -
కరెంటును కమ్మేసిన ‘బాబు’ అవినీతి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులూ విద్యుత్ శాఖను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు నిదర్శనం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు). అనవసర పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో పాటు అధిక బిడ్డింగ్, నాణ్యతలేని బొగ్గు సేకరణ, విదేశీ బొగ్గు కొనుగోలు వరకూ దేనినీ వదిలిపెట్టలేదు. వీటిలో అవినీతిని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)నే వెల్లడించింది. ముడుపుల కోసం విద్యుత్ రంగాన్ని కకావికలం చేసి, డిస్కంలను అప్పులపాలు చేసి, విద్యుత్ వ్యవస్థను కుంగదీసి భారీ అవినీతిని పెంచి పోషించిన ‘బాబు’ను అరెస్ట్ చేయడం ఏమాత్రం తప్పు కాదని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే అవసరం లేకపోయినా ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ళకు ఆర్డర్లు ఇచ్చారు. 2014 మే నుంచి 2015 అక్టోబరు వరకు దాదాపు ఏడాదిన్నరలోనే 13,180 మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొన్నారు. దీని విలువ రూ.8,286 కోట్లకు పైనే. ఇందులో కొంత విద్యుత్ను ఎక్కడా లేని విధంగా యూనిట్ రూ.10కు కొన్నారు. జెన్కో విద్యుత్ యూనిట్ రూ.4.50 మాత్రమే ఉంది. అయితే జెన్కో ఉత్పత్తి పెంచకుండా చంద్రబాబు ఎంత డబ్బు ఖర్చు చేసైనా ప్రైవేటు కొనుగోళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో రూ. 15 వేల కోట్ల అవకతవకలు జరిగినట్లు ఆరోపణ. ఇందులో ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు దాదాపు రూ.4 వేల కోట్లు ముడుపులుగా అందినట్లు అంచనా. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి రాసిన లేఖలో చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా అధిక ధరలకు ప్రైవేటు నుంచి కొంటున్న విషయాన్ని బయటపెట్టింది. మూసేస్తే రూ.675.69 కోట్లు నష్టం చంద్రబాబు హయాంలో బొగ్గు కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్వాకాలను కాగ్ కడిగిపారేసింది. ఇష్టారాజ్యంగా బొగ్గు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్కోకు భారీ నష్టం వాటిల్లిన వైనాన్ని ఎండగట్టింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు కొన్న ప్రభుత్వ పెద్దల తీరును తప్పుబట్టింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశాయి. కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీని వల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్కు రూ.2.94 నుంచి రూ.4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ.675.69 కోట్లు నష్టం వాటిల్లింది. అధిక ధరకు నాణ్యత లేని బొగ్గు మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడంలేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహన ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్లను సమీక్షిస్తే జెన్కో కొన్న బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నాణ్యత లేని రూ.3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరకు కొనడం వల్ల జెన్కోకు రూ.918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొన్నారు. ఇందులో ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెర వెనుక కోల్ మాఫియా చక్రం తిప్పింది. రూ.500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది. ఇందులో రూ.200 కోట్లు బాబు అండ్ కోకు ముడుపులుగా వెళ్లాయనే ఆరోపణలున్నాయి. -
విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగుతాయని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న గడ్డు పరిస్ధితుల కోసం ఇప్పుడే అప్రమత్తం కావాలని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ నెలాఖరు నాటికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా ఓ లేఖ పంపింది. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట డిమాండ్లో కొరత 23 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం తెలిచ్చింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్ను తీర్చలేకపోయాయని చెప్పింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 తరువాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిషేధించామని, పరిస్థితులు చక్కబడకపోవడంతో నిషేధాన్ని పక్కనపెట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు సాధాౄరణం కంటే తక్కువగా ఉన్నందున సెప్టెంబర్లోనూ వర్షాలు ఆశించినంతగా లేనందున రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్షీణించాయని, దానివల్ల గత ఏడాది 45 గిగావాట్లుగా ఉన్న గరిష్ట హైడ్రో పవర్ ఉత్పత్తి ఈ ఏడాది 40 గిగావాట్ల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. పవన ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని, సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో రుతుపవనాల ఉపసంహరణతో జల, గాలి ఉత్పత్తి మరింత క్షీణిస్తుందని అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. థర్మల్ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో నడవకపోవడం వల్ల 12–14 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో లేదన్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అలాగే థర్మల్, సోలార్, విండ్ వంటి కొత్త యూనిట్లను త్వరితగతిన ప్రారంభించాలని కోరింది. విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు కుదుర్చుకోవాలని, స్వల్పకాలిక టెండర్ల ద్వారా విద్యుత్ను బహిరంగ మార్కెట్ ద్వారా సమకూర్చుకోవాలని సూచించింది. -
రాజస్తాన్లో దారుణం.. అత్యంత పాశవికం, బాలికపై హత్యాచారం
జైపూర్: రాజస్తాన్లో భిల్వారాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు రాక్షసులు 14 ఏళ్ల బాలికను చంపి, బొగ్గు బట్టీలో కాల్చేశారు. బుధవారం ఉదయం మేకల కాపలాకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె సోదరుడు, గ్రామస్తులు వెతుకులాట మొదలుపెట్టారు. రాత్రికి గ్రామ సమీపంలోని మండుతున్న ఒక బట్టీలో బాలిక చేతి గాజు, ఎముక ముక్కలు..ఆ పక్కనే బాలిక చెప్పులు వారికి కనిపించాయి. దీంతో, వారు బట్టీలు నిర్వహించే కల్బేరియా తెగకు చెందిన అయిదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారం చేశాక, చంపి కొలిమిలో పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను ప్రశ్నిస్తున్నట్లు కోట్రి పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు. -
సింగరేణికి దొంగల బెడద..
కరీంనగర్: సింగరేణి రామగుండం రీజియన్ ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని ఓసీపీల్లో ఉన్న కాపర్ కేబుళ్లే లక్ష్యంగా దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. గతంలో స్క్రాప్ యార్డులపై కన్నేసిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లి, అక్రమ మార్గాన విక్రయించి, సొమ్ము చేసుకునేవారు. చోరీలను నివారించేందుకు యాజమాన్యం స్క్రాప్ యార్డులు, గనుల వద్ద సెక్క్యూరిటీ పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. స్క్రాప్ నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఈ చోరీలు తగ్గిపోయాయి. అంతేకాకుండా స్క్రాప్ చోరీలవల్ల ప్రయాస ఎక్కువగా ఉండటం, లాభాలు కూడా తక్కువగా ఉండటంతో దొంగలు తమ రూట్ మార్చారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వచ్చే కాపర్ కేబుళ్లపై కన్నేశారు. భారీ యంత్రాల పవర్ కేబుళ్లు చోరీ వర్షాకాలం కావడంతో ఓసీపీ క్వారీలోని పనిస్థలాల వద్దకు సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి అధికారులు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇదు అదనుగా దొంగలు రెచ్చి పోతున్నారు. విద్యుత్తో నడిచే భారీ యంత్రాలకు ఉన్న పెద్ద కాపర్ కేబుళ్లను కట్ చేసుకొని, ఎత్తుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో హెచ్టీ లైన్ విద్యుత్ సరఫరా ఉండగానే పెద్ద గొడ్డళ్లతో కేబుళ్లను నరికి, క్షణాల్లో వాహనంలో వేసుకొని, పరారవుతున్నారు. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టంతోపాటు యంత్రానికి విద్యుత్ లేక పని నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దొరికినా చర్యలు లేవు దొంగతనాలు జరిగిన కొన్ని సందర్భాల్లో దొంగలు రెడ్హ్యాండెడ్గా సెక్యూరిటీ సిబ్బందికి దొరికినా సరైన చర్యలు లేకపోవడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సింగరేణి సంస్థకు, పోలీసు శాఖకు మధ్య సరైన సమన్వయం లేక దొంగలు తిరిగి అదే పనికి అలవాటు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. స్క్రాప్, కాపర్ కేబుళ్ల ముఠాల వివరాలు, విషయాలు తెలిసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడంతో సింగరేణిలో చోరీలకు అడ్డుకట్ట పడటం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంటి దొంగల అండతోనే! ఇంటి దొంగల అండతో కాపర్ కేబుళ్ల చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో కొంత ముట్టజెప్పి, చోరీ సమయంలో సహకరించాలని కోరడంతో కొందరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే స్టోర్స్లోని 600 మీటర్ల కాపర్ కేబుల్ దొంగతనం జరిగిందని పలువురు అంటున్నారు. దీనిపై కొందరికి సస్పెండ్ కమ్ పెండింగ్ ఎంకై ్వరీ పెట్టి, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
బాహుబలి గని!
కరీంనగర్: రాబోయే రోజుల్లో వంద మిలి యన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా యాజ మాన్యం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రసుత్తం 78 మిలియన్ టన్నుల లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, రాబోయే రో జుల్లో మరో 22మిలియన్ టన్నులు పెంచేందు కు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే మరో భా రీ ఓపెన్కాస్ట్ ఏర్పాటుకు వడివడిగా ముందుకు సాగుతోంది. నాలుగు గనులు కలిపి రామగుండం కోల్మైన్ పేరుతో కొత్త ఓసీపీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 633.45మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ ప్రాజెక్టు రెండేళ్లలో ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆర్జీ–3ఏరియాకు అనుబంధంగా.. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్లోని ఆర్జీ–3 ఏరియాకు అనుబంధంగా రామగుండం కోల్మైన్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. భవిష్యత్లో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును కలుపుకుని ఆర్జీ–2 ఏరియాలోని వకీల్పల్లి గని, ఆర్జీ–3 ఏరియాలోని ఓపెన్కాస్ట్–1, 2, మూసివేసిన జీడీకే–10 గనిని కలుపుకుని మెగా ప్రా జెక్టు ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ఆర్జీ–2, 3 జీఎంలతో ఎ ప్పటికప్పుడు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరుపుతున్నారు. రెండు ఏరియాల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రాజెక్టు పనులు సిద్ధం చేసేందుకు ప్రత్యేక అధికారిని యాజమాన్యం నియమించింది. పెరుగనున్న బొగ్గు ఉత్పత్తి రామగుండం కోల్మైన్ ప్రాజెక్టు ఏర్పాటుతో ఏ టా 10మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం విడివిడిగా ఉత్పత్తి కొనసాగిస్తున్నప్పటికీ కాలానుగుణంగా అన్ని గనులను ఒకే ఓసీపీ కిందకు తీసుకరానున్నారు. నూతన మెగా ఓసీపీ మూలంగా వకీల్పల్లి గనిని మరో రెండేళ్లలో మూసివేయనున్నారు. ఇప్పటికే మూ సివేసిన జీడీకే–10గనితో పాటు నాలుగు గనులను ఒకే ప్రాజెక్టు పరిధిలోకి తీసుకరానున్నారు. దీనివల్ల సరిహద్దు సమస్య లేకుండా ఉండనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓసీపీ–2 ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, భూసేకరణ, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మార్పు తదితర పనుల మూలంగా ఉత్పత్తి వెనకపడింది. ఇదే ప్రాజెక్టు పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ ప్రాజెక్టు గని కూడా ఇందులో అంతర్భాగంగా కొనసాగించనున్నారు. రెమిడేషన్ ప్లాన్లో వకీల్పల్లి, ఓసీపీ–1 పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఉత్పత్తి తీసిన వకీల్పల్లిగని, ఓసీపీ–1 ప్రాజెక్టు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం రెమిడేషన్ ప్లా న్ చేయాల్సింది ఉంది. ఈ మేరకు రెండు గనుల అధికారులు సమీప గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇవి పూర్తయితే రెండు గనులకు సంబందించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. క్లియరెన్స్ రాగానే రామగుండం కోల్మైన్ ఓసీపీ కోసం యాజమాన్యం ఎన్విరాన్మెంట్ విభాగానికి దరఖాస్తు చేసుకోనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈఏడాది నవంబర్లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే అవకాశాలున్నాయి. 2024 నాటికి నాలుగు గనుల సరిహద్దు కలిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు ప్రొఫైల్ వివరాలు.. ప్రాజెక్టు పేరు: రామగుండం కోల్మైన్, విస్తరణ: 3445హెక్టార్లు, బొగ్గు నిల్వలు: 633.45మిలియన్ టన్నులు, ఏటా బొగ్గు ఉత్పత్తి: 14మిలియన్ టన్నులు(భూగర్భగనితో కలిపి), ఓవర్బర్డెన్: 2,846 మిలియన్ క్యూబిక్మీటర్లు, ప్రాజెక్టు జీవిత కాలం: సుమారు 30ఏళ్లు, అటవీభూమి: 719హెక్టార్లు. -
బొగ్గుపై సుంకం స్కామ్లో ఈడీ దూకుడు
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో బొగ్గుపై అదనంగా అక్రమ పన్ను కేసులో మనీ లాండరింగ్ కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను వేగవంతం చేసింది. తాజాగా రూ.51.4 కోట్లకుపైగా విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ మంగళవారం తెలిపింది. వీటిలో రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవేందర్ యాదవ్, చంద్రదేవ్ ప్రసాద్ రాయ్, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్లకు సంబంధించిన స్థిరాస్థులు, విలాసవంత వాహనాలు, ఆభరణాలు, నగదు ఉన్నాయి. మహిళా ఐఏఎస్ అధికారి, నాటి రాయ్గఢ్ జిల్లా కలెక్టర్ రాణు సాహూ, బొగ్గు వ్యాపారి, కేసులో ప్రధాన నిందితుడు సూర్యకాంత్ తివారీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. రాష్ట్రంలో రూ.2,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత, రాయ్పూర్ మేయర్ సోదరుడు అన్వర్ ధేబర్ను ఈడీ అరెస్ట్చేసిన కొద్దిరోజులకే ఈ ఆస్తుల జప్తు జరగడం గమనార్హం. ఈడీని బీజేపీ ఏజెంట్గా పేర్కొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ దీనిని తప్పుడు కేసుగా అభివర్ణించారు. -
రికార్డు సృష్టించిన సింగరేణి.. చరిత్రలోనే తొలిసారి..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 32,830 కోట్ల రూపాయల అమ్మకాలను (టర్నోవర్) సాధించి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2021-22)లో సాధించిన 26,619 కోట్ల రూపాయల టర్నోవర్పై 23 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు ముందు (2013-14)లో సింగరేణి సాధించిన 12,000 కోట్ల టర్నోవర్ తో పోల్చితే ఇది 173 శాతం అధికం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ వివరాలను సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్. శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు తన అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే ఉండగా.. ఇప్పుడు 10 కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో కూడా ప్రవేశించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది. గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో ఇంత భారీ టర్నోవర్ వృద్ధిని సాధించిన సంస్థ సింగరేణే కావడం విశేషం. బొగ్గు అమ్మకాలలో 25 శాతం.. విద్యుత్ అమ్మకాలలో 13 శాతం వృద్ధి.. సింగరేణి సంస్థ 2022-23లో సాధించిన ఈ టర్నోవర్ లో బొగ్గు అమ్మకాల ద్వారా 28, 459 కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా జరిపిన విద్యుత్ అమ్మకం ద్వారా 4,371 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం కూడా ఆల్టైం రికార్డుగా ఉంది. అంతకు ముందు ఏడాది(2021-22) సాధించిన 22740 కోట్ల రూపాయల బొగ్గు అమ్మకాలతో పోల్చితే సింగరేణి ప్రస్తుతం 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే విద్యుత్ అమ్మకాల్లో 2021-22లో జరిపిన 3,879 కోట్ల టర్నోవర్తో పోల్చితే ప్రస్తుతం 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి మొత్తమ్మీద 2021-22 కన్నా 23 శాతం వృద్ధిని సింగరేణి సంస్థ 2022-23 లో నమోదు చేసి సరికొత్త రికార్డును లిఖించింది. -
సంప్రదాయం నుంచి.. స్వచ్ఛత వైపు.. 2029–30 నాటికి లక్ష్యం 64 %
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రగతికి కీలకమైనది విద్యుత్ రంగం. కాగా ఒకప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదనకే ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. దశాబ్దన్నర కిందటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా బొగ్గుపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యతలు మారుతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణంలో మార్పులు నేపథ్యంలో విద్యుదుత్పాదన సంప్రదాయ విధానం నుంచి సంప్రదాయేతర విధానం వైపు మారుతోంది. బొగ్గుతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, కర్బన ఉద్గారాల విడుదల విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న భారత్ పుష్కరకాలంగా సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదనకే మొగ్గు చూపుతోంది. సంప్రదాయేతర విద్యుత్కే మొగ్గు దేశంలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్లకు మొత్తం 3,79,515 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామ ర్థ్యం ఉంది. వీటిలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 2,04,435 మెగావాట్లు (49.7%) కాగా, పవన, సౌర విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 1,21,550 మెగావాట్లు (29.5%). అయితే ఈ సౌర, పవన విద్యుత్ కేంద్రాలు గత దశాబ్దన్నర కాలంగా వచ్చినవే కావడం గమనార్హం కాగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కూడా తన ప్రధాన ఉత్పాదన అయిన థర్మల్ నుంచి సోలార్ వైపు అడుగులేస్తుండటం కీలక పరిణామం. ప్రస్తుతం సంప్రదాయేతర విద్యుదుత్పాదన మొత్తం 42.5 శాతం కాగా, దీనిని 2029–30 నాటికి ఏకంగా 64 శాతానికి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సంప్రదాయ (బొగ్గు, లిగ్నైట్, గ్యాస్, డీజిల్ ఆధారిత) అయితే, మరొకటి సంప్రదాయేతర (జల, పవన, సౌర, బయోమాస్, అణు) విద్యుత్. సంప్రదాయ విద్యుత్లో కూడా..దేశంలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్న నేపథ్యంలో అత్యధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలే ఉండేవి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అయినా.. వాటికి సరిపడా గ్యాస్ లభ్యత లేని కారణంగా నామమాత్రంగా తయారయ్యాయి. ఇక సంప్రదాయేతర ఇంధనంలో ఒకప్పుడు ప్రధానంగా జల ఆధారిత, స్వల్పంగా బయోమాస్తో విద్యుదుత్పాదన జరిగేది. డ్యామ్లు, రిజర్వాయర్లు ఉన్నచోట మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. ఇది కూడా వర్షాలపై ఆధార పడి ఉండడంతో.. రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువైన సమయంలో విద్యుత్ ఉత్పాదన సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే పవన, సౌర విద్యుత్ తెరపైకి వచ్చాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదన స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ ఇంధనాల కంటే సుస్థిర, పర్యావరణ హితమైన సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడమే సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. పడిపోతున్న థర్మల్ ఉత్పాదన సామర్థ్యం.. థర్మల్ విద్యుత్ కేంద్రాల విద్యుదుత్పాదన సామర్థ్యంలో తగ్గుదల నమోదు అవుతోంది, ఇందుకు ప్రధాన కారణాల్లో బొగ్గు కొరత ఒకటైతే, స్టేషన్ల బ్యాక్డౌన్ (వినియోగం తక్కువగా ఉన్న ప్పుడు లేదా సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదన అధికంగా ఉన్నప్పుడు, థర్మల్ కేంద్రాల ఉత్పత్తి నిలిపివేయడం/ తగ్గించడం) మరొకటి. యంత్రాల కాలపరిమితి ముగిసినా అలాగే ఉత్పత్తి చేయడం, బొగ్గులో నాణ్యత లోపించడం వంటి అంశాలతో ఉత్పాదన ఈ సామర్థ్యం తగ్గుతోంది. తాజాగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారం 57.69 శాతం విద్యుత్ ప్లాంట్లు మాత్రమే తమ స్థాపిత సామర్థ్యంలో 35 శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయని, మిగిలిన 42.31 శాతం విద్యుత్ ప్లాంట్లు 35 శాతం కంటే తక్కువ ఫీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో నడుస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల, ప్రభుత్వ రంగ సంస్థల్లోని థర్మల్ కేంద్రాలు మాత్రం ఏకంగా 90% పీఎల్ఎఫ్తో పనిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా.. సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటులో తెలంగాణ, ఏపీ వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం ఏపీలో పవన విద్యుత్ 4,096.95 మెగావాట్లు, సౌర విద్యుత్ 4,390.48 మెగావాట్లు, భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు1,610 మెగావాట్లు, బయోమాస్ 566 మెగావాట్లు, స్మాల్హైడ్రో 162 మెగావాట్లుగా ఉంది. కాగా తెలంగాణలో 5748 మెగావాట్ల సౌర విద్యుత్, 128 మెగవాట్ల పవన విద్యుత్ , 287 మెగావాట్ల రూఫ్టాప్, 2381.76 మెగావాట్ల జల విద్యుత్ ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమలదే సింహభాగం.. పారిశ్రామిక రంగ అభివృద్ధి ముఖ్యంగా విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంది. దేశంలో విద్యుత్ వినియోగంలో సింహభాగం పరిశ్రమల రంగానిదే. అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం తక్కువే. అధికార గణాంకాల ప్రకారం ఉత్పత్తి అయ్యే విద్యుత్లో పరిశ్రమల రంగానికి 41.36%, గృహావసరాలకు 26.89% , వ్యవసాయానికి 17.99 శాతం, వాణిజ్య అవసరాలకు 7.07% వినియోగిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1,255 యూనిట్లుగా ఉంది. -
పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపుపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొత్తగా వచ్చే బొగ్గు లేదా లిగ్నైట్ ఆధారిత థర్మల్ ప్లాంట్లు తప్పనిసరిగా తమ ప్లాంటు సామర్థ్యంలో కనీసం 40 శాతం పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ అలా చేయలేకపోతే అంత స్థాయిలో హరిత శక్తిని కొనుగోలు చేయాలని పేర్కొంది. సదరు సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 40 శాతం మేర పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ (ఆర్జీవో) 2016 టారిఫ్ పాలసీని కేంద్ర విద్యుత్ శాఖ ఈ మధ్యే సవరించింది. వీటి ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31లోగా వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించే (సీవోడీ) ప్లాంట్లు 2025 ఏప్రిల్ 1 నాటికి 40 శాతం ఆర్జీవో నిబంధనను పాటించాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 దాటిన తర్వాత వచ్చే ప్లాంట్లు వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిన తేదీ నుంచే దీన్ని పాటించాల్సి ఉంటుంది. కేంద్రం సూచించిన దానికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయడాన్ని బట్టి క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్లకు కొంత మినహాయింపు ఉంటుంది. 2030 నాటికల్లా 500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని భారత్ భారీ లక్ష్యం నిర్దేశించుకుంది. -
గ్యాస్ ధర 2012లో రూ.410.. ఇప్పుడేమో 1100.. కట్టెలపొయ్యివైపే జనం మొగ్గు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా కర్బన ఉద్గారాల విడుదల కారణంగా రోజురోజుకూ భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజల ఆలోచనా తీరు మాత్రం మారడంలేదు. అధిక కర్బన ఉద్గారాల విడుదల కారకాల్లో ఒకటైన వంట చెరకు వినియోగం నేటికీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎల్పీజీ, సోలార్, విద్యుత్ వాడకం ఆశించిన స్థాయిలో పెరగకపోగా పాతకాలం తరహాలో కట్టెలు, పంట వ్యర్థాలు, పిడకల వినియోగం ఇంకా కొనసాగుతోంది. తద్వారా అడవుల నరికివేత కూడా ఎక్కువవుతోంది. దేశంలో ఇంకా దాదాపు 44 శాతం మంది అడవుల నుంచి కలప, పంటల వ్యర్థాలు, పిడకలను వినియోగించి ఆహారం తయారు చేసుకుంటున్నారు. ఇటుకల తయారీకి కూడా కలప, పంటల వ్యర్థాలు వినియోగిస్తున్నారు. చిన్నచిన్న పరిశ్రమలు సైతం కట్టెలనే వాడుతున్నాయి. చివరకు బయోమాస్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సైతం పంట వ్యర్థాలు కాకుండా ఏకంగా అటవీ కలపను వినియోగిస్తున్నాయి. మరోవైపు కలపతో బొగ్గు తయారీ కూడా చేస్తున్నారు. ఫలితంగా వెలువడుతున్న వాయు కాలుష్యంతో ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో ఈ తరహా మరణాలు చైనా తరువాత భారత్లోనే ఎక్కువని అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఎల్పీజీ వినియోగం పెరిగినా.. దేశంలో దశాబ్దకాలంగా ఇళ్లలో ఎల్పీజీ వినియోగం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30.5 కోట్ల ఎల్పీజీ గృహ వినియోగదారులున్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. 2012లో రూ. 410 ఉన్న 14.5 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1,100కు చేరుకోవడంతో వినియోగదారుల సంఖ్య పడిపోతోందని డీలర్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఉచితంగా దాదాపు 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారిన నేపథ్యంలో చాలావరకు రీఫిల్లింగ్కు రావడం లేదని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లోనూ సిలిండర్ల పంపిణీ కేంద్రాలు తగిన స్థాయి లో అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాల నుంచి సిలిండర్లను తెచ్చుకోవాల్సి రావడం వల్ల సిలిండర్ ధరతోపాటు రవాణా చార్జీలు కూడా తడిసిమోపెడవుతున్నాయి. సిలిండర్ అయిపోయిన వెంటనే రీఫిల్ దొరుకుతుందన్న గ్యారంటీ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం వల్ల కలపతో ఆహార తయారీకి మొగ్గుతున్నా రు. స్నానాలకు అవసరమైన వేడినీటి కోసం కలపనే వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఎల్పీజీ వినియోగం దాదాపు 88.6 శాతం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అది 42 శాతం మాత్రమే ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని గృహిణులు ఇంకా అడవుల నుంచి తెచ్చిన కలప, పంట పొలాల్లోని వ్యర్థాలు, పిడకలను వాడుతున్నారు. కలప కాలడం వల్ల వచ్చే.. కలప, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడుతున్న వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా 3.3 లక్షల మంది మరణిస్తున్నారని ‘లాన్సెట్ కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’అధ్యయనం వెల్లడించింది. అదే చైనాలో 3.8 లక్షల మంది, యూరప్లో 1.17 లక్షల మంది, యూఎస్లో 32 వేల మంది మరణిస్తున్నారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు దాదాపు 28 కోట్ల మంది ఇంకా కలప, పంట వ్యర్థాలను వినియోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నారని సమాచారం. వంట చెరకు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది మరణిస్తున్నారని పలు అంతర్జాతీయ సంస్థలు తమ సర్వేల్లో పేర్కొంటున్నాయి. ఎల్పీజీ వినియోగిస్తున్న వారిలోనూ 12 శాతం మంది రెండో ఇంధనంగా ఈ కలపను వినియోగిస్తున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. బొగ్గు డిమాండ్ను తగ్గించాలి... చెట్లను కొట్టేయడం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతాయి. కొట్టేసిన చెట్టును బొగ్గుగా మార్చడానికి విద్యుత్ లేదా ఇతర రూపాల్లో ఇంధనం అవసరమవుతుంది. మళ్లీ బొగ్గును కాల్చినా అది కూడా కాలుష్యమే. ఈ రకంగా మూడు దశల్లోనూ కాలుష్యం ఉంటుంది. నల్లగొండ జిల్లాలో ఈ తరహా కలప కాల్చివేత ఎక్కువగా జరుగుతోంది. ఇదొక పాత విధానమైనా ఇంకా ఎందుకు అనుసరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ బొగ్గును అధికంగా చిన్నతరహా పరిశ్రమలు, ఇటుక బట్టీలు, హోటల్స్, దాబాల వంటి వాటిలో వాడుతున్నారు. వీటికి బొగ్గు సరఫరా పెంచితే ఇలాంటి బొగ్గు ఉపయోగించరు. అసలు బొగ్గే వద్దనుకుంటే సబ్సిడీపై విద్యుత్ ఇవ్వాలి. బాయిలర్ వంటివి ఎలక్ట్రిక్పై నడిచేవి అందుబాటులోకి తేవాలి. ముందుగా ఈ రకమైన బొగ్గుకు ఉన్న డిమాండ్ను తగ్గించాలి. చెట్లు కొట్టేయకుండా చట్టాన్ని తీసుకురావాలి.పచ్చదనానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన డిమాండ్, సప్లయ్ను తగ్గించడం ద్వారా అనుకున్న ప్రయోజనాలు పొందొచ్చు. ప్రస్తుతానికైతే చెట్లకు, పర్యావరణానికి నష్టం కలగజేసే వాటిపై ప్రభుత్వపరంగా ఎలాంటి నియంత్రణలు, పర్యవేక్షణలు లేవు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త, పాలసీ అనలిస్ట్ -
కేటీపీఎస్ కోల్ ప్లాంట్లో ప్రమాదం
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ కోల్ ప్లాంట్లో బ్రేకర్లు అమరుస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కేటీపీఎస్లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడో దశ కోల్ ప్లాంట్లో ఎంటీసీ కంట్రోల్ బోర్డ్ వద్ద ఏఈ విజయ్ ఆధ్వర్యాన ఆర్టిజన్లు మల్లికార్జున్, వరదరాజు బ్రేకర్లు అమరుస్తున్నారు. అయితే బ్రేకర్ల కండక్టర్ సరిగా అతుక్కోకుండానే విద్యుత్ ఆన్ చేయడంతో మంటలు చెలరేగాయి. మంటలు బయటకు ఎగిసిపడటం(బాయిలర్ ఫ్లాష్ ఓవర్)తో ఏఈతోపాటు మరో ఇద్దరు కార్మికులకు ముఖం, ఛాతీ, చేతులు కాలి పోయాయి. అప్రమత్తమైన తోటి సిబ్బంది వెంటనే కేటీపీఎస్ ఆస్పత్రికి తీసు కెళ్లగా...ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఈ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...బ్రేకర్ అమరుస్తుండగా కనెక్టర్ల నుంచి మంటలు రావడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు జెన్కో డైరెక్టర్లతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు. -
బొగ్గు గనుల్లో డ్రోన్ వినియోగం
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో ఉన్న కోల్ ఇండియా అనుబంధ కంపెనీ మహానది కోల్ఫీల్డ్స్ డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యావరణ పర్యవేక్షణ, నిల్వల స్థాయి తెలుసుకోవడానికి, గనుల చిత్రీకరణకు డ్రోన్ను ఉపయోగిస్తున్నట్టు కోల్ ఇండియా తెలిపింది. ఇందుకోసం విహంగం పేరుతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అధీకృత వ్యక్తులు ఈ పోర్టల్ ద్వారా ఎక్కడి నుంచైనా డ్రోన్ను ఆపరేట్ చేయవచ్చు. ఒడిషాలోని తాల్చేర్ బొగ్గు గనుల్లో భువనేశ్వరి, లింగరాజ్ ఓపెన్కాస్ట్ మైన్స్లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మహానది కోల్ఫీల్డ్స్ వాటా 20 శాతంపైమాటే. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
నాలుగో రౌండ్లో 8 బొగ్గు గనులే వేలం!
న్యూఢిల్లీ: నాలుగో రౌండ్ వేలంలో 99 బొగ్గు గనులను వేలంలో ఉంచగా, కేవలం ఎనిమిది బ్లాకులను మాత్రమే విజయవంతంగా వేలం వేసినట్లు బుధవారం ఆ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ గనులు ఉన్నాయని తెలిపారు. కాగా, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ లోక్సభకు ఒక లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను ఉల్లంఘించినట్లు అనుమానిస్తున్న 281 కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు స్వీకరించినట్లు తెలిపారు. చదవండి: యూజర్లకు భారీ షాక్, మోత మొదలైంది..మళ్లీ పెరగనున్న ఫోన్ బిల్! -
ఆపరేషన్ బొగ్గు.. డాక్యుమెంట్ విడుదల చేసిన మధుయాష్కీ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ బొగ్గు పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ చంద్రగుప్త బొగ్గు గనుల టెండర్ ఇచ్చిందని సెటైర్లు వేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తన కంపెనీ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. ఆయన రాజకీయమంతా బ్యాక్డోర్ లాబీయింగ్ అని విమర్శలు గుప్పించారు. చదవండి: సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు -
ప్రజల పైకి దూసుకొచ్చిన ట్రక్...నలుగురు మృతి
జార్ఖండ్: దసరా వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బోగ్గుతో కూడిన ట్రక్ ప్రజలపైకి దూసుకురావడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్లోని రామ్గఢ్లో చోటు చేసుకుంది. ఈ ట్రక్ అతి వేగంగా వస్తూ ఇద్దరు వాహనదారులను ఢీ కొట్టి మరికొంతమంది ప్రజలపైకి దూసుకొచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా, మరికొంతమందికి తీవ్ర గాయలపాలైనట్లు తెలిపారు. దసరా సందర్భండా ఆ కుటుంబం హాయిగా గడిపేందుకు బయటకు రావడంతో ఈ ప్రమాదం బారిన పడినట్లు పేర్కొన్నారు. పోలీసులు సదరు ట్రక్ని సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రమాదవశాత్తు రైఫిల్ కాల్పుల్లో వ్యక్తి మృతి) -
జీడీపీలో ఖ‘నిజ’ లక్ష్యం 2.5 శాతం
సాక్షి, హైదరాబాద్: దేశ జీడీపీలో బొగ్గు, పెట్రోలియం మినహా ఇతర ఖనిజాల వాటాను 2030 నాటికి 2.5 శాతానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్లో 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే రాష్ట్రాల గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సును శుక్రవారం ప్రహ్లాద్జోషి ప్రారంభించారు. ఖనిజ రంగాన్ని ఆత్మనిర్భర్గా మార్చేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత ఆర్థికరంగంలో భూగర్భ వనరుల రంగం పాత్ర చాలా తక్కువ. పెట్రోలియం, బొగ్గును కూడా కలుపుకుంటే దేశ జీడీపీలో మైనింగ్ రంగం వాటా సుమారు రెండు శాతంగా ఉంది. పెట్రోలియం, బొగ్గును మినహాయిస్తే ఒక శాతానికి అటూ ఇటూగా ఉంది’అని జోషి వెల్లడించారు. వేలం ఆదాయం రాష్ట్రాలకే ఇస్తున్నాం ‘బొగ్గు గనుల వేలం కోసం కేంద్రం ఎన్నో ప్రయాసలకోర్చినా, వచ్చిన ఆదాయం మాత్రం రాష్ట్రాలకే ఇస్తున్నాం. ఈ విధానం ద్వారా రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పనతోపాటు ఆర్థిక రంగానికి ఊతం లభిస్తోంది. నామినేషన్ పద్ధతికి స్వస్తి పలుకుతూ 2015లో తెచ్చిన సంస్కరణల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే వంద శాతం ఖనిజాన్వేషణ పూర్తయినా భారత్లో మాత్రం పది శాతంగానే ఉంది. ఖనిజాన్వేషనలో నిబంధనలు సరళీకృతం చేసి, అనుమతుల జారీలో లంచగొండితనాన్ని రూపుమాపాం’అని జోషి ప్రకటించారు. ‘లీజు పునరుద్ధరణ, బిడ్డింగ్ నిబంధనల సడలింపుతోపాటు సకాలంలో మైనింగ్ ప్రారంభించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో ఒడిషాసహా పలు రాష్ట్రాలు మైనింగ్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. నేషనల్ మినరల్ ఎక్స్ప్లొరేషన్ ట్రస్టు (ఎన్మెట్)కు రూ.4,050 కోట్లు సమకూరగా, ఖనిజాన్వేషణ కోసం రాష్ట్రాలకు ఇందులో నుంచి నిధులు ఇస్తున్నాం’అని కేంద్రమంత్రి ప్రకటించారు. 2047 నాటికి మైనింగ్ రంగానికి సంబంధించి అమృత్ కాల్ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. గనుల మంత్రిత్వ శాఖ పథకాలు, కార్యక్రమాలను వివరించే ‘ది మైనింగ్ ఎరీనా’డిజిటల్ వేదికను మంత్రి ప్రారంభించారు. ఏపీ సహా 11 రాష్ట్రాల మంత్రులు హాజరు గనులశాఖ మంత్రుల సదస్సుకు ఏపీ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా 11 రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. 19 రాష్ట్రాల అధికారులు, కేంద్రం బొగ్గు, గనులు, స్టీల్ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి ఏడు రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో ఖనిజ లభ్యత సంభావ్యత, మైనింగ్ రంగంలోని సవాళ్లను వివరించారు. -
అదానీ పవర్ చేతికి డీబీ పవర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ ఛత్తీస్గఢ్లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు కలిగిన డీబీ పవర్ను కొనుగోలు చేయనుంది. రూ. 7,017 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు అదానీ పవర్ వెల్లడించింది. డీబీ పవర్ జాంజ్గిర్ చంపా జిల్లాలోగల 600 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లను నిర్వహిస్తోంది. 923.5 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకి మధ్య, దీర్ఘకాలిక ఒప్పందాలను కలిగి ఉంది. పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియాతో ఇంధన సరఫరా ఒప్పందాలను సైతం కలిగి ఉంది. నగదు చెల్లించేవిధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ పేర్కొంది. దీనిలో భాగంగా డీబీ పవర్ మాతృ సంస్థ డిలిజెంట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్లో 100 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. డీబీ పవర్లో డిలిజెంట్ పవర్ మొత్తం ఈక్విటీ మూలధనాన్ని కలిగి ఉన్నట్లు వివరించింది. 2022 అక్టోబర్ 31లోగా వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువును పెంచుకోనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో ఛత్తీస్గఢ్లో థర్మల్ పవర్ సామర్థ్యాన్ని విస్తరించుకోనున్నట్లు పేర్కొంది. 2006లో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో రిజిస్టరైన డీబీ పవర్ గతేడాది(2021–22)లో రూ. 3,448 కోట్ల టర్నోవర్ను సాధించింది. అంతక్రితం ఏడాది(2020–21)లో రూ. 2,930 కోట్ల్ల, 2019–20లో రూ. 3,126 కోట్లు చొప్పున ఆదాయం లభించింది. -
దేశంలో మళ్లీ బొగ్గు సంక్షోభం.!
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా బొగ్గు సంక్షోభం మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గతేడాది అక్టోబర్లో మొదలైన బొగ్గు సంక్షోభం ఆ తరువాత కాస్త తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఏడాది మార్చి నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో వేసవిలో మరోసారి బొగ్గు కొరత ఏర్పడింది. వర్షాలు కురిసే వరకూ సాధారణ స్థితికి చేరలేదు. మూడోసారి వచ్చే ఆగస్టులో బొగ్గు సంక్షోభం ముంచుకురానుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేయడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఇదీ పరిస్థితి: దేశ వ్యాప్తంగా 180 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుండగా ప్రస్తుతం వాటిలో 74 కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. కేవలం సొంత బొగ్గు గనులున్న కేంద్రాలు మాత్రమే 92 శాతం నిల్వలతో ఉన్నాయి. దిగుమతిపై ఆధారపడే కేంద్రాల్లో అవసరమైన దానిలో 45 శాతం మాత్రమే బొగ్గు ఉంది. ఆగస్టులో వర్షాలతో బొగ్గు తవ్వకాలకు ఆటంకం, రవాణాలో తలెత్తే ఇబ్బందుల వల్ల ఈ నిల్వలు మరింత తగ్గిపోనున్నాయి. బొగ్గు ద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తి 204.9 గిగావాట్లు కాగా, దీనిలో 17.6 గిగావాట్లు విదేశీ బొగ్గుతో జరుగుతోంది. ఇందుకోసం 64.89 మిలియన్ టన్నుల బొగ్గును జూన్లో సరఫరా చేశారు. గతేడాది కంటే ఇది 30.8 శాతం ఎక్కువ. అయితే దేశంలో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 1,500 మిలియన్ టన్నులుంటే దానిలో సగమే జరుగుతోంది. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. గతేడాది ఇదే సమయానికి రోజు 140 మిలియన్ యూనిట్లు వినియోగం జరిగింది. ఈ ఏడాది 35 శాతం డిమాండ్ పెరిగింది. జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి 50 మిలియన్ యూనిట్లు మాత్రమే వస్తోంది. బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 6.45 చొప్పున 21.81 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా, ఇక్కడ ప్రస్తుతం 68,457 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇవి సుమారు 3 రోజులకు సరిపోతాయి. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ (కృష్ణపట్నం)లో రోజుకి 19 వేల మెట్రిక్ టన్నులు ఖర్చవుతుండగా 3,25,129 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. దీంతో దాదాపు 17 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఏపీ సన్నద్ధం ఆగస్టులో బొగ్గు సంక్షోభం, విద్యుత్ డిమాండ్ వల్ల వచ్చే విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ సన్నద్ధమవుతున్నాయి. ఏపీ జెన్కో, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్)లు 31 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నాయి. దీనిని నిల్వ చేసి సంక్షోభం తలెత్తే సమయానికి వినియోగించనున్నారు. అదే విధంగా రాష్ట్రానికి బొగ్గును సరఫరా చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్వాపింగ్ విధానంలో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను ఇచ్చిపుచ్చుకునేలా ఇంధన శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆగస్టులో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనేందుకు వీలుగా షార్ట్టెర్మ్ టెండర్లు పిలిచారు. -
మేలో మౌలిక రంగం భారీ వృద్ధి
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ మేనెల్లో (2021 మే నెలతో పోల్చి) భారీగా 18.1 శాతం పురోగతి సాధించింది. ఈ స్థాయి ఫలితం నమోదుకావడం 13 నెలల తర్వాత ఇదే తొలిసారి. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్లతో కూడిన ఈ గ్రూప్ వెయిటేజ్ మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో దాదాపు 44 శాతం. మే నెల్లో బొగ్గు (25.1 శాతం), క్రూడ్ ఆయిల్ (4.6 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (16.7 శాతం), ఎరువులు (22.8 శాతం), సిమెంట్ (26.3 శాతం) విద్యుత్ (22 శాతం) రంగాలు మంచి పురోగతి సాధించాయి. అయితే సహజ వాయువు ఉత్పత్తి 7 శాతం క్షీణించగా, స్టీల్ ఉత్పత్తి 15 శాతం పడింది. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 13.6 శాతంగా నమోదయ్యింది. -
దేశంలో విద్యుత్ సంక్షోభం..కోల్ ఇండియాకు కేంద్రం కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: రానున్న కాలంలో విద్యుత్ రంగ యుటిలిటీలకు అవసరమయ్యే బొగ్గును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉండవలసిందిగా ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రానున్న 13 నెలల్లో 12 మిలియన్ టన్నుల(ఎంటీ) కోకింగ్ కోల్ను దిగుమతి చేసుకోవలసి ఉంటుందంటూ సూచించింది. ఎంతమొత్తం బొగ్గు కాలవసిందీ వెల్లడించేందుకు రాష్ట్ర జెన్కోలు, స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థలు శనివారం మధ్యాహ్నంవరకూ గడువును కోరినట్లు తెలుస్తోంది.తద్వారా కోల్ ఇండియా దిగుమతులకు ఆర్డర్లను పెట్టే వీలుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 2015 తదుపరి మహారత్న కంపెనీ కోల్ ఇండియా తిరిగి బొగ్గును దిగుమతి చేసుకోనుంది. కాగా..ఈ జులై నుంచి 2023 జులై మధ్య కాలంలో 12 ఎంటీ బొగ్గు దిగుమతులకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఈ ఏడాది ఏప్రిల్లో విద్యుత్ కోతలకు తెరలేచిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో ప్రభుత్వం బొగ్గు నిల్వలు సిద్ధం చేసేందుకు తగిన సన్నాహాలు చేపట్టినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. -
రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమగా సింగరేణి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమగా ఉన్న సింగరేణి ఇప్పటికే తగినంత బొగ్గు, విద్యుత్ అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, రాష్ట్రంలోనే కాక దేశంలోనే అత్యుత్తమ వృద్ధి నమోదు చేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోందని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణి భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధన దిశగా కృషి చేయనున్నామన్నారు. గత ఎనిమిదేళ్లలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలలో అత్యద్భుత వృద్ధిని నమోదు చేసి దేశంలో గల నవరత్న కంపెనీలకు దీటుగా నిలబడిందని పేర్కొన్నారు. 2014తో పోల్చితే నాడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన కంపెనీ గత ఆర్థిక ఏడాది రికార్డు స్థాయిలో 65 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసిందని, నాడు రూ.11 వేల కోట్ల టర్నోవర్ ఉండగా అది గతేడాది రూ.26 వేల కోట్లకు పెరిగిందని, లాభాలు కూడా గణనీయంగా పెరిగాయని, ఈ అభివృద్ధి ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. -
విదేశీ బొగ్గుతో.. ‘విద్యుత్’ మోత!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు తప్పనిసరిగా బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. విద్యుత్ ధరల మోత మోగనుంది. ప్రధానంగా కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల (సీజీఎస్)తోపాటు ప్రైవేటు విద్యుత్ కేంద్రాల నుంచి నుంచి రాష్ట్రానికి సరఫరా అవుతున్న విద్యుత్ ధరలు పెరగనున్నాయి. దీనితో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతోపాటు సామాన్య వినియోగదారులపైనా ప్రభావం పడనుంది. పదింతల ధరతో.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 10శాతం బొగ్గును 90శాతం దేశీయ బొగ్గుతో కలిపి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నాణ్యత ఆధారంగా సింగరేణి బొగ్గు ధరలు టన్నుకు రూ.3,000–5,000 వరకు ఉండగా.. దిగుమతి చేసుకునే బొగ్గు ధరలు టన్నుకు రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటున్నాయి. విదేశీ బొగ్గు కారణంగా ఒక్కో యూనిట్ విద్యుత్ ధర అదనంగా 9–10 పైసలు పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. మొత్తంగా ఏడాదికి రూ.630 కోట్లు భారం పడుతుందని పేర్కొన్నాయి. మొత్తం రూ. 7,173 కోట్లు రాష్ట్రానికి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా.. ఎన్టీపీసీ సహా ఇతర కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 2,650 మెగావాట్లు, సెమ్బ్కార్ప్ అనే ప్రైవేటు సంస్థ నుంచి 840 మెగావాట్లు థర్మల్ విద్యుత్ రాష్ట్రానికి సరఫరా అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 17,116.91 మిలియన్ యూనిట్లు విద్యుత్ను కొనుగోలు చేయడానికి రాష్ట్ర డిస్కంలకు ఈఆర్సీ అనుమతిచ్చింది. ఈ విద్యుత్కు స్థిర ధర వ్యయం రూ.2,112.01 కోట్లు, చర వ్యయం రూ.4,601.41 కోట్లు కలిపి.. మొత్తం రూ.6,713.42 కోట్లు వ్యయం అవుతుందని ఈఆర్సీ అంచనా వేసింది. 10శాతం దిగుమతైన బొగ్గును వాడితే చర వ్యయం అదనంగా రూ.460.14 కోట్లు పెరిగి.. మొత్తం వ్యయం రూ.7,173.56 కోట్లకు చేరుతుంది. ఇక సెమ్బ్కార్ప్ ఎనర్జీ నుంచి 7,353.58 ఎంయూ విద్యుత్ కొనుగోళ్లకు ఈఆర్సీ అనుమతిచ్చింది. ఇందుకు రూ.1,471.29 కోట్ల స్థిర వ్యయం, రూ.1,697.44 కోట్ల చర వ్యయం కలిపి మొత్తం రూ.3,168.7 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దిగుమతి చేసుకున్న బొగ్గు వాడితే చర వ్యయం అదనంగా రూ.169.74 కోట్లు పెరిగి.. మొత్తం వ్యయం రూ.3,338.44 కోట్లు అవుతుంది. రేపటితో ముగియనున్న డెడ్లైన్! దేశంలోని అన్ని థర్మల్ ప్లాంట్లు మే 31లోగా బొగ్గు దిగుమతుల కోసం ఆర్డర్ చేయాలని, జూన్ 15 నాటికి ఆ బొగ్గు విద్యుత్ కేంద్రాలకు వచ్చి చేరాలని కేంద్రం గడువు విధించింది. రాష్ట్రంలో 4,042.5 మెగావాట్ల తెలంగాణ జెన్కో, 1,200 మెగావాట్ల సింగరేణి, 2,600 మెగవాట్ల ఎన్టీపీసీ–రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. సింగరేణి బొగ్గు లభ్యత పుష్కలంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ జెన్కో, సింగరేణి సంస్థ బొగ్గు దిగుమతులు చేసుకోబోమని ఇప్పటికే కేంద్రానికి తేల్చి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ఎన్టీపీసీ బొగ్గు దిగుమతులు చేసుకోనుంది. విద్యుత్ స్థిర, చర వ్యయాలేంటి ? థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అయ్యే స్థిర, చర వ్యయాలను కలిపి యూనిట్ విద్యుత్ ధరను ఖరారు చేస్తారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం పెట్టిన పెట్టుబడులను/పెట్టుబడి రుణాలను వడ్డీతో సహా కలిపి స్థిర వ్యయం పేరుతో రాబట్టుకుంటారు. విద్యుదుత్పత్తికి వాడే బొగ్గు, ఇతర ఖర్చులు, నిర్వహణ వ్యయాలను చర వ్యయం కింద లెక్కించి వసూలు చేస్తారు. -
ప్రతి వారం 15% బిల్లు కట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: విదేశీ బొగ్గు దిగుమతులకు సంబంధించి కేంద్రం రోజుకో కొత్త ఉత్తర్వుతో రాష్ట్రాలను కలవర పెడుతోంది. బొగ్గు దిగుమతులకు అవసరమైన నిధుల లభ్యతకు వీలుగా విద్యుదుత్పత్తి కంపెనీలకు ఇకపై ప్రతి వారం కనీసం 15 శాతం బిల్లులను చెల్లించాలని దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను కేంద్ర విద్యుత్ శాఖ గురువారం ఆదేశించింది. విద్యుదుత్పత్తి కంపెనీలు బిల్లు జారీ చేసిన తేదీ నుంచి వారంలోగా తప్పనిసరిగా కనీసం 15 శాతం చెల్లింపులు చేయాలని, మిగిలిన 85 శాతం చెల్లింపులను విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లోని నిబంధనల ప్రకారం జరపాలని సూచించింది. వారంలోగా 15 శాతం బిల్లులు చెల్లించడంలో విఫలమైతే, విద్యుదుత్పత్తి కంపెనీలు ఒప్పందం ప్రకారం డిస్కంలకు అమ్మాల్సిన విద్యుత్లో 15 శాతాన్ని పవర్ ఎక్సే్చంజీల్లో అమ్ము కోవడానికి వీలు కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. 15% విద్యుత్ కోల్పోయే ప్రమాదం! ఈ నిబంధనల ప్రభావం రాష్ట్ర డిస్కంలపై పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా ఎన్టీపీసీ, ఇతర కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి నుంచి 3,111 మెగావాట్లు, ఛత్తీస్గఢ్ నుంచి 1,000 మెగావాట్లు, ప్రైవేటు సెమ్కార్ప్ సంస్థ నుంచి 840 మెగావాట్ల థర్మల్ విద్యుత్ను రాష్ట్ర డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయి. 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించడానికి ఒప్పందాల్లో నిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే ఈ గడువులోగా చెల్లింపులు చేయకలేక ఇప్పటికే రూ.వందల కోట్ల అపరాధ రుసుముతో బకాయిలను చెల్లించే పరిస్థితిని డిస్కంలు ఎదుర్కొంటున్నాయి. తాజాగా కేంద్రం జారీ చేసిన తాజా ఆదేశాలు డిస్కంలకు మరింత ఇబ్బందికరంగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతివారం 15 శాతం బిల్లులను చెల్లించని పక్షంలో ఒప్పందం ప్రకారం రావాల్సిన విద్యుత్లో 15 శాతాన్ని రాష్ట్రం కోల్పోయే ప్రమాదం ఉంది. 10 శాతం దిగుమతి చేసుకున్న బొగ్గు వాడకంతో పెరగనున్న విద్యుదుత్పత్తి వ్యయాన్ని సైతం డిస్కంల నుంచి జనరేటర్లు వసూలు చేసుకోవాలని సూచించిన కేంద్ర విద్యుత్ శాఖ, ఈ అదనపు వ్యయాన్ని లెక్కించడానికి కొత్త ఫార్ములాను సైతం ప్రకటించడం గమనార్హం. ‘దిగుమతి బొగ్గు ప్రభావం’ ఉండదనుకుంటే కొత్త బెడద దేశంలో బొగ్గు కొరత తీవ్రమైన నేపథ్యంలో దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 90 శాతం దేశీయ బొగ్గులో 10 శాతం దిగుమతి చేసుకున్న బొగ్గును తప్పనిసరిగా కలిపి (బ్లెండ్ చేయడం అంటారు) విద్యుదుత్పత్తి జరపాలని గతంలో కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన విదేశీ బొగ్గు కొనుగోళ్లకు ఈ నెల 31లోగా ఆర్డర్లు జారీ చేయాలని, వచ్చే నెల 15లోగా దిగుమతులు ప్లాంట్ల వద్దకు చేరుకోవాలని మరో ఉత్తర్వులో గడువులు విధించింది. గడువులోగా ఆర్డర్లు ఇవ్వని పక్షంలో ఆ తర్వాత 15 శాతం బొగ్గును దిగుమతి చేయాల్సి ఉంటుందని అల్టిమేటం జారీచేసింది. అయితే రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులున్న నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో బొగ్గు దిగుమతులకు సంబంధించిన ఆదేశాల ప్రభావం జెన్కో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఉండదని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా ప్రతి వారం 15 శాతం బిల్లులను జెనరేటర్లకు చెల్లించాలని, లేనిపక్షంలో 15 శాతం విద్యుత్ కట్ చేస్తామని కేంద్రం చెప్పడంతో కొత్త బెడద వచ్చి పడినట్టయ్యింది. -
యుద్ధ ప్రాతిపదికన బొగ్గు సేకరణ
సాక్షి, అమరావతి: భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. విద్యుత్కు విపరీతంగా డిమాండ్ ఏర్పడడంతో.. దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుదుత్పత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ బొగ్గు సమస్య తీవ్రమై ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం దిగుమతులపైనా పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని ఇంధన శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో దాదాపు 32 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చుకోవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రికార్డు స్థాయిలో వినియోగం.. రాష్ట్ర్రంలో పీక్ డిమాండ్ రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 12,293 మెగావాట్లకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్. ఈ నెల ప్రారంభంలో దాదాపు 11,767 మెగావాట్లుగా ఉన్న డిమాండ్ ప్రస్తుతం 9,711 మెగావాట్లుగా ఉంది. ఇక రోజువారీ విద్యుత్ డిమాండ్కు తగ్గట్టుగా 200 మిలియన్ యూనిట్లను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. దీనిలో బుధవారం రూ.56.75 కోట్లతో 40.32 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్నుంచి యూనిట్ రూ.14.07 చొప్పున కొనుగోలు చేశారు. నెలలోపే టెండర్లు ఖరారు.. కొరతను అధిగమించేందుకు బొగ్గును దిగుమతి చేసుకోవటానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్కోను ఆదేశించింది. దీంతో కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల ఉత్పత్తిని పెంచడానికి ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లక్ష టన్నుల దిగుమతి చేసుకున్న మెరుగైన గ్రేడ్ బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. అదే విధంగా ఏపీజెన్కో 18 లక్షల టన్నుల కోసం, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) 13 లక్షల టన్నుల కోసం తాజాగా టెండర్లు ఆహ్వానించాయి. ఈ మొత్తం టెండర్ల ప్రక్రియను నెల రోజుల్లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎక్కడా దొరకని బొగ్గు, విద్యుత్.. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో 0.83 రోజులు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 2.10 రోజులు, కృష్ణపట్నంలో 6.02 రోజులు, హిందుజాలో 4.24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో బొగ్గు క్షేత్రాలు లేకపోవడంతో మహానది కోల్ ఫీల్డ్స్, సింగరేణి కాలరీస్పై ఆధారపడాల్సి వస్తున్నది. అక్కడి నుంచి కూడా తగినంత బొగ్గు సరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో అవసరమైన బొగ్గును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మరోవైపు విద్యుత్ ఎక్సే్ఛంజీల్లోనూ కరెంటు పరిమితంగానే దొరుకుతోంది. కొనుగోలు వ్యయం గత పదేళ్లలో లేనంతగా రికార్డు స్థాయికి చేరుకుంది. యూనిట్ రూ.12 నుంచి 16 వరకు పలుకుతోంది. పీక్ అవర్స్లో రూ.20కి కూడా కొనాల్సి వస్తోంది. -
ఊపిరి సలపని సంక్షోభం
కొలిమిలో కాలుతున్న ఇనుముపై సమ్మెటపోటంటే ఇదే. ఒకవైపు ఉష్ణపవనాలు... మరోవైపు బొగ్గు కొరత, ఫలితంగా కరెంట్ కష్టాలు. ఇప్పుడు దేశమంతటా ఇదే పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, జమ్మూ– కశ్మీర్ ... సహా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణావనుల్లోని కనీసం 16 రాష్ట్రాలంతటా అదే దృశ్యం. గడచిన 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతటి అత్యధిక ఉష్ణోగ్రతలు గత నెలలో వాయవ్య, మధ్య భారతావనిలో నమోదయ్యాయంటే వర్తమాన వేసవి కాలపు మహోగ్ర రూపం అర్థం చేసుకోవచ్చు. సోమవారం ఒకటికి రెండు ఉన్నత స్థాయి సమావేశాలు జరగడం పరిస్థితి తీవ్రతకు దర్పణం. ఉష్ణ పవనాల ముప్పుపై ప్రధానమంత్రి కార్యాలయం సమావేశం జరిపింది. అలాగే, బొగ్గు కొరత – రవాణాలో సవాళ్ళపై హోమ్ మంత్రి నివాసంలో విద్యుత్, బొగ్గు, రైల్వే మంత్రులతో ఉన్నత స్థాయి భేటీ సాగింది. పలు రాష్ట్రాలు అదనపు విద్యుత్కై అభ్యర్థించాక ఎట్టకేలకు కేంద్రం బరిలోకి దిగింది. వేసవి వచ్చే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మన దేశంలో విద్యుత్ కొరత ఏటా ఉండేదే. దానికిప్పుడు ఉడుకెత్తిస్తున్న ఉష్ణ పవనాలు అదనం. విద్యుత్ గిరాకీ, సరఫరాల మధ్య ప్రతిసారీ తలెత్తుతున్న అంతరానికీ, తాజా సంక్షోభానికీ బొగ్గుపైనే ఆధారపడడమే కారణం. దాదాపు 400 గిగావాట్ల విద్యుచ్ఛక్తిని, అందులోనూ దాదాపు 40 శాతాన్ని కాలుష్యరహితంగా ఉత్పత్తి చేసే స్థాపక సామర్థ్యం మన దేశానిది. కానీ, ఈ ఏప్రిల్ ఎండల్లో దేశంలో గరిష్ఠ డిమాండ్ ఒక రోజు 205 గిగావాట్లకు పెరిగింది. మన దేశ విద్యుదుత్పత్తి సామర్థ్యంలో సగానికి పైగా బొగ్గు నుంచి తయారవుతుంది. కానీ, 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సిన విద్యుత్కేంద్రాల్లో 9 రోజులకు సరిపడా నిల్వలే గత వారం మిగిలాయి. నిల్వలు లేవని రాష్ట్రాలు, ఉన్నాయని కేంద్రం భిన్న వాదాలకు దిగాయి. మరోపక్క ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో కోవిడ్కు మునుపటి రోజులకు విద్యుత్ గిరాకీ పెరిగింది. వేసవి తాపం ఏప్రిల్లోనే విజృంభించేసరికి, ఏసీల వాడకం హెచ్చింది. అదీ ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతో రష్యా చమురు, గ్యాస్పై వివిధ దేశాల నిరోధాలతో, అంతర్జాతీయంగా ఆ కొరతను బొగ్గుతో తీర్చాల్సిన పరిస్థితి. అలా ప్రపంచ విపణిలో బొగ్గు రేట్లు నింగికెగసాయి. సాధారణంగా మనం ఇండొనేషియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల నుంచి 200 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు దిగుమతి చేసుకుంటాం. తీరా టన్ను 100 డాలర్లుండే ఆస్ట్రేలియా బొగ్గు ఇప్పుడు 440 డాలర్లు పలుకుతోంది. అది తాళలేక మన బొగ్గు దిగుమతిదారులు స్థానిక వనరుల వైపు చూస్తున్నారు. ఇక్కడేమో బొగ్గు కొరత. గనుల నుంచి విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు తగినన్ని రైల్వే ర్యాక్లు లేక మరో ఇబ్బంది. జాతీయంగా, అంతర్జాతీయంగా బొగ్గు రేట్లు పెరిగేసరికి, రూ. 3–4 ఉండే యూనిట్ విద్యుత్ ధర ఇప్పుడు రూ. 12 అయింది. స్థూలంగా ఇదీ పరిస్థితి. తవ్వే కొద్దీ తరిగిపోయేదే గనక, భవిష్యత్తులో ఈ శిలాజ ఇంధన వనరులు మరింత క్షీణించి, సంక్షోభం తీవ్రమవుతుంది. భవిష్యత్ మాట అటుంచితే, ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలను అవసరమైన చోటికి సమర్థంగా తరలించడంలోనూ అలసత్వమే కనిపిస్తోంది. బొగ్గు, విద్యుత్, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వెక్కిరిస్తోంది. బొగ్గు రవాణాకు కావాల్సిన రైలు ర్యాక్లను సమయానికి అందించాల్సిన బాధ్యత రైల్వే శాఖది. ఆ ర్యాక్లలో బొగ్గును నింపడం, గమ్యస్థానం చేరాక దింపడం బొగ్గు శాఖ పని. విద్యుత్ శాఖ లక్ష్యాలు చేరడానికి ఆ తొలి రెండు శాఖల సమన్వయం, సమర్థత కీలకం. తీరా ఇప్పుడు దేశంలో బొగ్గు ఉత్పత్తి బాగున్నా, రోజు వారీ వ్యవహారంగా సాగాల్సిన రవాణా కుంటుపడింది. ఈ శాఖల మధ్య సమన్వయ లోపం సామాన్యులకు శాపమైంది. రైల్వేల సరకు రవాణాలో దాదాపు 18 శాతం వాటా ఈ బొగ్గు రవాణాదే. దేశీయంగా బొగ్గుకు డిమాండ్ పెరుగుతుందని తెలిసినా, రైల్వే శాఖ ముందుగా తగిన ర్యాక్లు సిద్ధంగా పెట్టుకోకపోవడం ఘోరమైన స్వీయతప్పిదం. చివరకు విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరా కోసం మే చివరి వరకు 21 ప్రయాణికుల రైళ్ళలో దాదాపు 753 ట్రిప్లను రైల్వే శాఖ రద్దు చేయాల్సి వచ్చింది. కరెంట్ కష్టాలు తప్పించే చర్యలో భాగంగా రైళ్ళను రద్దు చేసి, ప్రయాణికుల్ని కష్టాల పాలు చేసింది. భారత ప్రభుత్వ శాఖలు ఇలా సమన్వయ రహితంగా దేనికది పని చేస్తే పెద్ద చిక్కే. బొగ్గు తవ్వకందార్లు, విద్యుదుత్పత్తిదార్లు, రవాణా చూసే భాగస్వామ్య పక్షాలు ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడమే సరిపోతోంది. బొగ్గు ఏమీ తరగని గని కాదు గనక, భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు మరిన్ని తప్పవు. ఇకనైనా కళ్ళు తెరవాలి. పునర్వినియోగ ఇంధన వనరుల్ని ఆశ్రయించాలి. సౌర, పవన విద్యుత్ సహా రకరకాల ప్రత్యామ్నాయాల వైపు గట్టిగా దృష్టి సారించాలి. ఇతర దేశాల అనుభవాలనూ అర్థం చేసుకోవాలి. కొన్ని దేశాలు అర్ధంతరంగా బొగ్గు నుంచి పునర్వినియోగ ఇంధనాల వైపు మారి, మరిన్ని చిక్కులు కొని తెచ్చుకున్నాయి. అందుకే, క్రమంగా అటువైపు మారడం మంచిది. పదే పదే తలెత్తుతున్న బొగ్గు సమస్యను సాంప్రదాయిక దృష్టి కోణం నుంచే కాకుండా, శరవేగంతో మారుతున్న వాతావరణం వైపు నుంచి కూడా చూడాలి. భాగస్వామ్యపక్షాలన్నీ కలసి కూర్చొని, సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా సాగితే, బొగ్గుపై ఆధారపడడం తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక పరిష్కారాలు చూడవచ్చు. ఉమ్మడి జాబితాలోని విద్యుత్పై రాష్ట్రాలూ, రాష్ట్ర జెన్కోలూ వాస్తవిక దృష్టితో సాగాలి. వాతావరణం అనూహ్యంగా మారిపోతుంటే, ఆలస్యంగా అడుగులు వేస్తామంటే అర్థం లేదు. వేసవిలో దాహం తప్పదని తెలిశాక, ముందుగానే నూతిని తవ్విపెట్టుకోవడమే విజ్ఞత. -
బయోమాస్పెల్లెట్లతో పవర్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో బొగ్గు సంక్షోభం తీవ్రమవడంతో ప్రత్యామ్నాయాలపై నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బయోమాస్ పెల్లెట్లను బొగ్గుతో కలిపి విద్యుదుత్పత్తికి వాడాలని నిర్ణయించింది. టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్ల ఉత్పత్తికి భారతీయ స్టార్టప్ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది. సరఫరాదారులతో ఏడేళ్ల కాలవ్యవధితో ఒప్పందాలు చేసుకోనుంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గుతో పాటు 5–10 శాతం బయోమాస్ను ఇంధనంగా వాడాలని కేంద్రం ఆదేశించడంతో ఎన్టీపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత, ధరలు పెరిగి దేశ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు తీవ్రమై ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి బొగ్గు రవాణా పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. దీనికి తోడు బయోమాస్ పెల్లెట్ల వాడకానికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తప్పనిసరి కొత్త బయోమాస్ వినియోగ పాలసీ ప్రకారం.. బాల్ మిల్, ట్యూబ్ మిల్ తరహావి మినహా మిగతా అన్ని థర్మల్ ప్లాంట్లు బొగ్గులో 5–10 శాతం బయోమాస్ను కలిపి వాడాలి. బాల్ మిల్ తరహా విద్యుత్ కేంద్రాలు రెండేళ్లపాటు 5 శాతం, తర్వాతి నుంచి 7 శాతం బయోమాస్ను వాడాలి. బాల్ అండ్ రేస్ మిల్ తరహావి 5 శాతం బ్లెండ్ చేసిన బయోమాస్ పెల్లెట్లను.. బాల్ అండ్ ట్యూబ్ మిల్ తరహా ప్లాంట్లు 5 శాతం టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లను తప్పనిసరిగా వాడాలి. ఇప్పటినుంచి 25 ఏళ్లు, లేదా విద్యుత్ కేంద్రాల జీవితకాలం పాటు ఈ విధానం అమలు చేయాలి. బయోమాస్.. టొర్రిఫైడ్ పెల్లెట్లు జంతువుల అవశేషాలు, విసర్జితాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. అన్నింటిని పొడిచేసి యంత్రాల సాయంతో స్తూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వీటినే సాధారణ బయోమాస్ పెల్లెట్స్ అంటారు. ఇప్పటివరకు సాధారణ బాయోమాస్ పెల్లెట్ల వాడకంపై దృష్టి సారించిన ఎన్టీపీసీ.. ఇకపై భారీ మొత్తంలో బయోమాస్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు గాను టొర్రిఫైడ్ పెల్లెట్లను వాడాలని నిర్ణయించింది. సాధారణ బయోమాస్లో తేమను పూర్తిగా తొలగించి తీవ్ర ఉష్ణోగ్రతలో ఒత్తిడికి గురిచేసి గట్టిగా ఉండే పెల్లెట్లను తయారు చేస్తారు. బాగా మండేందుకు వీలుగా కొన్ని రసాయనాలు కలుపుతారు. వీటినే టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లు అంటారు. ఈ తరహా పెల్లెట్ల నుంచి ఎక్కువ మంట, ఉష్ణోగ్రత వెలువడతాయి. -
ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. కీలక వ్యవస్థలకు 24 గంటల కరెంట్ కష్టమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం డేంజర్స్ బెల్స్ మోగిస్తోంది. హీట్ వేవ్ కారణంగా దేశరాజధానిలో విద్యుత్ డిమాండ్ తారాస్థాయికి చేరడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మెట్రో, హాస్పిటల్స్ వంటి కీలక వ్యవస్థలకూ నిరంతర విద్యుత్ అందించడం సాధ్యంకాదని ప్రభుత్వం హెచ్చరించింది. బొగ్గు కొరత కారణంగా దాద్రీ-2, ఊంచహార్ పవర్ స్టేషన్స్ నుంచి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని... ఇది ఇలాగే కొనసాగితే, ఢిల్లీ మెట్రోతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్, ఇతర కార్యాలయాలకు 24 గంటలు విద్యుత్ అందించడం కుదరదని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టంచేసింది. విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు బొగ్గు సరఫరా కోసం ఢిల్లీ సర్కార్ కేంద్రం తలుపు తట్టింది. తక్షణమే బొగ్గు సరఫరా పెంచాలంటూ ఈమేరకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ విద్యుత్ అవసరాల్లో 25 నుంచి 30శాతం థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచే వస్తోందని వివరించారు. కేజ్రీవాల్ ప్రభుత్వ వినతిమేరకు ఢిల్లీకి బొగ్గు సరఫరాను పెంచేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినట్లు భారత రైల్వే వెల్లడించింది. చదవండి👉🏻పంజాబ్: శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు, వీడియోలు వైరల్ ఫుల్ డిమాండ్ ఏప్రిల్ నెలలో తొలిసారిగా రోజువారీ పవర్ డిమాండ్ 6వేల మెగావాట్ల మార్క్ను టచ్ చేసింది. తగినంత బొగ్గు నిల్వలు లేకపోవడంతో .. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే దాద్రీ -2 పవర్ స్టేషన్లో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దాద్రీ-2 నుంచి ఢిల్లీకి 1751 మెగావాట్ల విద్యుత్ అందుతోంది. ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోతే ఢిల్లీలో బ్లాకౌట్ కావడం ఖాయం అంటున్నారు నిపుణులు. చదవండి👉🏼 పెట్రోల్ ధరలు చాలా తక్కువ పెంచాం: కేంద్ర మంత్రి -
దేశంలో విద్యుత్ కష్టాలు పోవాలంటే..ఈ పనిచేయాల్సిందే!
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్ కష్టాలు ప్రత్యేకించి వేసవి కాలంలో తొలగిపోవాలంటే బొగ్గు సుంకం రహిత దిగుమతికి అనుమతించాలని పారిశ్రామిక సంస్థ– అసోచామ్ స్పష్టం చేసింది. దీనితోపాటు బొగ్గు రవాణా చేయడానికి రైల్వే రేక్ల లభ్యత భారీగా పెరగాలని, క్యాప్టివ్ జనరేటర్లకు డీజిల్ వేర్వేరు ధరలకు లభ్యమయ్యేలా చూడాలని కోరింది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు... ► విద్యుత్ సరఫరాలో వాణిజ్య వినియోగదారులతో విభేదాలు లేకుండా చూసుకోవాలని మేము రాష్ట్రాలు, డిస్కమ్లను కోరతాము. ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం ఆర్థిక పునరుద్ధరణ ఉన్నప్పటికీ పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ఇంకా మందగమనంలోనే ఉంది. ► ప్రపంచ సరఫరా పరిమితులు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు, డిస్కమ్లు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ►ప్రస్తుతం బొగ్గుపై దిగుమతి సుంకం 2.5 శాతం ఉన్నప్పటికీ, ఒత్తిడి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి సుంకాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాము. ►భారతదేశానికి ఆస్ట్రేలియా నుంచి ప్రధానంగా బొగ్గు దిగుమతి అవుతోంది. ఇటీవల ఆ దేశంతో భారత్కు కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) దేశ మధ్య, దీర్ఘకాలిక బొగ్గు సరఫరాల సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని భావిస్తున్నాం. తగిన బొగ్గు సరఫరాలు దేశంలో సకాలంలో అందేలా చర్యలు అవసరం. ►అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే అదనపు సాధారణ హీట్వేవ్ వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ►వర్షాలకు ఇంకా చాలా కాలం ఆగాల్సిన పరిస్థితి. విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్రాలు, పరిశ్రమలు సంయుక్తంగా నిరంతరం పర్యవేక్షణతో పరిస్థితిని నిర్వహించాల్సిన ఉంటుంది. ►ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై అసోచామ్ ఇప్పటికే సభ్యులపై సంప్రతింపులు జరిపింది. ఆయా అంశాలను ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. ►డిస్కమ్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కేంద్రం ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ►ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేవలం దృష్టి సారిస్తే సరిపోదు. పంపిణీకి సంబంధించి కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర, రాష్ట్రాలు పరిష్కరించాలి. అయితే, కేంద్రం ఈ దిశలో అనేక చర్యలతో ముందుకు వస్తోంది. వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు రాష్ట్రాల సహకారం కూడా అవసరం. ఇప్పటికే ప్రధానికి వినతులు... పరిశ్రమ బొగ్గు కొరత సమస్యలను సత్వరం పరిష్కరించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు కొరత వల్ల ఎక్సే్చంజీల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. తయారీ, క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్లపై (సీపీపీ) ఆధారపడే సంస్థలు, 10 పరిశ్రమల అసోసియేషన్లు కలిసి ఈ మేరకు ప్రధానికి సంయుక్తంగా ఒక వినతిపత్రం సమర్పించాయి. బొగ్గు సరఫరా సుదీర్ఘ సమయంగా తగ్గిపోవడం వల్ల అల్యుమినియం, సిమెంటు, ఉక్కు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.పరిశ్రమ వర్గాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీపీలు, ఉక్కు, సిమెంటు, స్పాంజ్ ఐరన్ వంటి రంగాలకు బొగ్గు సరఫరా 32 శాతం వరకూ తగ్గిపోయింది. -
ఎంఈసీఎల్తో సీఎంపీడీఐఎల్ విలీనం సన్నాహాల్లో ప్రభుత్వం!
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ కోల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్(సీఎంపీడీఐఎల్)ను మినరల్ ఎక్స్ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్)తో విలీనం చేసేందుకు యోచిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే సీఎంపీడీఐఎల్ను కోల్ ఇండియా అనుబంధ సంస్థగా కొనసాగించనున్నట్లు తెలియజేసింది. ఈ ప్రతిపాదనకు మద్దతుగా కేబినెట్ నోట్ను సిద్ధం చేయనున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. బొగ్గు రంగంలో సీఎంపీడీఐఎల్ ప్రధానంగా ఎక్స్ప్లొరేషన్, కన్సల్టెన్సీ సరీ్వసులను అందిస్తోంది. ఇతర ఖనిజాల(మినరల్స్)లోనూ వ్యాపార విస్తరణ నేపథ్యంలో కంపెనీని మరింత పటిష్ట పరచేందుకు ఎంఈసీఎల్లో విలీన ప్రతిపాదనను చేపట్టినట్లు బొగ్గు శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 6.5 శాతం పతనమై రూ. 189 వద్ద ముగిసింది. -
కాపాడండి మహాప్రభో..బొగ్గు కొరతపై మోదీకి విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: అనియంత్రిత రంగ సంస్థలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో సత్వరం జోక్యం చేసుకుని పరిష్కారమార్గం చూపాలని ప్రధాని నరేంద్ర మోదీకి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు కొరత వల్ల ఎక్ఛేంజీల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. తయారీ, క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్లపై (సీపీపీ) ఆధారపడే సంస్థలు మొదలైన వాటికి సంబంధించిన 10 పరిశ్రమల అసోసియేషన్లు కలిసి ఈ మేరకు ప్రధానికి వినతిపత్రం సమర్పించాయి. బొగ్గు సరఫరా సుదీర్ఘ సమయంగా తగ్గిపోవడం వల్ల అల్యుమినియం, సిమెంటు, ఉక్కు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. సీపీపీలు నిరుపయోగంగా పడి ఉండటంతో పాటు వాటిపై ఆధారపడిన సంస్థలు మార్కెట్ నుంచి విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని, దీనివల్ల మొత్తం వ్యవస్థ పనితీరు దెబ్బతింటోందని వినతిపత్రంలో పరిశ్రమలు వివరించాయి. చాలా మటుకు కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకోవడమో లేక మూసివేయడమో చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపాయి. దీనితో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయి, అంతిమంగా వినియోగదారులపై భారం పడుతుందని పేర్కొన్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీపీలు, ఉక్కు, సిమెంటు, స్పాంజ్ ఐరన్ వంటి రంగాలకు బొగ్గు సరఫరా 32 శాతం వరకూ తగ్గిపోయింది. జనవరి–మార్చిలోనే విద్యుత్, విద్యుత్యేతర రంగాలకు సమానంగా బొగ్గు సరఫరా జరిపి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని అవి తెలిపాయి. మరోవైపు, కోవిడ్–19 అనంతరం ఎకానమీలో డిమాండ్ ఒక్కసారిగా ఎగియడం, వేసవి మరికాస్త ముందుగానే రావడం, గ్యాస్ ధర .. దిగుమతి చేసుకున్న బొగ్గు రేటు పెరగడం, కోస్తా థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోవడం వంటి అంశాలు బొగ్గు కొరత.. విద్యుత్ డిమాండ్కు దారి తీశాయని బొగ్గు శాఖ కార్యదర్శి ఏకే జైన్ తెలిపారు. -
ఆరుగురితో విద్యుత్ ‘కోర్ కమిటీ’
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ సరఫరా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమలకు కూడా పరిమితులు తొలగించి, సాధారణ స్థితిలో విద్యుత్ సరఫరా చేయడానికి కృషిచేస్తోంది. దీన్లో భాగంగా బొగ్గు కొరత కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరతను అధిగమించడానికి చైర్మన్, ఐదుగురు సభ్యులతో కోర్ మేనేజ్మెంట్ టీమ్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంధనశాఖ కార్యదర్శి చైర్మన్గా ఉండే ఈ కమిటీలో జెన్కో డైరెక్టర్ (బొగ్గు), ట్రాన్స్కో డైరెక్టర్ (గ్రిడ్), ట్రాన్స్కో డైరెక్టర్ (ఫైనాన్స్), ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సభ్యులుగా ఉంటారు. ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఈ కమిటీకి కూడా మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఫ్యూయెల్ సప్లై అగ్రిమెంట్స్ (ఎఫ్ఎస్ఏ) ప్రకారం బొగ్గును సక్రమంగా సరఫరాకు సింగరేణి కాలరీస్, మహానది కోల్ఫీల్డ్స్ బొగ్గు క్షేత్రాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. కేంద్ర బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖలతో మాట్లాడి బొగ్గు రవాణా (ర్యాక్స్)లో పరిమితులను పరిష్కరించేందుకు కృషిచేస్తుంది. అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ఆర్థికశాఖకు నివేదిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలతో సమన్వయం చేస్తూ.. థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత బొగ్గు సరఫరా ఉండేలా చూస్తుంది. క్లిక్: బొండా ఉమ చిల్లర రౌడీ -
కొరతపై ‘కోర్ కమిటీ’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్న బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ కొరతను మే మొదటి వారానికల్లా అధిగమించేందుకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అన్నిరకాల చర్యలు చేపడుతున్నాయి. దీన్లో భాగంగా రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బొగ్గు లభ్యత పెంచడం, విద్యుత్ కొరతను అధిగమించడం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేకంగా ఒక డైరెక్టర్ (బొగ్గు)ను నియమించింది. ఇప్పటివరకు ఏపీజెన్కో డైరెక్టర్లే ఈ బాధ్యతలు కూడా చూసేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకాధికారితోపాటు ఉన్నతాధికారులతో ఒక కోర్ మేనేజ్మెంట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ పర్యవేక్షణలో పరిశ్రమలకు కూడా మే మొదటివారానికి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్దరించాలనే లక్ష్యంతో ఈ బృందం పనిచేయనుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో రెండు నుంచి ఐదురోజులకు సరిపడా బొగ్గునిల్వలు మాత్రమే ఉన్నాయి. నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంట్లో 24 రోజులకు సరిపడా బొగ్గునిల్వలు ఉండాలి. అన్ని రాష్ట్రాలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. విద్యుత్ ఎక్సే్ఛంజిల్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా యూనిట్ ధర గతేడాది అక్టోబర్ తరువాత మళ్లీ రూ.12 నుంచి రూ.20 వరకు పలుకుతోంది. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా పీక్ అవర్స్లో ఇదే ధర వద్ద విద్యుత్ కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారీగా పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో వేసవి కారణంగా విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. 2018–19లో 63,605 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం అది 68,905 మిలియన్ యూనిట్లకు చేరింది. అంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా 8.33 శాతం చొప్పున విద్యుత్ డిమాండ్ పెరగింది. అదే సమయంలో బొగ్గు లభ్యత భారీగా పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోను మన రాష్ట్రంలో గృహ అవసరాలకు నిరంతరం, వ్యవసాయానికి ఏడుగంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చేసేందుకు విద్యుత్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 23న డిస్కంలు 208 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేశాయి. గత ఏడాది అదే రోజున 192 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది. ప్రజలు అర్థం చేసుకుంటారు తప్పని సరై, విధిలేని పరిస్థితుల్లోనే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. తాత్కాలికంగా ఏర్పడిన విద్యుత్ కొరత సమస్యను ప్రజలు అర్థం చేసుకుంటారన్న నమ్మకం తమకు ఉందని, నెలాఖరుకల్లా విద్యుత్ కొరత తీరుతుందని మంత్రి చెప్పారు. ఎంత ఖర్చయినా సరే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ తగినంత విద్యుత్ లభ్యత లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే మే–అక్టోబర్ నెలల మధ్య కాలానికి విద్యుత్ సంస్థలు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ మంత్రికి వివరించారు. విద్యుత్ రంగంపై ప్రతివారం నిర్వహించే సమీక్షల్లో భాగంగా ఏపీ ట్రాన్స్కో ప్రాజెక్టులు, నిర్వహణపై సోమవారం సెక్రటేరియట్లో చర్చిస్తానని మంత్రి అధికారులకు చెప్పారు. టెలీకాన్ఫరెన్స్లో జేఎండీ ఐ.పృధ్వీతేజ్, గ్రిడ్ డైరెక్టర్ ఎ.వి.కె.భాస్కర్, మూడు డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. -
అక్టోబర్ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్
సాక్షి, విజయవాడ: గత ఏడాది అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎక్కడా బొగ్గు సరఫరాకు డబ్బు కొరత లేదు. సమయానికి చెల్లింపులు చేస్తున్నాం. కోల్ ఇండియా వాళ్లకు రూ.150 కోట్లు నిన్న చెల్లించాం. హిందూజకు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగింది. దీనికి తోడు బొగ్గు కొరత ఏర్పడింది. సెకితో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం ఉంది. ఇది రాష్ట్రంలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నాము. 2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయి. 2018-19కి ఇవి రూ.62 వేల కోట్లకు పెరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు పెరిగాయి. 2019 నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక డిస్కమ్లకు 36 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. బొగ్గు, వినియోగం పెరగడం వల్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. నెలాఖరుకి సమస్య పరిష్కారం అవుతుంది' అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. చదవండి: (మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై బొత్స కీలక వ్యాఖ్యలు) -
జనవరిలో మౌలిక రంగం వృద్ధి 3.7 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జనవరిలో 3.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 1.3 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.1 శాతం. అధికారిక గణాంకాల ప్రకారం, బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ పరిశ్రమల పనితీరు సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉంది. క్రూడ్ ఆయిల్, ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బొగ్గు (8.2 శాతం), సహజ వాయువు (11.7 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (3.7 శాతం), సిమెంట్ (13.6 శాతం) ఉత్పత్తులు బాగున్నాయి. స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాల పనితీరు అంతంతమాత్రంగానే నమోదయ్యింది. కాగా, ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ గడచిన 10 నెలల్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంటే, 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 8.6 క్షీణత నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44 శాతం. రానున్న రెండు వారాల్లో ఐఐపీ జనవరి గణాంకాలు వెలువడనున్నాయి. -
సింగరేణి టెండర్లలో అక్రమాలు
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ నిజాయితీగా ఉంటే దేశంలో కోల్ ఇండియా మాదిరిగానే సింగరేణిలో కూడా టెండర్లు పిలవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘పోటీ ఎక్కువగా ఉంటే తక్కువ రేటుకు టెండర్లు ఇవ్వటానికి ముందుకు వస్తారు. ఈ టెండర్లో ముగ్గురికే అర్హత ఉందని తేల్చారు. కేసీఆర్ సమీప బంధువుకు చెందిన ప్రతిభ ఇన్ఫ్రా అనే కంపెనీతో లోపాయికారి ఒప్పందం మేరకు టెండర్లు జరిగాయ’ని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు లెటర్ రాశానని, టెండర్లు తెరవగానే వాటిని సుప్రీంకోర్టు రద్దు చేస్తుందన్నారు. రఫెల్ లాంటి కుంభకోణమే సింగరేణిలో జరుగుతోందని ఆరోపించారు. సత్యహరిశ్చంద్రుడి వారసుడినని చెప్పే కేసీఆర్ కోల్ ఇండియాలో ఉన్న నిబంధనలు, సింగరేణిలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇది ఇరవై వేల కోట్ల రూపాయలు చేతులు మారే టెండర్ అని పేర్కొన్నారు. ఇది సింగరేణి సీఎండీ సొంతంగా తీసుకున్న నిర్ణయమా, లేదంటే, కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగిందా అని ప్రశ్నించారు. -
Anantapur: అనంత గర్భం.. అరుదైన ఖనిజం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అరుదైన ఖనిజాలకు నిలయమైన ‘అనంత’లో మరో విలువైన ఖనిజం ఉనికి లభింంది. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే లిథియం ఖనిజ నిక్షేపాలు జిల్లాలో భారీగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వేలో గుర్తించారు. ఇదే విషయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ధ్రువీకరించారు. లిథియం ప్రాజెక్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ, డాక్టర్ ఎస్.సంజీవ్ కుమార్ ఈ నెల రెండో తేదీన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి ప్రహ్లాద్ జోషి రాతపూర్వక సమాధానమిస్తూ అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఈ నిక్షేపాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు. తాడిమర్రి మండల పరిధిలో.. జీఎస్ఐ శాస్త్రవేత్తలు కొన్ని నెలల క్రితం జిల్లాలోని తాడిమర్రి మండలం తురకవారిపల్లె, దాడితోట ప్రాంతాలతో పాటు సమీపంలోని వైఎస్సార్ జిల్లా పార్నపల్లె, లోపటనూతల ప్రాంతాల్లో ఫీల్డ్ సర్వే చేశారు. ఈ ప్రాంతాల్లోని మట్టి, శిలలు, ప్రవాహ అవక్షేపాలను సేకరించి పరీక్షించారు. 18 పీపీఎం నుంచి 322 పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) మోతాదులో లిథియం నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. అరుదైన ఖనిజం.. ఫుల్ డిమాండ్ లిథియం ఖనిజం చాలా అరుదుగా లభిస్తుంది. ఇప్పటివరకూ చిలీ, ఆస్ట్రేలియా, పోర్చుగల్ వంటి దేశాల్లో మాత్రమే ఎక్కువగా లభిస్తోంది. ఈ ఖనిజాన్ని రీచార్జ్బుల్ బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా గుండెకు అమర్చే పేస్మేకర్ల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఈ ఖనిజాన్ని 1817లో స్వీడన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త జాన్ అగస్ట్ ఆర్ఫ్వెడ్సన్ కనుగొన్నారు. ఇది మార్కెట్ను శాసించింది మాత్రం 1990 తర్వాతనే. దీన్ని ప్రపంచ దేశాలన్నిటికీ పై కొన్ని దేశాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇలాంటి అరుదైన ఖనిజం ఉనికి అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో లభించడం గొప్ప విషయమని నిపుణులు అంటున్నారు. విలువైన ఖనిజాలకు కేరాఫ్ అనంతపురం జిల్లా విలువైన ఖనిజాలకు కేరాఫ్గా ఉంది. బంగారు, వజ్రాలు, బైరటీస్, ఇనుము తదితర ఖనిజ నిక్షేపాలు జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు లిథియం నిక్షేపాలు కూడా వెలుగు చూడడం విశేషం. అంతర్జాతీయంగా డిమాండ్ లిథియం ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని బ్యాటరీల తయారీలో, కెమికల్స్లో ఎక్కువగా వినియోగిస్తారు. సముద్రగర్భాల్లో ఎక్కువగా దొరికే అవకాశముంది. అలాంటిది మన దగ్గర ఉండడం గొప్ప విషయమే. దీన్ని అవసరానికి తగ్గట్టుగానే వినియోగించుకోవాల్సి ఉంటుంది. –సుబ్రహ్మణ్యేశ్వరరావు, గనుల శాఖడిప్యూటీ డైరెక్టర్, అనంతపురం -
షోలాపూర్ ఎన్టీపీసీ ప్లాంట్కు సింగరేణి బొగ్గు
సాక్షి, హైదరాబాద్: మన సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు కోల్ ఇండియా సంస్థ నుంచి బొగ్గును సరఫరా చేసుకుంటున్న ఎన్టీపీసీ ఇక సింగరేణి నుంచి బొగ్గు తీసుకోనుంది. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో రెండు సంస్థల అధికారుల మధ్య ఇంధన సరఫరా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు ఏడాదికి 25.40 లక్షల చొప్పున 25 ఏళ్ల పాటు సింగరేణి బొగ్గును మహారాష్ట్రలోని షోలాపూర్ యూనిట్–1కు సరఫరా చేయనుంది. ఇప్పటివరకు కోల్ ఇండియా నుంచి బొగ్గును తీసుకుంటున్న ఎన్టీపీసీ.. నాణ్యత, నిరంతరాయ సరఫరా కోసం సింగరేణి నుంచి బొగ్గు తీసుకుంటే తమకు లాభదాయకంగా ఉంటుందని భావించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ అంగీకారాన్ని కోరగా, ఇందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అయితే, సింగరేణి సంస్థ ఇప్పటికే దేశంలోని 8 రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లకు బొగ్గు ఇస్తోంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్లాంట్లకు యేటా 135.30 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. షోలాపూర్ ప్లాంట్కు బొగ్గు సరఫరా కోసం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి తరఫున కోల్ మూవ్మెంట్ ఈడీ జె.ఆల్విన్, మార్కెటింగ్ జీఎం కె.రవిశంకర్, డీజీఎం వెంకటేశ్వర్లు, ఎన్టీపీసీ ప్రాంతీయ ఈడీ మనీశ్ జవహరి, చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్.ఎన్.రావు, ఏజీఎం పి.కె.రావత్లు పాల్గొన్నారు. -
Singareni: ఆ‘గని’.. సమ్మె
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు శుక్రవారం కూడా విజయవంతమైంది. విధులను బహిష్కరించిన కార్మికులు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులను ఆపి పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు తెలపాలని వేడుకున్నారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏరియాలు, నాలుగు రీజియన్ల పరిధిలోని 25 ఓపెన్ కాస్టులు, 20 భూగర్భ గనులు బోసిపోయాయి. డంపర్లు, డోజర్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో గనులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మొదటి, రెండో షిఫ్టుల్లో మొత్తం 34,753 మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి ఉండగా 29,300 మంది గైర్హాజరయ్యారు. భూగర్భ గనుల్లో పని చేసే అత్యవసర సేవల సిబ్బంది 4,709 మంది మాత్రమే విధులకు వచ్చారు. మరోవైపు 13,701 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో 4,340 మంది గైర్హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. రెండు రోజుల సమ్మెతో 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీంతో సంస్థకు సుమారు రూ.160 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇటు కార్మికులు సైతం వేతన రూపంలో రూ.40 కోట్లు నష్టపోయారు. బొగ్గు రవాణాపై ఎఫెక్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, సిమెంట్, ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్, సిరామిక్స్, ఫార్మా, ఆగ్రో తదితర నాన్ పవర్ కంపెనీలకు రవాణా అవుతుంది. తెలంగాణలోని ప్రతిరోజూ 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఇందులో ప్రతి రోజూ 1.30 లక్షల టన్నుల బొగ్గు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది. 70 వేల టన్నుల బొగ్గును రాష్ట్ర అవసరాలకు వాడుతుంటారు. రెండు రోజుల సమ్మెతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 2.40 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు బ్రేక్ పడింది. 15న కేంద్రమంత్రితో చర్చలు.. సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేసేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రీజినల్ లేబర్ కమిషనర్ సమ్మెకు ముందే పలుమార్లు కార్మిక సంఘ నేతలతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. సమ్మె కొనసాగుతున్నా సంఘ నేతలతో చర్చలు జరిపారు. మొత్తం 12 డిమాండ్లతో సమ్మె చేపట్టగా, వాటిలో రాష్ట్రంలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహా మిగిలిన డిమాండ్లను దశల వారీగా పరిష్కరించేందుకు సింగరేణి సిద్ధమైంది. ప్రధానమైన బ్లాకుల ప్రైవేటీకరణ డిమాండ్ విషయంలో యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో అధికారులు, కార్మిక సంఘ నేతలతో ఏర్పడిన జేఏసీ బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషితో చర్చించేందుకు ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ (పీఏడబ్ల్యూ) బలరాంనాయక్, జీఎం (పర్సనల్) ఆనందరావు, యూనియన్ నాయకులు వెంకట్రావ్ (టీబీజీకేఎస్), వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్ ప్రసాద్ (ఐఎన్టీయూసీ), రాజిరెడ్డి (సీఐటీయూ), రియాజ్ (హెచ్ఎంఎస్), మాధవన్నాయక్ (బీఎంఎస్) ఢిల్లీలో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు. -
కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా?
A house worth crores of rupees was gutted In USA Know How: ఇంట్లోకి పాములొస్తే సాధాకణంగా ఎవరైనా ఏం చేస్తారు? పాములను పట్టేవాళ్లను పిలవడమో.. ధైర్యముంటే కర్ర సహాయంతో పామును పట్టుకుని ఆరుబయట వదిలెయ్యడమో చేస్తాం! ఐతే ఓ వ్యక్తి పాము నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఇంటికి నిప్పంటించాడు. అసలేంజరిగిందంటే.. అమెరికాలోని మోంట్గోమేరీ కౌంటీలో కోట్ల విలువచేసే ఇల్లును తగులబెట్టాడు. నిజానికి ఇంటి యజమాని ఐడియా ఏంటంటే.. పొగ పెట్టడం ద్వారా పామును బయటికి పంపొచ్చని బొగ్గులను మండించాడు. ఈ మంటలు ఇంట్లోని వస్తువులకు అంటుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వాళ్లు వచ్చిన కాసేపటికే ఇళ్లు మొత్తం పూర్తిగా కాలిపోయిందని పోలీసధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో షేర్చేశారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఐతే ఈ అగ్నిప్రమాదంలో సుమారు పది లక్షలపైనే ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. చదవండి: ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే.. ICYMI (Tuesday 11/23 10p) 21000blk Big Woods Rd, Dickerson/Poolesville, @mcfrs no injuries, Cause-undetermined/under investigation, >$1M loss, ~75FFs responded, it was dark & cold (~ 25°) NOTE: non-hydrant area, driveway 3/4 mi long off Big Woods Rd pic.twitter.com/hJ4i4Bz8nL — Pete Piringer (@mcfrsPIO) November 26, 2021 Update (11/23 10p) 21000blk Big Woods Rd, Dickerson/Poolesville, @mcfrs Media Hotline Update 240.777.2442 - no injuries, Cause-undetermined/under investigation, >$1M loss, ~75FFs responded, it was dark & cold (~ 25°) https://t.co/6PwIkbRAkf pic.twitter.com/jWlB1HPdKt — Pete Piringer (@mcfrsPIO) November 24, 2021 -
బొగ్గు వినియోగం నిలిపివేతపై ఇంకా అస్పష్టత
గ్లాస్గో: భూతాపం(గ్లోబల్ వార్మింగ్)పై పోరాటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ సదస్సు తుది నిర్ణయానికి రాలేదు. గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు ముగిసిపోయినప్పటికీ తాజా ప్రతిపాదనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గు వాడకానికి, శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలకాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునివ్వాలన్న సూచనలను పరిశీలిస్తున్నట్టు శనివారం విడుదల చేసిన ముసాయిదా ప్రకటన స్పష్టం చేసింది. కాప్–26 నిర్ణయాలను 197 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే అవి అమల్లోకి వస్తాయి. అందుకే సదస్సు ముగిసిన తర్వాత కూడా అతి పెద్ద దేశాలు చర్చల ప్రక్రియని ముందుకు తీసుకువెళతాయి. కాప్–26 శిఖరాగ్ర సదస్సుకి నేతృత్వం వహించిన బ్రిటన్ మంత్రి, భారత సంతతికి చెందిన అలోక్ శర్మ ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులపై అత్యుత్తమ పరిష్కారాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలేవీ భూతాపం పెరుగుదలను నిరోధించలేవని, మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాప్–26లో పాల్గొన్న పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు. -
బొగ్గు వినియోగం తగ్గించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ పిలుపు
-
బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్.. కలకలం
న్యూఢిల్లీ: లఖీమ్పూర్ ఖేరి హింసాకాండకు నిరసనగా రైతు సంఘాలు సోమవారం చేపట్టిన రైల్ రోకో కారణంగా దేశవ్యాప్తంగా 293 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 150 గూడ్స్ రైళ్లకు ఆటంకం ఏర్పడగా వీటిలో 75 వరకు విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్న రైళ్లు ఉన్నట్టు సమాచారం. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నేడు రైల్ రోకోకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పంజాబ్లోని ఫిరోజిపూర్ డివిజన్లోని నాలుగు రైల్వే విభాగాలు రైతుల ఆందోళనతో స్తంభించాయని అధికారులు తెలిపారు. ఫిరోజ్పూర్ నగరంలోని ఫిరోజ్పూర్-ఫాజిల్కా విభాగం, మొగాలోని అజిత్వాల్ వద్ద ఉన్న ఫిరోజ్పూర్-లూధియానా విభాగంపై నిరసనల ప్రభావం పడిందని వెల్లడించారు. మిశ్రాను అరెస్ట్ చేసే వరకు విశ్రమించం: తికాయత్ 'రైల్ రోకో' ఆందోళన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, తదుపరి వ్యూహం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. లఖీమ్పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడైన అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిందితుడిగా ఉన్న అజయ్ మిశ్రాకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, కేంద్రం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన నిర్దోషిగా తేలితే మళ్లీ మంత్రి కట్టబెట్టుకోవచ్చని తికాయత్ అన్నారు. (చదవండి: హత్య కేసులో డేరాబాబాకు జీవిత ఖైదు) -
బీటీపీఎస్లో నాలుగో యూనిట్ సింక్రనైజేషన్
మణుగూరు టౌన్: తెలంగాణ ఏర్పడ్డాక ఏర్పాటుచేసిన భద్రాద్రి థర్మల్ పవర్ప్లాంట్లో చివరిదైన నాలుగో యూనిట్ సింక్రనైజేషన్ (బొగ్గును మండించే ప్రక్రియ)ను ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సచ్చిదానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ప్లాంట్లో 270 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్ల నిర్మాణానికి బీహెచ్ఈఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడు యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, నాలుగో యూనిట్ పనులను ఇప్పుడు సింక్రనైజేషన్ చేశామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ యూనిట్ నిర్మాణం పూర్తిచేసి సీఓడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్డ్) చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈమేరకు సింక్రనైజేషన్ విజయవంతంగా పూర్తిచేసిన సీఈ బాలరాజు, అధికారులను ఆయన అభినందించారు. -
Coal Crisis: పెను సంక్షోభం..?
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందని ఉత్తరప్రదేశ్ నుంచి కేరళ వరకు వివిధ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఎదురవనుంది. రాజస్తాన్ ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో రోజుకి రెండు గంటలు, పల్లెల్లో రోజుకి నాలుగు గంటలు విద్యుత్ కోతలు విధిం చడం మొదలు పెట్టింది. కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి అందాల్సిన బొగ్గులో సగం కూడా రాజస్తాన్కి అందడం లేదు. పంజాబ్, జార్ఖండ్, మహా రాష్ట్రలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ సమస్యని తగ్గించి చూపించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డిస్కమ్లు యూనిట్కు రూ.20 పెట్టి మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిరోజుల వ్యవధిలోనే నాలుగింతలు ధర పెరిగింది. దేశంలో 66% మేరకు విద్యుత్ వినియోగం థర్మల్ విద్యుత్ కేంద్రాలపైనే ఆధారపడి ఉంది. సాధారణంగా ఈ కేంద్రాలలో 20 రోజుల వరకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంటాయి. కానీ ఇప్పుడు 70 వరకు కేంద్రాల్లో నాలుగు రోజులకి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 136 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 50% బొగ్గు సరఫరా కేంద్రానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) నుంచే జరుగుతుంది. కానీ నాలుగేళ్లుగా ఈ సంస్థ నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ వస్తోంది. 2016 నుంచి స్వదేశీ బొగ్గుపైనే ఆధారపడాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ సీఐఎల్లో బొగ్గు ఉత్పత్తి ఆశించిన దాని కంటే 70 లక్షల నుంచి కోటి టన్నుల మేరకు పడిపోతూ వస్తోంది. కొన్ని బొగ్గు గనుల్ని వేలం వేసి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కేంద్రం అప్పగిం చింది. వీటి ద్వారా 12–14 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ ప్రైవేటు సంస్థలు కూడా బొగ్గు వెలికితీయడంపై దృష్టి పెట్టకుండా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తక్కువగా ఉన్నప్పుడు దిగుమతులపై ఆధారపడ్డాయి. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు ఈ ఏడాది మొదట్లో టన్ను 75 డాలర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 270 డాలర్లకు చేరుకుంది. దీంతో బొగ్గును కొనలేక, ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచలేక చేతులెత్తేస్తున్నాయి. ఇదో సంధికాలం బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులతో వాతావరణం కలుషితమై గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకు దారి తీస్తూ ఉండడంతో చాలా దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడుతున్నాయి. భారత్ కూడా అదే బాటలో నడుస్తూ గ్రీన్ ఎనర్జీ పేరుతో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి ప్రోత్సహిస్తోంది. ఇన్సెంటివ్లు ప్రకటిస్తోంది. దీంతో బొగ్గు గనుల అవసరాలకు అనుగుణంగా నిధుల్ని కేటాయించడం లేదు. అలాగని ప్రత్యామ్నాయ విధానాల ద్వారా విద్యుత్ డిమాండ్కి తగినంత ఉత్పత్తి జరగడం లేదు. ఫలితంగా సంక్షోభం ముంచుకొస్తోంది. కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. లెబనాన్లో గత వీకెండ్లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చైనాలో కూడా విద్యుత్కి కొరత ఏర్పడడంతో కొత్తగా 90 బొగ్గు గనుల్లో తవ్వకాలు ప్రారంభించింది. యూరప్లో అధికంగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే ఉన్నాయి. అయితే చమురు ధరలు ఆకాశాన్నంటడంతో యూకేలో కూడా 15 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయని బ్రిటన్ మీడియా చెబుతోంది. ఇక యూరప్లో చమురు ధరలు ఏకంగా 400 శాతం పెరగడంతో త్వరలోనే అక్కడ కూడా చార్జీలు పెరగనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ వాతలు తప్పవా ? విద్యుత్ కోతలతో పాటు చార్జీలు పెరిగి ప్రజలకు వాతలు కూడా తప్పేలా లేదు. కొద్ది రోజుల క్రితం వరకు ఒక యూనిట్ విద్యుత్ని 5 రూపాయలు ఉంటే, ఇప్పుడు డిస్కమ్ కంపెనీలు 20 రూపాయలు చెల్లించి కొనే పరిస్థితి వచ్చేసింది. గత జనవరి నుంచి బొగ్గు ధరలు అమాంతంగా 300 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితి కేవలం భారత్లోనే కాదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితి కునారిల్లిపోయింది. దీంతో గ్యాస్ ఆధారితంగా పనిచేసే విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఫలితంగా విద్యుత్ చార్జీల మోత ఖాయమన్న ఆందోళనలు అంతటా వ్యక్తం అవుతున్నాయి. -
భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం తప్పదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రానున్న రోజుల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం వచ్చే అవకాశముందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్ర భుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణతో భవి ష్యత్తులో రాష్ట్రంలో సైతం విద్యుత్ కోతలు తప్పకపోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కోతలు లేవన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసేందుకే కృత్రిమ కొరత సృష్టించారని నిపుణులు అంటుంటే నిజమే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకుంటు న్నాయని, దీనికి కేంద్రప్రభుత్వ నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలతోనే దేశంలో మళ్లీ విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయవద్దని డిమాండ్ చేశారు. రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిక్షేపాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. -
విద్యుత్ ఉత్పత్తికి .. బయోమాస్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గుతోపాటు 5 శాతం బయోమాస్ను ఇంధనంగా వినియోగించాలని కేంద్రం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత, ధరలు విపరీ తంగా పెరిగిన నేపథ్యంలో బయోమాస్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘బయోమాస్ వినియోగ పాలసీ’లో తాజాగా మార్పులను ప్రకటించింది. 2017 నవంబర్లో ప్రకటించిన బయోమాస్ వినియోగ పాలసీ ప్రకారం.. బాల్ మిల్, ట్యూబ్ మిల్ తరహావి మినహా మిగతా అన్ని థర్మల్ ప్లాంట్లు బొగ్గులో 5–10 శాతం బయో మాస్ను కలిపి వినియోగించాలి. బౌల్మిల్ తరహా థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా రెండేళ్లపాటు 5శాతం, తర్వాతి నుంచి 7 శాతం బయోమాస్ను వాడాల్సి ఉంటుంది. బాల్ అండ్ రేస్మిల్ తరహావి 5 శాతం బ్లెండ్ చేసిన బయోమాస్ పెల్లెట్లను.. బాల్ అంట్ ట్యూబ్ మిల్ తరహా ప్లాంట్లు 5శాతం టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లను తప్పనిసరిగా వినియో గించాలి. ఇప్పటినుంచి 25 ఏళ్లు, లేదా సదరు థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం పాటు ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. బయోమాస్ కొరత ఏర్పడకుండా.. సరఫరాదారులతో ఏడేళ్ల కాలవ్యవధితో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించింది. ఏవైనా థర్మల్ కేంద్రాలు బయోమాస్ వినియోగం నుంచి మినహాయింపు కోరితే.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. బయోమాస్ అంటే.. వృక్ష, జంతు వ్యర్థాలనే బయోమాస్గా పరిగణిస్తారు. జంతువుల అవశేషాలు, విసర్జితాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. వాటన్నింటిని పొడిచేసి.. యంత్రాల సాయంతో స్థూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వాటినే సాధారణ బయోమాస్ పెల్లెట్స్ అంటారు. రకరకాల వ్యర్థాలతో రూపొందిన బయోమాస్ పెల్లెట్లను వివిధ ఇంధనాలుగా వినియోగించవచ్చు. ► సాధారణ బయోమాస్లో తేమను పూర్తిగా తొలగించి, తీవ్ర ఉష్ణోగ్రతలో ఒత్తిడికి గురిచేసి గట్టిగా ఉండే పెల్లెట్లను తయారు చేస్తారు. బాగా మండేందుకు వీలుగా కొన్నిరకాల రసాయనాలు కలుపుతారు. వాటిని టోర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లు అంటారు. ఈ తరహా పెల్లెట్ల నుంచి ఎక్కువ మంట, ఉష్ణోగ్రత వెలువడతాయి. వీటిని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వినియోగిస్తారు. సాధారణ పెల్లెట్లు ► మన దేశంలో వార్షికంగా 750 మెట్రిక్ టన్నుల బయోమాస్ లభ్యత ఉందని, పంట వ్యర్థాలను కూడా కలిపితే మరో 230 మెట్రిక్ టన్నుల లభ్యత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. -
బొగ్గు సంక్షోభం తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత, ధరలు విపరీతంగా పెరగడం మన దేశంపైనా ప్రభావం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బొగ్గు కొరత మొదలైంది. పలు రాష్ట్రాల్లో థర్మల్ విద్యుదుత్పత్తి నిలిచిపోయి, అంధకారం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే థర్మల్ ప్లాంట్లలో కేవలం ఒక్క రోజుకు సరిపడానే బొగ్గు నిల్వలు ఉన్నాయని.. తక్షణమే బొగ్గు సరఫరా జరగకుంటే ఢిల్లీలో చీకట్లు అలముకుంటాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ శనివారం కేంద్రానికి లేఖ రాశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 110 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటిల్లో సగటున 4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు లేకపోవడంతో శనివారం పలు రాష్ట్రాల్లోని 16 ప్లాంట్లలో (మొత్తం 16,880 మెగావాట్ల సామర్థ్యం) విద్యుదుత్పత్తి జరగలేదు. సింగరేణి నుంచి తరలింపు సింగరేణి సంస్థ రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను తగ్గించి.. ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లకు మళ్లిస్తోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుత అవసరాలకు మించి బొగ్గును నిల్వ ఉంచడానికి బదులు.. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే స్థితిలో ఉన్న ప్లాంట్లకు సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణికి తొలి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రమేనని.. ఇక్కడి అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నామని సింగరేణి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో బొగ్గు కొరత ఉన్నా.. రాష్ట్రంలోని ప్లాంట్లకు కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో 4 రోజులకు సరిపడానే.. బొగ్గు కొరత ప్రభావం తెలంగాణపైనా పడింది. రాష్ట్రంలోని జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంటాయి. కానీ ప్రస్తుతం నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. 810 మెగావాట్ల భద్రాద్రి టీపీపీ, 1,000 మెగావాట్ల కొత్తగూడెం టీపీఎస్(న్యూ), 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం, 1,200 మెగావాట్ల సింగరేణి టీపీపీ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు 4 రోజులకే సరిపోతాయని పేర్కొంటున్నాయి. పిట్హెడ్ (బొగ్గు గనులకు సమీపంలో ఉన్న) ప్లాంట్లలో 5 రోజులకన్నా తక్కువకు సరిపడా బొగ్గు నిల్వలే ఉంటే ‘ఆందోళనకర (క్రిటికల్)’ పరిస్థితిగా పరిగణిస్తారు. రాష్ట్రంలోని జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి ప్లాంట్లలో సజావుగా విద్యుదుత్పత్తి జరగడానికి రోజుకు 96 వేల టన్నుల బొగ్గు అవసరం. అంటే 15 రోజుల అవసరాలకు కనీసం 14.37 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాలి. ప్రస్తుతం 5.92 లక్షల టన్నులే ఉన్నట్టు సీఈఏ తమ వెబ్సైట్లో పేర్కొంది. ‘పిట్హెడ్’ కాబట్టి ఇబ్బంది లేదు! బొగ్గు గనులకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ‘పిట్హెడ్’ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అంటారు. ఈ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేసేందుకయ్యే వ్యయం, పట్టే సమయం తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంటు తప్పిస్తే.. మిగతా థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ‘పిట్హెడ్’ ప్లాంట్లే. సింగరేణి గనులకు సమీపంలో ఉండటంతో వీటికి బొగ్గు రవాణా తక్కువ సమయంలో జరుగుతుంది. అందువల్ల ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గినా ఆందోళన అవసరం లేదని, అవసరమైతే తక్షణమే బొగ్గు సరఫరా చేయగలమని సింగరేణి అధికారులు చెప్తున్నారు. కొరత ఎందుకంటే? కరోనా మహమ్మారి, లాక్డౌన్ల అనంతరం ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కుదుటపడుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు పుంజుకోవడం, ఇతర రంగాలు కూడా సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీనితో విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గుకు సైతం డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. పొరుగుదేశం చైనాలో వారం, పది రోజులుగా తీవ్ర బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాదితో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు రెట్టింపునకు పైగా పెరిగాయి. మన దేశంలోనూ విద్యుత్ డిమాండ్ పెరిగి బొగ్గు కొరత వచ్చింది. -
‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’
న్యూఢిల్లీ: పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా మెరుగుపడకపోతే రాబోయే రెండు రోజుల్లో దేశ రాజధాని అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత కారణంగా సుదీర్ఘ విద్యుత్ కోతలపై ఆందోళన వ్యక్తం చేసిన తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల జాబితాలోకి ప్రస్తుతం ఢిల్లీ కూడా చేరిపోయిందని అన్నారు. (చదవండి: "అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది") అంతేకాదు భారత్లోని135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో సగానికి పైగా, దేశంలోని మొత్తం విద్యుత్తులో 70 శాతం ఇంధనం నిల్వలు మూడు రోజుల కన్నా తక్కువ ఇంధన నిల్వలను కలిగి ఉన్నాయని సెంట్రల్ గ్రిడ్ ఆపరేటర్ డేటా తెలిపిందన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.... "బొగ్గు సరఫరా మెరుగుపడకపోతే, రెండు రోజుల్లో ఢిల్లీలో చీకట్లోకి వెళ్లిపోతుంది. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కనీసం ఒక నెల బొగ్గు నిల్వను కలిగి ఉండాలి, కానీ ఇప్పుడు అది ఒక రోజుకి పడిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే బొగ్గు సరఫరా, గ్యాస్ సరఫరాను అందించాలి లేదంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ -19 సెండ్ వేవ్లో వైద్య ఆక్సిజన్ సరఫరా సంక్షోభం మాదిరిగా ఈ బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం అంటూ అభివర్ణించారు. కరోనా మహమ్మారీ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్తో వినియోగం లేకపోవడం, ధరలు ఒక్కసారిగా పెరగడం, డిమాండ్ , సప్లయ్ల మధ్య సమన్యయం లోపించడం తదితర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి జైన్ వెల్లడించారు. (చదవండి: విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్) -
4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో బొగ్గు కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 108 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వివిధ ప్రాంతాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బుధవారం నాటికి సగటున 4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు లభ్యత లేక గురువారం ఇతర రాష్ట్రాల్లోని 14,500 మెగావాట్ల సామర్థ్యం గల 15 థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి జరగలేదు. మరోవైపు బొగ్గు కొరత ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది. అయితే జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి బొగ్గు గనుల సంస్థ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను తగ్గించి ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లకు మళ్లిస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుత అవసరాలకు మించి బొగ్గును వృథాగా నిల్వ ఉంచడానికి బదులుగా, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గును తరలిస్తున్నారు. అయితే సింగరేణి బొగ్గు సరఫరా తొలి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రమేనని, రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నట్లు సింగరేణి సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో బొగ్గు కొరత ఎంత పెరిగినా, రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి: విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్) మనవద్దా నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే.. రాష్ట్రంలోని తెలంగాణ జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా, బుధవారం నాటికి నాలుగైదు రోజులకు సరిపడ నిల్వలే ఉన్నాయి. 810 మెగావాట్ల భద్రాద్రి టీపీపీ, 1,000 మెగావాట్ల కొత్తగూడెం టీపీఎస్(న్యూ), 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం, 1,200 మెగావాట్ల సింగరేణి టీపీపీ వద్ద 4 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలే ఉన్నాయి. పిట్హెడ్ ప్లాంట్లలో 5 రోజులు, అంతకన్న తక్కువ రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉంటే ‘ఆందోళనకర (క్రిటికల్)’ పరిస్థితిగా పరిగణిస్తారు. రాష్ట్రంలోని తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సజావుగా ఉత్పత్తి జరగడానికి రోజుకు 96 వేల టన్నుల బొగ్గు అవసరం. కనీసం 15 రోజుల అవసరాలకు 14.37 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాల్సి ఉండగా, 5.98 లక్షల టన్నుల బొగ్గు నిల్వలే ఉన్నట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ గురువారం తన వెబ్సైట్లో పేర్కొంది. పిట్హెడ్ ప్లాంట్లు కాబట్టి ఇబ్బంది లేదు.. బొగ్గు గనులకు 50 కి.మీ.ల పరిధిలో ఉంటే ‘పిట్హెడ్’థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అంటారు. వీటికి బొగ్గు రవాణా చేసేందుకు.. అయ్యే వ్యయం, పట్టే సమయం తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం తప్పిస్తే.. మిగిలిన థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ‘పిట్హెడ్’ప్లాంట్లే. సింగరేణి గనులకు సమీపంలో ఉండటంతో వీటికి బొగ్గు సరఫరాకు చాలా తక్కువ సమయం పట్టనుంది. అందువల్ల వీటిల్లో బొగ్గు నిల్వలు తగ్గినా ఆందోళన అవసరం లేదని, గనులకు సమీపంలో ఉండటంతో తక్షణమే అవసరమైన బొగ్గును సరఫరా చేయగలమని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. కొరత ఎందుకంటే? కరోనా మహమ్మారి, లాక్డౌన్ల అనంతరం అన్ని రంగాలు కుదుటపడుతున్నాయి. మళ్లీ పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం, ఇతర రంగాలూ సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీంతో విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గుకు సైతం డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. పొరుగు దేశం చైనాలో గత వారం రోజులుగా తీవ్ర బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. (చదవండి: విద్యుత్ సంక్షోభంపై తక్షణం స్పందించండి) గతేడాదితో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు సైతం 100 శాతానికి మించి పెరిగిపోయాయి. దేశంలో సైతం విద్యుత్ డిమాండ్ పెరిగి బొగ్గు వినియోగం పెరిగిపోయింది. దీంతో ఇక్కడా బొగ్గు కొరత నెలకొంది. విదేశీ బొగ్గు ధరలు భారీగా పెరిగిపోవడంతో .. దేశీయంగా తక్కువ ధరకు లభిస్తున్న కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ పెరిగింది. -
విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు సంక్షోభం ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమస్య గురించి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. (చదవండి: విద్యుత్ సంక్షోభంపై తక్షణం స్పందించండి) ఈ సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. విద్యుత్ కేంద్రాలలో ఒక రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. తక్షణమే బొగ్గు సరఫరా, గ్యాస్ సరఫరాను అందించాలి. లేదంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ ధర 20 రూపాయలకు పెంచారు. దీన్ని నియంత్రించాలి. విద్యుత్తు కొరతను అధిగమించేందుకు అవకాశాన్ని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాను. సంక్షోభాన్ని అధిగమించేందుకు సాధ్యమైనంత మేర పని చేస్తున్నాం. అంతేకాక ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాశాను’’ అని తెలిపారు. (చదవండి: బొగ్గు సంక్షోభంలో భారత్ ) ఈ క్రమంలో టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ విద్యుత్ కొరత గురించి వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారం ఇచ్చింది. శనివారం పంపిన ఎస్ఎమ్ఎస్లో ‘‘ఉత్తర జనరేషన్ ప్లాంట్లలో బొగ్గు లభ్యత తక్కువగా ఉన్నందున, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యుత్ సరఫరా క్లిష్ట స్థాయిలో ఉంటుంది. విద్యుత్ని తెలివిగా వినియోగించుకోండి. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి. అసౌకర్యానికి చింతిస్తున్నాము’’ అంటూ- టాటా పవర్ డీడీఎల్ మెసేజ్ చేసింది. చదవండి: అడుగేస్తేనే కరెంట్ పుడుతుంది మరి! -
బొగ్గు సంక్షోభంలో భారత్
సాక్షి, అమరావతి : దేశంలో బొగ్గు సంక్షోభం ఏర్పడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్పైనా, మన రాష్ట్రంపైనా పడుతోంది. దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. పారిశ్రామిక, గృహ అవసరాల కోసం దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో సింహభాగం థర్మల్ కేంద్రాల నుంచే వస్తోంది. ఎన్టీపీసీ, టాటా పవర్, టొరెంట్ పవర్ ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిన్నా పెద్దా అన్నీ కలిపి 135 థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉండగా అవన్నీ ఇప్పుడు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. అసలు దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70శాతం. వీటిలో ఇప్పటికే 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయి మూతపడ్డాయి. అంటే 16,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 30 ప్లాంట్లలోని నిల్వలు కేవలం ఒక రోజులో అయిపోతాయి. దీంతో 37,345 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. 18 ప్లాంట్లు రెండు రోజుల్లోనూ, 19 ప్లాంట్లు 3 రోజుల్లోనూ, 9 ప్లాంట్లు నాలుగు రోజుల్లోనూ, 6 ప్లాంట్లు 5 రోజుల్లోనూ, 10 ప్లాంట్లు ఆరు రోజుల్లోనూ, ఒక ప్లాంటు ఏడు రోజుల్లోనూ బొగ్గు సరఫరా జరగకపోతే మూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ మూతపడితే దేశవ్యాప్తంగా 1,36,159 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. చదవండి: (కేంద్రమే అప్పుల ఊబిలో.. రాష్ట్రానికి ఏమిస్తది?) బొగ్గు ధరలకు రెక్కలు కరోనా సెకండ్ వేవ్ తరువాత, దేశంలోని పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో అంటే దాదాపు నలభై శాతం పెరిగాయి. ఇక దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 80శాతం వాటా కలిగిన కోల్ ఇండియా.. ప్రపంచ బొగ్గు ధరల్లో పెరుగుదల కారణంగా, దేశీయ బొగ్గు ఉత్పత్తిపై తాము ఆధారపడాల్సి వస్తోందని వెల్లడించింది. డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో టాప్–2 దేశాలైన భారత్, చైనాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొద్దిరోజుల్లోనే మన దేశం అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయం. అదే జరిగితే విద్యుత్తో ముడిపడి ఉన్న అన్ని రకాల వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాక.. విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. బొగ్గు ఉత్పత్తిని కనీసం 10–18 శాతానికి పెంచాలని కోల్ ఇండియా నిర్ణయించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. రాష్ఠ్రంలో తగ్గిన బొగ్గు నిల్వలు.. పెరిగిన విద్యుత్ కొనుగోలు ధరలు ఒకసారి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెడితే కనీసం వారం రోజులైనా ఆపకుండా నడపాలి. కానీ ఏపీలోని థర్మల్ కేంద్రాల్లో అందుకు తగినట్టు నిల్వల్లేవని సాక్షాత్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రధాన థర్మల్ కేంద్రాలైన డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ), శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టిపీఎస్–కృష్ణపట్నం)లు మొత్తం 5,010 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. వీటిలో.. విజయవాడ ఎన్టీటీపీఎస్కు రోజుకి 24,600 టన్నుల బొగ్గు కావాలి. ప్రస్తుతం ఇక్కడ 13,600 టన్నులే నిల్వ ఉంది. ఆర్టీపీపీకి రోజుకు 16,800 టన్నులు అవసరం కాగా, ఇక్కడ 69,100 టన్నుల నిల్వ (4 రోజులకు సరిపడా) మాత్రమే ఉంది. ఇక దామోదరం సంజీవయ్య పవర్ స్టేషన్కి రోజుకు 13,600 టన్నులు కావాలి. ఇక్కడ మాత్రమే 89,200 టన్నులు (7 రోజులకు సరిపడా) నిల్వ ఉంది. ఇలా బొగ్గు కొరత ఏర్పడడంతో మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు అమాంతం పెరిగాయి. కేవలం రూ.4 లేదా రూ.5కు వచ్చే యూనిట్ విద్యుత్కు ఇప్పుడు దాదాపు రూ.6 నుంచి పీక్ అవర్స్లో రూ.20 వరకూ వెచ్చించాల్సి వస్తోంది. చదవండి: (కోస్తాంధ్రకు మరో తుపాను!) గుదిబండలా బకాయిలు పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెడితే రోజంతా దాని నుంచి విద్యుత్ తీసుకోవాలి. కానీ, మనకు రోజంతా అవసరం ఉండదు. అలాగని ఉత్పత్తి ఆపేయాలంటే దానికి 18 గంటలు సమయం పడుతుంది. అందుకే ఒకసారి మొదలుపెడితే కనీసం వారం రోజులు నడపాలి. దానికి సరిపడా బొగ్గులేదు. ఇక ఏపీ జెన్కోకు బకాయిలు గుదిబండగా మారాయి. తెలంగాణ నుంచే రూ.6,200 కోట్లు ఏపీ జెన్కోకు రావాలి. బొగ్గు సరఫరా చేస్తున్న మైనింగ్ సంస్థలకు మన జెన్కో రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాలి. అదంతా కడితే తప్ప వారు పూర్తిస్థాయిలో సరఫరా చేయరు. దీనికి తోడు ఇప్పుడు బొగ్గు కొరత ఏర్పడింది. – నాగులాపల్లి శ్రీకాంత్, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి -
భెల్ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో..
ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుత దేశ అవసరాలకు తగ్గట్టుగా గ్రీన్ ఎనర్జీ విభాగంలో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన తొలి పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్లో ఇటీవల ప్రారంభించింది. తొలి అడుగు హైదరాబాద్లో కర్బన ఉద్ఘారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక విధాలైన టెక్నాలజీలు వస్తున్నాయి. అందులో భాగంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలుష్యంతో ఎక్కువ శక్తిని ఇచ్చే ఇంధనాన్ని తయారు చేసే టెక్నాలజీని భెల్ అభివృద్ధి చేసింది. అందులో భాగంగా బొగ్గు నుంచి మిథనాల్ ఉత్పత్తి చేసే ప్లాంటుని పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లో భెల్ ప్రారంభించింది. ఉమ్మడి పరిష్కారం సాధారణంగా మిథనాల్ని నేచురల్ గ్యాస్ నుంచి తయారు చేస్తారు. అయితే మన దేశంలో సహాయ వాయు నిల్వలు సమృద్ధిగా లేకపోవడంతో ప్రతీసారి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అంతేకాదు అధికంగా విదేశీ మారక ద్రవ్యం దీనిపై ఖర్చు చేస్తోంది. మరోవైపు మన దేశంలో బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నా వాటిలో బూడిద శాతం ఎక్కువగా ఉంటోంది. అందువల్లే కాలుష్యం ఎక్కువ వస్తోందనే నెపంతో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనేక కోర్రీలు ఎదురవుతున్నాయి. ఈ రెండు సమస్యలకు ఉమ్మడి పరిష్కారంగా భెల్ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. బూడిద నుంచి మీథేన్ సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న పలు ఏరియాల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో యాష్ (బూడిద) కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. ఈ బొగ్గుకి డిమాండ్ కూడా తక్కువ. ఇలాంటి బొగ్గును ప్రత్యేక పద్దతిలో ప్రాసెస్ చేసి మిథనాల్గా మార్చే పరిశ్రమను హైదరాబాద్లో భెల్ ప్రారంభించింది. ప్రతీ రోజు ఈ ప్లాంటు నుంచి రోజుకు 0.25 టన్నుల మిథనాల్ ఉత్పత్తి అవుతోంది. దీని ప్యూరిటీ 99 శాతంగా ఉండటం గమనార్హం. నీతి అయోగ్ సహకారంతో ఇండియాలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నా అందులో యాష్ కంటెంట్ ఎక్కువగా ఉండటం సమస్యగా మారింది. దీంతో ఈ బొగ్గును పూర్తి స్థాయిలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ బొగ్గును మిథనాల్ మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిని భెల్కి 2016లో నీతి అయోగ్ అప్పటించింది. ఐదేళ్ల శ్రమ నీతి అయోగ్ సూచలనలు అనుసరించి కోల్ టూ మిథనాల్ ప్రాజెక్టుకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నుంచి రూ. 10 కోట్లు కేటాయించారు. ఐదేళ్ల శ్రమ అనంతరం తొలి ప్రాజెక్టు హైదరాబాద్లో ఉత్పత్తి ప్రారంభించింది. ద్రవరూప మిథనాల్ని డీజిల్కి ప్రత్యామ్నాయంగా వాడుకునే వీలుంది. చదవండి : Reliance AGM 2021:ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీదే... భవిష్యత్ భారత్దే -
బొగ్గుతో మెథనాల్ ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే దిశలో భారత్ మరో ముందడుగు వేసింది. బూడిద శాతం ఎక్కువగా ఉండే భారతీయ బొగ్గు నుంచి మోటారు ఇంధనంగా ఉపయోగపడే మెథనాల్ను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన టెక్నాలజీని డిజైన్ చేసింది. ప్రయోగాత్మక రియాక్టర్ను విజయవంతంగా పరీక్షించింది. మెథనాల్తో కాలుష్యం తక్కువ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే మెథనాల్తో కాలుష్యం తక్కువ. ఇప్పటికే నౌకల ఇంజిన్లలో దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. అంతేకాకుండా.. మెథనాల్తో డీజిల్ మాదిరిగానే ఉండే డై మిథైల్ ఈథర్ను కూడా తయారు చేయవచ్చు. కొద్దిపాటి మార్పులతో ఈ ఇంధనాన్ని కార్లు, లారీలు, బస్సుల్లో వాడుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో మెథనాల్ను సహజ వాయువుతో తయారు చేస్తుండగా భారత్లో దాని నిక్షేపాలు తక్కువగా ఉన్న కారణంగా సాధ్యపడటం లేదు. భారత్లో విస్తారంగా అందుబాటులో ఉన్న బొగ్గుతో తయారు చేయగలిగినా భారతీయ బొగ్గులో బూడిద మోతాదు చాలా ఎక్కువ. 98 నుంచి 99.5 శాతం స్వచ్ఛత: సారస్వత్ అందుబాటులో ఉన్న అదేతరహా బొగ్గును వినియోగించుకుని మెథనాల్ తయారు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం అంటే 2016లోనే హైదరాబాద్లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో దీనికి సంబంధించిన పరిశోధనలు మొదలయ్యాయి. నీతి అయోగ్ సహకారంతో మొదలైన ఈ పరిశోధనల్లో భాగంగా టెక్నాలజీకి రూపకల్పన చేసి, ముందుగా రోజుకు 0.25 టన్నుల మెథనాల్ను తయారు చేసే ఓ రియాక్టర్ను తయారు చేయాలని నిర్ణయించారు. నాలుగేళ్ల శ్రమ తరువాత, కేంద్ర ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం ఇచ్చిన రూ.10 కోట్ల గ్రాంట్తో తొలి రియాక్టర్ సిద్ధమైంది. దీనిని గత సోమవారం విజయవంతంగా పరీక్షించారు. దీనిద్వారా ఉత్పత్తి అయిన మెథనాల్ 98 నుంచి 99.5 శాతం స్వచ్ఛతతో ఉన్నట్లు తెలిసిందని, నీతి అయోగ్ గౌరవ సభ్యులు, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ డాక్టర్ వీకే సారస్వత్ తెలిపారు. బొగ్గును గ్యాస్గా మార్చి వాడుకునేందుకు, బొగ్గు నుంచి స్వచ్ఛ ఇంధనం హైడ్రోజన్ను తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది తొలి విజయమని పేర్కొన్నారు. -
5 ఏరియాలు టాప్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్లో 20 ఓపెన్కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్లోని మణుగూరు టాప్గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి(కొత్తగూడెం): గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో నాలుగు రోజుల్లో సుమారు 3.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంస్థకు రూ.42 కోట్ల విలువైన ఉత్పత్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కరోనాతో పాటు భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడగా, ఈసారి కూడా వర్ష ప్రభావంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా, తమ క్వారీలో ఇప్పటికి 8 కోట్ల గ్యాలన్ల నీరు చేరగా, రెండు 350 హెచ్పీ, ఐదు 240 హెచ్పీ మోటార్లతో నీటిని బయటకు పంపిస్తున్నట్లు కొత్తగూడెంలోని గౌతంఖని ఓపెన్ కాస్ట్ (జీకేఓసీ) పీఓ వెంకట్రాంరెడ్డి తెలిపారు. మొత్తం నీరు తొలగిస్తేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని ఆయన వివరించారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 25 భూగర్భ గనులు, 20 ఓపెన్కాస్ట్ గనులు ఉన్నాయి. ఇందులో 20వ తేదీన 1.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యా నికి గాను 70 వేల టన్నుల ఉత్పత్తి జరగలేదు. -
ఉన్నది రెండు అంగుళాలే.. దీని వెనుక పెద్ద కథే ఉంది
ఈ చిత్రంలో ఏదో ఓ బొగ్గు ముక్కలా కనిపిస్తున్నది చిన్నపాటి ఉల్క. ఉన్నది కేవలం రెండు అంగుళాలే.. కానీ శాస్త్రవేత్తలను పరుగులు పెట్టిస్తోంది. ఎందుకో తెలుసా..? భూమ్మీద జీవం పుట్టుకను తేల్చేందుకు ఈ ఉల్క తోడ్పడనుంది మరి. సైన్స్ పరంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ ఉల్కను గుర్తించడం వెనుక పెద్ద కథే ఉంది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ వెంటాడి.. వేటాడి.. బ్రిటన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాత్రి ఆకాశాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు ధగధగా మెరుస్తూ భూమివైపు దూసుకొస్తున్న ఓ ఉల్క కనబడింది. సాధారణంగా చిన్న చిన్న ఉల్కలు వాతావరణంలోనే మండిపోతాయి. కాస్త పెద్దవి అయితేనే దాటుకుని వచ్చి నేలపై పడతాయి. ఈ ఉల్క కూడా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ రావడంతో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అలా ఈ ఉల్క వించ్కోంబ్ ప్రాంతం దాకా వచ్చినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఇళ్లలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి.. ఉల్క ఎక్కడ పడిందీ సుమారుగా గుర్తించారు. తర్వాత ఏడెనిమిది మంది శాస్త్రవేత్తలు, మరికొందరి సహాయంతో గాలించి.. ఓ ఇంటి ఆవరణలో ఒక ముక్కను, రెండు కిలోమీటర్ల దూరంలోని గొర్రెల ఫారంలో మరో ముక్కను గుర్తించారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు. జీవానికి ఆధారమైన అమైనో ఆమ్లాలతో.. బొగ్గు తరహాలో నల్లగా ఉన్న ఆ ఉల్కలను తీసుకెళ్లి పరిశోధన చేపట్టారు. అది చాలా ప్రత్యేకమైనదని గుర్తించి.. తాజాగా వివరాలను వెల్లడించారు. ఇది అత్యంత అరుదైన ‘కార్బొనసియస్ కాండ్రైట్’రకానికి చెందిన ఉల్క అని, సుమారు 460 కోట్ల సంవత్సరాల కిందటిదని శాస్త్రవేత్తలు తెలిపారు. 300 గ్రాముల బరువున్న ఈ ఉల్కలో.. జీవం పుట్టుకకు ఆధారమైన అమైనో ఆమ్లాలు, నీటి ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ‘‘సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు ఏర్పడిన తొలినాళ్ల నాటి గ్రహ శకలం ఇది. దీనిని ఆనాటి పరిస్థితులను యథాతథంగా కాపాడుతున్న ‘టైం క్యాప్సూల్’అనుకోవచ్చు.భూమి, ఇతర గ్రహాల పుట్టుకకు సంబంధించిన విశేషాలను దీనిద్వారా తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ధ్వని వేగానికి 40 రెట్ల వేగం.. అంటే గంటకు 50 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించి.. మండిపోయింది..’’అని ఇంగ్లండ్ నేషనల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకుడు డాక్టర్ ఆష్లే కింగ్ వెల్లడించారు. ఇప్పుడున్న జీవజాలం భూమ్మీద పుట్టిందేనా? అంతరిక్షంలో మరోచోటి నుంచి ఇక్కడికి వచ్చిందా? విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా అన్నదానికీ ఈ ఉల్క సమాధానం చెప్పగలదని తెలిపారు. -
కల్తీ బొగ్గు దందా గుట్టురట్టు
సాక్షి, నేరేడ్మెట్ (హైదరాబాద్): పెద్ద పరిశ్రమలు కొనుగోలు చేసిన నాణ్యమైన బొగ్గును దారి మళ్లించి కాజేసి... సగం లోడు నాసిరకం బొగ్గును నింపుతూ మోసం చేస్తున్న కల్తీ మాఫియా గుట్టును ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు రట్టు చేశారు. లారీ యజమానులు, డ్రైవర్లతో కుమ్మక్కై బడా పరిశ్రమలను బురిడీ కొట్టిస్తూ కల్తీ బొగ్గు దందా చేస్తున్న 8మంది నిందితులను అరెస్టు చేశారు. 1.050 టన్నుల నాణ్యమైన బొగ్గుతోపాటు 700 టన్నుల నాసిరకం బొగ్గు, రెండు లారీలు, జేసీబీలు, రూ.2.50 లక్షల నగదుతో కలిపి మొత్తం రూ.1.62 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్భగవత్ వివరాలు వెల్లడించారు. హస్తినాపురానికి చెందిన గుండె రాజు 2014 నుంచి ఇబ్రహీంపట్నం మండలం రాందాస్పల్లిలో బొగ్గు డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకొని బొగ్గు సరఫరా వ్యాపా రం ప్రారంభించాడు. ఈ యార్డు పక్కనే గగన్పహాడ్కు చెందిన అమీర్ మహ్మద్ డంపింగ్ యార్డు కూడా ఉంది. వీరిద్దరూ కొత్తగూడెం, సింగరేణి నుంచి తక్కువ నాణ్యత ఉన్న బొగ్గు, బొగ్గు బూడిదను కొనుగోలు చేసి తమ డంపింగ్ యార్డులకు తరలిస్తారు. అనంతరం అదే బొగ్గును స్థాని క చిన్నతరహా పరిశ్రమలకు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రణాళిక ఇలా... విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్, కాగితం తయారీ, అల్యూమినియం ప్లాంట్లు, ఫార్మా కంపె నీలు, ఉక్కు పరిశ్రమలకు అధిక నాణ్యత కలిగిన బొగ్గు అవసరం. లారీ డ్రైవర్లకు డబ్బులు ఆశజూపి సింగరేణి కాలరీస్ నుంచి, విదేశీ బొగ్గుతో ఏపీలోని కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చే నాణ్యమైన బొగ్గు లారీ లను తమ డంపింగ్ యార్డులకు తీసు కొచ్చి... సగం లోడు ఖాళీ చేసి నాసిరకం బొగ్గును నింపి పరిశ్రమలకు పంపేవారు. బొగ్గు కల్తీ జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు డంపింగ్ యార్డులపై దాడి చేసి, నిందితులు గుండె రాజు, కాట్రవత్ సోమ, చల్లా అమరేందర్రెడ్డి, కురతాల మల్లేష్, నిజాముద్దీన్, ఎరుకల అంజయ్య, సగరాల సత్యం, రిజ్వాన్లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ఉత్తంపల్లి లక్ష్మణ్, అమీర్ మహ్మద్, ఉమాకొండ పురుషోత్తంరెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. -
పోలీసుల అదుపులో కోల్ మాఫియా గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: బొగ్గును అక్రమ రవాణా చేస్తున్న కోల్ మాఫియా గ్యాంగ్ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నల్లబొగ్గు అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. 1,050 టన్నుల బొగ్గును సీజ్ చేశాం. నిందితల నుంచి రెండు లక్షల యాభై వేల నగదు, రెండు లారీలతో సహా దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం బొగ్గు మాఫియాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాం. ఇబ్రహీంపట్నం రాందాస్పల్లిలో డంపింగ్ యార్డ్ తయారు చేసుకుని ముఠా కోల్ మాఫియా కొనసాగిస్తున్నట్లు గుర్తించాం. అక్రమంగా లారీ డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం నడిపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన బొగ్గును ఈ డంపింగ్ యార్డ్కు తెసుకొచ్చి వాటిని కల్తీ చేసి వివిధ ప్రాంతాలకు పంపుతారు. కృష్ణ పట్నం, కొత్తగూడెం నుంచి బొగ్గు సరఫరా ఎక్కువగా అవుతుంది. ఇతర రాష్ట్రాల సిమెంట్, ఐరన్ ఫ్యాక్టరీలకు బొగ్గును సరఫరా చేస్తారు. క్వాలిటీ ఉన్న బొగ్గులో నాణ్యత లేని వాటిని మిక్స్చేసి పలు కంపెనీలకు సరఫరా చేస్తారు' అని మహేష్ భగవత్ తెలిపారు. -
ప్రమాదవశాత్తూ నిప్పుల్లో పడిన భక్తురాలు
-
రాష్ట్రానికి ‘మందాకిని’!
సాక్షి, అమరావతి :మరో బొగ్గు క్షేత్రాన్ని కైవసం చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) అడుగులేస్తోంది. దీనివల్ల జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత తీరుతుంది. కొత్తగా ఉత్పత్తిలోకి వచ్చే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలకూ మరింత ప్రయోజనం కలుగుతుంది. ఒడిశాలోని అంగుల్ జిల్లా బైండా, లుహ్మరా గ్రామాల్లో తాల్చేరు కోల్ఫీల్డ్స్ (మందాకిని) కు కేంద్ర బొగ్గు గనుల శాఖ అన్ని అనుమతులు తీసుకుంది. సొంత అవసరాల కోసమే ఈ క్షేత్రాన్ని కేటాయించాలని నిర్ణయించింది. ఏపీ జెన్కో ఈ బొగ్గు క్షేత్రాన్ని దక్కించుకునేందుకు దరఖాస్తు చేసింది. ఈ క్షేత్రంలో నాణ్యమైన బొగ్గు లభిస్తుందని సర్వేలో తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికోసం కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక్కడ మొత్తం 653.66 హెక్టార్లలో బొగ్గు తవ్వకానికి వీలుందని తేలింది. ఇందులో 324.52 హెక్టార్ల అటవీ ప్రాంతానికి ఆ శాఖ 2013లోనే అవసరమైన అనుమతులిచ్చింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా 2011లో లభించాయి. ఈ బొగ్గు క్షేత్రం నుంచి మొత్తం 287.886 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభిస్తుందని వెల్లడైంది. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లోని థర్మల్ ప్లాంట్లకు ఏటా 7.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభ్యమవుతుంది. ఈ నేపథ్యంలో.. మందాకిని బొగ్గు క్షేత్రం కోసం సేకరించే 274.52 హెక్టార్ల ప్రైవేటు భూమి విషయంలో పునరావాస కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. దీనికి సమీపంలోనే మహానది కోల్ఫీల్డ్స్ (ఎంసీఎల్) ఉంది. దీని నుంచి రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు ఏటా 13 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు కేటాయింపులున్నాయి. ఎంసీఎల్కు సమీపంలోనే ఏపీకి చెందిన వాష్డ్ కోల్ (బొగ్గు శుద్ధి) కేంద్రాలున్నాయి. అక్కడి నుంచి బొగ్గు రవాణాకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. పైగా ఈ బొగ్గు.. నాణ్యతతో పాటు, తక్కువ ధరకూ లభిస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏపీకే ఈ బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది దక్కితే జెన్కో ప్లాంట్లకు బొగ్గు కొరత చాలా వరకు తీరుతుందని భావిస్తున్నారు. బొగ్గు కొరత తీరుతుంది మందాకిని కోల్ బ్లాక్ను దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇది మనకు వస్తుందనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఇది అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా థర్మల్ ప్లాంట్లు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటే బొగ్గు కొరతను నివారించినట్లు ఉంటుంది. ఏపీ జెన్కో నుంచి అధికారులు కూడా ప్రత్యేకంగా అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతమంతా బొగ్గు నిక్షేపాల మయం కాబట్టి పునరావాసానికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నాం. – శ్రీధర్, ఏపీ జెన్కో ఎండీ -
‘బీ గ్రేడ్’తో అధిక ఆదాయం
కోల్బెల్ట్(భూపాలపల్లి జిల్లా): సింగరేణివ్యాప్తంగా బీ గ్రేడ్కు బొగ్గు ద్వారా అధిక ఆదాయం లభిస్తోంది. భూపాలపల్లి ప్రాంత గనుల్లో ఈ రకం బొగ్గు ఎక్కువగా లభిస్తోంది. వినియోగదారులు కూడా ఈ ఏరియా బొగ్గుపైనే ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఏటా 4.5 లక్షల టన్నుల బొగ్గు విక్రయం జరపటం ద్వారా సంస్థకు రూ. 9 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతున్నది. భూపాలపల్లి ఏరియాలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆయా గనుల ద్వారా 34.40 లక్షల టన్నులను ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. అందులో కేటీకే 1,5,8 గనుల్లో 4 లక్షల టన్నుల చొప్పున లక్ష్యం నిర్దేశించగా కేటీకే–6లో 2.40 లక్షలు, కేటీకే ఓసీపీ–2లో 15 లక్షలు, కేటీకే ఓసీపీ–3లో 5 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని టార్గెట్ విధించారు. అందులో నాణ్యమైన బీ గ్రేడ్ అనగా జీ–5 బొగ్గు 6.27 లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుతుందని అధికారుల అంచనా. మిగతాది జి–11 బొగ్గు. బహిరంగ మార్కెట్లో జీ–5 బొగ్గుకు టన్ను ధర రూ.3885 ఉండగా జీ–11 బొగ్గుకు టన్ను ధర రూ. 1820 ఉంది. ఏరియాలో 6.27 లక్షల టన్నుల ఉత్పత్తి.. భూపాలపల్లి ఏరియాలోని గనులలో నాణ్యత కలిగిన బీ గ్రేడ్ బొగ్గు 6.27 లక్షల టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా గత ఏడాదితో పోల్చి నిర్ణయం తీసుకున్నారు. కేటీకే–1లో 2.0 లక్షలు, కేటీకే–5లో 2.0 లక్షలు, కేటీకే–6లో 50 వేలు, కేటీకే–8లో 70 వేలు, కేటీకే ఓసీపీలో 1,07,000 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉంది. నిర్దేశించిన లక్ష్యంలో 4.50 లక్షల టన్నులను మాత్రమే వినియోగదారులకు విక్రయించే అవకాశముంది. అందులో కేటీపీపీకి ఏటా 50 వేలు, మిగిలిన నాలుగు లక్షల టన్నులు కేశోరాం, అంజనీ, భవ్య, డక్కన్, కీర్తి, మైహోం, ఎన్సీఎల్, ఓరియంట్, రేయిన్, కేసీపీ, ఎంటైర్ సిరామిక్స్, అబిజిత్ ఫెర్రోటెక్, నవభారత్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలకు సరఫరా చేయనున్నారు. ఇందులో ఇప్పటికే పలు కంపెనీలు బొగ్గు కోసం సింగరేణి సంస్థతో లింకేజీ కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందం ప్రకారం 2,99,000 టన్నుల బీ గ్రేడ్ (జీ5) బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలతో కేటీపీపీ జీ–5 గ్రేడును అదనంగా కొనుగోలు చేసింది. జీ–11 బొగ్గు ధర కన్నా జీ–5 గ్రేడు బొగ్గుకు టన్నుకు అదనంగా రూ. 2 వేలు ఉండటంతో 4.5 లక్షల టన్నులకు రూ. 9 కోట్లు ఆదాయం సమకూరుతున్నది. భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి అవుతున్న జీ–5 గ్రేడు బొగ్గును కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. సంస్థకు సైతం అదనపు ఆదాయం సమకూరుతుంది. నాణ్యత కలిగిన బొగ్గును కొనుగోలు చేసేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఏరియా జనరల్ మేనేజర్ నిరీక్షణ్రాజ్ తెలిపారు. -
ఎనిమిది రంగాలూ నెమ్మది వృద్ధి
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన మౌలిక రంగ పరిశ్రమల వృద్ధి రేటు జూలైలో కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తి, రిఫైనరీ ప్రొడక్టుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదుకావడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూలైలో ఈ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతం వాటా కలిగిన ఈ ఎనిమిది మౌలిక రంగ పరిశ్రమల పనితీరు జూలైలో వేర్వేరుగా... వృద్ధి అప్...1 ఎరువులు: ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా 1.3 శాతం నుంచి (2018 జూలై) నుంచి 1.5 శాతానికి పెరుగుదల వృద్ధి తగ్గినవి.. 3 ♦ స్టీల్: 6.9 శాతం నుంచి 6.6 శాతానికి డౌన్ ♦ సిమెంట్: 11.2% నుంచి 7.9 శాతానికి పయనం ♦ విద్యుత్: 6.7% నుంచి 4.2%కి తిరోగమనం క్షీణతలో... 4 బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తి, రిఫైనరీ ప్రొడక్టుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. ఏప్రిల్–జూలై మధ్య..: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో, ఈ ఎనిమిది రంగాల గ్రూప్ వృద్ధి రేటు 5.9 శాతం నుంచి 3 శాతానికి పడింది. ఆగస్టులో ‘తయారీ’ పేలవం: పీఎంఐ ఆగస్టు నెలలో తయారీ రంగం పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. జూలైలో 52.5గా ఉన్న ఈ సూచీ ఆగస్టులో 51.4కు పడింది. గడచిన 15 నెలలుగా ఇంత తక్కువ సూచీ ఇదే తొలిసారి. ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. ఉపాధి కల్పనపైనా ఈ ప్రభావం పడింది. ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. -
వసూళ్లపై పోలీస్ అధికారుల ఆరా..?
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5 ఇంక్లైన్ వద్దగల కోల్ ట్రాన్స్పోర్టులో మళ్లీ వసూళ్ల దంద మొదలైంది. ఈవిషయంపై జిల్లా ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందితో ఆరా తీయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఈ వ్యవహారంపై కొత్తగూడెం ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వి శ్రీనివాస్రావు లారీ ఓనర్స్, ట్రాన్స్పోర్టర్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వసూళ్లను నిలిపివేయాలని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ముందస్తు జాగ్రత మేరకు ఏరియాలో కోల్ ట్రాన్స్పోర్టుకు అంతరాయం వాటిల్లకుండా ఉండేందుకు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు డివిజన్ ఉన్నతాధికారి ఈవసూళ్లపై సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. కోల్ట్రాన్స్పోర్టులో గతంలో ఒక వర్గం వారే వసూళ్లు చేస్తే, ఈసారి రెండు వర్గాల వారు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి యాజమాన్యం నుంచి వినియోగదారులు బొగ్గును ఆన్లైన్లో కొనుగోలు చేసి, ట్రాన్స్పోర్టర్ల ద్వారా రవాణా చేయించుకుంటుంటే... ఈ మధ్యలో ఈ వసూళ్ల దందా ఏంటని, దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులను కోరినట్లు తెలిసింది. -
జీడీకే–10 గని మూత!
రామగిరి(పెద్దపల్లి జిల్లా): సింగరేణి సంస్థలో మరో భూగర్భ గని మూతపడనుంది. సంస్థలో మొట్టమొదటి బీజీ(బ్లాస్టింగ్ గ్యాలరీ)ప్యానల్ ఏర్పాటు చేసిన 10వ గనిని మూసివేసేందుకు యాజమాన్యం ముహూర్తం ఖరారు చేసింది. ఈయేడాది డిసెంబర్లో 10వ గని మూసి వేసేం దుకు సంబంధిత అధికారులు సన్నహాలు చేస్తు న్నారు. ఇప్పటికే గనిలో పని చేస్తున్న సుమారు 520 మంది కార్మికులను బదిలీ చేయనున్నారు. వారికి ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశా రు. 157 మంది కార్మికులు ఆర్జీ–3 పరిధి ఓసీపీ–1, 2గనులకు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకోగా మిగిలిన వారు వివిధ ఏరియాలకు బదిలీ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. మరో 180 మంది కార్మికులను ఇక్కడే ఉంచనున్నారు. 1976లో ప్రారంభం 1976లో ఏర్పాటు చేసిన జీడీకే–10 ఇంక్లైన్ గని ఎంతో మందికి ఉపాధి కల్పించింది. భూగర్భంలోని నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లోని కింది రెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడం కోసం 1989లో సింగరేణి మొత్తానికి మొట్టమొదటి సారి ఈగనిలో బీజీ ప్యానల్ ఏర్పా టు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని నిర్దశించిన ఉత్తత్పి సాదించి ఈగనిలో వర్క్స్పాట్(పని స్థలం)దూరం పెరిగింది. దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసేందుకు మ్యాన్ వైడింగ్ షాఫ్టును ఎర్పాటు చేశారు. పనిస్థలం దూరం పెరిగిపోవడంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రాకపోవడంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో యాజమా న్యం ఈ గనిని మూసి వేసి ఆర్జీ–3 పరిధి ఓపీసీ–1కు అప్పగించాలని నిర్ణయించింది. ఈమేరకు డిసెంబర్లో ఉత్పత్తి నిలిపివేసి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఓసీపీ–1 జీవితకాలం జీడీకే–10వ గనిని మూసి వేసి ఆర్జీ–3 పరిధి లోని ఓసీపీ–1కు అప్పగించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల ఓసీపీ–1 జీవితకాలం దాదాపు 16 సంవత్సరాలు పెరుగుతుంది. 2019 డిసెంబర్లో ఓసీపీ–1 ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. మూడేళ్లక్రితం 10ఏ మూసివేత సింగరేణ సంస్థలో మొట్టమొదటిసారి లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన జీడీకే 10ఏ గనిని మూడు సంవత్సరాల క్రితం 2015లో యాజమాన్యం మూసివేసింది. జీడీకే–10ఏ గనిని 1985లో ఏర్పాటు చేశారు. భూగర్భంలో నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లో పైరెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం కోసం 1994లో 10ఏగనిలో లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జీడీకే–10, జీడీకే–10ఏ ఇంక్లైన్ గనుల్లో సుమారు 336 మిలియన్ టన్నుల బొగ్గు ఉండగా, రెండు గనుల ద్వారా 34 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మిగిలిని 302 మిలియన్ టన్నుల బొగ్గును ఓసీపీ–1 ద్వారా వెలికితీయాలని సింగరేణి భావిస్తోంది. 34మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జీడీకే–10వ గనిని డిసెంబర్లో మూసి వేయాలని యాజమాన్యం నిర్ణయించింది. జీడీకే–10, జీడీకే–10ఏ గనుల ద్వారా సుమారు 34 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పతి జరిగింది. మిగిలిన బొగ్గు నిక్షేపాలను ఓసీపీ–1 ద్వారా వెలికితీయనున్నాం. ఓసీపీ–1 విస్తరణ వల్ల ఏపీఏకు ఎలాంటి ముప్పు వాటిళ్ళకుండా రెండు డ్యాంలను నిర్మిస్తున్నాం. బి.వీరారెడ్డి, ఏపీఏ జీఎం -
పతనం
అది ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక మూలగా ఉన్న గూడ్స్షెడ్ల ఆవరణ. ఆ డిసెంబర్ చలిలో ఒకామె వొణుకుతూ నడుస్తున్నది. ఒకప్పుడు ఆమె పేరు సద్రాన్. ఇప్పుడామె ముసలి సద్రాన్. ఆమె కళ్లు కూడా తడిగా ఉన్నాయి. ముక్కు కారుతున్నది. మిగిలి ఉన్న కొద్ది పళ్లూ చలికి కొట్టుకుంటున్నాయి. కాళ్లూ చేతులూ స్పర్శ పోగొట్టుకున్నాయి. దారి కనపడటం కోసం కళ్ల మీది చెమ్మను అప్పుడప్పుడూ తుడుచుకుంటున్నది. ఆమె కాళ్లనూ చలి తొలిచేస్తున్నది. అరిగిపోయిన చెప్పులు మట్టితోనూ గోనెసంచుల పీచుతోనూ నిండిపోయి ఉన్నాయి. ఆ స్థితిలోనే కాళ్లీడ్చుకుంటూ పరుగులాంటి నడకతో ముందుకెళుతున్నది. చేతిలో చిన్న సంచీ చిన్న పార ఉన్నాయి.ఆ రైల్వే ప్రాంతంలో శ్మశాన ప్రశాంతత నెలకొని ఉంది. చలిగాలి హోరు ఎక్కువగా ఉంది. ఆవరణ అసాధారణంగా ఖాళీగానూ భీతిగొలుపుతూనూ ఉంది. వినియోగంలో లేని వ్యాగన్ల నీడలో ఆమె నడుస్తున్నది. ‘కాసేపట్లో సూర్యోదయం అవుతుంది. యార్డులో ఒక్క పిట్ట కూడా లేదు. సాధారణంగా జరిగే ఇంజన్ల షంటింగు కూడా లేదు. చలి మనుషులందర్నీ ఇళ్లలోనికి నెట్టేసినట్టుంది. ఎవరూ చలిని ఎదిరించే సాహసం చెయ్యలేరు. కాని డ్యూటీల్లో ఉన్నవారు ఎలాగో నెట్టుకొస్తారు. వారికి తప్పదు. కాపలాదార్లు మందమైన చలికోట్లు వేసుకొని వ్యాగన్లలో కునికిపాట్లు పడుతూ ఉంటారు. నిజానికి వారు మేల్కొని ఉండి రైల్వే ఆస్తులను కాపాడటానికే ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది. అయితే ఇంత చలిలో ఎవరు మాత్రం బయట తిరిగి అపాయం కొని తెచ్చుకుంటారు? ఎవరి సుఖం వారిది. ఒక్క నాకే సుఖసంతోషాలు లేవు. శాంతి లేదు. పూట గడవటానికి కొట్లాడవలసి వస్తున్నది. ఈ జీవితం మీద ఆశా లేదు, ఆసక్తీ లేదు. ఈ రైల్వే ఆవరణలోని బొగ్గుని ఊడ్చి సేకరిస్తూ నా యవ్వనమంతా వ్యర్థమైంది. ఇప్పుడు ముసిలినై జీవిత చరమాంకంలో ఉన్నాను. అయినా తిండి కోసం పాట్లు తప్పడం లేదు. ఇన్నేళ్ల బతుకులో రేపనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే.’’ఇలా తన ఆలోచనల్లో మునిగి ముసలి సద్రాన్ రైల్వే లైన్లని దాటుకుంటూ తడబడుతూ నడుస్తున్నది. కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల కాంతిలో రైల్వే లైన్లు మెలికలు తిరిగిన పాముల్లా కనపడుతున్నాయి. ఆ పాములు నోర్లు తెరిచి ఆమెనే మింగడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి. సద్రాన్ ఇక్కడ బొగ్గును దొంగిలించి బయట అమ్ముతూ జీవిక సాగిస్తుంది. బొగ్గుని సేకరించడం కోసం అనేక సంవత్సరాలుగా ఈ రైల్వే ఆవరణని ఊడుస్తున్నది. ఢిల్లీ రైల్వే స్టేషన్లోని ప్రతి అంగుళం ఆమెకు చిరపరిచితమే. పద్మవ్యూహంలా ఉండే ఈ లైన్లు ఎక్కడ కలుసుకుంటాయో, ఎక్కడ విడిపోతాయో, ఎక్కడ వొంపు తిరుగుతాయో ఆమెకు తెలుసు. స్విచ్చులు, కూపాలు, వ్యర్థాలు చేరే గోతులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆమెకు తెలుసు. బొగ్గుని పోగు చేస్తుండగా కాపలాదారు కంటపడితే దాక్కోవడం, తనతో పాటు బొగ్గుని దాచడం ఆమెకు తెలుసు. ఒకవేళ పట్టుబడిపోతే అతన్ని ఎలా మెప్పించి ఒప్పించాలో కూడా ఆమెకు తెలుసు. పై అధికారితో కూడా కబుర్లు చెప్పి మాయ చేయడం ఆమెకు తెలుసు. క్లీనర్లనీ, ఫిట్టర్లనీ ఎలా ప్రలోభపెట్టి తప్పించుకోవాలో ఆమెకు తెలుసు. బొగ్గు కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన రోజులు ఉన్నాయి. షంటింగ్ ఇంజన్ ముందు నుంచి మెలకువగా జారుకునేటప్పుడు ఇంజన్ కదిలిపోతే అంతే సంగతి. అయినా ఆమె ఆ వృత్తినే చేసింది. చేస్తున్నది. మరోపని చెయ్యడం ఆమెకు చేతకాదు.ముసలి సాద్రాన్ ఇలా తలపోస్తున్నది. ‘‘డబ్బుకు లొంగే జనంతో ఇబ్బంది లేదు. కాకపోగా వారికి సంతోషమే. ఒకటి రెండు అణాలు ముట్టజెప్పి బుట్ట నిండా బొగ్గుని మోసుకుపోవచ్చు. కొంతమందైతే ఆ బొగ్గు తామే మోసుకొచ్చి తనకు కావలసిన చోట వేసి వెళతారు. అలా డబ్బు తీసుకున్న వారే ఉత్తములు. వాళ్లెవరూ నన్ను ఇబ్బంది పెట్టరు. కాని నిజాయతీపరులతోనే చిక్కంతా. వారు నేను పోగు చేసిన బొగ్గంతా తీసుకుంటారు. లేకపోతే వారితో ఖాళీ కోచ్లోనికి రమ్మంటారు. కుక్కలు! తుచ్ఛులు! వారు తల్లుల్నీ, అక్కచెల్లెళ్లనీ, కూతుళ్లనీ వొదిలిపెట్టరేమో! నీచులు! వారికి వయసుతో పనిలేదు. అందంతో పనిలేదు. ఆడది అయితే చాలు. వారికి కావలసిందల్లా... ముసలి ఎముకలు పగిలిపోయినా వారికి పట్టదు. ముసలి స్త్రీలకు నరకం కనిపించినా వారికి సంబంధం లేదు. కేవలం నగదు తీసుకోకుండా శీలాన్ని హరించినవాడు నిజాయతీపరుడు! వీళ్లనే రైల్వే మెచ్చుకుని మెడల్స్ వేస్తుంది. ఏమైనా ఈ స్థితిలో నన్నెవరూ కన్నెత్తి చూడరు. కాకపోతే మోటాగానూ, అసభ్యంగానూ మాట్లాడతారు. బయటికి గెంటివేస్తారు..’’ముసలి సాద్రాన్ తన ఆలోచనల్లో మునిగిపోయి కళ్లను తుడుచుకున్నది. ముఖం మీది ముడుతలు మంచుతో గడ్డకట్టుకుపోయినట్టు అనిపించింది. ఆమె మళ్లీ పరధ్యానంలో పడిపోయింది. ‘ఒకప్పుడు నా యవ్వనాన్ని దాచుకునేదాన్ని. అప్పుడు ముసలితనం తొందరగా రావాలని కోరుకునేదాన్ని. యవ్వనం సుఖశాంతుల్ని ఇవ్వలేదు. కాని వృద్ధాప్యం ఇంకా బాధాకరమైనది. ఇప్పుడు అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. ముసలితనం ఒక శాపం. ధనం, యవ్వనం రెండూ సిగ్గుపడవలసినవి కావు. కాని ఇప్పుడు ఆ రెండూ నా వద్ద లేవు..’ సాద్రాన్ తన సంపాదనంతా తన కొడుకు బరాదాన్ అనారోగ్యం కోసం ఖర్చుపెట్టింది. భర్త చనిపోయిన తర్వాత వాడిని పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడింది. వాడికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించడానికి తన శరీరాన్ని అమ్ముకున్నది. చివరికి వాడి పెళ్లి చేసింది. వాడికొక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడే ఇప్పుడు తన సర్వస్వం. కాని బరాదాన్ పెళ్లి అనర్థదాయకమే అయింది. తెలియని వ్యాధితో మంచం పట్టాడు. ముసలి సాద్రాన్కు తన పెళ్లినాటి జ్ఞాపకాలు వెంటాడాయి. బరాదాన్ తండ్రి ఈమెని తన ఇంటికి తీసుకెళ్లాడు. ‘‘సాద్రాన్ సాద్రాన్’’ అన్న పిలుపు అతడి పెదవుల మీద ఉండేది. అదేపనిగా ఆమె వెంట తిరిగేవాడు. ఆమెని ఇంటి వద్ద వొదిలి డ్యూటీకి వెళ్లడానికీ ఇష్టపడేవాడు కాదు. ఏదో వంక పెట్టి ఇంటి వద్దనే ఉండిపోయేవాడు. ‘‘సాద్రాన్! మనిద్దరికీ నా జీతం సరిపోతుంది. మనం పోషించవలసిన వారెవరూ లేరు’’ అనేవాడు.‘‘మన ఇరుగుపొరుగు నవ్వుతున్నారు. అత్తమామలు లేరట. నేనే ఇంటికి రాణినట. నిన్ను ఇంట్లో కట్టి పడేస్తున్నానట’’ అనేది తను. ‘‘సాద్రాన్! ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు. నీ సంతోషమే నాక్కావాలి.ఎవరైనా సంతృప్తిగా జీవిస్తే వారు చూడలేరు’’ అనేవాడు. అలాంటి భర్త.. కొడుకు బరాదాన్ని ఇచ్చి చనిపోయాడు. అప్పటి నుంచీ తనకు కష్టాలు మొదలయ్యాయి.సాద్రాన్ నిట్టూర్చింది. ఒక్కసారిగా ఒక గాలి కెరటం రైల్వేయార్డులో ప్రవేశించింది. ఆమె ఆలోచనలకు భంగం కలిగించింది. విద్యుద్దీపాల కాంతి తీవ్రతలో ఆమె కళ్లు తెరిచి ఉంచలేకపోతున్నది. లైన్ స్విచ్చులకుఅడ్డంగా యాంత్రికంగా నడవసాగింది. చేతిని నుదుటిపై ఉంచి కళ్లకు చాటు పెట్టుకున్నది. ఒక దొంగలా చుట్టూ జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు అడుగులేస్తున్నది. ఒక్కోసారి ఒక వ్యాగన్ నీడలోకి చేరిపోయి ఎవరూ తనను గమనించడం లేదని నిర్ధారించుకుంటున్నది. ఇప్పుడు ముసలి సాద్రాన్ బొగ్గు ముక్కల పోగుల్ని చేరుకున్నది. అవి ఆమెకు బంగారు బిస్కట్ల దొంతర్లలా కనపడుతున్నాయి. రెండు పోగుల బొగ్గు ముక్కలు తీసుకెళ్తే సరి. బరాదాన్ కోసం మందులు కొనగలదు. మనవడి కోసం బియ్యం కొనగలదు. తనకీ కోడలికీ చాలినంత జొన్నపిండి కొనగలదు.చలి కొరికేస్తున్నప్పటికీ ఒకటి మాత్రమే కాదు, రెండు బొగ్గు పోగుల్ని తీసుకెళ్లడానికి ఇదే అదనుగా భావించింది. రెండు పోగుల్ని కొట్టేస్తే చాలు చలికాలం గడిచిపోతుంది. ఆ తర్వాత పగటిపూట చిన్న బొగ్గుముక్కలు ఎప్పుడైనా ఏరుకోవచ్చు. బూడిద కుప్పల నుంచి బొగ్గు ముక్కల్ని ఏరుకుంటే ఎవరూ ఏమీ అనరు. అభ్యంతరపెట్టరు. ఆ బూడిద పోగుల నుంచి ముందుగా కొడుకు బరాదాన్, ఆపైన మనవడూ పైకి లేస్తున్నట్టు ఆమె ఊహించుకుంది.ఇల్లు గడవటం కష్టంగా ఉంది. బరాదాన్కు మందులు కావాలి. కొడలూ మనవడూ తనూ తినాలి. తనొక్కతే సంపాదించాలి. కోడల్ని ఇదే వ్యాపారం, ఇదే రొంపిలోకి దింపడం ఆమెకు ఇష్టం లేదు. ఈ నికృష్టమైన వృత్తి తనతోనే అంతం కావాలనుకున్నది.రెండు విడతల బొగ్గు తీసుకెళ్లడానికి రెండుసార్లు తిరగాలి. ఇదే సరైన సమయం. ఇటువంటి చలిలో చీకటిలో ఏ ఉద్యోగీ బయటకు రాడు. కాబట్టి రెండుసార్లు సులువుగా తిరగ్గలదు. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నవి. ‘‘హిందుస్తాన్, పాకిస్తాన్, దేశం ఏదైతేనేం? పేదలకు బాధలు తప్పవు. ఒకప్పుడు హిందువులూ ముస్లిములూ ఎంతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకొనేవారు. ఇప్పుడు దేశం ముక్కలైన తర్వాత ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. కుర్బాన్ అలీషా విద్వేషాలకి బలి అయిపోయాడు. అతడే ఈరోజు బతికి ఉన్నట్లయితే నాకీ కష్టాలు ఉండేవి కావు. నాకోసం తన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. అతడు ఉన్నంత కాలమూ నాకు డబ్బుకొరత ఉండేది కాదు. డ్రైవర్ నాథ్సింగ్ కూడా ఉండేవాడు. కానీ అతడు కుర్బాన్ అలీ ఉండగా తనని తాకడానికి సాహసించేవాడు కాదు. నాథ్సింగ్ ఇలా అనేవాడు. ‘‘కోడలా! నా మాట విను. అలీని పెళ్లి చేసుకో. ఇదే మంచి సమయం. నీ యవ్వనం, నీ అందం ఎల్లకాలమూ ఉండవు. మతం గురించి పట్టించుకోకుండా అతన్ని పెళ్లి చేసుకో.’’అందుకు నేనిలా అనేదాన్ని. ‘‘నాథ్సింగ్! ముస్లిముని పెళ్లి చేసుకొని నన్ను నేను మోసం చేసుకోవాలా?’’ అతడిలా అనేవాడు ‘‘మరి ఇది బాగుందా? అతడు ప్రతిరోజూ నిన్ను కోచ్లోకి తీసుకెళుతున్నాడు. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇలా చాటుగా తిరగడానికి అడ్డురాని మతం పెళ్లికెందుకు అడ్డం? కొద్ది రోజుల తర్వాత అలీ కూడా నిన్ను పట్టించుకోడు. అప్పుడు పశ్చాత్తాపపడతావు.’’ఈ సంభాషణ తర్వాత దేశం విడిపోయింది. అలీని హిందువులే పొట్టన పెట్టుకున్నారు. నిజంగా తన పొట్టనూ కొట్టినట్టయింది.సాద్రాన్ గట్టిగా నిట్టూర్చింది. ఒక వాషింగ్లైను దాటుతుండగా ఆమె కాలు ఒక గోతిలో పడింది. అసహాయంగా ముందుకి తూలిపోయింది.మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. పాదం కింది భాగంలో ఏదో లోహపు ముక్క గీసుకొనిపోయింది. చెప్పుల మీద నుంచే రక్తం కారడం కనపడింది. కదల్లేకపోతున్నది. బాధతో మూలుగుతున్నది.అలాగే పడి ఉన్న చోటే చనిపోతే నయమనిపించింది. కానీ ఏదో అదృశ్య శక్తి జీవితం మీద వ్యామోహం కలిగించింది. నెమ్మదిగా పాకుతూ రైల్వే ట్రాక్ రెండో వైపు చేరింది. అంతలోనే అతి వేగంగా ఆ ట్రాక్ పైనుంచే రైలు పరుగెత్తింది. అది తన మీదుగా వెళుతున్నట్లు అనిపించింది.ముసలి సాద్రాన్ నెమ్మదిగా లేచింది. పాదం తీవ్రంగా సలుపుతున్నది. కాస్త దూరంలో ఎవరో చలిమంట కాగుతున్నారు. అక్కడ దగ్గుతూ కూర్చున్న ముసలివాడిని గుర్తించింది. అతడు ఆమెకు తెలుసు. వెళితే వాడు తన పాత కథలన్నీ ఏకరువు పెడతాడు. చావుకు దగ్గరగా ఉన్నాడు కానీ సరసాలు మానడు. కాబట్టి ఆమె అటు వెళ్లడానికి ఇష్టపడలేదు.కనీసం ఒక విడత బొగ్గునైనా మోసుకెళ్లాలని భావించింది. ఆ పోగుల వద్దకు వెళ్లేసరికి ఏదో టార్చి కాంతి పడుతున్నట్టు గ్రహించింది. కొందరు కాపలాదార్లు టోపీలు సర్దుకుంటూ వినియోగంలో లేని కోచ్ నుంచి అటువైపే వస్తున్నారు. వారిని చూసి ఆమె వెనుతిరగక తప్పలేదు. గాయమైనా సరే వచ్చిన పని పూర్తి కానందుకు చింతించింది. ముసలి సాద్రాన్ ఖాళీ చేతులతో గుడిసె చేరింది. ఆమెను చూసి కోడలు జోమన్ రెచ్చిపోయింది. ‘‘ఈ ముసిల్ది చావనైనా చావదు. తను సంపాదించలేదు. నన్ను బయటికి వెళ్లనివ్వదు. చీకటిపడ్డాక వెళ్లి ఇప్పుడు తిరిగొచ్చింది. అదీ ఖాళీ చేతుల్తో ఏడుస్తూ వచ్చింది. రాత్రంతా మంచి చలిమంట దగ్గర ఉండి హాయిగా తిరిగి వచ్చేసింది. నువ్వేమీ పని చెయ్యలేవని, ఇంటి వద్దనే ఉండమని చెప్పాను. నేను వెళ్తానని బొగ్గు తెస్తానని చెప్పాను. అయినా వినదు. చేతకాని గొప్పలకు పోతుంది. నన్ను ఇల్లు కదలనివ్వదు. నేనేదో ఐస్క్రీమునైతే నన్నెవరో తినేస్తారన్నట్టు భావిస్తుంది. ఈరోజు కుటుంబమంతా పస్తులుండాలి.’’సాద్రాన్ కోడలు జోమన్ అరుపులు విన్నది. ఏడ్చింది. కాని పైకి ఏమీ అనలేకపోయింది. ఒకవేళ ఏమైనా అన్నా కోడలు మరింత బిగ్గరగా అరిచి తిరగబడుతుందని ఆమెకి తెలుసు.‘‘రేపు నేనే వెళ్లి బొగ్గు తెస్తాను’’అన్నది జోమన్.సాద్రాన్ గట్టిగా వొద్దనలేదు. అంటే కారణాల్ని వివరించాలి. అది ఆమె చెయ్యలేదు. ‘‘రైల్వే యార్డు నుంచి బొగ్గు సేకరించడంలో కష్టాలు కోడలికి తెలియవు’’ అని తనలోనే అనుకున్నది. సాద్రాన్కు దెబ్బ తగిలిన కాలు నొప్పెడుతున్నది. ఒక గోనెసంచి ముక్క కట్టుకున్నది. ‘‘నా జీవితం ఎలాగూ నాశనమైంది. నా దుర్గతి కోడలికి రాకూడదు’’ అని పదే పదే అనుకున్నది.మరునాడు సాద్రాన్ నిద్రలేచింది. జోమన్ గుడిసెలో లేనట్టు కనుగొన్నది. ఖాళీ సంచి, పార కూడా లేవు. ఆమె హృదయం బాధగా మూలగడం మొదలుపెట్టింది. గుడిసె ద్వారం వద్దకు పరుగెత్తింది. ఒక తుపానువల్ల గుడిసె పెళ్లగించబడినట్టు వెయ్యి ముక్కలు చెక్కలైనట్టు అనిపించింది. ముసలామె గాఢాంధకారంలోనికి చూస్తూ ద్వారం వద్దనే కూలబడింది.తెలతెల్లవారుతుండగా జోమన్ తిరిగి వచ్చింది. గుడిసె ముందర సంచి నిండా బొగ్గు పెట్టింది. ఆ ఇద్దరూ స్త్రీలూ ఒకరి కళ్లలోనికి ఒకరు చూసుకున్నారు. ముసలి సాద్రాన్ చూపు కోడలి చెదిరిన జుత్తుపైనా, చినిగిన చొక్కాపైనా పడింది. అత్త తన పరిస్థితిని చదివేసిందని కోడలికి తెలిసిపోయింది. జోమన్ అపరాధభావంతో చూపును కిందకు దించుకుంది. కేవలం ఒక సంచిడు బొగ్గు కోసం తన కోడలు అమూల్యమైనదేదో కోల్పోయిందని ముసలామె గ్రహించింది. ఒక విధమైన వేదనతో కుప్పకూలిపోయింది. పంజాబీ మూలం : బూటా సింగ్ అనువాదం: టి.షణ్ముఖరావు -
బొగ్గు అన్వేషణకు ఆటంకం
చింతలపూడి: జిల్లాలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు తెలియడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి చింతలపూడిపై పడింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత ఏపీలో బొగ్గు నిల్వలు బయట పడటం రాష్ట్రం పాలిట వరదాయినిగా మారింది. బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమేకాక ఉపాధి అవకాశాలుపెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తూ వచ్చారు. అయితే చివరి దశ సర్వే పనులకు వర్షాలు అడ్డంకిగా మారాయి. దీంతో రెండు నెలలుగా ఎక్కడా సర్వే పనులు జరగడం లేదు. 2016నాటికే పూర్తికావాలి వాస్తవానికి తుదిదశ సర్వే పనులు 2016 నాటికే పూర్తికావాలి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గు నిక్షేపాల అన్వేషణ చివరి దశ సర్వేకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2016 చివరినాటికి అన్వేషణ పూర్తి చేయాల్సి ఉంది. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిల్లాలోని చింతలపూడి మండలం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరిన్ని అధునాతన యంత్రాలతో అన్వేషణ చేపట్టాలని భావించడంతో సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఇందులో భాగంగా సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి 120 పాయింట్ల(ప్రదేశాలు)ను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది. ఈ 120 పాయింట్లలో సుమారు 65 వేల మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40 వేల మీటర్ల పనులు పూర్తి చేసినట్లు తెలిసింది. అయితే పినాకిల్ సంస్థ సర్వే పనుల గడువు ముగియడంతో ప్రసుత్తం ఎంఈసీఎల్ సంస్థ ద్వారా చివరి దశ అన్వేషణ పనులు చేపట్టాల్సి ఉంది. పనులు ప్రారంభం కాక ముందే వర్షాలు మొదలు కావడంతో సర్వే ముందుకు సాగడం లేదని సంస్థ సిబ్బంది తెలిపారు. సానుకూలంగా లేని కేంద్రం తెలంగాణలోని సింగరేణి తరహాలో బొగ్గును తవ్వుకోవడానికి అనుమతి కోరుతూ 2015లో రాష్ట్రానికి చెందిన ఏపీఎంఐడీసీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా పంపింది. దీనికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. రాజమండ్రి వరకూ బొగ్గు నిక్షేపాలు మూడేళ్ల నుంచి కృష్ణా జిల్లా సోమవరం, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి కేంద్రంగా బొగ్గు నిక్షేపాలపై జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నుంచి నిపుణులు సర్వే పనులు ప్రారంభించారు. మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు 2 వేల నుంచి 3 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొంది. ఇతర రాష్ట్రాలలో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అదికూడా భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే సంవత్సరానికి 8 వేల మెగావాట్ల చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ కొరత రాదని నిపుణులు చెబుతున్నారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలో మీటర్ల వ్యాసార్ధంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత సర్వేల్లోనే వెలుగులోకి .. చింతలపూడి ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీస్తామని 2015లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఆయన ఆశ ఇంత వరకు నెరవేరలేదు. 1964 నుంచి 2006 వరకు సుమారు 4 దఫాలుగా అధికారులు సర్వేలు నిర్వహించారు. ఈ ప్రాంత భూభాగంలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలోనే ఏపీఎండీసీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పశ్చిమ, ఖమ్మం సరిహద్దులను ఆనుకుని 2,500 స్క్వేర్ కిలో మీటర్ల పరిధిలో ఈ బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నట్లు ప్రభుత్వం వద్ద నివేదిక ఉన్నట్లు తెలిసింది. పశ్చిమ సరిహద్దు, ఖమ్మం జిల్లా రేజర్ల, నారాయణపురం, నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గురుభట్లగూడెం, రాఘవాపురం గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు వెయ్యి అడుగుల మందంతో బొగ్గు తయారైనట్లు నిర్ధారించారు. అయితే సర్వే పనులే ఇంత వరకు పూర్తవ్వలేదు. ఇక బొగ్గు వెలికి తీతకు ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని ఈ ప్రాంత వాసులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
కృష్ణపట్నం బొగ్గు పక్కదారి!
సాక్షి, అమరావతి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో బొగ్గు నాణ్యత ఒక్కసారిగా పడిపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని ఇంధనశాఖ నిర్ణయించడంతో జెన్కో అధికారుల్లో కలవరం మొదలైంది. నివేదిక ఇవ్వకుండా తాత్సారం కృష్ణపట్నం థర్మల్ విద్యుత్తు కేంద్రానికి సరఫరా అయ్యే బొగ్గు నాణ్యత తగ్గడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి కమిటీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. బొగ్గు క్షేత్రాల నుంచే నాసిరకం బొగ్గు వస్తోందా? లేదంటే మధ్యలో ఇంకేదైనా వ్యవహారం జరుగుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణపట్నం ప్లాంట్కు వచ్చే బొగ్గు పూర్తిగా తడిసిపోయి డొల్లగా ఉంటోందని, మండిస్తే సరైన ఉష్ణశక్తి రావడం లేదని ప్లాంట్ ఇంజనీర్లు ఇటీవల ఇంధనశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. కృష్ణపట్నం ఏపీపీడీసీఎల్ పరిధిలోది కావడంతో వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని జెన్కో ఎండీ ఆదేశించినట్టు తెలిసింది. ఏపీపీడీసీఎల్ ముఖ్య అధికారి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వకుండా కాంట్రాక్టు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. దీన్నిబట్టి నాసిరకం బొగ్గును ప్లాంట్కు చేరవేయడంలో కాంట్రాక్టర్ల హస్తం ఉందని, ఏపీపీడీసీఎల్ అధికారులు వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లేని బొగ్గు వాడటం వల్ల వినియోగం పెరిగి థర్మల్ ప్లాంట్ బాయిలర్స్పై ప్రభావం పడుతోందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతోంది? కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 1,600 మెగావాట్లు. ఇక్కడ నిత్యం 16 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగిస్తారు. ఈ ప్లాంట్కు మహానది కోల్ ఫీల్డ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేస్తోంది. ఒడిశాలోని తాల్చేరు గనుల నుంచి సేకరించే బొగ్గును సమీపంలోనే వాష్ చేస్తారు. ఓ ప్రైవేటు సంస్థకు ఈ కాంట్రాక్టు బాధ్యతను అప్పగించారు. వ్యర్థాన్ని తొలగించాక బొగ్గును నేరుగా పారాదీప్ పోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి సముద్రమార్గం ద్వారా కృష్ణపట్నం పోర్టుకు చేరుతుంది. అనంతరం కన్వేయర్ బెల్ట్ ద్వారా థర్మల్ ప్లాంట్కు నేరుగా చేరుతుంది. వాస్తవానికి బొగ్గు మైన్ దగ్గరే నాణ్యత పరీక్ష కోసం నమూనాలు సేకరిస్తారు. తర్వాత ప్లాంట్ దగ్గర మరో శాంపుల్ తీస్తారు. బొగ్గు క్షేత్రాల దగ్గర ఎంసీఎల్ తీసే శాంపుల్ 4,120 జీసీవీ (ఉష్ణశక్తి) వరకూ ఉంటుంది. కానీ ప్లాంట్లో ఇది 3,700 ఉంటోందని, గత నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉందని కృష్ణపట్నం సీనియర్ ఇంజనీర్లు గుర్తించారు. ఉన్నతాధికారులు మాత్రం ఎంసీఎల్ శాంపుల్స్ నాణ్యతనే పరిగణలోనికి తీసుకుని వాస్తవాలను దాచిపెడుతున్నట్లు తెలిసింది. ఈ బొగ్గును కేంద్ర ప్రభుత్వ సంస్థ సింఫర్కు థర్డ్ పార్టీ పరీక్షకు పంపుతారు. దీన్ని కూడా కొంతమంది మేనేజ్ చేస్తున్నారని, నాణ్యత ఉన్న శాంపుల్స్ పంపుతున్నారని తెలిసింది. వాష్ చేసిన బొగ్గును ప్లాంట్కు చేరవేసే కాంట్రాక్టు సంస్థలు నాణ్యమైన బొగ్గును ఇతర ప్రైవేట్ సంస్థలకు అమ్ముకునే వీలుంది. అందుకనే నాసిరకం బొగ్గును కలుపుతున్నట్లు కృష్ణపట్నం ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. పోర్టులో గోల్మాల్? పారాదీప్ లేదా కృష్ణపట్నం పోర్టులో గోల్మాల్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రైవేట్ థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గును తరలిస్తూ కాంట్రాక్టు సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని, ఏపీపీడీసీఎల్ ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీనిపై జెన్కో అధికారులను సంప్రదించగా వర్షాల కారణంగా బొగ్గు తడిసి నాణ్యత తగ్గుతోందన్నారు. నాణ్యత తగ్గడంపై విచారణకు ఆదేశించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీనిపై ఏపీపీడీసీఎల్ సీజీఎం రాఘవేంద్రరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. -
ఖమ్మంలో జోరుగా వర్షాలు
ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, తిరుమలాయపాలెం, కూసుమంచి, చింతకాని, కారేపల్లి, కామేపల్లి, బూర్గంపాడు మండలాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. మణుగూరు ఓపెస్ కాస్ట్ 4 ఓబీ నుంచి వర్షపునీరు పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఇల్లందు మండలంలోని మాణిక్యారం, మాసి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా రెండో రోజు సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెంలో 3 వేల టన్నులు, సత్తుపల్లిలో 6వేల టన్నులు, మణుగూరులో 4 వేల టన్నులు, ఇల్లందులో 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నిన్నటి వర్షం కారణంగా 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు సంబంధిత శాఖాధికారులు తెలిపారు. -
వ్యాపారీకరణతో పెను ప్రమాదం
సందర్భం బొగ్గుగనుల జాతీయకరణ స్థానంలో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గని విధానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రైవేట్ బొగ్గు సంస్థలు మళ్లీ రాజ్యమేలే పరిస్థితి ఏర్పడనుంది. ధరల నియంత్రణ కూడా వాటి పరమయ్యే ప్రమాదముంది. స్వాతంత్య్రం నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది. భారత ప్రభుత్వ నిర్వహణలో 1956లో ఏర్పడిన జాతీయ బొగ్గు అభివృద్ధి సంస్థ బొగ్గు ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1945 నుంచే కార్యకలాపాలు సాగిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. భారతీయ బొగ్గు పరిశ్రమ 1950లలో ప్రభుత్వ యాజమాన్య కంపెనీల ఆజమాయిషీలో ఉండేది. ఇవ్వాళ సింగరేణి కాలరీస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆజ మాయిషీలో 51:49 నిష్పత్తితో కొనసాగుతోంది. పెరుగుతున్న ఉక్కు పరిశ్రమ అవసరాల రీత్యా, నేలబొగ్గు నిక్షేపాలను వెలికితీసి వాడుకోవడంపై ఆసక్తి పెరి గింది. కానీ దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలకు తగినంత మూలధనాన్ని సమకూర్చే పనికి ప్రైవేట్ బొగ్గు గని యజమానులు పూనుకోలేదు. ప్రైవేట్ బొగ్గు గని యజమానులు అశాస్త్రీయ పద్ధతులను పాటించడం, గని కార్మికుల పని పరిస్థితి దిగజారడం వంటివాటిపై స్పందించిన కేంద్రప్రభుత్వం ప్రైవేట్ బొగ్గుగనులను జాతీయం చేయాలని నిర్ణయించుకుంది. ఇది రెండు రకాలుగా జరిగింది. 1971–72లో ఖనిజబొగ్గు గనులను, 1973లో థర్మల్ బొగ్గు గనులను కేంద్రప్రభుత్వం స్వాధీనపర్చుకుంది. 1971లో కోకింగ్ కోల్ మైన్స్ యాక్ట్ ద్వారా బొగ్గు గనులను, బొగ్గు ప్లాంట్లను జాతీయం చేసి భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక 1973 కోల్ మైన్స్ యాక్ట్ ద్వారా 1971లో స్వాధీనపర్చుకున్న బొగ్గు గనులతోపాటు, 7 రాష్ట్రాల్లోని ఖనిజ, ఖనిజయేతర బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ అన్ని గనులనూ కోల్ మైన్స్ యాక్ట్ 1973 ద్వారా కేంద్రప్రభుత్వం 1973 మే 1న జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఖనిజయేతర బొగ్గు గనులను ఇలా 1973లో జాతీయం చేసి భారత బొగ్గుగని ప్రాధికార సంస్థ అధీనంలోకి తీసుకొచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థగా ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ను 1975లో స్థాపించారు. ఇది రాణిగంజ్ బొగ్గుక్షేత్రం లోని అన్ని ప్రైవేట్ కాలరీలను స్వాధీనపర్చుకుంది. దీంతో 29.72 బిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలతో ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ దేశంలోనే రెండో అతిపెద్ద బొగ్గు సంస్థగా ఆవిర్భవించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కోల్ మైన్స్ యాక్ట్ 2015ను పార్లమెంట్ 2015 మార్చిలో ఆమోదించింది. దీంతో బొగ్గుగనులను వేలం పాటద్వారా కేటాయించే అధికారం కేంద్రప్రభుత్వానికి దఖలు పడింది. అలాగే తమ సొంత సిమెంట్, ఉక్కు, విద్యుత్ లేక అల్యూమినియం ప్లాంట్ల వినియోగం కోసం బొగ్గుగనులను తవ్వుకోవడానికి ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ చట్టం అవకాశమిచ్చింది. ఇక 2018 ఫిబ్రవరి 20న భారత్లో ప్రైవేట్ సంస్థలు వాణిజ్య బొగ్గు పరిశ్రమలో ప్రవేశించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతించేసింది. దీంతో 1973 జాతీయకరణ తర్వాత వాణిజ్యపరమైన బొగ్గుగనులపై ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా సంస్థకున్న గుత్తాధిపత్యం చెదిరిపోయింది. దీంతో టన్ను ధరను ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి గనులు దక్కే విధానం అమలులోకి వచ్చేసింది. వాణిజ్య బొగ్గు గని తవ్వకాల దుష్ఫలితాలు : 1. బొగ్గు అత్యంత అరుదైన సరుకు కాబట్టి ఒకసారి నిల్వలు ఖాళీ అయ్యాయంటే తర్వాత బొగ్గు లభ్యం కాదు. గతంలో ప్రైవేట్ గని సంస్థలు లాభదాయకంగా ఉండే బొగ్గు నిక్షేపాలలోనే బొగ్గును తవ్వుకుని కఠిన పరిస్థితుల్లోని బొగ్గు గనుల జోలికి వెళ్లేవి కావు. 2. అనుమతించిన ప్రాంతంలోనే కాకుండా ప్రైవేట్ బొగ్గుగనుల యజమానులు అక్రమ తవ్వకాలకు పాల్పడే ప్రమాదముంది. 3. లేబర్ చట్టాల ఉల్లంఘనకు అవకాశమెక్కువ. 4. బొగ్గు తవ్వకాల రికార్డు లేకుండా ప్రైవేట్ కంపెనీలు జరిపే తవ్వకాలవల్ల ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలు, పన్నులు తగ్గిపోయే అవకాశం ఎక్కువ. 5. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడి, ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నంలో కార్మికుల సంఖ్యను ప్రభుత్వ బొగ్గు సంస్థలు తగ్గించడం అని వార్యం. కార్మికుల తొలగింపు మాత్రమే కాకుండా తాజా నియామకాలు గణనీయంగా తగ్గిపోతాయి. 6. బొగ్గు పరిశ్రమ క్రమేపీ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి, జాతీయకరణకు మునుపుటిలాగా ధరలను ఇతర నిబంధనలనూ వారే నియంత్రించే ప్రమాదం పొంచి ఉంది. 7. ప్రైవేట్ సంస్థల ప్రవేశంతో గనుల్లో ప్రమాదాలు పెరుగుతాయి. అధిక లాభాల యావలో ఇవ కార్మికుల భద్రతను గాల్లో కలిపేయడం తెలిసిందే. దీంతో మరిన్ని ప్రమాదాలు, మరిన్ని మరణ ఘట నలు తప్పవు. 8. కాలుష్య నిబంధనలను ఖాతరు చేయవు కాబట్టి ప్రైవేట్ బొగ్గుగని కంపెనీలు పర్యువరణానికి కలిగించే ప్రమాదం మామూలు స్థాయిలో ఉండదు. బి. జనక్ ప్రసాద్ వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ ఈ–మెయిల్ : janakprasad@rediffmail.com -
గడ్డి గాదం... అవుతుంది బొగ్గు!
ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతమైంది... పంజాబ్, హర్యానాలలో పంటపొలాల్లో గడ్డి కాల్చేయడం దీనికి కారణమని అంటున్నారు? అలా ఎందుకు వృథాగా తగలేస్తున్నారన్న అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? చాలామందికి వచ్చే ఉంటుంది.. కోతలయ్యాయి కాబట్టి గడ్డి ఇక పనికి రాదన్నది రైతుల అంచనా కావచ్చుగానీ.. నాటింగ్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మాత్రం ఆ వృథాకు కొత్త అర్థం చెబుతున్నారు. తాము అభివృద్ధి చేసిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో గడ్డితోపాటు అన్ని రకాల సేంద్రీయ పదార్థాలను బొగ్గులాంటి ఇంధనంగా మార్చేయవచ్చునని వారు అంటున్నారు. గడ్డిని అధిక పీడనానికి గురిచేసి.. కొద్దిగా వెచ్చబెట్టడం ద్వారా తేమ ఎక్కువ ఉన్న సేంద్రీయ పదార్థాలనూ బొగ్గులాంటి ఇంధనాలుగా మార్చవచ్చునని నిరూపించారు. ] ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం భూమిలోకి చేరిన సేంద్రీయ పదార్థాలు అక్కడి పీడనం, ఉష్ణోగ్రతల కారణంగా బొగ్గు, చమురు వంటి ఇంధనాలుగా మారతాయి. ఇందుకు వేల ఏళ్లు పడుతుంది. నాటింగ్హామ్ శాస్త్రవేత్తలు ఇదే ప్రక్రియను ఫ్యాక్టరీల్లో కొన్ని గంటల్లోనే పూర్తయ్యేలా చేశారు. అన్నీ సవ్యంగా సాగితే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ అనే సంస్థ యునైటెడ్ కింగ్డమ్లో ఈ టెక్నాలజీతో పనిచేసే ఫ్యాక్టరీని త్వరలోనే మొదలుపెట్టనుంది. ఈ రకమైన టెక్నాలజీలతో కాలుష్యకారక శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు లభించి వాతావరణ మార్పులను అడ్డుకునే వీలు ఏర్పడుతుంది. -
ఇన్ఫ్రా దిగాలు!
♦ ఏప్రిల్లో ఉత్పాదకత 2.5% క్షీణత ♦ బొగ్గు, క్రూడ్, సిమెంట్ పేలవం! న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన ఎనిమిది పరిశ్రమల ఇన్ఫ్రా గ్రూప్ ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల– ఏప్రిల్లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. 2016 ఏప్రిల్తో పోల్చిచూస్తే, 2017 ఏప్రిల్లో అసలు వృద్ధిలేకపోగా ఉత్పత్తి 2.5 శాతం క్షీణించింది (మైనస్). బొగ్గు, క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాల పేలవ పనితీరు దీనికి కారణం. ఇంకా ఈ గ్రూప్లో నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. ఈ గ్రూప్ 2016 ఏప్రిల్ వృద్ధి రేటు 8.7 శాతం. ఎనిమిది రంగాలూ వేర్వేరుగా... ⇔ బొగ్గు: –1.8% క్షీణత.. –3.8 శాతానికి చేరింది. ⇔ క్రూడ్ ఆయిల్: క్షీణతలోనే ఉన్నా ఇది –2.2 శాతం నుంచి –0.6 శాతానికి తగ్గింది. ⇔ సిమెంట్: 4.3 శాతం వృద్ధి రేటు నుంచి –3.7 శాతం క్షీణతకు పడిపోయింది. ⇔ నేచురల్ గ్యాస్: –6.9 శాతం క్షీణత నుంచి 2 శాతం వృద్ధికి మళ్లింది. ⇔ రిఫైనరీ: 19.1% వృద్ధి 0.2%కి పడింది. ⇔ ఎరువులు: –3% క్షీణత నుంచి 6.2%కి ఎగసింది. ⇔ స్టీల్: వృద్ధి 4.5% నుంచి 9.3 శాతానికి చేరింది. ⇔ విద్యుత్: ఉత్పాదకత వృద్ధి 14.5 శాతం నుంచి 4.7 శాతానికి పడిపోయింది. -
5లక్షల ఉద్యోగాలకు చెక్ పెట్టిన చైనా
బీజింగ్: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పరిశ్రమల రంగంలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయింది. ముఖ్యంగా స్టీల్ మరియు ఉక్కు సహా ఇతర భారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న 5 లక్షలమంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ మేరకు చైనా కార్మికశాఖ మంత్రి యిన్ వీమెన్ బుధవారం జారీ చేసిన ప్రకటన జారీ చేశారు. అదనపు మిగులు ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అదనపు ఉత్పత్తితో మార్కెట్లో ఉత్పత్తుల వెల్లువ కారణంగా గ్లోబల్ ధరలు నిరుత్సాహకంగా ఉన్నాయన్నారు. అయితే తొలగించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను కల్పించనున్నట్టు చెప్పారు. అలాగే ఆయా ఉద్యోగులు సొంత సంస్థలు ప్రారంభించడానికి లేదా ఉద్యోగ విరమణకు సాయం చేయనున్నట్టు చెప్పారు. గత ఏడాది 7లక్షల 26వేలమందికి పైగా తొలగించిన ఉద్యోగులకు ఇలాంటి సాయాన్ని అందించినట్టు తెలిపారు. చైనాకు చెంది స్టీల్ సహా ఉక్కు, బొగ్గు, అల్యూమినియం, సిమెంట్, గ్లాస్ లాంటి భారీ పరిశ్రమలు అధిక ఉత్పత్తి సామర్థ్యంతో నిండి ఉన్నాయి. అటు మిగులుఉత్పత్తి, ఇటు డిమాండ్ లేక ఇబ్బందులు పడుతున్న ఈ పరిశ్రమలను బైటపడేసేందుకు చైనా బహుళ సంవత్సరాలుగాకృషి చేస్తోంది. మరోవైపు కొన్ని కంపెనీలు మిగులు ఉత్పత్తిని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో తమ ఉద్యోగాలకు ఎసరుపెడుతున్నారంటూ అమెరికా, యూరోప్ మరియు ఇతర వ్యాపార భాగస్వామ్య దేశాలు ఆరోపిస్తున్నాయి. -
‘పశ్చిమ’లో నల్ల బంగారం నిక్షేపాలు
చింతలపూడి ప్రాంతంలో అపారంగా ఉన్నట్లు గుర్తింపు భూగర్భంలో తక్కువ లోతులోనే కనుగొన్న వైనం చింతలపూడి: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి దేశవ్యాప్త ఖ్యాతి గడించబోతోంది. ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు వెల్లడి కావడం తో ఆంధ్రా సింగరేణిగా వార్తల్లోకి ఎక్కుతోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు నిక్షేపాల అన్వేషణ కోసం జియా లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో సౌత్ వెస్ట్ పినాకిల్, మహేశ్వరి సంస్థలు పెద్దఎత్తున డ్రిల్లింగ్ పనులు చేపట్టాయి. చింతలపూడి, శెట్టివారిగూడెం ప్రాంతాల్లో 50–70 మీటర్ల లోతులోనే అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. మహేశ్వరి కంపెనీ నిర్వహించిన సర్వే(డ్రిల్లింగ్)లో నామవరం ప్రాంతంలోని రిగ్గు నంబర్–1 వద్ద 70 మీటర్ల దిగువన, రెండో రిగ్గు వద్ద 67 మీటర్ల దిగువన, 3వ రిగ్గు వద్ద 51 మీటర్ల దిగువన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేలింది. మిగిలిన ప్రాంతాల్లో 115 మీటర్ల లోతునుంచి 280 మీటర్ల లోతున నాణ్యమైన బొగ్గు నిల్వలున్నట్టు కనుగొన్నారు. 6 నెలల్లో సర్వే పూర్తి సర్వే పూర్తి కావడానికి ఆర్నెల్లు పడుతుం దని జియాలజిస్ట్ ఎ.సతీష్ తెలిపారు. ప్రస్తుతం చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి డ్రిల్లింగ్ చేస్తున్నా మన్నారు. ఈ ప్రాంతంలో సింగరేణి కన్నా నాణ్యమైన బొగ్గు ఉందన్నారు. సర్వే పూర్తయ్యాక కేంద్రానికి నివేదిక పంపాలని, నిక్షేపాల వెలికితీతకు అనుమతులు రావడానికి మాత్రం సమయం పడుతుందని చెప్పారు. 2 వేల మిలియన్ టన్నుల నిల్వలు కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం నుంచి మొదలుకొని పశ్చిమ గోదా వరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపు చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల పరిధిలో ఈ నిల్వలున్నట్లు సర్వే నివేదికలు వివరిస్తున్నాయి. మరిన్ని యంత్రాలు రప్పిస్తాం బొగ్గు అన్వేషణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరిన్ని అధునాతన యంత్రాలను రప్పించే పనిలో ఉన్నాం. – వీపీ యాదవ్, డీలర్, (జీఎస్ఐ) -
బొగ్గు భాగ్యాలు
చింతలపూడి : భూగర్భంలోని బొగ్గు నిల్వల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్ల బంగారం వెలికితీతకు ఇటీవల మైనింగ్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గును వెలికితీయాలనిప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగనున్నాయి. మరిన్ని ప్రదేశాల్లో పాయింట్లు పెట్టి అన్వేషణ సాగించాలని భావించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సూచనల మేరకు జిల్లాలోని చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరోమారు డ్రిల్లింగ్ ప్రారంభించారు. గత గురువారం నుంచి సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ శెట్టివారిగూడెం ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టింది. ప్రస్తుతం 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేస్తోంది. ఈ 120 పాయింట్లలో 65 వేల మీటర్ల లోతున తవ్వి బొగ్గు అన్వేషణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచి జీఎస్ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్ఐ ఆరునెలల పాటు చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. సింగరేణి ప్రాంతంలో లభించే బొగ్గు కన్నా ఇక్కడ నాణ్యమైన నిల్వలు ఉన్నాయని తేల్చారు. 2వేల మిలియ¯ŒS టన్నుల బొగ్గు నిల్వలు మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం నిల్వలు ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా వెల్లడైంది. అవికూడా భూమి ఉపరితలానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నాయని నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2013లోనే నిర్ధారణ లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాల్లో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అవీ భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపులోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. 6 నెలలపాటు అన్వేషణ అధునాతన యంత్రాలతో 6నెలల పాటు బొగ్గు అన్వేషణ కొనసాగుతుంది. అన్వేషణ పూర్తయ్యాక ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రిగ్గులు వచ్చాయి. మొత్తం 120 రిగ్గులు రప్పిస్తున్నాం. – దాశరథి సుదర్శనం, సూపర్వైజర్, సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ -
బొగ్గు భాగ్యాలు
చింతలపూడి : భూగర్భంలోని బొగ్గు నిల్వల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్ల బంగారం వెలికితీతకు ఇటీవల మైనింగ్ ఎక్స్ప్లొరేష¯ŒS కార్పొరేష¯ŒS లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లొరేష¯ŒS ట్రస్ట్ (ఎ¯ŒSఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గును వెలికితీయాలనిప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగనున్నాయి. మరిన్ని ప్రదేశాల్లో పాయింట్లు పెట్టి అన్వేషణ సాగించాలని భావించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సూచనల మేరకు జిల్లాలోని చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరోమారు డ్రిల్లింగ్ ప్రారంభించారు. గత గురువారం నుంచి సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ శెట్టివారిగూడెం ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టింది. ప్రస్తుతం 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేస్తోంది. ఈ 120 పాయింట్లలో 65 వేల మీటర్ల లోతున తవ్వి బొగ్గు అన్వేషణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచి జీఎస్ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్ఐ ఆరునెలల పాటు చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. సింగరేణి ప్రాంతంలో లభించే బొగ్గు కన్నా ఇక్కడ నాణ్యమైన నిల్వలు ఉన్నాయని తేల్చారు. 2వేల మిలియ¯ŒS టన్నుల బొగ్గు నిల్వలు మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియ¯ŒS టన్నుల నల్ల బంగారం నిల్వలు ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా వెల్లడైంది. అవికూడా భూమి ఉపరితలానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నాయని నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2013లోనే నిర్ధారణ లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాల్లో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అవీ భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపులోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. 6 నెలలపాటు అన్వేషణ అధునాతన యంత్రాలతో 6నెలల పాటు బొగ్గు అన్వేషణ కొనసాగుతుంది. అన్వేషణ పూర్తయ్యాక ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రిగ్గులు వచ్చాయి. మొత్తం 120 రిగ్గులు రప్పిస్తున్నాం. – దాశరథి సుదర్శనం, సూపర్వైజర్, సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ -
పోర్టులో బొగ్గు దిగుమతి
ముత్తుకూరు : కృష్ణపట్నం పోర్టు ద్వారా మండలంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్లకు అవసరమైన బొగ్గు పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా యూకేకి చెందిన ఎంవీ అలికీ పెర్రోటిస్ అనే నౌక ద్వారా 59,310 టన్నుల బొగ్గు దిగుమతి జరుగుతోంది. పనామాకు చెందిన జియోలాండ్ అల్మైర్ నౌక నుంచి 56 వేల టన్నుల బొగ్గు దిగుమతి చేస్తున్నారు. 74,121 టన్నుల బొగ్గు దిగుమతి జరిపేందుకు హాంగ్కాంగ్కు చెందిన డెక్కన్ ప్రైడ్ నౌక శుక్రవారం లంగరు వేయనుంది. మరో భారీ నౌక కేప్ బ్రాజిల్లా ద్వారా 1.64 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేయనున్నారు. ఈ నౌక శనివారం పోర్టులో లంగరు వేయనుంది. -
పర్యావరణంలో అదో మైలురాయి
బీజింగ్: ‘బొగ్గు అంటే చైనా, చైనా అంటే బొగ్గు’ అంతర్జాతీయ ఇంధన సంస్థ 2012లో చైనా గురించి చేసిన వ్యాఖ్యలివి. అప్పుడు మొత్తం ప్రపంచంలో సగం బొగ్గును చైనానే ఉత్పత్తి చేసేది. విద్యుత్ ఉత్పత్తి కోసం దాన్ని ఉపయోగించేది. ప్రపంచంలో రెండవ బలమైన ఆర్థిక దేశంగా ఘనతికెక్కిన చైనాలో అప్పుడు 2,600 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండేవి. 2014 సంవత్సరం నుంచి చైనా వైఖరి ఊహించని విధంగా మారింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గిస్తూ జల విద్యుత్, సౌర విద్యుత్, పవన విద్యుత్ కేంద్రాలను పెంచుతూ వచ్చింది. థర్మల్ విద్యుత్ రంగంలో ఉత్పత్తిని తగ్గిస్తూ కాలుష్యరహిత ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి రంగంలో పురోభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో బ్రిటన్, అమెరికా తర్వాత చైనానే నిలబడింది. 2013లో చైనా 420 టన్నుల బొగ్గును విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించగా, 2014లో దానిలో 2.9 శాతాన్ని, 2015లో 3.6 శాతాన్ని చైనా తగ్గించిందని ‘నేచర్ జియోసైన్స్ జర్నల్’ వెల్లడించింది. అదే సమయంలో చైనా సౌర విద్యుత్ రంగంలో 28 శాతం, పవన, జల విద్యుత్ రంగాల్లో 13 శాతం ఉత్పత్తిని పెంచిందని చైనాకు చెందిన ‘రినీవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్ అసోసియేషన్’ తెలియజేసింది. భూతాపోన్నతిపై అంతర్జాతీయంగా కుదురిని అవగాహన మేరకు 2014 నుంచి బ్రిటన్, అమెరికా, చైనాలతోపాటు జపాన్, కెనడా, జర్మనీ, ఇండోనేషియా, మెక్సికో లాంటి దేశాలు కూడా విద్యుత్ కోసం బొగ్గు వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయి. కనుక ఆ సంవత్సరాన్ని ›ప్రపంచ ఆర్థిక, పర్యావరణ చరిత్రలో ఓ మైలురాయిగా పరిగణిచ్చవచ్చని వ్యాసకర్తలు అభివర్ణించారు. -
నాణ్యమైన ఉత్పత్తి సాధించాలి
మల్టీ డిపార్ట్మెంట్æ కమిటీ సమావేశాల్లో సీజీఎం వెంకటేశ్వరరావు గోదావరిఖని/యైటింక్లయిన్కాలనీ : సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి అందరూ కృషి చేయాలని ఆర్జీ–1 సీజీఎం, ఆర్జీ–2 ఇన్చార్జి సీజీఎం వెంకటేశ్వర్రావు కోరారు. ఆర్జీ–1 పరిధిలోని జీడీకే–1వ గని, ఆర్జీ–2 పరిధిలోని ఓసీపీ–3 కృషిభవన్లో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన మల్టీడిపార్ట్మెంటల్ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతేడాది ఉద్యోగులందరూ మల్టీ డిపార్ట్మెంట్ కమిటి ద్వారా సమావేశాలు నిర్వహించుకుని ఆయా గనులు, డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో, సమన్వయంతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సంస్థను లాభాల బాట పట్టించారని తెలిపారు. ఈసారి వర్షాల కారణంగా సెప్టెంబర్ వరకు ఉత్పత్తి, ఉత్పాదకత విషయంలో కొంత వెనుకబడి ఉన్నామని, దీనిని అధిగమించి ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి అంకితభావంతో పని చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు ప్రణాళిక బద్దంగా ముందుకు సాగితే వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధిం^è డం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో బొగ్గుకు డిమాండ్ తగ్గిపోయిందన్నారు. విదేశాలను నుంచి తక్కువ ధరకే బొగ్గు మార్కెట్లోకి దిగుమతి కావడంతో బొగ్గు ధరలు పడిపోయాయని తెలిపారు. విద్యుత్ సంస్థలకు సరఫరా చేసే బొగ్గు ధరను పెంచే అవకాశం లేకుండా పోయిందని, కేవలం సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేసే బొగ్గు ధరమాత్రమే మనచేతుల్లో ఉందన్నారు. దీనికోసం ఇ–యాక్షన్ ద్వారాబొగ్గు అమ్మకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఉద్యోగులపై ఒత్తిడి పెంచి అధికారులు చేతులు ఎత్తేస్తే కాదని అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. భారీ యంత్రాల నిర్వహణపై దృష్టిసారించి పనిగంటలు పెంచుకోవాలని సూచించారు. సంస్థ మిగులు బడ్జెట్ కోసం అవుట్ సోర్సింగ్, ట్రాన్స్పోర్టు కోల్కాంట్రాక్టు ద్వారా పనులు నిర్వహిస్తుందని తెలిపారు. ఇది ఎంతో కాలం ఉండబోదన్నారు. రాబోయే రోజుల్లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచకతప్పదని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రాన్స్పోర్టు ధరలు విపరీతంగా పెరిగాయని, ఇలాంటి పరిస్థితుల్లో సంస్థ పరిస్థితి అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నారు. సమావేశాల్లో ఐఈడీ ఏజీఎం ప్రసాద్రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేవీ.రావు సాధించాల్సిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను, కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు, రక్షణ పరమైన చర్యలు, అందరి బాధ్యత తదితర విషయాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశాల్లో ఎస్ఓటూ సీజీఎం సుధాకర్రెడ్డి, ఎస్వోటూ జీఎం రవీందర్, ఏజెంట్లు సాంబయ్య, రమేశ్, పర్సనల్ డీజీఎం బి.హనుమంతరావు, ఎన్వీ.రావు, ఈఅండ్ఎం ఏజీఎం సాయిరాం, ఫైనాన్స్ డీజీఎం రాజేశ్వర్రావు, క్వాలిటీ డీజీఎం భైరయ్య, మేనేజర్లు బీవీ.రమణ, వెంకటయ్య, సంక్షేమాధికారి శ్రీనివాస్, నాయకులు సారంగపాణి, యాదగిరి సత్తయ్య, షబ్బీర్అహ్మద్, రమేశ్రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
జెన్కో బొగ్గు రవాణా పేరిట దోపిడీ
వరంగల్ : జెన్కో నిర్వహణలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్కు జరుగుతున్న బొగ్గు రవాణాలో కోట్ల రూపాయాలు దోచుకుం టున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010లో కాకతీయ థర్మల్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం అయ్యిందన్నారు. బొగ్గును స్థానిక భూపాలపల్లి గనుల నుంచి తీసుకోకుండా నాణ్యత పేరుతో గోదావరిఖని నుంచి తెప్పించడం వల్ల రవాణా చార్జీలతో బొగ్గు ధర పెరిగి ఉత్పత్తి వ్యయంపై భారం పడుతోందన్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్లకు దోచిపేట్టేందుకే కోల్ డైరెక్టర్, పవర్ స్టేషన్ ఎస్ఈలు ఈ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు ఉప్పల్ స్టేషన్లో బొగ్గును నీటితో కడగడం వల్ల ప్రతి రోజు 200 టన్నుల బరువు అదనంగా కాంట్రాక్టర్కు కలసి వస్తోందన్నారు. ఎక్కువ వచ్చిన బొగ్గును సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలకు అమ్ముకునేందుకు లారీల్లో తరలిస్తుం టే కరీంనగర్ జిల్లా మానకొండూరులో పోలీసులు పట్టుకొని సీజ్ చేశారని అన్నారు. ఈ బొగ్గు రవాణా కాంట్రాక్టు కాంగ్రెస్ నేత గండ్ర రమణారెడ్డి కుటుంబానిదే కావడం వల్ల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. అధికార పార్టీ నేతలకు సైతం భారీ మొత్తంలో ముడుపులు చెల్లించడం వల్ల ఈ దోపిడీని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోవడం లేదన్నారు. ఇప్పటి వరకు బొగ్గు రవాణా, కొనుగోలు, తదితర విషయాల్లో సుమారు రూ.1500 కోట్ల వరకు దళారులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలసి పంచుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీ సీఐడీ, సెంట్రల్ విజిలెన్స్తో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్కు, జెన్కో సీఎండీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగిందని అనేదానికి ఇటీవల ఐదుగురు ఇంజనీర్ల సస్పెన్షన్లే రుజువని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకొని తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూ రు అశోక్కుమార్, నాయకులు ఆక రాధాకృష్ణ, చాడా రఘునాథరెడ్డి, హన్మకొండ సాంబయ్య, రహీం, మార్గం సారం గం, తాళ్లపల్లి జయపాల్ తదితరులు పాల్గొన్నారు. l అధికార పార్టీ నాయకులకు వాటాలు l బొగ్గు అక్రమ రవాణా చేస్తున్న కాంట్రాక్టర్ l ఆరేళ్లలో రూ.1500కోట్లు లూటీ l టీyీ పీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు -
మన్మోహన్ను మోసం చేశారు
- బొగ్గు బ్లాకు కోసం రథి స్టీల్స్ కుట్ర - నిర్ధారించిన ప్రత్యేక కోర్టు - బొగ్గు కుంభకోణంలో రెండో తీర్పు న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకు కుంభకోణంలో రథి స్టీల్, పవర్ లిమిటెడ్ (ఆర్ఎస్పీఎల్) కంపెనీ, దానికి సంబంధించిన ముగ్గురు అధికారులను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. బొగ్గు గని కేటాయింపుల కోసం ఆర్ఎస్పీఎల్ తప్పుడు సమాచారమిచ్చి అప్పటి ప్రభుత్వాన్ని, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (బొగ్గు శాఖ ఇన్చార్జి మంత్రి)ను మోసం చేశారని తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో ఇది రెండో తీర్పు. ఛత్తీస్గఢ్లోని కేస్లా ఉత్తర బొగ్గు బ్లాకును పొందేందుకు ఆ కంపెనీ, దాని అధికారులైన మేనేజింగ్ డెరైక్టర్ ప్రదీప్ రథి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదిత్ రథి, ఏజీఎం కుశల్ అగర్వాల్లు మోసం (సెక్షన్ 420), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బీ) అభియోగాల కింద అవకతవకలకు పాల్పడినట్లు కోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు మంగళవారం ప్రత్యేక సీబీఐ జడ్జి భరత్ పరాశార్ తన 107 పేజీల తీర్పులో పేర్కొన్నారు. అనంతరం శిక్ష విధింపుపై జడ్జి వాదనలు విన్నారు. గరిష్ట శిక్ష విధించాలని సీబీఐ కోరింది. జడ్జి బుధవారం శిక్షలను ఖరారు చేయనున్నారు. ఐపీసీ సెక్షన్ 420 కింద జరిమానాతోపాటు ఏడేళ్ల వరకు శిక్ష విధించే అవకాశముంది. గత ఏప్రిల్లో ఇచ్చిన తొలి తీర్పులో జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్లు ఆర్సీ రుంగ్లా, ఆర్ఎస్ రుంగ్టాలను కోర్టు దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. -
బొగ్గు క్షేత్రాల వేలంలో లొసుగులు
- పార్లమెంట్కు కాగ్ నివేదిక - గతేడాది వేలం వేసిన ఎన్డీఏ సర్కారు న్యూఢిల్లీ : గత ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు క్షేత్రాల ఈ-వేలంలో లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపింది. కార్పొరేట్ గ్రూపుల జాయింట్ వెంచర్లు, సబ్సిడియరీలుగా బిడ్లు వేయడంతో 11 క్షేత్రాలకు సంబంధించి జరిగిన వేలంలో పోటీతత్వానికి అడ్డుకట్ట పడినట్లయిందని మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నివేదికలో పేర్కొంది. తొలి రెండు భాగాలకు సంబంధించి జరిగిన వేలంలో సామర్థ్య పోటీ అనేది ఆడిట్ లో కనిపించలేదని తెలిపింది. మొదటి రెండు భాగాల్లో 29 బొగ్గు క్షేత్రాల్లోని 11 క్షేత్రాలకు విజయవంతంగా ఈ-ఆక్షన్ పూర్తయిందని, ఈ వేలంలో పాల్గొన్న అర్హత గల బిడ్డర్లలో ఒకే కంపెనీకి చెందినవో లేదా సబ్సిడియరీ సంస్థగానో లేదా జాయింట్ వెంచర్లగానో పాల్గొన్నాయని తెలిపింది. ఈ పరిస్థితులను బట్టి చూస్తే జాయింట్ వెంచర్లను స్టాండర్డ్ టెండర్ డాక్యుమెంట్ అనుమతించి.. అదే సమయంలో అర్హత గల బిడ్డర్లను పరిమితం చేసిందని పేర్కొంది. దీంతో రెండు భాగాల్లో సరైన పోటీ జరిగిందనే నమ్మకం ఆడిట్లో కలగలేదని కాగ్ చెప్పింది. ఇక మూడో భాగంలో ఎక్కువ మంది జాయింట్ వెంచర్లుగా పాల్గొనే ఉద్దేశంతో నిబంధనలను బొగ్గు శాఖ సవరించిందని తెలిపింది. కాగ్ రిపోర్ట్పై ఓ అధికారి స్పందిస్తూ.. అర్హత సాధించిన బిడ్డర్లలో 6 శాతం మాత్రమే జాయింట్ వెంచర్లు అని, వాటిలో ఒక్కటే విజయవంతమైన బిడ్డర్ అని చెప్పారు. కనుక ఆ నిబంధన పోటీని నిరోధించలేదనేది అర్థమవుతుందన్నారు. కాగ్ గుర్తించిన ఇతర అంశాలు... 8 రైలు ప్రమాదాలను ఫుట్ఓవర్ బ్రిడ్జి, ఫెన్సింగ్లాంటి ఏర్పాట్లతో నివారించాలని సూచించింది. 8 రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు వసతులు సరిగాలేవని, అలాగే అపరిశుభ్రత తాండవిస్తోందని ఆక్షేపించింది. 8 రూ.18,845 కోట్ల వ్యయంతో అమెరికా నుంచి తెప్పించిన సీ-17 గ్లోబ్మాస్టర్ అనే ఆధునిక రవాణా విమానాలను సరిగా వినియోగించకపోవడాన్ని కాగ్ ఎండగట్టింది. 8 మిగ్-29కే యుద్ధ విమానాలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని కాగ్ పేర్కొంది. -
21 ఇన్క్లైన్ బొగ్గు గని మూత!
ఏడు నెలల్లో ముగియనున్న భూగర్భ గని జీవితకాలం బదిలీ భయంతో కార్మికుల ఆందోళన నూతన గని ప్రారంభించాలని డిమాండ్ ఇల్లెందుఅర్బన్: ఇల్లెందు ఏరియాలోని 21 ఇన్క్లైన్ భూగర్భ గని జీవితకాలం మరో ఏడు నెలల్లో ముగియనుంది. 2017 మార్చి నాటికి గనిలో ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ప్రస్తుతం గనిలో 497 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గని జీవితకాలం ముగిసేనాటికి సుమారు 60 మందికి పైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. మిగిలిన కార్మికుల్లో మాత్రం బదిలీ భయం పట్టుకుంది. ఏళ్లతరబడి స్థానికంగా పని చేసి దూరప్రాంతాలకు వెళ్లాల్సివస్తుందని ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం రెండేళ్ల నుంచి దశలవారీగా బదిలీ చేస్తూ కార్మికుల సంఖ్యను కుదించింది. గని జీవితం కాలం మరికొంత కాలం పెంచాలని, అది సాధ్యపడకపోతే నూతన గనిని ప్రారంభించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పలు విభాగాలకు ముప్పు 21 ఇన్క్లైన్ మూతపడితే సమీపంలోని వర్క్షాపు, ఆటోవర్క్షాపు, స్టోర్స్లతో పాటు ఏరియా వైద్యశాల తదితర విభాగాలకు ముప్పు వాటిల్లనుంది. గని మూతపడితే ఆయా విభాగాలు కూడా ఎత్తివేసే అవకాశం ఉందని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో కార్మికుల సంఖ్య 15 మంది కంటే మించిలేరు. మూతపడే నాటికి సగానికిపైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు ఎటు తేలని సొసైటీ అవినీతి గని మరో ఏడు నెలల్లో మూతపడనుందని యాజమాన్యమే చెబుతోంది. రెండేళ్లుగా 21 ఇన్క్లైన్ సొసైటీ అవినీతిపై విచారణ జరుగుతోంది. అక్రమార్కులను ఇప్పటివరకు తేల్చలేదు. డిపాజిటర్లకు రావాల్సిన నగదును పూర్తిగా చెల్లించలేకపోయారు. వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. కొందరు అక్రమార్కులు చక్రం తిప్పుతూ గని మూతపడే వరకు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గని మూతపడితే తమ పరిస్థితి ఏమిటని డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్కాస్టులే దిక్కు ఇల్లెందు ఏరియాలో ఉన్న ఒకే ఒక్క అండర్ గ్రౌండ్మైన్ మూతపడటంతో కేఓసీ, జేకే–5 ఓసీల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగనుంది. యాజమాన్యం గని మూతపడిన అనంతరం మెగా ఓసీకి ప్రతిపాదనలు రూపొందిస్తోంది. మూతపడిన గని ప్రదేశాన్ని ఓసీగా మార్పు చేసి ఉత్పత్తి సాధించేందుకు చర్యలు చేపడుతున్నారు. 21 ఇన్క్లైన్కు చివరి గుర్తింపు ఎన్నికలు సింగరేణిలో జరగనున్న ఈ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో 21 ఇన్క్లైన్ కార్మికులు ఓటు వేయనున్నారు. మళ్లీ జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి గని మూతపడి ఉంటుంది. మళ్లీ దఫా జరగనున్న ఎన్నికల నాటికి ఇక్కడి కార్మికులు వివిధ ప్రాంతాల్లో పని చేయనున్నారు. గని జీవితకాలం పెంచాలి గనిలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. మూసివేయడం సరికాదు. యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి మరో నాలుగైదేళ్లు గని జీవితం కాలం పెంచవచ్చు. కార్మికులను బదిలీ చేయొద్దు –కె.సారయ్య, ఏఐటీయూసీ నేత నూతన గనులు ప్రారంభించాలి యాజమాన్యం నూతన గనుల ఏర్పాటు విషయమై ఆలోచించడంలేదు. గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు గని జీవితకాలాన్ని పెంచడంలో విఫలమయ్యారు. యాజమాన్యం పునరాలోచించి నూతన గనులను ప్రారంభించాలి. –సత్యనారాయణ, హెచ్ఎంఎస్ నేత యాజమాన్యానికి విన్నవించాం ఇల్లెందు ఏరియాలో నూతన గనులు ప్రారంభించాలని యాజమాన్యానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేశాం. ఇల్లెందు ఏరియాలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. 21ఇన్క్లైన్ గని జీవిత కాలం పెంచాలి. కార్మికులను బదిలీ చేయొద్దు. –జగన్నాథం, టీబీజీకేఎస్ నేత -
'దేశంలో కరెంట్ కొరతను నివారించాం'
న్యూఢిల్లీ: దేశంలో కరెంట్ కొరతను నివారించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ... థర్మల్ పవర్ ప్లాంట్కు 51 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. అలాగే విద్యుత్ ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని 70 శాతానికి పెంచగలిగామన్నారు. తెలంగాణలో 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ప్రారంభంపై పునరాలోచించాలన్నారు. ప్రస్తుతం యూనిట్ కరెంట్ ధర రూ. 2.20 పైసలకు అందుబాటులో ఉందని పీయూష్ గోయల్ చెప్పారు. -
డైలమా..!
► గుర్తింపు’ ఎన్నికలపై సందిగ్ధత ► 29తో ముగియనున్న టీబీజీకేఎస్ కాలపరిమితి ► ప్రక్రియ మొదలు పెట్టని ఆర్ఎల్సీ ► సింగరేణిలో ఆరో దఫా ఎన్నికలూ ఆలస్యమేనా? మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఇప్పటి వరకు కాల పరిమితి ప్రకారం జరిగిన దాఖలాలు లేవు. కంపెనీలో ఐదు దఫాలుగా నిర్వహించిన ఎన్నికలు మూడు నుంచి పది నెలల జాప్యంతో జరిగారుు. ప్రస్తుతం ఆరో దఫా ఎన్నికలు సైతం సకాలంలో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా ప్రస్తుత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్లో నెలకొన్న అనిశ్చితి కారణం కావడంతో శ్రేణుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. మిగిలింది 13 రోజులే.. సింగరేణిలో ఐదో దఫా ఎన్నికలు 2012 జూన్ 28న జరిగారుు. గెలుపొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి మాత్రం ఆగస్టు 6న అధికారికంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. వాస్తవం గా ఎన్నిక ఫలితం తేదీ ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఈనెల 29వ తేదీ తో టీబీజీకేఎస్ కాలపరిమితి ముగుస్తుంది. రెండు నెలల ముందు నుంచే ఆర్ఎల్సీ ఎన్నిక ల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా అలాంటిదేమీ చేపట్టలేదు. యూజమాన్యం సైతం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆది నుంచీ ఆధిపత్య పోరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలుపొందిన నాటి నుంచి యూనియన్లో పదవుల కోసం నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. మాతృ సంస్థ సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతో చినికి చినికి గాలివానలా మారింది. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను పట్టించుకునే వారు లేకపోవడంతో కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. నాలుగేళ్ల పుణ్యకాలం కాస్త ముగిసే సమయం వచ్చినా యూని యన్ గాడిలో పడలేదు. ఎక్కడి సమస్యలు అక్క డే ఉన్నారుు. బొగ్గు బిడ్డలకు తెలంగాణ ఇంక్రిమెంట్ తప్ప చేసిన మేలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. వారసత్వ ఉద్యోగాల హామీ అలాగే ఉంది. సొంతింటి కల నెరవేర్చలేదు. ఆదాయపు పన్ను మినహారుుంపు ఊసే లేదు. ఇక సకల జనుల సమ్మె కాలపు వేతనంపై స్పష్టత లేదు. ఈ విషయూలపై ఇప్పటికే అవకాశం దొరి కిన ప్రతీసారి ఇతర కార్మిక సంఘాలన్నీ దుమ్మె త్తి పోస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే కార్మికులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫలితాలు ఎలా ఉంటాయోనని అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఎత్తుగడ కలిసొచ్చేనా..? టీబీజీకేఎస్లోని అంతర్గత పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సమస్య పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయకపోవడంతో పరిస్థితి ఇంతవరకు వచ్చిందని రాజకీయ పరిశీ లకులు అంటున్నారు. తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ‘నూతన కమిటీ’ వేస్తామని చెప్పినా ఇంకా కొలిక్కి రాలే దు. ఎన్నికలు జరిగిన తేదీని బట్టి చూస్తే జూన్ 29 తర్వాత ఆరో దఫా ఎన్నికలు నిర్వహించాలి. ఈనేపథ్యంలో అధికారికంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తేదీ.. ఎన్నికలు జరిగిన తేదీకి మధ్య ఉన్న 38 రోజుల సమయూన్ని యూనియన్లోని పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి వినియోగించుకోవాలని అధినాయకత్వం చూస్తోంది. అం దులో భాగంగానే ‘ఆగస్టు 6వ తేదీ వరకు తమ కు హోదా వర్తిస్తుంది కాబట్టి.. ఆ సమయానికే ఎన్నికలు జరపాలని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే పరిస్థితి ఏమిటని శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆలస్యమైతే ఉత్పత్తికి నష్టం ఎన్నికలు ఆలస్యమైతే ఉత్పత్తికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్పత్తి మందకొడిగా సాగుతోంది. గడిచిన రెండు నెల ల్లో ఒకటి రెండు ఏరియూలు మినహా నూరు శా తం ఉత్పత్తి నమోదు కాలేదు. పైగా ఎన్నికలను సాగదీస్తే ప్రచారం, గేట్ మీటింగ్ల ప్రభావం ఉత్పత్తిపై పడుతుంది. అందుకే తొందరగా ఎన్నికలు ముగించాలని యూజమాన్యం భావి స్తున్నా అధికార పక్షం అడ్డుపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు మొదటి వారంలోపు ఎన్నికలు ముగించితే వార్షిక లక్ష్యాన్ని సులువుగా కార్మికులపై భారం పడకుండా సాధించవచ్చని కంపెనీ ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. -
సింగరేణి ప్లాంట్కు బొగ్గు రవాణా
► మొదటి యూనిట్ ప్లాంటులో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ► శ్రీరాంపూర్, మందమర్రి, ► భూపాల్పల్లి నుంచి బొగ్గు సరఫరా ► ప్లాంటులో 2.80లక్షల టన్నుల బొగ్గు నిల్వలు జైపూర్ : మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంటుకు అసరమైన బొగ్గును రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న 1200 మెగా వాట్ల ప్లాంటు పనులు తుది దశకు చేరాయి. మార్చిలో బొగ్గు, ఆయిల్తో యూనిట్-1 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా ఈ నెలాఖరుకు యూనిట్-2 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి బొగ్గు, నీరు ప్రధానం కావడంతో ఇప్పటికే షెట్పల్లి నుంచి 1టీఎంసీ నీటిని తరలించారు. రిజర్వాయర్-1 సిద్ధం చేశారు. కాగా ప్లాంటుకు రైల్వేట్రాక్ ద్వారా బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించినా అది ఇప్పట్లో పూర్తి అయే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ జైపూర్ ప్లాంటు నుంచి మంచిర్యాల వరకు ప్రసుత్తం ఉన్న 63నంబరు జాతీయ రహదారిని రూ.19కోట్లతో నాలుగు వరుసల రోడ్డు విస్తరించింది. అలాగే జాతీయ రహదారి నుండి కోల్-హ్యాడ్లింగ్ ప్లాంటు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. శ్రీరాంపూర్ ఓసీపీ, మందమర్రి వాచర్, భూపాల్పల్లి ఏరియాలోని గనుల నుంచి లారీల ద్వారా ప్లాంటుకు బొగ్గు రవాణా చేస్తున్నారు. ఒక యూనిట్ ప్లాంటుకు (600మెగావాట్లు) ఒక రోజుకు 6 వేల టన్నుల బొగ్గు అవసరం అంటే రెండు యూనిట్లకు ఒక్కరోజుకు 12 వేల టన్నుల బొగ్గు అవసరం. బొగ్గు నాణ్యతలోపిస్తే 12వేల నుంచి 15వేల టన్నుల వరకు అవసరం పడుతుంది. అయితే ప్లాంటు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అరుుతే 12వేల నుంచి 15వేల టన్నుల బొగ్గు కావాల్సి వస్తుందని, కాని ప్రారంభ దశలో 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. అరుునా ప్లాంటులో 2లక్షల 80వేల టన్నుల బొగ్గును నిల్వ చేశారు. మొదటి యూనిట్ ప్లాంటు నుంచి ఉత్పత్తి 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటులో మొదటి యూనిట్ (600 మెగావాట్ల) ప్లాంటు ను మార్చి 13న సింక్రనైజేషన్ చేయగా శుక్రవారం నుంచి నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సింక్రనైజేషన్ చేసి బొగ్గు, ఆయిల్తో ప్రయోగాత్మకం గా ఒక్క రోజు విద్యుత్ ఉత్పత్తి చేసినా ఇక నుం చి యూనిట్-1 ప్లాంటు ద్వారా బొగ్గుతో ఉత్పత్తి చేయనున్నారు. మొదటి యూని ట్ ద్వారా వచ్చిన విద్యుత్ను 400కేవీ స్విచ్యార్డు ద్వారా గజ్వేల్ గ్రిడ్కు సరఫరా చేయనున్నారు. -
బొగ్గు కుప్పల్లో యంత్రాలు బుగ్గి
తొమ్మిది నెలల్లో మూడు యంత్రాలు దగ్ధం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం ఓసీపీ-3లో ఆపరేటర్ల ఆందోళన యైటింక్లయిన్కాలనీ(కరీంనగర్) : బొగ్గు కుప్పలను ఎత్తే భా రీ యంత్రాలు కాలిపోతున్నారుు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కోట్లాది రూపాయల విలువచేసే యంత్రాలు అ గ్నికి ఆహుతవుతున్నారుు. సింగరేణి వ్యాప్తంగా 16 ఓపెన్కా స్ట్లు ఉన్నా.. ఎక్కడా లేని విధంగా ఆర్జీ-2 ఓసీపీ-3లో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నారుు. ఓసీపీ-3 సీహెచ్పీ వద్ద నిల్వ ఉన్న బొగ్గు ఎత్తే క్రమంలో షావల్స్ ఎక్కువగా ప్ర మాదానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మండుతున్న బొగ్గు కుప్పలపైకి ఎక్కి షావల్ యంత్రాలు పనిచేస్తుండగా హోస్పైపుల్లో ఆయిల్, డీజిల్ లీకేజీ వల్ల బొగ్గు వేడికి మంటలంటుకుంటున్నాయని కార్మికులు చెబుతున్నారు. తొమ్మిది నెల ల కాలంలో మూడు భారీ యంత్రాలు బుగ్గయ్యూరుు. గత ఏడాది సెప్టెంబర్లో సరస్వతి షావల్, డిసెంబర్లో ఎల్-7 లోడర్, ఈనెల 18 స్వర్ణముఖి అగ్నికి ఆహుతయ్యూరుు. తాజా ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఇవి కాకుండా గతంలో బొగ్గు ఎత్తే ఒక లోడర్ యంత్రం ఇదే విధంగా అగ్ని ప్రమాదానికి గురైంది. సీహెచ్పీలో పనిచేసే సరస్వతి యంత్రం సైతం అగ్నిప్రమాదంలో కాలిపోయింది. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు ఓసీపీ-3 సీహెచ్పీ వద్ద ఉన్న బొగ్గు నిల్వలను తరలించే క్రమంలో బొగ్గును షావల్ ద్వారా డంపర్లలో ఎత్తుతున్నారు. కొన్ని సందర్భాల్లో బొగ్గు మంటలను చల్లార్చేందుకు కుప్పలపైకి షావల్ను ఎక్కించి బొగ్గును దూరంగా జరుపుతున్నా రు. అయితే బొగ్గు వేడికి షావల్స్ వెనకభాగంలో ఉండే ఆయిల్ పైపులకు మంటలంటుకుంటున్నారుు. అవి పెద్ద ఎత్తున ఎగిసి పడి బయటి వాళ్లు చూసి చెప్పేంత వరకు క్యాబిన్లో ఉండే ఆపరేటర్ గమనించడం కష్టంగా మారుతోంది. మంటలను చల్లార్చేందుకు వాటర్ ట్యాంకర్లు సమీపంలో లేకపోవడంతో యంత్రాలు పూర్తిగా కాలిపోతున్నా యి. ఆపరేటర్లు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఈనెల 18న అర్ధరాత్రి షావల్ దగ్ధం కాగా మంటలు ఆర్పేందుకు సమీపంలో వాటర్ ట్యాంకర్ అందుబాటులో లేదు. ఫైర్ఫైటింగ్ ఎగ్జిస్టింగ్ సిలిండర్లు కూడా పనిచేయలేదని కార్మికులు తెలిపారు. -
సింగరేణి ప్లాంట్కు బొగ్గు రవాణా
జైపూర్ : మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంటుకు అసరమైన బొగ్గును రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న 1200 మెగా వాట్ల ప్లాంటు పనులు తుది దశకు చేరాయి. మార్చిలో బొగ్గు, ఆయిల్తో యూనిట్-1 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా ఈ నెలాఖరుకు యూనిట్-2 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి బొగ్గు, నీరు ప్రధానం కావడంతో ఇప్పటికే షెట్పల్లి నుంచి 1టీఎంసీ నీటిని తరలించారు. రిజర్వాయర్-1 సిద్ధం చేశారు. కాగా ప్లాంటుకు రైల్వేట్రాక్ ద్వారా బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించినా అది ఇప్పట్లో పూర్తి అయే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ జైపూర్ ప్లాంటు నుంచి మంచిర్యాల వరకు ప్రసుత్తం ఉన్న 63నంబరు జాతీయ రహదారిని రూ.19కోట్లతో నాలుగు వరుసల రోడ్డు విస్తరించింది. అలాగే జాతీయ రహదారి నుండి కోల్-హ్యాడ్లింగ్ ప్లాంటు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. శ్రీరాంపూర్ ఓసీపీ, మందమర్రి వాచర్, భూపాల్పల్లి ఏరియాలోని గనుల నుంచి లారీల ద్వారా ప్లాంటుకు బొగ్గు రవాణా చేస్తున్నారు. ఒక యూనిట్ ప్లాంటుకు (600మెగావాట్లు) ఒక రోజుకు 6 వేల టన్నుల బొగ్గు అవసరం అంటే రెండు యూనిట్లకు ఒక్కరోజుకు 12 వేల టన్నుల బొగ్గు అవసరం. బొగ్గు నాణ్యతలోపిస్తే 12వేల నుంచి 15వేల టన్నుల వరకు అవసరం పడుతుంది. అయితే ప్లాంటు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అరుుతే 12వేల నుంచి 15వేల టన్నుల బొగ్గు కావాల్సి వస్తుందని, కాని ప్రారంభ దశలో 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. అరుునా ప్లాంటులో 2లక్షల 80వేల టన్నుల బొగ్గును నిల్వ చేశారు. మొదటి యూనిట్ ప్లాంటు నుంచి ఉత్పత్తి 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటులో మొదటి యూనిట్ (600 మెగావాట్ల) ప్లాంటు ను మార్చి 13న సింక్రనైజేషన్ చేయగా శుక్రవారం నుంచి నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సింక్రనైజేషన్ చేసి బొగ్గు, ఆయిల్తో ప్రయోగాత్మకం గా ఒక్క రోజు విద్యుత్ ఉత్పత్తి చేసినా ఇక నుం చి యూనిట్-1 ప్లాంటు ద్వారా బొగ్గుతో ఉత్పత్తి చేయనున్నారు. మొదటి యూని ట్ ద్వారా వచ్చిన విద్యుత్ను 400కేవీ స్విచ్యార్డు ద్వారా గజ్వేల్ గ్రిడ్కు సరఫరా చేయనున్నారు. -
అసౌకర్యాల సెగ
ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్న కార్మికులకు కనీసం సౌకర్యాలు కరువయ్యూరుు. దుమ్ము, ధూళి, కాలిన బొగ్గు నుంచి గ్యాస్ లాంటి పొగతో ఊపిరి సలపని పరిస్థితి. మండుటెండలోనే విధుల నిర్వహణ. స్థానికంగా క్వార్టర్లు లేక దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు జేవీఆర్ ఓసీ-1 కార్మికులు. - సత్తుపల్లి(ఖమ్మం) కొత్తగూడెం ఏరియూ పరిధి సత్తుపల్లి జేవీఆర్ ఓసీని 2005 జూలై 5న అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 11 ఏళ్లుగా ఉత్పత్తిలో ఏటా కంపెనీ నిర్దేశించిన లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు కార్మికులు. ప్రస్తుతం 453 మంది పని చేస్తున్నా రు. హైడ్రాలిక్ షావల్స్ 4, డ్రిల్స్ 2, డోజర్లు 4, డంపర్లు 15, గ్రేడర్స్ 2, లోడర్ 1 ఉన్నారుు. గతేడాది లక్ష్యం 40లక్షల టన్నులకు 45.5లక్షల టన్నులు తీశారు. షిఫ్టునకు కనీసం 16 నుంచి 18వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. సమస్యల తిష్ట : కార్మికులకు స్థానికంగా క్వార్టర్లు లేకపోవడంతో సగానికి పైగా కొత్తగూడెం, ఇల్లెందు ఏరియూల్లో నివాసముంటున్నారు. అక్కడి నుంచి డెరైక్ట్ బస్సు సౌకర్యం లేక లారీల ను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. క్వార్టర్ల నిర్మాణానికి యూజ మాన్యం రూ.114కోట్లు మంజూరు చేసినా స్థలం సేకరిం చలేదు. కంపెనీ ఇస్తున్న 10శాతం హెచ్ఆర్ఏ విద్యుత్ బిల్లులకు సరిపోవటం లేదని కార్మికులు చెబుతున్నారు. ఓసీలో కార్మికులు సేద తీరేందుకు వేసిన పందిళ్లకు చుట్టూ తడికలు కట్టకపోవటంతో తీవ్రవేడి, వడగాడ్పు లు, బొగ్గు సెగలోనే పని చేయాల్సి వస్తోంది. పందిళ్ల కింద ఏర్పాటు చేసి కుండలోని మంచినీళ్లు వేడెక్కి తాగలేకపోతున్నారు. పదేళ్ల నాటి యంత్రాలనే వాడటం వలన తరచూ రిపేరుకొస్తున్నారుు. హైడ్రాలిక్ షావల్స్ నాలుగు ఉన్నా ఒక్కటే సక్రమంగా నడుస్తోంది. మిగిలినవి ఎప్పుడు ఆగిపోతా యో తెలియదు. డోజరు పాతకాలంనాటిది కావడటం వల్ల దుమ్ము, ధూళితో నరకం చూస్తున్నారు. క్రషర్ క్యాబిన్లు, డోజర్, లోడర్ యంత్రాల క్యాబిన్ల పైన చాపలతో కప్పుతున్నారు. చుట్టు పక్కల నుంచి వచ్చే వేడికి కార్మికులు తట్టుకోలేకపోతున్నారు. యూజమాన్యం నిర్వహిస్తున్న క్యాంటీన్లో అల్పాహారం నాణ్యత లేకుండా తయూరు చేస్తున్నారు. వాటిని తినలేక అర్ధాకలితో ఉండాల్సి వస్తోంది. కేవలం వడ, ఉప్మాతోనే సరిపుచ్చుతున్నారు. పూరి అప్పుడప్పుడు వడ్డిస్తున్నారు. ఇడ్లీ, స్వీట్లు అసలే ఇవ్వటం లేదు. రెస్ట్ రూంలోనే క్యాంటీన్ నిర్వహించటంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం. పంపిణీ చేస్తున్న మజ్జిగ ప్యాకెట్లు కార్మికులకు అందే వరకు ఎండలకు వేడిగా మారుతున్నారుు. వాటిని పని ప్రదేశానికి పంపిణీ చేయకుండా ఒక షెడ్డులో ఇస్తున్నారు. అవి కార్మికుల చేతికి చేరడానికి చాలా సమయం పడుతోంది. పీఎంఈ పరీక్షలకు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్లి రావటంతో మస్టర్ పోతోంది. బీపీ హెచ్చుతగ్గులుంటే.. పరీక్షలకు రెండు మూడురోజులు పడుతోంది. కొత్తగూడెం ఏరియా పరిధి కావటంతో ప్రతి చిన్న పనికి అక్కడి కార్యాలయూనికి వెళ్లడంతో మస్టర్లు పోతున్నారుు. క్వార్టర్లు లేక అవస్థలు సత్తుపల్లిలో క్వార్టర్లు లేకపోవటంతో కార్మికుల కుటుం బాలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికీ చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిపోతున్నారు. సంస్థ ఇచ్చే హెచ్ఆర్ఏ అద్దెలకు ఏమాత్రం సరిపోవటం లేదు. స్థల సేకరించి తక్షణం క్వార్టర్లు నిర్మించాలి. - ఎండీ.అజ్గర్ఖాన్, ఈపీ ఆపరేటర్ పీఎంఈ పరీక్షలు ఇక్కడే చేయూలి ప్రతి ఏడాది పీఎంఈ పరీక్ష లు తప్పనిసరి. పరీక్షలకు కొ త్తగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్లటంతో మస్టర్ పోతుంది. స్థానిక డిస్పెన్సరీ వద్దే పీఎంఈ పరీక్షలు నిర్వహిస్తే వేతనం కలిసివస్తుంది. టెన్షన్ తగ్గుతుంది. - చిట్టూరి యుగంధర్, ఫిట్ కార్యదర్శి సత్తుపల్లి -
కట్టెలు కొట్టి.. బొగ్గుగా మార్చి
కనిపించని ‘హరితహారం’ గ్రామాల్లో బుగ్గి అవుతున్న పచ్చదనం హైదరాబాద్కు తరలుతున్న బొగ్గు పట్టింపులేని అధికార గణం పాలకుర్తి : చెరువు శిఖాలు, గుట్టలు, వ్యవసాయం చేయకుండా వృథాగా ఉన్న భూముల్లో ఉన్న చెట్లను నరికించి బొగ్గు వ్యాపారులు లాభాలార్జిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లు నరికించి బట్టీలు పెట్టి బొగ్గును బస్తాల్లో నింపి హైదరాబాద్కు తరలిస్తున్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ ఓ వైపు విస్తృత ప్రచారం చేస్తున్న ప్రభుత్వం యథేచ్ఛగా చెట్లు నరికివేస్తుంటే పట్టింపులేకుండా వ్యవహరిస్తుంది. మండలంలోని ముత్తారం, లక్ష్మినారాయణపురం, గూడూరు, తిర్మలగిరి, ఇరవెన్ను, వావిలాల, మల్లంపల్లి గ్రామాల్లో బొగ్గుబట్టీల వ్యవహారం కొనసాగుతుంది. బొగ్గు బట్టీల కోసం ప్రతిరోజు వేలాది చెట్లు ఆహుతి అవుతున్నాయి. మరో హరితహారం పేరిట చెట్లను పెంచాలని నాటిన లక్షలాది మొక్కలు ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు. చెట్ల నరికి వేతపై సంబందితాధికారులు దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఒక చెట్టు నరికితే పది మొక్కలు పెంచాలి ఒక చెట్టు నరికితే పది మొక్కలు నాటించే బాధ్యత తీసుకోవాలి. ప్రతిఒక్కరూ మొక్కలు నాటితే హరిత తెలంగాణ సాధ్యమౌతుంది. మొక్కుబడిగా మొక్క ల పెంపకం చేపడితే ఫలితాలు ఉండవు. చిత్తశుద్దితో మొక్కల పెంపకం చేపట్టాలి. - ఇమ్మడి అశోక్, ఉపాధ్యాయుడు, అయ్యంగారిపల్లి చెట్ల నరికివేతను అరికడతాం మండలంలో అనుమతి లేని చెట్ల నరికివేతను అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడతాం. చెట్లు నరికివేయడం మానుకొని చెట్లను పెంచాలనే అవగాహన ప్రతిఒక్కరూ కలిగిఉండాలి. - బి.బన్సీలాల్, తహసీల్దార్, పాలకుర్తి -
సిమెంట్ కు సహజ వనరుల కొరత!
♦ ప్రస్తుతమున్న బొగ్గు, సున్నపురాయి నిల్వలు 30 ఏళ్ల వరకే ♦ ఆ తర్వాత పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం; ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని సూచన ♦ సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) అధ్యక్షులు డాక్టర్ శైలేంద్ర చౌక్సీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సిమెంట్ ఉత్పత్తికి ప్రధాన వనరులు బొగ్గు, సున్నపురాయి వంటి సహజ వనరులే. కానీ, మన దేశంలో వీటి లభ్యత రోజురోజుకూ తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కూడా. ప్రస్తుతం దేశంలో ఉన్న సహజ వనరులు మరో 30 ఏళ్ల వరకు మాత్రమే ఈ పరిశ్రమకు సరిపోతాయి. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? అంటే ఏ ఒక్కరి దగ్గరా సమాధానం లేదని’’ సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) అధ్యక్షులు డాక్టర్ శైలేంద్ర చౌక్సీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సిమెంట్ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమని చెప్పుకొచ్చారు. అందుకే సిమెంట్ ఉత్పత్తిలో ప్రారంభ స్థాయి నుంచే ఆధునిక సాంకేతికత వినియోగించడంతో పాటూ సాధ్యమైనంత వరకూ ముడి పదార్థాలు, వ్యర్థాల పున ర్ వినియోగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చౌక్సీ సూచించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) సంయుక్త ఆధ్వర్యంలో ‘12వ గ్రీన్ సిమెంటెక్-2016’ రెండు రోజుల సదస్సు గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా శైలేంద్ర చౌక్సీ ఏమన్నారంటే.. ♦ రానున్న రోజుల్లో దేశంలో సిమెంట్ వినియోగ సగటు పెరగనుంది. స్మార్ట్ సిటీ లు, అందరికీ ఇళ్లు, మెరుగైన మౌలిక వసతుల కల్పన వంటి అనేక పథకాలే ఇందుకు కారణం. అయితే ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలు సిమెంట్ పరిశ్రమకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికీ తీసుకెళ్లాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ♦ దేశంలో ఏటా 380 మిలియన్ టన్నుల సిమెంట్ను ఉత్పత్తి అవుతుంది. అయితే గత నాలుగే ళ్లుగా ఉత్పత్తి 2-4 శాతం తగ్గింది. గత రెండు దశాబ్ధాలుగా సిమెంట్ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 8 శాతాని కంటే తక్కువకు పడిపోయింది. దేశ ఆర్థిక సంక్షోభం, ప్రపంచ మాంద్యం, గ్రామీణ ఆర్థిక ప్రతికూలతలు ఇందుకు కారణం. కానీ గత ఐదేళ్ల నుంచి ఎన్నడూ చూడని విధంగా గతేడాది మార్చి నెలలో 11 శాతం వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మొత్తం మీద 6 శాతం వృద్ధి రేటుంటుందని అంచనా వేస్తున్నాం. ♦ సదస్సులో కేశోరాం ఇండస్ట్రీస్ (గ్రీన్కో ప్లాటినం), అల్ట్రాటెక్ సిమెంట్ లి. (గ్రీన్కో గోల్డ్)లకు గ్రీన్కో అవార్డులు, దాల్మియా సిమెంట్, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అలైస్ లి., జేఎస్డబ్ల్యూ సిమెంట్ లి., అల్ట్రాటెక్ ఎక్స్ట్రాలైట్ ఏఏసీ బ్లాక్స్లకు గ్రీన్ప్రో అవార్డులు అందించారు. అలాగే గ్రీన్ చాంపియన్స్ ఆఫ్ ఇండియన్ సిమెంట్ సెక్టార్, కాంపోసైట్ సిమెంట్ మార్చి 2016 పబ్లికేషన్స్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఏ సెక్రటరీ జనరల్ ఎన్ఏ విశ్వనాథన్, గ్రీన్సిమెంటెక్ చైర్మన్ జీ జయరామన్, కో-చైర్మన్లు కేఎన్ రావు, ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక రంగం మెరుపు..
♦ మార్చిలో 6.4 శాతం వృద్ధి ♦ 16 నెలల గరిష్ట స్థాయి న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన కీలక మౌలిక రంగం మార్చిలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తిలో 6.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి. 2015 మార్చిలో ఈ పరిశ్రమల గ్రూప్ అసలు వృద్ధిని నమోదుచేసుకోకపోగా -0.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్లతో కూడిన ఈ మౌలిక రంగం ఉత్పత్తి వాటా మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 38 శాతం. మార్చి ఐఐపీ గణాంకాలు ఈ నెల రెండవ వారంలో వెలువడతాయి. తాజా సమీక్ష నెలలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తిలో మంచి ఫలితం నమోదయ్యింది. రంగాల వారీగా వేర్వేరుగా చూసే... దూసుకుపోయినవి... ♦ రిఫైనరీ ప్రొడక్టులు: 2015 మార్చి నెలలో ఈ రంగం -1.5 శాతం క్షీణతలో ఉంది. అయితే 2016 మార్చిలో భారీగా 10.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ♦ ఎరువులు: ఈ రంగంలో వృద్ధి 5.2 శాతం నుంచి 22.9 శాతానికి ఎగసింది. ♦ స్టీల్: -6.5% క్షీణత నుంచి 3.4% వృద్ధికి మళ్లింది. ♦ సిమెంట్: ఈ రంగం కూడా -3.7 శాతం క్షీణత నుంచి 11.9 శాతం వృద్ధి బాటకు మళ్లింది. ♦ విద్యుత్: ఉత్పత్తి వృద్ధి రేటు 2 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా... ♦ కాగా గడచిన ఆర్థిక సంవత్సరం (2015 ఏప్రిల్-2016 మార్చి) ఈ గ్రూప్ ఉత్పత్తి వార్షికంగా 4.5 శాతం నుంచి 2.7 శాతానికి పడింది. తయారీ రంగం... 4 నెలల కనిష్టానికి న్యూఢిల్లీ: తయారీ రంగం ఏప్రిల్లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్/మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. మార్చిలో 52.4 పాయింట్ల వద్ద ఉన్న సూచీ... ఏప్రిల్లో 50.5 శాతానికి పడింది. కొత్త ఆర్డర్లు భారీగా లేకపోవడం, ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. ఆర్బీఐ రెపో రేటును మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ సూచీ సూచిస్తున్నట్లు మార్కిట్ ఎకనమిస్ట్ డీ లిమా పేర్కొన్నారు. కాగా పాయింట్లు 50పైన ఉంటే... దానిని విస్తరణ దశగానే పరిగణించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. -
గని ప్రమాదానికి అధికారులే కారకులు
బెల్లంపల్లి : మందమర్రి ఏరియా శాంతిఖనిలో జరిగిన గని ప్రమాదానికి సింగరేణి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. బుధవారం బెల్లంపల్లికి వచ్చిన ఆయన ఇటీవల పైకప్పు కూలి శాంతిఖని గనిలో మృతి చెందిన ముగ్గురు కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు మృతుల చిత్రపటాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం నంబర్ 2 ఇంక్లైన్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలేకరులతో మాట్లాడారు. గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే పైకప్పు కూలి హన్మంతరావు, పోశం, కిష్టయ్య ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బొగ్గు గనుల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత యాజమాన్యానిదేనని అన్నారు. శాంతిఖని గనిలో కొన్నాళ్ల నుంచి సేఫ్టీని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బొగ్గు అధికోత్పత్తి సాధించాలనే కాంక్షతో అధికారులు కంటిన్యూయస్ మైనర్ యంత్రంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారే తప్ప సేఫ్టీని పట్టించుకోలేదన్నారు. గని ప్రమాదం, ఎక్స్గ్రేషియా చెల్లింపు, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే అంశాలపై సింగరేణి సీఅండ్ఎండీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. సమావేశంలో టీవీవీ తూర్పు జిల్లా అధ్యక్షుడు పి.సంజీవ్, ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు జి.మోహన్, జిల్లా బాధ్యుడు అడ్లూరి వెంకటస్వామి,కాంగ్రెస్ బల్దియా ఫ్లోర్ లీడర్ కటకం సతీష్ కుమార్, రిటైర్డు ఏఈ కనకయ్య, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎనగందుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
లింకు తెగింది
► భూపాలపల్లిలో బొగ్గు ఉన్నా ► రామగుండం నుంచి రవాణా ► బొగ్గు దిగుమతిలో అడ్డదారులు ► జెన్కోకు కోట్లలో రవాణా భారం కోల్బెల్ట్(వరంగల్) : భూపాలపల్లి ఏరియా గనులలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కోసం తీసుకోవడానికి టీఎస్ జెన్కో సింగరేణి యాజమాన్యంతో లింకేజీ కుదుర్చుంది. ఒప్పం ద నియమాలకు విరుద్ధంగా కేటీపీపీ అధికారులు వ్యవహరించడంతో జెన్కోపై సుమారు రూ.34కోట్లు అదనపు భారం పడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నారు. బొగ్గు, నీటి వనరులు అందుబాటులో ఉండడంతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పతి చేయవచ్చని వరంగల్ జిల్లా చెల్పూర్ సమీపంలో ప్రభుత్వ రంగంలో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇందుకు భూపాపల్లి ఏరియూ గనుల నుంచి ఉత్పత్తి అరుున బొగ్గు తీసుకోవడానికి టీఎస్ జెన్కో, సింగరేణి మధ్య కోల్ లిం కేజీ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం జి-11 గ్రేడ్ బొగ్గును టన్నుకు రూ.1300 చొప్పున ఇస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రోజుకు సుమారు 10వేల టన్నుల చొప్పున మొత్తం 22లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉంది. కేటీపీపీ ఇప్పటి వరకు 16,91,831 టన్నులు దిగుమతి చేసుకుంది. ఆర్థిక సంవత్సరం ముగి యడానికి 13 రోజులు మాత్రమే ఉంది. ఇంకా సుమారు 5లక్షల టన్నులు తీసుకోవాలి. ఏరి యాలోని గనుల వద్ద 1.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. అయినా కేటీపీపీ అధికారులు అదే గ్రేడ్ బొగ్గును రామగుండం ఏరియా జీడీకే-1 సీహెచ్పీ నుంచి 3,66,658 టన్నులు దిగుమతి చేసుకున్నారు. భూపాలపల్లి గనుల నుంచి కేటీపీపీకి 14 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటే రవా ణా ఖర్చు టన్నుకు రూ.5.85 పైసలు మాత్రమే అవుతుంది. జీడీకే సీహెచ్పీ నుంచి రైలు వ్యాగన్ల ద్వారా ఉప్పల్ వరకు రవాణా చేసిన బొగ్గు ను అక్కడ డంప్ చేసి తిరిగి రోడ్డు మార్గంలో 60కిలోమీటర్ల దూరంలోని కేటీపీపీకి తరలిం చారు. ఇలా చేయడం వల్ల లోడింగ్ అన్లోడింగ్ చార్జీలతో కలుపుకుని టన్నుకు రూ.900 చొప్పున సుమారు రూ.34కోట్ల రవాణా భారం అదనంగా పడినట్లు సమాచారం. అందుబాటులో ఉన్నా.. భూపాలపల్లిలో నిల్వలు పెరిగి పోవడంతో ఓపెన్మార్కెట్లో విక్రరుుంచడానికి మూడు నెలల క్రితం టెండర్ ద్వారా రామగుండం ఓసీపీ-3 సీహెచ్పీకి 3,78,229 టన్నులు రవాణా చేశారు. అదే బొగ్గు ఈ ఏడాది జనవరి 10న 4067 టన్నులు కేటీపీపీకి పంపించారు. రామగుండం, మణుగూరు నుంచి జీ-5గ్రేడ్ బొగ్గును సైతం దిగుమతి చేసుకుంటున్నారు. జీ-5 గ్రేడ్ భూపాలపల్లిలోనూ ఉత్పత్తి అవుతోంది. దగ్గరలో ఉన్న బొగ్గును తీసుకోకుండా దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని బట్టి చూస్తే బొగ్గు రవాణాలో అధికారుల తీరు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా భూపాలపల్లి నుంచి రామగుండంకు బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టర్, ఉప్పల్ నుంచి కేటీపీపీ బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టర్ ఒక్కరే కావటం గమనార్హం. అంతా కుమ్మకై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేటీపీపీ వారే తీసుకుపోవడం లేదు ఏరియా గనుల నుంచి జి-11 గ్రేడ్ బొగ్గు రోజుకు 7వేల టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఇప్పటికే 9 లక్షల టన్నులు నిల్వ ఉంది. లింకేజీ ప్రకారం కేటీపీపీకి సరఫరా చేయటానికి ఎటువంటి ఇబ్బందులు లేదు. సత్వర రవాణాకు అత్యాధునిక వేరుుంగ్ బ్రిడ్జిలతోపాటు షావల్, డంపర్, లోడర్ యంత్రాలను సైతం సమకూర్చాం. అరుునా వారు తీసుకుపోవడం లేదు. - పి.సత్తయ్య, సింగరేణి ఏరియూ జీఎం, భూపాలపలి -
జనవరిలో కీలక పరిశ్రమల వృద్ధి 2.9 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జనవరిలో 2.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గడచిన మూడు నెలల్లో ఇంత స్థాయిలో వృద్ధి నమోదుకాలేదు. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు ఈ గ్రూప్లో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ రంగాల వాటా 38 శాతం. మార్చి రెండవ వారం చివర్లో జనవరి ఐఐపీ ఫలితాలు వెలువడనున్నాయి. కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ కీలక గ్రూప్ వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. -
బొగ్గు.. బుగ్గి
ఓసీపీల్లో కాలుతున్న కోల్ సింగరేణికి రూ.లక్షల్లో నష్టం ఆర్జీ-1 ఏరియూ పరిధి మేడిపల్లి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు పనిస్థలాల నుంచి వెలికితీసిన బొగ్గును రెండు నిల్వ కేంద్రాలలో డంప్ చేశా రు. గాలితో జరిగే రసాయన చర్య వల్ల బొగ్గుకు మంటలు అంటుకుని బూడిదవుతోంది. ప్రాజె క్టు నుంచి ప్రతీ రోజు 13వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి నిల్వ కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి సీహెచ్పీలకు లారీల ద్వారా రవాణా చేస్తారు. అయితే ఓసీపీ క్వారీలలో ఊటగా వచ్చే నీటిని మోటర్ల ద్వారా పైకి తీసుకువచ్చి కాలుతున్న బొగ్గుపై చల్లించే ప్రయత్నం చేస్తు న్నారు. నీళ్లు చల్లిన సమయం వరకే పొగలు రాకుండా ఉండి ఆ తర్వాత బొగ్గు కాలుతూనే ఉంటుంది. ఇలా రోజుకు సుమారు 15 టన్నుల బొగ్గు కాలి బూడిదవుతున్నట్లు అంచనా వేశా రు. ఇలా ఒక్క ఓసీపీ వద్దే రోజుకు రూ.30వేల చొప్పున నెలకు రూ.9లక్షల వరకు సింగరేణికి నష్టం కలుగుతోంది. ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులోని ఊటనీరు డోజర్లు, డంపర్లు నడిచే మార్గంలో దుమ్ము లేవకుండా చల్లడానికే సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో కాలుతున్న బొగ్గుపై నీటిని చల్లించేందుకు యూజమాన్యం గోదావరినది నుంచి నేరుగా పైప్లైన్ వేసి నీటిని తీసుకువచ్చే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. చాలా ఓసీల్లో ఇదే పరిస్థితి.. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం కావడం తో యూజమాన్యం ఉత్పత్తిపై దృష్టి సారించిం ది. దీంతో రోజు వారీ లక్ష్యాని కన్నా అధికంగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అందుకు అనుగుణంగా డంప్ యూర్డుల నుంచి రవాణా కాకపోవడంతో సింగరేణి కంపెనీ వ్యాప్తంగా చాలా ఓసీపీల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. బెల్లంపల్లి రీజియన్ పరిధి ఖైరిగూడ, డోర్లి-1, 2 తోపాటు పలు ప్రాజెక్టుల ప్రాంతాల్లో బొగ్గు కాలుతున్న ట్లు తెలుస్తోంది. పేరుకుపోతున్న నిల్వలుబొగ్గును ముందుగా సీహెచ్పీలకు పంపించి అక్కడి నుంచి సిమెంట్, విద్యుత్ తదితర పరిశ్రమలకు రైలు వ్యాగన్ల ద్వారా తరలిస్తారు. విద్యుత్, సిమెంట్ పరిశ్రమలు సింగరేణి నుంచి బొగ్గు తీసుకోవడానికి జాప్యం చేస్తుండడంతో బొగ్గు నిల్వలు పేరుకుపోరుు అగ్నికి ఆహుతవుతున్నారుు. రోడ్డు మార్గం ద్వారా కూడా బొగ్గు సరఫరా చేయడానికి యాజమాన్యం ఇటీవల నిర్ణయం తీసుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. -
తెలంగాణలో 5 వేల మెగావాట్ల విద్యుత్
న్యూఢిల్లీ : మూడు, నాలుగేళ్లలో తెలంగాణలో 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో పీయూష్ గోయల్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పీయూష్ గోయోల్ మాట్లాడుతూ... 2020 నాటికి రామగుండ ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. అలాగే మణుగూరు ప్లాంట్ ద్వారా 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. తెలంగాణలో మరిన్ని సోలార్ పార్కులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పీయూష్ గోయోల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో విద్యుత్ ప్రాజెక్టులపై కేసీఆర్తో చర్చించినట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. -
కీలక రంగాల వృద్ధి 0.9 శాతం
డిసెంబర్ గణాంకాల విడుదల న్యూఢిల్లీ: ఎనిమిది కీలక రంగాల గ్రూప్ 2015 డిసెంబర్లో కేవలం 0.9 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2014 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 3.2 శాతం. అయితే 2015 నవంబర్లో అసలు ఈ గ్రూప్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత (ఎనిమిది నెలల కనిష్టం, -1.3 శాతం క్షీణత) నమోదయ్యింది. ఈ ఎనిమిది రంగాల్లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 38 శాతం. క్రూడ్ ఆయిల్, సహజవాయువు, స్టీల్ రంగాల పేలవ పనితీరు మొత్తం గ్రూప్పై ప్రతికూల ప్రభావం చూపింది. ఎరువుల రంగం మంచి పనితీరును కనబరిచింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. తొమ్మిది నెలల్లో... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 1.9 శాతం. 2014 ఇదే తొమ్మిది నెలల కాలంలో ఈ రేటు 5.7 శాతం. -
కోల్ మాఫియా డాన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో ‘నల్ల బంగారం’ అక్రమ దందా అంతా ఓ వ్యక్తి కనుసన్నల్లో జరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం వంటవాడిగా, హరిదాసు వేషాలు వేస్తూ పొట్ట నింపుకున్న సదరు వ్యక్తి బొగ్గుదందాలోకి ప్రవేశించి నేడు ఏటా రూ.100 కోట్ల విలువైన బొగ్గును నల్ల బజారుకు తరలిస్తూ మాఫియా డాన్గా ఎదిగాడు. బొగ్గు గనుల ప్రాంతం నుంచి ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం, ఇతర పరిశ్రమలకు రైల్వే వ్యాగన్ల ద్వారా వెళ్లే బొగ్గును తస్కరించి దానిని లారీలు, ట్రాక్టర్లలో రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లడం వరకు అంతా అతడి డెరైక్షన్లోనే నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. సామాన్యులెవరైనా బొగ్గు దందాకు ఎదురుతిరిగితే ఎంతకైనా తెగిస్తాడని తెలుస్తోంది. ఇక పోలీసులు, ఎన్టీపీసీ, సింగరేణికి చెందిన వారిని మాత్రం మామూళ్లతో కొడుతుంటాడు. కొత్తగా వచ్చిన పోలీసు అధికారులు అడ్డుతగిలినప్పుడు తన చీకటి వ్యాపారానికి కొంత విరామమిచ్చి సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత షరా‘మామూలు’గానే దందాను కొనసాగించడం అతని ప్రత్యేకత. రామగుండం ఎరువుల కర్మాగారం స్థాపించిన సమయంలో వేములవాడ నుంచి బతుకుదెరువు కోసం ఓ వ్యక్తి వలసవ చ్చాడు. టౌన్షిప్ సమీపంలోనే నివాసముంటూ చుట్టుపక్కల ప్రాంతాలలో కూలి పనులు చేసేవాడు. సంక్రాంతి పండుగకు హరిదాసు వేషం వేసేవాడు. తర్వాత కొంతకాలం చిన్న హోటల్ ప్రారంభించి వంటవాడిగా అవతారమెత్తాడు. ఆ తరువాత సింగరేణికి చెందిన 7వ గని వద్ద గల బంకర్ నుంచి బొగ్గును సేకరించి సంచులలో నింపుతూ సైకిళ్లపై తీసుకెళ్లి ఎఫ్సీఐ టౌన్షిప్లో విక్రయించేవాడు. 1999లో ఎరువుల కర్మాగారం మూతపడ్డ తర్వాత ‘హరిదాసు’ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 2010 నుంచి అక్రమ బొగ్గు దందాను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని రూ.కోట్లు ఆర్జిస్తూ కోల్ మాఫియా డాన్గా మారాడు. ఈ అక్రమ దందాకు ఎవరైనా అడ్డుతగలకుండా ఉండేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులతో ‘ఎస్కార్ట్’ తయారు చేసుకున్నాడు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ వీరు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. చీకటి పడిన తర్వాత బొగ్గుతో నిండిన లారీలను ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఈ ఎస్కార్ట్ ఆరు ద్విచక్రవాహనాలతో (లారీకి మూడు ముందు, మరో మూడు వెనకాల) రక్షణ కవచంగా ఉంటాయి. ఇందుకు గాను సదరు యువకులకు నెలకు రూ.2 లక్షల చొప్పున ముట్టజెపుతున్నట్లు సమాచారం. నకిలీ వేబిల్లులతో... సింగరేణి నుంచి ఎన్టీపీసీకి వెళ్లే రైలువ్యాగన్ల నుంచి అక్రమంగా తస్కరించిన బొగ్గును లారీలలోకి ఎక్కించి రాచమార్గంలో తరలించేందుకు మార్గమధ్యంలో వే బిల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. స్థానికంగా నేతలు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటాడని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులైతే కొంత ఎక్కువ... మాజీలైతే వారికంటే కొంత తక్కువ సొమ్మును ఇస్తాడు. అలాగే ఎఫ్సీఐ నుంచి ఎల్కలపల్లి గేట్లోకి ఎవరైనా వస్తే... వారి సమాచారాన్ని వెంటనే చెప్పేందుకు ఏజంట్లను కూడా పెట్టుకున్నాడు. వారు ఆయా హోటళ్ల వద్ద తిష్టవేసి సమాచారం ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు. ఇక సింగరేణి నుంచి వ్యాగన్లు బయలుదేరిన తర్వాత రైలును నెమ్మదిగా నడిపించేందుకు లోకో పైలట్లకు, ఈ తతంగం జరుగుతున్నా చూసీచూడనట్టుగా వ్యవహరించినందుకు సింగరేణి సెక్యూరిటీ విభాగం అధికారులకు, గార్డులకు కూడా నెలవారీగా లక్షల రూపాయల్లో మామూళ్లు ముట్టుజెపుతున్నట్లు సమాచారం. ఈ అక్రమదందా ఇన్నాళ్లుగా సాఫీగా సాగడానికి పోలీస్ వ్యవస్థ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించినట్లుగా స్పష్టమవుతోంది. ఇందుకోసం కోల్బెల్ట్ ఏరియాలోని పోలీస్స్టేషన్లతో పాటు రాజీవ్ రహదారిపై ఉండే పోలీస్స్టేషన్లకు కూడా నెలవారీగా లక్షలాది రూపాయల నజరానాలను ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సైకిల్ నుంచి స్కార్పియో దాకా... ఒకప్పుడు సైకిల్పై బొగ్గు సంచులను పెట్టుకుని క్వార్టర్లు, ఇళ్లల్లో బొగ్గును అమ్మిన వ్యక్తి స్వస్థలం వేములవాడ. హరిదాసు వేషాలేసినా, వంట పని చేసినా కాలం కలిసిరాకపోవడంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర అనుచరుడిగా చేరి బొగ్గు రవాణా చేయడం ఆరంభించాడు. వ్యాపారంలో నష్టం రావడంతో సదరు ఆంధ్రావ్యక్తి ఇక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఇక తానే రంగంలోకి దిగి మాఫియా డాన్గా మారాడు. ఒకనాడు సైకిల్పై తిరిగిన ఈ వ్యక్తి ప్రస్తుతం రూ.కోట్లకు పడగలెత్తాడు. సుల్తానాబాద్ రాజీవ్ రహదారి సమీపంలో కోట్ల రూపాయల విలువైన స్థలాలు కొనుగోలు చేశాడు. వేములవాడలో పెద్ద భవనం. ఎల్కలపల్లి ప్రాం తంలో ఇండ్లు, భూములు కొన్నాడు. రాజకీ య నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో తన అనుచరులపై కేసులు నమోదైతే బెయిల్ ఇప్పించడం, తిరిగి దందాకు ప్రోత్సహించడం, వినాయకచవితి నవరాత్రోత్సవాలకు భారీగా చందాలు ఇవ్వడం ఇతని ప్రత్యేకత. ఇంటి వద్ద నిత్యం పదుల సంఖ్యలో యువకులు తిరుగుతుం టారు. దాదాపు వంద మందికిపైగా యువకులను పెంచిపోషిస్తూ తన అక్రమ బొగ్గు దందాను మూడు ట్రాక్టర్లు, ఆరు లారీల లాగా కొనసాగిస్తున్నాడు. -
సాయం చేస్తే.. బొగ్గుపై ఆధారపడం!
లె బౌజెట్: అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సాయం, అవసరమైన సాంకేతికత అందిస్తే విద్యుదుత్పత్తిలో బొగ్గుపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమేనని పారిస్లో జరుగుతున్న వాతావరణసదస్సులో భారత్ స్పష్టం చేసింది. పునరుత్పాదిత విద్యుదుత్పత్తి ఖర్చు ను తగ్గించుకునేందుకు ధనిక దేశాల ఆర్థిక, సాంకేతిక సహకారం అవసరమని పేర్కొంది. దేశ విద్యుత్ అవసరాల కోసం శిలాజ ఇంధనాన్ని భారీగా వినియోగించే విషయంలో భారత్ను ఏకాకిని చేసే ప్రయత్నాలు సాగుతున్న సమయంలో.. భారత్ తరఫున చర్చల్లో పాల్గొంటున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెరైక్టర్ జనరల్ అజయ్ మాధుర్ గురువారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాగా, సదస్సులో ఒక ముసాయిదా ఒప్పందాన్ని ఆవిష్కరించారు. అయితే, దానిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. అందులోని దాదాపు 250 అంశాలపై భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ‘విద్యుదుత్పత్తిలో సౌరశక్తి, పవన శక్తి మా తొలి రెండు ప్రాథమ్యాలు. ఆ తరువాత జలవిద్యుత్, అణు విద్యుత్లకు ప్రాధాన్యతనిస్తాం. ఇవి పోనూ మిగతా విద్యుత్ అవసరాల కోసం బొగ్గుపై ఆధారపడతాం’ అని భారత్ విధానాన్ని మాధుర్ వివరించారు. సౌర, పవన విద్యుత్ అందుబాటులో లేనప్పుడు.. తక్షణమే బొగ్గు ఆధారిత విద్యుతుత్పత్తికి మారేందుకు అవసరమైన సాంకేతికత తమ తక్షణావసరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పుపై పోరాటంలో భారత్ సమస్య కాబోదని పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. -
బొగ్గే బంగారమాయే
బొగ్గు మాఫియా బరితెగింపు పోర్టు కేంద్రంగా కీలక నేత అక్రమసామ్రాజ్యం భారీగా దారిమళ్లుతున్న మేలురకం బొగ్గు విశాఖపట్నం మొదట ఇసుక మాఫియా... తరువాత మద్యం మాఫియా... తాజాగా బొగ్గు మాఫియా... ఇదీ అధికార టీడీపీ ప్రజాప్రతినిధుల అక్రమార్జనకు తాజా కేంద్ర బిందువు ఇదీ. కొన్నేళ్లుగా పోర్టులో వ్యాపార కార్యకలాపాలతో సంబంధాలు ఉన్న ‘కీలక నేత’ దీనికి కేంద్ర బిందువుగా మారారు. భారీగా దిగుమతి అవుతున్న బొగ్గును ఈ మాఫియా కొల్లగొడుతోంది. కీలక నేత సమీప బంధువు పర్యవేక్షణలో ఓ బృందం పోర్టులో స్థావరం ఏర్పాటు చేసుకుంది. నెలకు రూ.4.50కోట్లు కొల్లగొడుతున్న ఈ మాఫియా కథకమామిషు ఇదిగో ఇలా ఉంది... సెయిల్, మరికొన్ని పెద్ద సంస్థలు దిగుమతి చేసుకునే మేలురకం బొగ్గు టన్ను ధర దాదాపు రూ.18వేలు. కానీ స్థానికంగా కొన్ని ప్రైవేటు సంస్థలు దిగుమతి చేసుకునే నాసిరకం స్టీమ్డ్ బొగ్గు ధర టన్నుకు కేవలం రూ.4వేలు. ఈ రెండు ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్నే అనుకూలంగా మలచుకుని అధికార పార్టీ మాఫియా చెలరేగిపోతోంది. సెయిల్, మరికొన్ని పెద్ద సంస్థల కోసం నెలకు సగటున 15 షిప్ల ద్వారా బొగ్గు దిగుమతి అవుతోంది. ఒక్కో షిప్మెంట్ ద్వారా దాదాపు 65వేల మెట్రిక్ టన్నుల మేలురకం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. టన్ను రూ.18వేల చొప్పున ఒక షిప్మెంట్ విలువ దాదాపు రూ.100కోట్లు. ఇంత మేలురకం బొగ్గునిల్వల్లో కొంతవరకు దారిమళ్లిస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న వే బ్రిడ్జీలు , బీవోటి బ్రిడ్జిల వద్ద మతలబు చేస్తున్నారు. ఇందుకు కొందరు కిందిస్థాయి అధికారుల సహకారం కూడా ఉంది. దాదాపు ఒక్కో షిప్మెంట్కు 500 టన్నుల మేలురకం బొగ్గును దారిమళ్లిస్తున్నారు. ఆ స్థానంలో నాసిరకం స్టీమ్డ్ బొగ్గును కల్తీ చేసి కనికట్టు చేస్తున్నాయి. రూ.4వేలు టన్ను ధర ఉన్న బొగ్గును కలిపి రూ.18వేలు ధర ఉన్న బొగ్గును అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో షిప్మెంట్ ద్వారా 500టన్నుల మేలరకం బొగ్గును దారిమళ్లిస్తున్నాయి. నెలకు పోర్టుకు సగటున 15 షిమ్మెంట్ల బొగ్గు దిగుమతి అవుతోంది. అంటే నెలకు 7, 500టన్నుల మేలరకం బొగ్గును అధికార పార్టీ మాపియా గుప్పిటపడుతోంది. అంతా నాదే..: బొగ్గు మాఫియాలో అంతా తన కనుసన్నల్లోనే సాగేలా కీలక నేత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇసుక, మద్యం మాఫియాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పలువురు భాగస్వాములుగా ఉన్నారు. కానీ బొగ్గు మాఫియా మాత్రం అంతా తన గుప్పిట్లోనే ఉండేలా కీలక నేత చక్రం తిప్పుతున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు కొందరు అధికారులు యత్నించినప్పటికీ రాజకీయ ఒత్తిడితో వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ బొగ్గు మాఫియాను కట్టడి చేయాలంటే సీబీఐ రంగంలోకి దిగాల్సిందేనని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సొమ్మే సొమ్ము ఇలా దారి మళ్లించిన బొగ్గును ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వివిధ సంస్థలకు విక్రయిస్తున్నారు. మేలురకం బొగ్గు ధర టన్నుకు రూ.18వేలు. దొంగచాటుగా దారిమళ్లించిన బొగ్గును టన్ను రూ.10వేల నుంచి రూ.12వేలకే విక్రయిస్తున్నారు. ఆ లెక్కన షిప్మెంట్కు 500టన్నులు అంటే రూ.50లక్షలకు విక్రయిస్తున్నారు. అందులో వీరు కలిపిన నాసిరకం బొగ్గు విలువ 500 టన్నులకు రూ.20లక్షలు పోగా బొగ్గు మాఫియా నికరంగా ఒక షిప్మెంట్కు రూ.30లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్నారు. నెలకు 15 షిమ్మెంట్లకు రూ.4.50కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.54కోట్లు కొల్లగొడుతున్నారు. -
సింగరేణి.. వెలుగుల బొగ్గు
- మన రాష్ర్టంతో పాటు ఇతర రాష్ట్రాలకూ సరఫరా - విద్యుత్ ప్లాంట్లు, పరిశ్రమల అవసరాలకు రవాణా - ఈ ఏడాది నుంచి ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచిన యాజమాన్యం రుద్రంపూర్ : సింగరేణి కార్మికులు ఉత్పత్తి చేస్తున్న బొగ్గు తెలంగాణలోని పరిశ్రమలకే గాక వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమలకు సరఫరా అవుతోంది. 2014-15 సంవత్సరంలో 526 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి వివిధ పరిశ్రమలకు రవాణా చేసింది. ఇందులో 392.6 లక్షల టన్నులు విద్యుత్ కర్మాగారాలకు సరఫరా చేశారు. వీటి లో తెలంగాణలోని విద్యుత్ సంస్థలతో పాటు మహారా ష్ర్ట, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, కేరళ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఉన్నారుు. ఈ బొగ్గుతో సుమారు 9000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అరుు్యంది. ఇక రా ష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల సిమెంట్ కంపెనీలకు దా దాపు 46.40 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశారు. ఒప్పందాల కన్నా ఎక్కువ సరఫరా తెలంగాణ రాష్ట్రంలోని జెన్కోకు ఎఫ్ఎస్ఏ(ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్)ప్రకారం 83.60 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉండగా 127.89 లక్షల టన్నులు స రఫరా చేశారు. ఇందులో కేటీపీఎస్(పాల్వంచ)కు 59 లక్షల టన్నులకు గాను 93.55 లక్షల టన్నులు, కేటీపీపీ(భూపాలపెల్లి) 21.60 లక్షల టన్నులకు 33.09 లక్షల టన్నులు సరఫరా చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నా యి. దీంతో ఎండాకాలంలో కూడా బొగ్గు కొరత తీరి.. విద్యుత్ కర్మాగారాలు సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్ప త్తి చేసి ప్రజలకు అందించినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు.. మహాజెన్కో(పర్లి-మహారాష్ట్ర)కు 19.98 లక్షల టన్ను లు, కేపీసీఎల్(రాయచూర్- కర్ణాటక)కు 28.45 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్లోని జెన్కోకు(మద్దనూరు- ఆంధ్రప్రదేశ్)కు 39.38 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేశారు. ఇంకా ఎస్ఎస్పీసీఎల్(భిలాయ్-చత్తీస్గఢ్), కేపీసీఎల్(బల్లారి-కర్ణాటక), మహాజెన్కో(చంద్రాపూర్-మహారాష్ట్ర), ఐజీపీపీపీ(ఆరావళి-హర్యానా), డాక్ట ర్ ఎన్టీపీపీ(విజయవాడ-ఆంధ్రప్రదేశ్)కి కలిపి సు మారు 51,30 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ రవాణా చేసింది. 36 కేటగిరీల పరిశ్రమలకు.. విద్యుత్ పరిశ్రమలతోపాటు మరో 36 కేటగిరీల పరిశ్రమలకు కలిపి సుమారు 750 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ సరఫరా చేసింది.వీటిలో ప్రధానంగా పేపర్మిల్స్, పల్ప్ పరిశ్రమ, సిరామిక్ పైపులు, మం దుల పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ, ఇటుక, సున్నం, పొగాకు, ఆయిల్, వస్త్రపరిశ్రమలతోపాటు మరికొన్ని పరిశ్రమలకు బొగ్గును రవాణా చేయడం ద్వారా వాటి ఉత్పత్తిని కొనసాగించేందుకు దోహదపడింది. రాబోయే కాలంలో సింగరేణిపై మరింత భారం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికు లు కీలకపాత్ర పోషించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర సింగరేణి కార్మికులపై ఉం ది. తెలంగాణలో రానున్న పదేళ్ల కాలంలో 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అనేక విద్యుత్ థర్మ ల్ కేంద్రాలను ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రస్తు తం సింగరేణి సంస్థ అందిస్తున్న బొగ్గు కంటే అదనంగా ఏడాదికి మరో 40 మిలియన్ టన్నుల బొగ్గు అవసరముంటుంది. ప్రస్తుతం సాధించిన 52 మిలియన్ టన్ను ల నుంచి 90-100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది వా ర్షిక లక్ష్యాన్ని 60 మిలియన్ టన్నులకు యాజమాన్యం పెంచింది. దీని సాధించటానికి యాజమాన్యం నెల రో జులుగా ప్రణాళికలను తయారుచేసి అందుకు కావాల్సి న పనులను వేగవంతం చేస్తోంది. అలాగే, లక్ష్యసాధ నకు కార్మికులు జూన్ నుంచి కసరత్తు చేస్తున్నారు. రికార్డు స్థారుులో బొగ్గురవాణా ఈ ఏడాది మే, జూన్ నెలల్లో సింగరేణి సంస్థ అన్ని ఏరి యూల్లో కలిపి కలిపి 126.34 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. గత ఏడాది ఈ నెలల్లో 60%శాతం రావాణాను కూడా చేయని పరిస్థితి. సింగరేణి చైర్మన్ చొరవతో ఏరియాల అధికారులు ముందుకు వచ్చి రవాణాను రికార్డు స్థాయికి చేర్చారు. -
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
బెల్లంపల్లి(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి పడుతున్న వర్షానికి తిర్యాని, రెబ్బెన మండలాల్లోని డోర్లి-1, డోర్లి-2, కైరిగూడ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచి పోయింది. సిర్పూర్- ఆసిఫాబాద్ మధ్య గురువారం రాత్రి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం ఉదయం నుంచి వర్షం తగ్గుముఖం పట్టటంతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. -
ఏపీ సర్కార్ ‘కోల్’మాల్
♦ విదేశీ బొగ్గు సరఫరాలో ఖజానాకు రూ.500 కోట్ల నష్టం ♦ అంతర్జాతీయంగా బొగ్గు ధర తగ్గినా పాత ధరే చెల్లింపు ♦ అవసరం లేకున్నా భారీగా బొగ్గు దిగుమతులు ♦ ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీజెన్కో)కు విదేశీ బొగ్గు వ్యవహారంలో భారీ కొనుగోల్మాల్ జరిగినట్టు తెలుస్తోంది. ఆరు నెలలకు టెండర్లు పిలిచి రెండేళ్లపాటు భారీ స్థాయిలో బొగ్గు దిగుమతి చేసుకోవడతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.500 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఓ రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ముందుపెట్టి ప్రభుత్వ పెద్దలు కథ నడిపిస్తుంటే, అధికారులు వారికి చేయూతనిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు 70 శాతం స్వదేశీ బొగ్గును, 30 శాతం విదేశీ బొగ్గును వాడతారు. విదేశీ బొగ్గును సరఫరా చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఓపెన్ టెండర్ల ద్వారా దక్కించుకుంటాయి. విదేశీ బొగ్గు సరఫరా కోసం 2013 జూన్ 28న పిలిచిన టెండర్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీఈసీ లిమిటెడ్ (న్యూఢిల్లీ), ఎంఎస్టీసీ లిమిటెడ్ (కోల్కతా) చేజిక్కించుకున్నాయి. ఆ మేరకు విజయవాడలోని థర్మల్ కేంద్రాలకు టన్ను రూ. 4,970 చొప్పున ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు, ముద్దనూరు ఆర్టీపీపీకి మెట్రిక్ టన్ను రూ. 5,150 చొప్పున నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేయాలి. ఈ కాంట్రాక్టు గడువు 2013 డిసెంబర్తో ముగిసింది. నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, ఎవరు తక్కువ ధరకు సరఫరాచేస్తే వారికే కాంట్రాక్టు ఇవ్వాలి. కానీ ఏపీ జెన్కో ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వలేదు. 2013 డిసెంబర్ 20 నుంచి ఏడుసార్లు టెండర్లు పిలిచి, ఆ తర్వాత రద్దు చేసేసింది. 2014 ఏప్రిల్ 22వ తేదీన మరోసారి టెండర్లు పిలిచినా... ఏపీ జెన్కో పెట్టిన సవాలక్ష నిబంధనలవల్ల ఎవరూ అర్హత పొందలేదు. ఈ నేపథ్యంలో 2014 ఆగస్టు 25న మరోసారి 3.4 మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచింది. ఎంఎస్టీసి ఒక్కటే టెండర్ వేయడంతో దీన్నీ రద్దు చేశారు. ఈ సంస్థల్లోని వ్యక్తులు ప్రభుత్వ పెద్దల అక్రమాలకు అన్నివిధాలుగా సహకరిస్తున్నందువల్ల... ఇప్పటివరకూ సరఫరా చేస్తున్న సంస్థలు మాత్రమే అర్హత పొందేలా, ఇతర సంస్థలేవీ అర్హత సాధించకుండా ఉండేలా నిబంధనలు పొందుపరిచినట్లు తెలుస్తోం ది. ఇలా వివిధ కారణాలతో టెండర్లు ఖరారు చేయకుండా.. 2013లో టెండర్లు దక్కించుకున్న ఎంఎంటీసీ, పీఈసీ లిమిటెడ్ సంస్థలు పాత ధరలకే బొగ్గు దిగుమతి చేసేందుకు మార్గం సుగమం చేశారు. బొగ్గు ధర తగ్గినా పాత రేటుకే సరఫరా 2013లో అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర టన్ను 69.15 డాలర్లుగా ఉంది. ఇది 2015 నాటికి 52.40 డాలర్లకు తగ్గింది. అయినప్పటికీ ఏపీ జెన్కో టన్నుకు 69.15 డాలర్లు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటనేది అర్థం కాని విషయం. పైగా 2013 ఒప్పందం ప్రకారం 12 లక్షల టన్నులు సరఫరా చేయగా.. కాంట్రాక్టు గడువు పొడిగించిన తర్వాత 19.5 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సమయంలో స్వదేశీ బొగ్గు సమృద్ధిగా లభిస్తోంది. ఏపీ జెన్కో విద్యుత్ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదు. అయినా పెద్ద మొత్తంలో విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవడం ఆర్థిక ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. 2013తో పోలిస్తే ఏపీ జెన్కో 165 శాతం విదేశీ బొగ్గు కోసం వెచ్చించినట్టు కన్పిస్తోంది. దీని విలువ రూ. 1,100 కోట్లని లెక్కగట్టారు. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత 10 లక్షల టన్నులు అవసరంకాగా 20 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఫలితంగా రూ. 200 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. టెండర్లను ఖరారు చేసి, వాస్తవ వినియోగం ప్రకారం బొగ్గును దిగుమతి చేసుకుని ఉంటే... సుమారు రూ. 500 కోట్ల మేర ఖర్చు తగ్గేదని నిపుణులు చెబుతున్నారు. అడ్డగోలుగా హ్యాండ్లింగ్ ఛార్జీలు విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును ఓడరేవులనుంచి థర్మల్ ప్రాజెక్టులకు చేర్చినందుకు ఏపీ జెన్కో కొంతమొత్తం చెల్లిస్తుంది. బొగ్గు సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సరుకు రవాణాకు సబ్కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తాయి. అలా ఎంపికైన అదానీ, మహేశ్వరి కోల్ కంపెనీలు మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నులను రవాణా చేశాయి. అయితే కృష్ణపట్నం పోర్టుకు, థర్మల్ ప్రాజెక్టుకు దూరం కేవలం ఏడు కిలోమీటర్లే. కాబట్టి ఎలాంటి హ్యాండ్లింగ్ ఛార్జీలు దీనికి వర్తించవనే నిబంధనలున్నాయి. కానీ ఏపీ జెన్కో ఉదారంగా హ్యాండ్లింగ్ ఛార్జీలకింద రూ. 100 కోట్లు చెల్లించి వారికి లబ్ధి చేకూర్చిందన్న ఆరోపణలున్నాయి. టెండర్లు రద్దు చేశాం: జెన్కో వర్గాలు ఇప్పటివరకూ గడువు పొడిగిస్తూ వచ్చిన సంస్థల టెండర్లు రద్దు చేస్తూ ఏపీ జెన్కో బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హతగల సంస్థలు ముందుకు రాకపోవడంవల్లే ఇంతకాలం టెండర్లు పిలవలేదని పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర తగ్గినప్పటికీ, డాలర్ విలువ పెరిగిందనీ, దీంతోపాటు రైల్వే రవాణా ఛార్జీలు పెరిగాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో సరఫరా చేస్తున్న విదేశీబొగ్గుకు చెల్లించే మొత్తం ఒక్కపైసా కూడా ఎక్కువ ఉండదని పేర్కొన్నాయి. 69.15 డాలర్లు: 2013లో అంతర్జాతీయ మార్కెట్లో టన్ను బొగ్గు ధర 12 లక్షల టన్నులు: టెండర్ల ప్రకారం సరఫరా చేయాల్సిన విదేశీ బొగ్గు 52.40 డాలర్లు: 2015లో అంతర్జాతీయ మార్కెట్లో టన్ను బొగ్గు ధర 19.5 లక్షల టన్నులు: గడువు తర్వాత సరఫరా చేసిన విదేశీ బొగ్గు 1,100 కోట్లు: గడువు ముగిశాక సరఫరా చేసిన బొగ్గు విలువ 100 కోట్లు: హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో చెల్లించింది -
జోడేఘాట్లో నల్ల బంగారం
భారీ స్థాయిలో బయటపడిన బొగ్గు నిక్షేపాలు 1,100 మిలియన్ టన్నుల వరకూ ఉన్నట్లు అంచనా ఆదిలాబాద్ జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లోనూ బొగ్గు నిల్వలు భారీగా సున్నపురాయి నిల్వలు కూడా గుర్తింపు వందేళ్ల వరకూ సిమెంట్ ఉత్పత్తికి సరిపడా ఖనిజాలు రామగుండం-భూపాలపల్లి కారిడార్లోనూ మరిన్ని నిల్వలు అడవులకు ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో భారీ స్థాయిలో బొగ్గు, సున్నపురాయి నిక్షేపాలు బయటపడ్డాయి. గిరిజన పోరాటయోధుడు కొమురం భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్తో పాటు మరిన్ని ప్రాంతాల్లో ‘డీ’ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నట్లు సింగరేణి అధికారులు గుర్తించారు. ఇక్కడితోపాటు చింతగూడ, కెరమెరి, బేల మండలాల పరిధిలోనూ బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. మొత్తంగా 1,500 మిలియన్ టన్నుల వరకూ బొగ్గు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే ప్రాంతంలో అత్యంత భారీ స్థాయిలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి అధికారులు గుర్తించారు. - బెల్లంపల్లి భారీగా సున్నపురాయి నిక్షేపాలు.. జోడేఘాట్లో బొగ్గు సంపదను తలదన్నే రీతిలో భారీగా సున్నపురాయి నిక్షేపాలు కూడా బయటపడ్డాయి. డోర్లి-2 ఓపెన్కాస్ట్ నుంచి జోడేఘాట్ వరకు దాదాపు 85 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో... బొగ్గు కోసం చేసిన డ్రిల్లింగ్ ప్రక్రియలో అపారమైన ఈ సున్నపురాయి నిల్వలను సింగరేణి అధికారులు గుర్తించారు. ప్రస్తుతం బయటపడిన సున్నపురాయి నిల్వలు కనీసం 10 సిమెంట్ ఫ్యాక్టరీల అవసరాలను తీర్చగలవని సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తంగా వందేళ్ల వరకు సిమెంట్ పరిశ్రమలను నిర్వహించడానికి సరిపడా ముడి సరుకు ఈ ప్రాంతంలో లభిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా బయ్యారంలో సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు ఇనుప ఖనిజం నిక్షేపాలపై పరిశీలన చేస్తున్నారు. అదేమాదిరి డోర్లి-2, జోడేఘాట్ అటవీ ప్రాంతంలోని సున్నపురాయి నిక్షేపాలపైనా చర్యలు చేపట్టాల్సి ఉందని భావిస్తున్నారు. రామగుండం వద్ద కూడా.. గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం నుంచి వరంగల్ జిల్లా భూపాలపల్లి వరకు మరిన్ని బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీ కాలనీతోపాటు వరంగల్ జిల్లా భూపాలపల్లిలో భూగర్భ గనులు, ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులను సింగరేణి సంస్థ నిర్వహిస్తోంది. తాజాగా భూపాలపల్లి సమీపంలోని వెంకటాపూర్ డీప్సైడ్ బ్లాక్లో 35 చదరపు కిలోమీటర్ల పరిధిలో 588 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించారు. తాడిచర్ల బ్లాక్-2లో 277 మిలియన్ టన్నులు, మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని చంద్రుపల్లి బ్లాక్, లక్ష్మీదేవిపల్లి-పాలంపేట బ్లాక్, భూపాలపల్లి వద్ద కేటీకే-6 ఫేజ్-2, మహదేవపూర్ బ్లాక్లో నిల్వలను గుర్తించారు. పూర్తిస్థాయిలో నిర్ధారించడం కోసం త్వరలో డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. మొత్తంగా రామగుండం నుంచి భూపాలపల్లి వరకు గల కోల్కారిడార్లోని చాలా ప్రాంతాల్లో తక్కువ నాణ్యత కలిగిన ఎఫ్, జి-గ్రేడ్ల బొగ్గును, పలు చోట్ల ఈ-గ్రేడ్ బొగ్గు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా రామగుండం నుంచి భూపాలపల్లి వరకు ఉన్న సుమారు 3 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయని.. ఇప్పటివరకు వెలికితీసింది 30 నుంచి 40 శాతమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. నాణ్యమైన బొగ్గు.. గిరిజన పోరాటయోధుడు కొమురం భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్ ప్రాంతంలో భారీగా బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇక్కడ దాదాపు వందేళ్లకు సరిపడా బొగ్గు, సున్నపురాయి నిల్వలు ఉన్నట్లు బెల్లంపల్లిలోని సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం సర్వే చేసి నిర్ధారించింది. తిర్యాణి మండలం డోర్లి-2 ఓపెన్కాస్ట్ (ఓసీ) ప్రాజెక్టు నుంచి జోడేఘాట్ వరకు సుమారు 85 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిలో దాదాపు 1,100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అటవీ ప్రాంతంలోని కొందన్మోర్, మోవాడ్, జోడేఘాట్ ప్రాంతాల్లో చేసిన డ్రిల్లింగ్లో ఈ బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇక్కడ సుమారు 500 మీటర్ల లోతులో ‘డీ’ గ్రేడ్ నాణ్యత కలిగిన బొగ్గు ఉన్నట్లు తేలింది. మరిన్ని చోట్ల కూడా: ఆదిలాబాద్ జిల్లాలోని మరికొన్ని చోట్ల భారీస్థాయిలో బొగ్గు నిక్షేపాలు వెలుగుచూశాయి. ఆసిఫాబాద్ మండలంలోని చింతగూడ ప్రాంతంలో 240 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి అధికారుల సర్వేలో తేలింది. చింతగూడ పరిసరాల్లోని వెంకటాపూర్, నిమ్మగూడ, మోవాడ్, బల్హాన్పూర్, ఆజి దస్నాపూర్ పరిసరాల్లో ఈ బొగ్గు ఉంది. ఈ ప్రాంతాన్ని సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం అధికారులు నాన్ ఫారెస్ట్ ఏరియాగా గుర్తించారు. చింతగూడలో 300 మీటర్ల లోతులోనే ‘డీ’ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నాయి. దీంతో ఇక్కడ ఓపెన్కాస్ట్లను చేపట్టేందుకు అవకాశాలున్నాయి. కెరమెరి గుట్టల్లోనూ బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బేల మండలంలోనూ బొగ్గు నిక్షేపాల ఆనవాళ్లున్నట్లు సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మరిన్ని సార్లు డ్రిల్లింగ్ చేసి... ఆయా ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఎంత లోతులో ఉన్నాయో తేల్చనున్నట్లు చెబుతున్నారు. -
కీలక బిల్లులపై విపక్షాలను ఎలా ఒప్పించాలి?
న్యూఢిల్లీ: కీలకమైన భూసేకరణ, బొగ్గు, గనుల బిల్లులను రాజ్యసభలో ఆమోదింపజేసుకోవటం ప్రభుత్వానికి సమస్యగా మారింది. లోక్సభలో ఆమోదం పొందిన భూసేకరణ, గనులు బిల్లు, బొగ్గు బిల్లులను రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. వీటికోసం సోమవారం నుంచి రాజ్యసభ సాయంత్రం 7 గంటల తర్వాతా కొనసాగించేందుకు సర్కారు సిద్ధపడింది. గనుల, బొగ్గు బిల్లులను సవరణల నిమిత్తం సెలెక్ట్ కమిటీకి పంపాలని గతవారం రాజ్యసభ నిర్ణయించింది. కమిటీ ఈ నెల 18 నాటికి.. అంటే తొలి దశ బడ్జెట్ సమావేశాలు ముగియడానికి రెండు రోజుల ముందునివేదిక అందిస్తుంది. బొగ్గు, గనుల ఆర్డినెన్స్లు ఏప్రిల్ 5తో రద్దవుతాయి. భూసేకరణ బిల్లూ ఆ రోజే రద్దవుతుంది. ఆ లోపు వీటి స్థానంలో బిల్లులను పార్లమెంట్ ఆమోదించాలి. ఇందుకోసం ప్రభుత్వం అనధికారికంగా విపక్షాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. -
తప్పనిసరి పరిణామం
అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని శాపాలై వెంటాడుతున్నాయి. ఆ పార్టీ నేతృత్వంవహించిన యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ నిందితుడిగా బోనెక్క బోతున్నారు. ఈ స్కాంను ఆదినుంచీ గమనిస్తున్నవారంతా ఇలాంటి పరిస్థితి ఏర్పడు తుందని ముందే ఊహించారు. దర్యాప్తు చేసిన సీబీఐ మాత్రమే మరోలా భావిం చింది. ఇప్పుడు మన్మోహన్సింగ్కు సమన్లు అందిన తలబిరా-2 బొగ్గు క్షేత్రాల కేటా యింపు కేసుపై ఆ సంస్థ సుదీర్ఘకాలం దర్యాప్తు చేసింది. ఈ కేసులో ఎవరూ నేరానికి పాల్పడలేదంటూ ప్రత్యేక న్యాయస్థానానికి నిరుడు ఆగస్టులో ముగింపు నివేదికను సమర్పించింది. ప్రత్యేక న్యాయస్థానం ఆ నివేదికను తిరస్కరించి, దర్యాప్తులోని లొసుగులను ఎత్తిచూపింది. కేసులో ఉన్న కొన్ని అనుమానాలను ఎందుకు నివృత్తి చేసుకోలేదని ప్రశ్నించింది. ముఖ్యంగా మన్మోహన్సింగ్ను ప్రశ్నించవలసి ఉండగా ఆ పని చేయలేదేమని నిలదీసింది. ఆ తర్వాతే సీబీఐలో కదలిక వచ్చింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని మూడేళ్ల క్రితం తొలిసారి కాగ్ వెల్లడించింది. మొత్తం 195 క్షేత్రాల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తెలిపింది. ఇందువల్ల ఖజానాకు లక్షా 86 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. స్కాం జరిగిందంటున్న సమయంలో కొంతకాలం బొగ్గు శాఖను స్వయంగా మన్మోహన్సింగే పర్యవేక్షించారు. కనుక ఆ స్కాంపై మన్మోహన్ను ప్రశ్నించడం తప్పనిసరి. అయినా సీబీఐ ఏ దశలోనూ ఆయనను పిలవలేదు. మన్మోహన్సింగ్ వరకూ అవసరం లేదు... ఆ సమయంలో ప్రధాని కార్యాలయం (పీఎంఓ)లో పని చేసిన వారినే ప్రశ్నించలేదు. తలబిరా-2 బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా హిందాల్కో అధిపతి కుమార మంగళం బిర్లా మన్మోహన్తో సమావేశమయ్యారని, అటుతర్వాత ఆయనకు రెండు లేఖలు రాశారని వెల్లడైంది. ఇవన్నీ జరిగాక ఆ బొగ్గు క్షేత్రాలను హిందాల్కోకు కేటాయించాలని పీఎంఓనుంచి ఒత్తిళ్లు వచ్చాయని బొగ్గు శాఖ అధికారులు దర్యాప్తులో చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్కు తలబిరా-2 బొగ్గు క్షేత్రాలను కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ చేసిన సిఫార్సును తొలుత ఒప్పుకున్న మన్మోహన్ ఆ తర్వాత హిందాల్కోవైపు మొగ్గు చూపారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో నిజానిజాలేమిటన్నది తేల్చాల్సింది న్యాయస్థానాలే. కుమార మంగళం బిర్లా ప్రధానిని కలవడంలోగానీ, ఆయనకు లేఖలు రాయడంలో గానీ తప్పుబట్టాల్సిందేమీ లేదు. అయితే, ఆ కారణాలవల్లనే ఆ సంస్థకు బొగ్గు క్షేత్రాలు కేటాయించారా, ఇతరత్రా ఆ సంస్థకు ఎలాంటి అర్హతలూ లేవా అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత సీబీఐకి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిజానిజాలేమిటో తెలుసుకుని సందేహాతీతంగా న్యాయస్థానానికి వివరించి ఉంటే వేరుగా ఉండేది. ఆ పనిచేయాలంటే మన్మోహన్ను పిలిచి ప్రశ్నించాలి. పీఎంఓలోని ఇతర అధికారులనుంచీ విషయాలు రాబట్టాలి. కానీ, సీబీఐ ఆ పనిచేయలేదు. సందేహాలన్నిటినీ అలాగే మిగిల్చి కేసు మూసేస్తున్నట్టు నివేదిక ఇస్తే ఏ న్యాయ స్థానమైనా ప్రశ్నించకుండా ఎందుకుంటుంది? మన్మోహన్ బోనెక్కాల్సిరావడం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు విచారకరమైన విషయమే. కానీ అందుకు బాధ్యులెవరు? ఆ స్కాంపై ఎన్నోసార్లు పార్లమెంటు స్తంభించిపోయింది. అనేకసార్లు వాయిదా పడాల్సివచ్చింది. ఏ దశలోనూ మన్మోహన్ సందేహ నివృత్తికి ప్రయత్నించలేదు. తన సచ్ఛీలతను నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. అసలు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకే ఆ రోజుల్లో యూపీఏ సర్కారు ముందుకు రాలేదు. విపక్షాల ఒత్తిడి తట్టుకోలేక చివరకు దాన్ని నియమించినా ఆ సంఘం ముందుకొచ్చి మన్మోహన్ వివరణనిచ్చే ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి బొగ్గు క్షేత్రాల కేటాయింపు సరైంది కాదని, వేలం విధానం ద్వారానే దాన్ని అప్పగించడం మంచిదని స్వయంగా మన్మోహనే ప్రతిపాదించారు. ఆనాటి బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్ సలహా మేరకు అలాంటి ప్రతిపాదన చేసినా... ఆయనే దాన్ని ఎందుకు పాటించలేకపోయారో, పీఎంఓనుంచి బొగ్గు శాఖపై ఎందుకు ఒత్తిళ్లు వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఈ సందేహాలన్నిటికీ మన్మోహన్ మౌనమే సమాధానమైంది. విపక్ష రాష్ట్రాల సీఎంల ఒత్తిడి వల్లనే తాము వేలం విధానాన్ని ప్రారంభించలేక పోయామని ఒక దశలో మన్మోహన్ అన్నారు. కానీ అది బలహీనమైన వాదన. ఎవరో ఒత్తిడి చేశారని ఖజానాకు నష్టం కలిగించే పద్ధతిని కొనసాగిస్తారా? నిజానికి ప్రధానిగా ఆయన అన్ని శాఖల పర్యవేక్షణనూ చూస్తూ, అవి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేయాలి. అలాంటిది తానే స్వయంగా చూసిన శాఖలో అవకతవకలు జరుగుతుంటే ఆయన ఎందుకు మిన్నకుండిపోయారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సిమెంటు, ఉక్కు, విద్యుత్తువంటి ఎన్నో పరిశ్రమలకు బొగ్గు కీలకమైన ముడి సరుకు. దాని సరఫరా అంతంతమాత్రంగా ఉన్నందువల్ల విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సివస్తున్నది. ప్రధాన సరఫరాదారు కోల్ ఇండియా లిమిటెడ్ డిమాండుకు తగ్గ స్థాయిలో అందించలేక పోతున్నదన్న కారణంతో అవసరమైన పరిశ్రమలకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు విధానం ప్రారంభించారు. అయితే అందుకు వేలం పద్ధతిని ఎంచుకోకపోవడంవల్ల, పారదర్శకత పాటించనందువల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లింది. బొగ్గు క్షేత్రాలను అందుకున్న సంస్థలు భారీయెత్తున లాభపడ్డాయి. మన్మోహన్ను నిందితుడిగా పరిగణిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేయడం అనేకులకు మింగుడుపడని విషయమే. కానీ స్కాం జరిగిన సమయంలో ఆయన బొగ్గు శాఖను చూడటం, ఎన్నో సందేహాలకు సమాధానాలు లభించకపోవడం వంటి కారణాలవల్ల మన్మోహన్ ఈ పాపభారం మోయకతప్పదు. -
బొగ్గు టు బుగ్గ
కరెంట్ లేని ప్రపంచాన్ని ఊహించలేం.. ఒక్క నిమిషం పాటు కరెంట్ పోతే భరించలేం.. ప్రతీది కరెంటుతో ముడిపడి ఉంది.. వ్యవసాయం, పరిశ్రమలు, టెక్నాలజీ తదితరాలకు ముఖ్య మైనది..! అటువంటి కరెంట్ ఎలా ఉత్పత్తి అవుతుంది.. మనం సాధారణంగా బొగ్గు, నీరు, సౌర, గాలి నుంచి ఉత్పత్తి అవుతుందని విన్నాం.. మీరు విన్నది నిజమే.. ఇందులో బొగ్గు నుంచి కరెంటు ఎలా ఉత్పత్తి అవుతుందనేది తెలుసుకుందాం.. ఇందుకు గణపురంలోని కేటీపీపీ వద్దకు వెళ్లాల్సిందే.. బొగ్గు నుంచి కరెంటు ఉత్పత్తిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం.. బుగ్గ వెలగాలంటే స్విచ్చేయూలి.. చాలా సింపుల్! మరి విద్యుదుత్పాదన స్విచే ్చసినంత తేలికా..!! ఎక్కడో ప్లాంట్లలో ఉత్పత్తయ్యే కరెంటు మన లోగిళ్లలో ఎలా మెరుస్తుంది ఇందులో బొగ్గు పాత్ర ఎంత? దీనికి నీటి తోడ్పాటు ఏమిటి? అసలింతకూ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్రక్రియ ఏమిటి? నల్లని బొగ్గు నుంచి వెలుగుల బుగ్గ వరకు జరిగే పరిణామం ఏమిటి? వీటికి సమాధానాలు జిల్లాలోని కేటీపీపీకి వెళ్తే తెలుస్తాయి.. వీటినే ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు మీ ముందుంచుతోంది.. చదవండిక.. వరంగల్ జిల్లాలోని గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ ధర్మల్ విద్యుత్ ప్లాంట్(కేటీపీపీ) సామర్థ్యం 500 మెగావాట్లు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు, నీరు ప్రధాన ముడి సరుకులు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం సమీపంలోని గోదావరి నది నుంచి 64 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నీరు తరలించి 25 ఎకరాల్లో నిర్మించిన రిజర్వాయర్లో నిల్వ చే స్తారు. భూపాలపల్లి, లాంగ్వాల్, గోదావరిఖని నుంచి బొగ్గు ప్లాంట్కు చేరుతుంది. కేటీపీపీలో ప్రతీరోజు 7,500మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రతి 3.20 నిమిషాలకు లారీబొగ్గు(17టన్నులు) అవసరం. ప్రతి రోజు 480 లారీల బొగ్గు కోల్యార్డ్కు చేరుతుంది. ప్లాంట్ లో 15 రోజులకు సరిపడే బొగ్గు నిల్వ ఉంచాలి. బొగ్గు కరెంటుగా మారే పరిణా మం.. దీనికి నీరు ప్రేరకంగా పనిచేసే తీరు ఇలా.. కన్వేయర్ బెల్ట్తో ప్రారంభం.. యార్డు నుంచి బొగ్గును కన్వేయర్బెల్ట్ ద్వారా హపర్స్కు పంపిస్తారు. కన్వేయర్బెల్ట్ అన్నిస్టేజీలను కలిపి 600మీటర్లు ఉంటుంది. యూర్డు నుంచి ఇది బాయిలర్లోని మిల్లర్ వరకు ఉంటుంది. దీని ద్వారా కొంచెం తడిబొగ్గు సరఫరా అవుతుండటంతో బెల్ట్కు అంటుకోవద్దని నిత్యం శుద్ధి చేస్తారు. స్ట్రాకర్లో 20ఎంఎంగా.. హపర్స్కు చేరిన బొగ్గును డస్ట్ ఎట్రాక్షన్ సిస్టంలోకి వెళ్తుంది. ఇందులో వైబ్రేషన్ జరుగుతుంది. బొగ్గులో ఉండేమట్టి ఇతర డస్ట్ బయటికి వెళ్లి శుద్ధి జరుగుతుంది. అనంతరం కన్వేయర్ బెల్ట్ ద్వారా స్ట్రాకర్లోని క్రషర్లోకి పంపిస్తారు. అక్కడ బొగ్గును 20ఎంఎం సైజులోకి క్రషర్ చేస్తారు. ఈ బొగ్గు తడిగా ఉంటుంది. కొంచెం హిట్ చేస్తారు. ఫైనల్ సూపర్ హీటర్ ఫ్లాటిన్ సూపర్ హీటర్లో కొంత టెంపరేచర్ పెరిగిన ఆవిరిని ఫైనల్ సూపర్ హీటర్లోనికి పంపటంతో హై టెంపరేచర్కు చేరుతుంది. ఇక్కడ తయారైన ఆవిరి(స్టీమ్) హై ప్రెజర్తో మెరుున్ స్ట్రీమ్లైన్ ద్వారా టర్బైన్కు చేరుతుంది. గంటకు 324 మెట్రిక్ టన్నుల బొగ్గును మండిస్తారు. సుమారుగా 1600 సెంటిగ్రేడ్ టెంపరేచర్ వస్తుంది. 40 నుంచి 45శాతం బూడిద వస్తుంది. బారుులర్లో ఏం జరుగుతుందంటే.. బారుులర్లలో మూడు రకాలు ఉంటాయి. కేటీపీపీలో టు పాస్ బారుులర్ను వినియోగిస్తున్నారు. ఇందులో ప్రత్యేక పద్ధతిలో అమర్చిన పైపుల ద్వారా నీరు సరఫరా అవుతుంది. అదే సమయంలో బారుులర్ కింద వైపు డ్రమ్ముల్లోని బొగ్గు పొడిని ఆయిల్తో మండిస్తారు. బొగ్గుమంట ద్వారా వచ్చే ఉష్ణం (టెంపరేచర్) మూలంగా పైపుల్లోని నీరు వేడి అవుతుంది. ఆ దశలో వేడి నీరు ఆవిరిగా మారి డ్రమ్ములోకి చేరుతుంది. డ్రమ్ములో సగం కంటే తక్కువ నీరు, సగం కంటే ఎక్కువ ఆవిరి ఉంటుంది. డ్రమ్ములోని ఆవిరిని నిర్ణీత టెంపరేచర్కు చేరేందుకు ఫ్లాటిన్ సూపర్ హిటర్ లోనికి పంపిస్తారు. మిల్లర్లో బొగ్గు పొడిగా.. కన్వేయర్ బెల్ట్ ద్వారా బారుులర్ సమీపంలోని మిల్లర్లోకి 20ఎంఎం బొగ్గు వెళ్తుంది. మిల్లర్లోకి వెళ్లిన బొగ్గు పూర్తిగా పొడిగా మారుస్తారు. బొగ్గుపెళ్లలు లేకుండా ప్రైమరీ, సెంకడరీ ఫ్యాన్స్ ద్వారా బారుులర్లోకి బొగ్గుపొడిని పంపిస్తారు. ఇదే సమయంలో రిజర్వాయర్పై ఉన్న రా వాటర్ పంపుహౌస్ నుంచి పైపులైన్ ద్వారా నీటిని డీ మినర్లైజ్ ప్లాంట్కు పంపిస్తారు. అక్కడ నీటిలోని మినరల్ను తొలగించి శుద్ధి చేస్తారు. డీ మినర్లైజ్ నీటిని ప్లాంట్ స్టోరేజీలో నిల్వ చేస్తారు. అవసరం మేరకు నీటిని బారుులర్ ఫీడ్పంపు ద్వారా ఎకనమైజర్ నుంచి బారుులర్ డ్రమ్లోని పైపులకు పంపిస్తారు. యాష్ యార్డ్ బారుులర్లో బొగ్గును మండించగా ఏర్పడే బూడిద పైపులైన్ ద్వారా యాష్యార్డ్లోని సైలో నిర్మాణానికి చేరుతుంది. ఈ బూడిదను సిమెంట్, ఇటుక ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. మిగిలిన బూడిదను యాష్యార్డ్కు పంపిస్తారు. సింగరేణిలో బొగ్గు తీసిన బావుల్లో ఇసుకకు బదులు యాష్ను వినియోగిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్స్ జనరేటర్లో తయారైన విద్యుత్ను ట్రాన్స్ఫార్మర్లకు పంపిస్తారు. 500 మెగావాట్ల ప్లాంట్కు మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నారుు. అక్కడి నుంచి హైఓల్టెజీ పవర్ లైన్కు అనుసంధానించి గ్రిడ్కు పంపిస్తారు. కేటీపీపీలో ప్రతి రోజు 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కోల్యాష్ బారుులర్లో బొగ్గును ఆయిల్తో మండించే సమయంలో వెలువడే తేలికపాటి వాయువులు బారుులర్కు ఉన్న ప్రత్యేక ఏర్పాటును చిమ్నితో అనుసంధానిస్తారు. చిమ్మి 275 మీటర్లు ఉంటుంది. చిమ్మి ద్వారా బయటకు వచ్చిన వాయువులు తేలిగ్గా ఉండి పైకి మాత్రమే పోతారుు రోజూ బొగ్గును మండించడానికి ఆయిల్ను ప్లాంట్లో నిల్వ చేస్తారు. బొగ్గు నిల్వలు లేనప్పుడు కూడా ఆయిల్ను మండించి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగకుండా చూస్తారు. -
లోక్సభలో బొగ్గు బిల్లు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) బిల్లు-2015ను బొగ్గుశాఖ మంత్రి పీయూష్ గోయల్ సభ ముందుకు తెచ్చారు. దీనిపై బీజేడీ సభ్యుడు భరృ్తహరి నిరసన తెలిపారు. బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనలు)-2014 పేరుతో కేంద్రం గత అక్టోబర్, డిసెంబర్లో ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది. పౌరసత్వ బిల్లుకు ఆమోదముద్ర రాజ్యసభలో ఆమోదించిన పౌరసత్వ(సవరణ) బిల్లు-2014కు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో భారత ప్రవాస పౌరసత్వ కార్డు(ఓసీఐ), భారత సంతతి వ్యక్తి కార్డు(పీఐవో)లను విడివిడిగా కాకుండా ఇకపై ఒకే కార్డుగా గుర్తిస్తారు. ప్రధాని మోదీ కిందటేడాది అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఓసీఐ, పీఐవోలను కలుపుతామని హామీ ఇచ్చారు. కేంద్రం ఇటీవలే దీనిపై ఆర్డినెన్స్ తెచ్చింది. సర్కారు తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్లలో ఇదొకటి. -
తెలంగాణకు బొగ్గు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుదుత్పత్తి అవసరాలకు బొగ్గు బ్లాక్లతోపాటు తగినంత బొగ్గును, రాష్ట్రానికి 500 మెగావాట్ల విద్యుత్ను కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధానికి సీఎం వేర్వేరుగా రెండు లేఖలు రాశారు. ‘విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు ఉపయోగపడేలా 36 బొగ్గు బ్లాక్లను కేటాయించేందుకు కేంద్ర ఇంధనశాఖ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. రెండోదశ నిర్మాణంలో కాకతీయ థర్మల్ వపర్ ప్రాజెక్టు ఈ ఏడాది రెండో అర్ధం లో పూర్తవుతుంది. దీనికి ఏటా 2.5 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఈ ప్రాజెక్టుకు తాడిచెర్ల-1 కోల్బ్లాక్ నుంచి బొగ్గు కేటాయించారు. గత ఏడాది సెప్టెంబరు 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ బ్లాక్ రద్దయింది. అందుకే తాజా ఈ కోల్బ్లాక్ను తిరిగి తెలంగాణకు కేటాయించాల్సిన అవసరముంది. రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లకు ఏటా 4.50 మిలియన్ టన్నుల బొగ్గు కొరతను తీర్చేందుకూ కొత్త కోల్బ్లాక్లను కేటాయించాలి. సింగరేణి కం పెనీ ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల కేంద్రానికి 6 మిలియన్ టన్నులు, అదనంగా నిర్మించే 600 మెగావాట్ల యూనిట్కు 3 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంది. వీటితోపాటు 4,200 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి 21 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఈ ప్రాజెక్టుల ప్రతి పాదనలన్నీ సిద్ధమయ్యాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ తెలంగాణలో 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాలను నెలకొల్పనుంది. రామగుండంలో ఇప్పుడున్న ప్లాంట్లోనూ 1,600 మెగావాట్ల యూనిట్లు, రెండోదశలో నల్లగొండ జిల్లా దామరచర్లలో 2,400 మెగావాట్ల ప్లాంట్ను స్థాపించనుంది. ఎన్టీపీసీ ప్లాంట్లకు 20 మిలి యన్ టన్నుల బొగ్గు అవసరం. గత ఏడాది జూన్ 7న, సెప్టెంబర్ 6న రాసిన లేఖల్లోనూ ఈ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. 500 మెగావాట్ల విద్యుత్తు ఇవ్వండి తెలంగాణలో వచ్చే 4 నెలలు విద్యుత్తు కొరత తీవ్రమయ్యే పరిస్థితి ఉన్నందున.. తూర్పు గ్రిడ్ నుంచి 500 మెగావాట్ల మిగులు విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి మరో లేఖలో విన్నవించారు. ఏపీ, తెలంగాణ విద్యు త్తు వాటాల పంపిణీ వివాదంపై కేంద్ర ఇంధన శాఖ కమిటీ ఇప్పటికీ తుది నివేదిక ఇవ్వలేదని, దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ లేఖ ప్రతిని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రికి కూడా పంపారు. -
కొనసాగుతున్న ఉత్పత్తి లోటు
మిగిలింది 75 రోజులే లక్ష్యం 18 మిలియన్ టన్నులు ఇప్పటివరకు 37 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉత్పత్తి వేగం పెంచేందుకు అధికారుల కసరత్తులు కొత్తగూడెం : సింగరేణి సంస్థ నిర్ధేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో లోటు కొనసాగుతోం ది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఓసీల్లో ఉత్పత్తికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడేది. ఈ ఏడాది అ లాంటి ఇబ్బందులు పెద్దగా లేకున్నా ఉత్పత్తి మందగించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండున్నర నెలలు మాత్రమే ఉంది. దీంతో ఉత్పత్తి వేగం పెంచడానికి యాజమా న్యం అవసరమైన చర్యలు చేపట్టింది. ఫలితం గా కార్మికులపై పనిభారం పెరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరానికి 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ధేశించుకుం ది. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఉన్న 15 ఓపెన్కాస్టు, 34 భూగర్భ గనుల ద్వారా గడిచి న తొమ్మిదిన్నర నెలల కాలంలో 41 మిలియన్ ట న్నులకు 37 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. మరో రెండున్నర నెలల కాలంలో సుమారు 18 మిలియన్ టన్నులు సాధించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి 13 నాటికి 4,17, 21,644 టన్నుల ఉత్పత్తి చేపట్టాల్సి ఉండగా 3,73,40,418 టన్నుల(89 శాతం) ఉత్పాదక త నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఉత్పత్తి కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ 2012-13 ఏడాదితో పోల్చుకుంటే మాత్రం 2 మిలియన్ టన్నులు వెనుకంజలో ఉంది. వెనుకబడిన ఓపెన్కాస్టులు ప్రతి ఏటా ఓపెన్కాస్టుల్లో నూరు శాతానికి పైగా చేసిన ఉత్పత్తితో భూగర్భగనుల లోటు భర్తీ అయ్యేది. భూగర్భగనుల ద్వారా ఇప్పటివరకు 1,13,30,949 టన్నులకు 76,09,400 టన్నులు, ఓపెన్కాస్టు గనుల్లో 3,03,90,695 టన్నులకు 2,97,31,003 టన్నుల ఉత్పత్తి జరి గింది. మొత్తం 11 ఏరియాల్లో 4 ఏరియాలు మాత్రమే నూరుశాతం ఉత్పత్తి సాధించాయి. కొత్తగూడెం ఏరియా 126 శాతంతో ప్రథమ స్థానంలో, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా చివరి స్థానంలో, మందమర్రి ఏరియా 65 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. -
పేరుకుపోతున్న బొగ్గు నిల్వలు
* విదేశాల నుంచి భారీగా దిగుమతి * వినియోగం తగ్గించిన స్థానిక సంస్థలు * సిమెంటు కంపెనీలకు నిలిచిన బొగ్గు రవాణా గోదావరిఖని/యైటింక్లయిన్కాలనీ(కరీంనగర్) : సింగరేణి గనుల నుంచి వెలికితీస్తున్న బొగ్గు రోజురోజుకూ నిల్వ కేంద్రాలకే తరలిపోతున్నది. సంస్థ నుంచి రవాణా అయ్యే బొగ్గు ను సిమెంట్ కంపెనీలు తీసుకోవడానికి విముఖత చూపడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. సిమెంట్ ఉత్పత్తి తగ్గడంతో పాటు విదేశాల నుంచి వచ్చే బొగ్గు తక్కువ ధరకు లభిస్తుండడంతో ఆయా కంపెనీలు విదేశీ బొగ్గువైపే ఆకర్షితులవుతున్నారు. సింగరేణిలో ప్రస్తుతం ఉత్పత్తి అయ్యే మొదటి రకం(5 శాతం బూడి ద వెలువడే) బొగ్గు ప్రతి టన్నుకు 4,800 ధర పలికితే.. విదేశాల నుంచి వచ్చే ఇదే రకమైన బొగ్గు *3,600 లకే లభిస్తున్నది. అయితే విదేశాల నుంచి వచ్చే బొగ్గుకు 60 రోజుల వరకు క్రెడిట్ ఇచ్చే సౌకర్యం ఉండగా.. సింగరేణిలో మాత్రం మూడు నెలల ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా సిమెం ట్ కంపెనీలు సింగరేణి బొగ్గును తీసుకునేందు కు వెనుకాడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణ జెన్కోకు సింగరేణి నుంచి 130 నుంచి 140 శాతం బొగ్గు రవాణా అవుతోంది. అయితే ఏపీ జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్లకు కాకినాడ పోర్టు నుంచి విదేశీ బొగ్గు ను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం 20 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మార్చి నాటికి 60 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయే పరిస్థితి ఏర్పడనున్నది. ఈ నేపథ్యంలో సింగరేణి మార్కెటింగ్ విభాగం అధికారులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ వద్ద గల విద్యుత్ ప్రాజెక్టు అధికారులతో చర్చలు జరుపుతున్నారు. వారు ఒకవేళ అంగీకారం తెలిపితే నిల్వ బొగ్గును అటు రవాణా చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లోనూ సింగరే ణి బొగ్గుకు డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపిస్తు న్న నేపథ్యంలో బొగ్గును విక్రయించే బదులు సంస్థ ఆధ్వర్యంలోనే విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పి వాటికే విక్రయిస్తే ఎలా ఉంటుందనే విషయమై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్న ట్లు సమాచారం. బూడిదవుతున్న బొగ్గు రోజుల తరబడి బొగ్గు నిల్వ ఉండటంతో స్వతహాగా మండుతూ టన్నుల కొద్ది బొగ్గు కా లిబూడిదై పోతోంది. రైల్వే ద్వారా తరలించే ప్రతి సీహెచ్పీలో ఇదే పరిస్థితి ఎదురవుతున్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల నుంచి వెలికి తీసిన బొగ్గును నిర్ణీత సమయంలోగా రవాణా చేయాలి. సకాలంలో పంపించక పోతే బొగ్గులో ఉన్న కార్బన్ బయ ట ఉన్న ఆక్సిజన్తో కలవడంతో దానంతట అదే మండే అవకాశం ఉంటుంది. ఇండోనేషియా ఎఫెక్ట్ రుద్రంపూర్(ఖమ్మం) : బొగ్గు ధరను ఇండోనేషియా ప్రభుత్వం భారీగా తగ్గించింది. గతం లో సుమారు 80 డాలర్లు ఉన్న ధరను ఒకేసారి 40 డాలర్లకు తగ్గించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విద్యుత్ ప్లాంట్లు ఆ దేశం నుంచి, మహానది కోల్ఫీల్డ్స్(ఒరిస్సా) నుంచి భారీగా దిగుమతి చేసుకుం టున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గుగనుల ద్వారా ఉత్పత్తి చేసే బొగ్గుకు డిమాండ్ తగ్గే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక సింగరేణి బొగ్గు వాడకం తగ్గించే ప్రయత్నంలో కేటీపీఎస్ లాంటి సంస్థలు ఉన్నట్లు సమాచారం. కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్సీహెచ్పీ నుంచి రోజుకు 5 లేదా 6 రేకు లు బొగ్గు(ఒక్క రేకుకు 60 వ్యాగన్లు) చొప్పున కేటీపీఎస్కు రవాణా జరుగుతుంది. అయితే 25 రోజులనుంచి రోజుకు రెండు రేకుల బొగ్గును తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలి సింది. అదేమని సింగరేణి అధికారులు కేటీపీఎస్ అధికారులను అడిగితే యాజమాన్యం ఇష్టమని చెబుతున్నట్లు సమాచారం. రేకులు లేక నిలిచిపోతున్న బొగ్గులారీలు కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కోల్హాండ్లింగ్ ప్లాంట్ నుంచి రోజుకు 5 లేదా 6రేకుల బొగ్గు కేటీపీఎస్కు రవాణా జరుగుతుంది. గత 20 రోజులుగా రోజుకు 5 రేకులు ఒక్కోక్క రోజు నాలుగు రేకుల బొగ్గు రవాణా అవుతోంది. దీంతో రోజుకు ఒక లోడ్ ర్యాక్ బొగ్గు రవాణా నిలిచిపోవడంతో జేవీ ఆర్ఓసీ, జీకేఓసీ నుంచి వచ్చే బొగ్గులారీలు నిలిచిపోతున్నాయి. ఆర్సీహెచ్పీ అధికారులు చేసేదిలేక బొగ్గును యాడ్లో డంప్ చేస్తున్నారు. -
మన్మోహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ
-
మన్మోహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ?
ఢిల్లీ: కోల్స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను విచారించడానికి సీబీఐ సన్నద్ధమయినట్లు తెలుస్తోంది. యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన ఆనాటి ప్రధాని మన్మోహన్ కూడా విచారించాలని సీబీఐ యోచిస్తోంది. హిందూల్కోకు బొగ్గు గనుల కేటాయింపుపై సీబీఐ సమర్పించిన తుది నివేదికను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. హిందూల్కోకు బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్ వాంగ్మూలం నమోదు చేయాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మన్మోహన్ ను సీబీఐ విచారించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. -
బొగ్గు బాగోలేదు..
ఎర్రగుంట్ల: రాయలసీమ ప్రాంతానికి వెలుగులు నింపేరాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) ఏపీ జెన్కో ఉన్నతాధికారులు వివక్ష చూపుతున్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరైమన బొగ్గును సరఫరా చేయడంలో సవతి ప్రేమను చూపుతున్నారు. ప్రస్తుతం ఆర్టీపీపీకి సింగరేణి నుంచి వస్తున్న బొగ్గులో నాణ్యత లోపించింది. బొగ్గులో ఎక్కువగా రాళ్లు వస్తున్నాయి. వీటిని పగల కొట్టి బంకర్లలోకి పంపించడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వస్తున్న రాళ్లను కార్మికులు సమ్మెటలతో పగలగొట్టి అందులోంచి బండరాళ్లను బయటకు తీస్తున్నారు. ఆర్టీపీపీలో 1,2,3,4,5 యూనిట్లలో 1050 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న విషయం విధితమే. బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలిగే పరిస్థితులు ఏర్పడడంతో కింద పడిన బొగ్గును సైతం వాడుతున్నారు. బొగ్గు మాత్రం యూనిట్లుకు సరిపడ సరఫరా కావడంలేదు. ఆర్టీపీపీకి సింగరేణి, మణగూరు, రామగుండం మంచిర్యాల ప్రాంతాల నుంచి బొగ్గు సరఫరా అవుతోంది. సింగరేణి నుంచి ఇక్కడి స్టేజ్-1,2 ప్లాంట్లకు 38.80 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి సరఫరా చేయించే విధంగా 2012 ఏప్రిల్ 1న చేసుకున్న ఒప్పందం మేరకు 2032 సంవత్సరం వరకు సింగరేణి బొగ్గు ఆర్టీపీపీకి రావాల్సింది. కొన్ని నెలలుగా సగటున రోజుకు ఒక్క వ్యాగన్ కూడా రావడంలేదు. సింగరేణి నుంచి కృష్ణపట్నం సమీపంలోని ధర్మల్ స్టేషన్కు ఇబ్బందుల్లేకుండా బొగ్గు సరఫరా చేస్తున్నారు.. ఏపి జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బొగ్గు ఆ ప్లాంట్కు తరలివెళుతోందని విశ్వసనీయ సమాచరం. ఒరిస్సా నుంచి వస్తున్న బొగ్గు పరిస్థితి దారుణం ఆర్టీపీపీకి ఒరిస్సాలోని మహానది నుంచి వస్తున్న వాష్డ్ బొగ్గు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నెలకు రెండు లక్షల టన్నుల బొగ్గు రావాల్సింది. నెలకు సుమారు 26 వ్యాగన్ల వరకు రావాల్సింది. ప్రస్తుతం నెలకు పది వ్యాగన్లు కూడా రాలేదు. నవంబరు నెలలో కేవలం 8 వ్యాగన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. అంటే వాష్డ్ బొగ్గు ఆర్టీపీపీ ఒప్పందం ప్రకారం సక్రమంగా సరఫరా జరిగితే సమస్య తగ్గే అవకాశం ఉంది. ఆర్టీపీపీలోని ఐదు యూనిట్లు పని చేయాలంటే రోజుకు సుమారు 16వేల టన్నుల బొగ్గ్గు అవసరం. అయితే గురువారం నాటికి ఆర్టీపీపీలో స్వదే శీ బొగ్గు నిల్వలు కేవలం 62 టన్నులు మాత్రమే. విదేశీ బొగ్గు నిల్వలు నిల్. ఈ మధ్య కాలంలో సింగరేణి నుంచి వస్తున్న బొగ్గులో కూడా నాణ్యత ప్రమాణాలు క్షీణించాయి. ఎక్కువగా రాళ్లు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం గ్రేడ్-15 గల బొగ్గు రావాల్సింది. రాయలసీమ ప్రాంతంలోని విద్యుత్ ఉత్పత్తి కర్మగారంపై ఏపి జెన్కో ఉన్నతాధికారులు చిన్నచూపు చూడడంలో అంతరార్థం ఏవరికీ బోధపడడంలేదు. నాణ్యత లేని బొగ్గుతో నష్టం సింగారేణి కాలని నుంచి వస్తున్న నాణ్యత లేని బొగ్గుతో ఆర్టీపీపీ ఉత్పత్తి నష్టం కల్గుతోందని అధికారులు అంటున్నారు. ఈ బొగ్గులో రాళ్లు ఎక్కువగా వస్తున్నాయని దీనిని వాడితే యూనిట్లులో ఇబ్బందులు కలుగుతాయన్నారు. బొగ్గు కొరతతో ఒక్కొక్క యూనిట్లో 210 మెగావాట్లు బదులు ప్రస్తుతం 150లోపే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. అంతేకాక రాళ్లుతో వస్తున్న బొగ్గును బయటకు తీయడానికి ప్రత్యేక ఖర్చుతో పొక్లెయిన్లు ఏర్పాటు చేసుకుని బండ రాళ్లును బయటకు తీస్తున్నారు. దీంతో ఆర్టీపీపీకి బొగ్గు కొరతతో పాటు అదనపు ఖర్చు వస్తుందని సీఈ తెలిపారు. సింగరేణి వద్దనే బొగ్గును క్రష్ చేసి పంపించాల్సింది.. సింగరేణిని వస్తున్న బొగ్గును ముందుగా క్రషర్ ద్వారా పెద్ద బొగ్గును పిండి చేసి సరఫరా చేయూలి. అరుుతే సింగరేణి కాలనీ నేరుగా వ్యాగన్లు ద్వారా పెద్ద రాళ్ల బొగ్గును అలానే పంపిస్తున్నారు. సింగరేణి బొగ్గుతో పాటు వాష్డ్ బొగ్గు సక్రమంగా వస్తేనే ఉత్పత్తికి ఆటంకం ఉండదని అధికారులు వివరిస్తున్నారు. ఆర్టీపీపీ సీఈ ఏమంటున్నారంటే..... ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ కుమారుబాబును వివరణ కోరగాఆర్టీపీపీకి బొగ్గు కొరత చాలా ఎక్కువగా ఉంది. వాష్డు బొగ్గు ఒప్పంద ప్రకారం రాలేదు. ఒరిస్సా నుంచి నెల సుమారు 26 వ్యాగన్లు రావాల్సి ఉన్నా రాలేదు. సింగ రేణి నుంచి వస్తున్న బొగ్గులో రాళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని పగల కొట్టి కష్టాల నడుమ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూస్తున్నాం. -
మన్మోహన్ను విచారించలేదేం?
బొగ్గు స్కాం కేసులో సీబీఐని ప్రశ్నించిన ప్రత్యేక కోర్టు మాజీ ప్రధానిని ప్రశ్నించేందుకు అనుమతివ్వలేదన్న సీబీఐ సీబీఐ న్యాయవాదిపై {పశ్నల వర్షం కురిపించిన జడ్జి న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను కోల్స్కాం కేసులో విచారించడానికి తమకు అనుమతి రాలేదని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. ఒరిస్సాలోని తలాబిరా-2, 3బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాలకు సంబంధించిన కేసు మంగళవారం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ కేసులో పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్తోపాటు హిందాల్కో కంపెనీ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్ పరాశర్.. సీబీఐదర్యాప్తు అధికారిపై ప్రశ్నల పరంపర కురిపించారు. ‘ఈ కేసులో నాటి బొగ్గుశాఖ మంత్రిని విచారించాల్సిన అవసరం లేదని మీరు భావించారా? కేసులో అనేక అంశాలపై స్పష్టత వచ్చేందుకు ఆయన వాంగ్మూలం అవసరమని మీకు ఎందుకు అనిపించలేదు’ అని ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి బదులిస్తూ.. ‘మొదట మన్మోహన్ను ప్రశ్నించాలని భావించాం. కానీ ప్రధాని కార్యాలయం అధికారులు నాయర్, జావెద్ ఉస్మానీలను ప్రశ్నించాం. వారి వాంగ్మూలం సరిపోతుందనుకున్నాం.’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో నాటి బొగ్గుశాఖ బాధ్యతలను చూసిన ప్రధానిని విచారించేందుకు తమకు అనుమతి రాలేదని వివరించారు. ఈ సందర్భంగా పీఎంవో అధికారులను ముఖాముఖీ ప్రశ్నించా రా? లేదా వారికి ప్రశ్నావళిని పంపి సమాధానాలు అడిగారా? అని న్యాయమూర్తి అడిగారు. ఇందుకు నేరుగానే ప్రశ్నించామని న్యాయవాది బదులిచ్చారు. తర్వాత న్యాయమూర్తి... ‘దీనిపై సమగ్ర అవగాహనకు రావాలంటే కేసు దర్యాప్తు ఎలా సాగింది, ఎవరెవరిని ఎలా ప్రశ్నించారన్న విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కేసు డైరీ, ఇతర ఫైళ్లన్నీ సీల్డ్ కవర్లో మా ముందుంచండి’అని సీబీఐని ఆదేశించారు. కేసు తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. 2005లో ప్రధాని మన్మోహన్ అదనంగా బొగ్గుశాఖ బాధ్యతలను నిర్వర్తించారు. కాగా, తలాబిరా బొగ్గు గనుల కేటాయింపు కేసు డైరీ, సంబంధిత ఫైళ్లన్నీ న్యాయస్థానానికి అందజేస్తామని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. వాటిని పరిశీలించాక మన్మోహన్ను ప్రశ్నించకపోవడం తప్పో కాదో నిర్ణయించాల్సింది కోర్టేనని అన్నారు. -
ముందు చూపేదీ?
కొత్తగూడెం(ఖమ్మం) : రాష్ట్రం తీవ్రమైన విద్యుత్ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రానున్న మూడేళ్ల కాలంలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. అయితే కొత్త విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలంటే ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు బొగ్గు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్నప్పటికీ కొత్త విద్యుత్ ప్రాజెక్టులు వస్తే వాటి అవసరాలకు తగిన విధంగా బొగ్గు ఉత్పత్తి చేయగలిగే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడంలేదు. దీంతో కొత్త ప్రాజెక్టులకు బొగ్గు ఎక్కడి నుంచి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ద్వారా 1720 మెగావాట్లు, భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా 500 మెగావాట్లు, ఆర్టీపీపీ ద్వారా మరో 60 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతోంది. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు 2,280 మెగావాట్లు మాత్రమే రాష్ట్రానికి అందుతోంది. వీటికి సింగరేణి సంస్థ నుంచి ప్రతిరోజు 35 వేల టన్నుల బొగ్గు సరఫరా అవుతోంది. అవొస్తే.. బొగ్గు సంగతేంటి? రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పే విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 10 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా కొత్తగూడెం మండలంలోని పునుకుడుచెలకలో రెం డువేల మెగావాట్లు, మణుగూరులో మరో రెం డువేల మెగావాట్లతోపాటు ఇప్పటికే పాల్వంచలోని కేటీపీఎస్లో 7వ దశ నిర్మాణం ద్వారా మరో 800 మెగావాట్ల ఉత్పత్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీటితోపాటు మరి కొన్ని ప్రాజెక్టులను నెలకొల్పి మొత్తం 10 వేల మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలంటే ఆయా ప్రాజెక్టులకు రోజుకు సుమారు 1.5 లక్షల టన్నుల బొగ్గు అవసరం పడుతుంది. సింగరేణి సంస్థ ప్రస్తుతం తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న 34 భూగర్భ గనులు, 15 ఓపెన్కాస్టు ప్రాజెక్టుల ద్వారా రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. వీటిలో కేవలం 35 వేల టన్నులు మాత్రమే తెలంగాణ జెన్కోకు సరఫరా చేస్తుండగా మిగిలిన బొగ్గును ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ ప్రాజెక్టులతోపాటు ఎన్టీపీసీ, ఇతర సిమెంటు సంస్థలకు సరఫరా చేస్తోంది. సింగరేణి సంస్థ కొత్తగా బొగ్గుగనులను ఏర్పాటు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటే తప్ప నూతనంగా ఏర్పాటు చేయదల్చుకున్న విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గును సరఫరా చేసే పరిస్థితులు కన్పించడంలేదు. పెండింగ్లో 21 బొగ్గు గనుల ప్రాజెక్టులు సింగరేణి సంస్థ వ్యాపారాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా సంస్థ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించి ప్రారంభిస్తే తప్ప తెలంగాణలో కొత్తగా ఏర్పాటుచేసే విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన మేరకు బొగ్గు సరఫరా జరిగే అవకాశం లేదు. ఇప్పటికే సంస్థ ఆధ్వర్యంలో 2006 నుంచి ఇప్పటివరకు 21 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. వివిధ కారణాలతో ప్రాజెక్టులు పెండింగ్ పడుతూ వస్తుండడంతో సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోలేకపోతోంది. వీటికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి కొత్త విద్యుత్ ప్రాజెక్టులతోపాటు కొత్తగా బొగ్గుగనులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో విదేశాలనుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే జరిగితే విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు ప్రజలపై భారం పడుతుందని పలువురు భావిస్తున్నారు. -
జిందాల్ స్టీల్పై మరో ‘బొగ్గు’ కేసు
తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటారుుంపునకు (1993-2005) సంబంధించిన దర్యాప్తులో భాగంగా మోసం, అవినీతి వంటి ఆరోపణలతో.. తాజాగా జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇది 36వ ఎఫ్ఐఆర్ అని సంస్థ ప్రతినిధి ఒకరు ఆదివారం నాడిక్కడ చెప్పారు. జిందాల్ స్రైప్స్ లిమిటెడ్ (ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్)తో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులపై నేరపూరిత కుట్ర, ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదైనట్టు సీబీఐ వర్గాలు వెల్లడించారుు. వెనువెంటనే సీబీఐ రాయ్గఢ్, ఛత్తీస్గఢ్ల్లోని మొత్తం 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారుు. ఇది గరె పల్మా 4/1 బొగ్గు గని కేటారుుంపునకు సంబంధించిన కేసుగా ఆ వర్గాలు వివరించారుు. కంపెనీకి చెందిన స్పాంజ్ ఐరన్ ప్లాంట్ కోసం గనిని కేటారుుంచగా.. దానికి బదులు కంపెనీ, బొగ్గు శాఖ నిర్దేశిత పరిధికి మించి అక్రమ మైనింగ్కు ప్రతిపాదించడమే కాకుండా అందుకు పాల్పడిందనే ఆరోపణలున్నారుు. మితిమీరిన మైనింగ్కు పాల్పడటమే కాకుండా ముడి బొగ్గును అమ్మడం వంటి చర్యలకు పాల్పడినట్టుగా ఆరోపణలున్నట్టు సీబీఐ ప్రతినిధి తెలిపారు. జార్ఖండ్లో ఓ బొగ్గు గనిని కైవసం చేసుకోవడంలో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలతో జేఎస్పీఎల్ ఇప్పటికే సీబీఐ విచారణను ఎదుర్కొంటోంది. ఈ కేసుకు సంబంధించి కంపెనీ చైర్మన్, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ను సీబీఐ ప్రశ్నించింది. -
ఆగస్ట్లో మౌలిక రంగ వృద్ధి 5.8%
న్యూఢిల్లీ: కీలకైమైన 8 మౌలిక పరిశ్రమలు ఆగస్ట్లో 5.8% వృద్ధిని అందుకున్నాయి. ప్రధానంగా బొగ్గు, సిమెంట్, విద్యుత్ రంగాల పనితీరు ఇందుకు దోహదపడింది. గతేడాది(2014) ఆగస్ట్లో మౌలిక పరిశ్రమల పురోగమన రేటు 4.7% చొప్పున నమోదైంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం బొగ్గు రంగం 13.4% వృద్ధిని చూపగా, సిమెంట్ 10.3%, విద్యుత్ 12.6% చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో స్టీల్ ఉత్పత్తి 9.1% మెరుగుపడినప్పటికీ, ముడిచమురు 4.9%, సహజవాయువు ఉత్పత్తి 8.3% చొప్పున క్షీణించడం గమనార్హం.ఇదే విధంగా రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల విభాగం 4.3% చొప్పున నీరసించాయి. కాగా, ఏప్రిల్-ఆగస్ట్ కాలానికి 8 కీలక పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం 4.4% వృద్ధిని సాధించింది. గతంలో ఇదే కాలానికి 4.2% వృద్ధి నమోదైంది. ఆగస్ట్లో 8 కీలక పరిశ్రమలు సగటున మెరుగైన ఫలితాలను సాధించడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు సానుకూలంగా వెలువడేందుకు వీలుచిక్కనుంది. ఐఐపీలో వీటికి 38% వెయిటేజీ ఉండటమే దీనికి కారణం. ఆర్థిక రికవరీకి సంకేతం ఆగస్ట్లో కీలక పరిశ్రమలు 5.8% వృద్ధి సాధించడం ద్వారా ఆర్థిక పురోగమన సంకేతాలను మరింత బలపరుస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ వ్యాఖ్యానించింది. బొగ్గు రంగ వేగం కొనసాగకపోయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఆటంకం ఉండబోదని అభిప్రాయపడింది. మెరుగుపడుతున్న పారిశ్రామికోత్పత్తిని గణాంకాలు పట్టిచూపుతున్నాయని పేర్కొంది. భవిష్యత్లో బొగ్గు రంగంలో జోష్ కొనసాగాలంటే బ్లాకులను ప్రభుత్వం తిరిగి వేలం ద్వారా కేటాయించాల్సిన అవసరం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టు మొత్తం 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
కాంతి గుమ్మం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా విద్యుత్ హబ్గా వెలుగొందబోతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చే జిల్లాగా రూపుదిద్దుకోబోతోంది. నూతన రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తోడు జిల్లాలో సహజవనరులు అందుబాటులో ఉండడంతో ఏకంగా 5వేల మెగావాట్లకు పైగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తయారయిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు జెన్కో వర్గాలు చెబుతున్నాయి. కొత్తగూడెం మండలంలో 4వేల మెగావాట్ల నూతన ప్రాజెక్టుతోపాటు కేటీపీఎస్ విస్తరణను మరో 1040 మెగావాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చితే జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో గణనీయమైన పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. విశేషమేమిటంటే ఈ ప్రాజెక్టులన్నీ సవ్యంగా ఏర్పాటయితే భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సగం జిల్లా నుంచే ఉత్పత్తి కానుంది. అయితే, ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి కనీసం నాలుగేళ్లు పడుతుందని అంచనా. అన్నీ అనుకూలతలే... నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండడమే జిల్లా విద్యుత్ హ బ్గా మారేందుకు అవకాశం కల్పించింది. విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, బొగ్గు అందుబాటులో ఉన్న జిల్లా కావడంతో ప్రభుత్వం ఖమ్మంపై దృష్టి సారించింది. దీంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటే సముద్రతీరం అందుబాటులో ఉండాలి. తెలంగాణలో సముద్రం లేనందున ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలి. అయితే మచిలీపట్నం పోర్టుకు తెలంగాణలో ఖమ్మం జిల్లానే దగ్గర. ఇక ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు ప్రాంతాల్లో బొగ్గు నిల్వలుండడం, గోదావరి నీరు కూడా అందుబాటులో ఉండడంతో పాటు అవసరమైన మేర ప్రభుత్వ భూమి లభించడం, జిల్లా యంత్రాంగం ఈ భూమి వివరాలను వేగంగా ప్రభుత్వానికి పంపడం.. ఇలా అన్ని సానుకూలతల నడుమ నాలుగేళ్ల తర్వాత ఖమ్మం జిల్లా వెలుగుల జిల్లాగా మారబోతోంది. 8,029 ఎకరాల గుర్తింపు... తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు జిల్లాలోని కొత్తగూడెం మండలంలో ఏర్పాటు కాబోతోంది. మండలంలోని గునుకుచెలక గ్రామంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న దృష్ట్యా అక్కడ 4వేల మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పడబోతోంది. వాస్తవానికి ఇక్కడ 8,029 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. అయితే, అందులో వెయ్యి ఎకరాలు ఇప్పటికే వివిధ వర్గాలకు ప్రభుత్వం మంజూరు చేసింది. మరో 1700 ఎకరాలు అసైన్భూమి ఉంది. ఈ భూమికి నష్టపరిహారం చెల్లించి మళ్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇక, ప్రభుత్వం గుర్తించిన 8వేలకు పైగా ఎకరాల్లో 2వేల ఎకరాల వరకు అటవీభూమి ఉంది. ఈ భూమిని ప్రాజెక్టుకు కేటాయించడం కష్టమే. అయితే, ఇక్కడ ఉన్న ఒకటి, రెండు సానుకూలతలు ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ భూమి అటవీ శాఖ పరిధిలోనే ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈ విషయంలో తుది నోటిఫికేషన్ రాలేదు. అలా రాకుంటే ఆ భూమిని రెవెన్యూకు మార్చేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే తొలి నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటుంది. మరోవైపు ఈ భూమి సేత్వార్లో కూడా రెవెన్యూ భూమి అని రాసి ఉండడం ప్రభుత్వానికి కలిసివచ్చే మరో అంశం. ఈ రెండు అంశాల ప్రాతిపదికన ఆ రెండువేల ఎకరాలను కూడా అటవీశాఖ నుంచి తీసేసుకుని గుర్తించిన 8వేలకు పైగా ఎకరాల్లో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కేటీపీఎస్ విస్తరణ 1080 యూనిట్లు... జిల్లాలో ప్రస్తుతం ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) సామర్థ్యం 1700 మెగావాట్లు. ప్రాజెక్టు ఏడో దశ విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ విస్తరణను స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నందున దీనిని నాలుగు యూనిట్లుగా విభజించనున్నారు. ఒక్కో యూనిట్ను 270 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 1080 మెగావాట్లుగా ఈ విస్తరణ జరగనుంది. ఇదిలా ఉండగా, మణుగూరు మండలం రామానుజవరంలో కూడా 2వేల ఎకరాలను విద్యుదుత్పత్తికి అనువైన భూమిగా జిల్లా యంత్రాంగం గుర్తించి ప్రభుత్వానికి పంపింది. అయితే, ఈ భూమి మధ్యలో కొంత ప్రైవేటు భూమితో పాటు కొన్ని నివాస సముదాయాలు కూడా ఉన్నాయి. ఈ భూమికి పరిహారం చెల్లించి సేకరించేందుకు కొంత ఇబ్బందికర పరిస్థితులున్న నేపథ్యంలో ప్రస్తుతానికి కీలక విభాగాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పంపాలని జెన్కో అధికారులు జిల్లా యంత్రాంగాన్ని కోరినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కూడా భూసేకరణ సమస్యలు తొలిగితే రామానుజవరంలో కూడా మరో రెండువేల మెగావాట్ల ప్రాజెక్టు వస్తుందని అధికారులు చెపుతున్నారు. -
ఖమ్మం కళకళలాడాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కళకళలాడాలని, ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. అపార సహజ సంపదను సద్వినియోగం చేసుకుని తెలంగాణకే తలమానికమయ్యేలా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. జిల్లాకు చెందిన మాజీమంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు వేలాది మంది అనుచరులు, ముఖ్య నాయకులతో కలిసి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై తనకున్న విజన్ను వివరించారు. జిల్లాలో ఉన్న అటవీ, సహజ సంపదలను సద్వినియోగం చేసుకోవాలని, గోదావరి జలాలు, బొగ్గును వినియోగించుకుని పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయేలా, ఔరా అనేలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలో లభించే ముడి ఇనుము నాణ్యత లేనిదని గతంలో ప్రచారం చేశారని, ఇటీవల సెయిల్ ఎండీ కలిసినప్పుడు బయ్యారంలో ఉన్న ఇనుము నెం.1 అని చెప్పారని, రూ. 30 వేల కోట్ల వ్యయంతో అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారని చెప్పారు. కొత్తగూడెం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన రోజే ఆయన తెలంగాణలో జిల్లాల పునర్నిర్మాణంపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో చర్చించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కేంద్రంగా త్వరలో జిల్లా ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో త్వరలోనే మెడికల్ కళాశాల, కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరలోనే తాను ఖమ్మం వస్తానని చెప్పారు. సీఎం అయ్యాక ఆయన పలు జిల్లాల్లో పర్యటించినా, ఖమ్మం మాత్రం రాలేదు. ఖ మ్మంపై అసలు ఆయన ఎలాంటి చర్చ కూడా జరిపినట్టు కనిపించలేదు. కానీ, శుక్రవారం మాత్రం నవ్వుతూ తాను త్వరలోనే ఖమ్మం వస్తానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక పార్టీలో చేరిన తుమ్మలను రాజకీయ దురంధరుడన్న కేసీఆర్.. ఆయన నాయకత్వం లో జిల్లా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని చెప్పా రు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇప్పుడు పార్టీలోకి వస్తున్న వారందరూ సమన్వయంతో తుమ్మల నాయకత్వంలో పనిచేయాలని సూచించారు. దీంతో జిల్లాలో పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలను కేసీఆర్ తుమ్మ ల చేతిలో పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుమ్మల నాకు మంచి మిత్రుడు... తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు తనకు మంచి మిత్రుడని కేసీఆర్ అన్నారు. ‘తుమ్మల నాకు ఆప్తమిత్రుడు, చాలా సన్నిహితుడు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్నాం. ఇద్దరం 82లో పోటీ చేసి ఓడిపోయాం. కష్టాలు సుఖాలు చాలా పంచుకున్నాం. ఒత్తిళ్లకు లోనయ్యాం.’ అని వ్యాఖ్యానించారు. పార్టీలు వేరయినా తమ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు మాత్రం కొనసాగాయని చెప్పారు. పార్టీలోకి రావాలని ఎన్నికలకు ముందే ఆయనతో మాట్లాడానని, ప్రజలు నిన్నే ఆదరిస్తారు... అప్పుడు జాయిన్ అవుదాంలే అని తుమ్మల చెప్పారని, ఆయన మాట నిజమైంది కాబట్టి మళ్లీ పార్టీలోకి తానే ఆహ్వానించానని కేసీఆర్ చెప్పారు. దశాబ్దాలుగా రాజకీ యాల్లో ఉన్నా... మచ్చలేని నాయకుడిగా, వేలెత్తి చూపించలేని, నిప్పులాంటి వ్యక్తి నాగేశ్వరరావు అని ప్రశంసించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో అట్టహాసంగా జరిగిన తుమ్మల టీఆర్ఎస్లో చేరిక కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేత, ఎంపీ కె. కేశవరావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, కొత్తగూడెం, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్లాల్, కోరం కనకయ్య, పార్టీ నేతలు ఆర్జేసీ కృష్ణ, బాణోతు చంద్రావతి, బమ్మెర రామ్మూర్తి, పిడమర్తి రవి, తుమ్మలతో పాటు టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మువ్వా విజయ్బాబు, ఎగ్గిడి అంజయ్య, తెలుగు రైతు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, తెలుగు విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతనిప్పు కృష్ణచైతన్య, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ షేక్ మదార్సాహెబ్, బోడేపూడి రమేశ్బాబు, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
పడినప్పుడు కొనడానికి సిద్ధంగా ఉండండి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే 10 ఏళ్ళు మోడీ ప్రధానిగా ఉండటమే కాకుండా కీలకమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తారని మార్కెట్ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయంటోంది ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్. బుల్లిష్ సెంటిమెంట్ పటిష్టంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రతీ కరెక్షన్ను కొనుగోళ్లకు వినియోగించుకోమంటున్న ఎస్ఎంసీ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్లతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... మోడీ 100 రోజుల పాలనపై మార్కెట్ వర్గాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్ చాలా బుల్లిష్గా ఉంది. మన మార్కెట్పై దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అత్యంత నమ్మకంతో ఉన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం చేస్తుండటంపై మార్కెట్ వర్గాలు కొంత అసంతృప్తిగా ఉన్నాయి. ముఖ్యంగా రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్, సహజవాయువు ధరలు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాల్లో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోందన్న భావన ఉంది. అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినా డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ మొదలు కాలేదు. కానీ మోడీ బాడీ లాంగ్వేజ్ను బట్టి వచ్చే 10 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న ధీమాతో కీలక నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తంమీద మార్కెట్ వర్గాలు మాత్రం రానున్న కాలంలో సంస్కరణల వేగం పెరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ టాప్ 3 బుల్లిష్ సెంటిమెంట్స్లో ఇదొకటని కచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మార్కెట్లు జీవన కాల గరిష్ట స్థాయిల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ స్థాయిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? స్వల్ప, మధ్య కాలానికి సూచీల కదలికలు ఎలా ఉంటాయని అంచనా వేస్తున్నారు? ప్రస్తుతం విలువ పరంగా చూస్తే ఇండెక్స్లు అంత చౌకగా ఏమీ లేవు. సెన్సెక్స్ 18 -19 పీఈ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత బుల్న్ల్రో ఇండెక్స్లు 25 పీఈ వరకు కూడా వెళ్ళాయి. ఒక్కసారి వృద్ధిరేటు గాడిలో పడి కంపెనీల ఆదాయం పెరిగితే సూచీలు మరింత పైకి పరుగులు పెడతాయి. ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్నందున సూచీలు ఎంత వరకు వెళ్తాయి అని అంచనా వేయడం కష్టం. స్వల్పకాలానికి ఇండెక్స్లో 5-6 శాతం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. రానున్న కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎదుర్కొనే ప్రధానమైన రిస్క్ ఏది? కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం రావడంతో స్టాక్మార్కెట్లకు దేశీయంగా ఎటువంటి నష్టభయాలు లేవని చెప్పొచ్చు. రిస్క్ ఏదైనాఉందంటే అవి అంతర్జాతీయ పరిణామాలే. ఇరాక్, ఉక్రెయిన్, అమెరికాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేం. ప్రస్తుతం క్రూడ్ ధరలు తగ్గుతున్నా.. అంతర్జాతీయంగా ఏ మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినా తిరిగి పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి ఆయిల్ ధరలు పెరిగితే అది దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మీరిచ్చే సలహా? ఇప్పటికే చాలా షేర్లు కనిష్ట స్థాయిల నుంచి బాగా పెరిగిపోయాయి. ఈ ర్యాలీని మిస్ అయిన వాళ్లల్లో చాలామంది షేర్ల ధరలు 2011, 2012 స్థాయికి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. బుల్ సెంటిమెంట్ బాగా ఉన్న మార్కెట్లలో సూచీల్లో ప్రతీ పతనంలోనూ కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. కాబట్టి సూచీలు గరిష్టంగా 5 నుంచి 6 శాతానికి మించి పతనం కావు. కాని షేర్లు గరిష్ట స్థాయి నుంచి 20-30% పతనం అవుతాయి. ఇటువంటి సందర్భాలను కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చు. మార్కెట్లు పతనం అయ్యాక ఎందులో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించడం కంటే ముందుగానే మంచి షేర్లను ఎంపిక చేసుకొని కరెక్షన్ వచ్చినప్పుడల్లా కొనుగోలు చేయమని సూచిస్తాను. అప్పులు ఎక్కువగా ఉన్న కంపెనీలకు దూరంగా ఉండండి. ఏయే రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? పెరిగిన షేర్లు అందనంత ఎత్తుకు పెరగడం అనేది బుల్ మార్కెట్ లక్షణం. ఇటువంటి ఇఫోరియాలో వాల్యుయేషన్స్ను మార్కెట్ పట్టించుకోదు. ప్రస్తుతం ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు విలువ పరంగా ఖరీదుగా ఉన్నప్పటికీ ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. కానీ క్రమేపీ ఈ షేర్లలో పెట్టుబడులను తగ్గించుకోమని సూచిస్తాను. ప్రస్తుత మార్కెట్లో ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, మైనింగ్, కోల్, పవర్ రంగాల షేర్లు విలువ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ నియంత్రణ ఉన్న మైనింగ్, కోల్, పవర్ రంగాల్లో ప్రభుత్వం ఏ మాత్రం సంస్కరణలు చేపట్టినా ఈ రంగాల షేర్లు పరుగులు తీస్తాయి. ఇక పీఎస్యూ బ్యాంకుల కంటే మిడ్క్యాప్ ప్రైవేట్ బ్యాంక్లు మంచి ర్యాలీ చేస్తున్నాయి. వడ్డీరేట్లు, రూపాయి కదలికలపై అంచనాలు ఏమిటి? డిసెంబర్ చివరి వరకు వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వడ్డీరేట్లు తగ్గడం అనేది అమెరికా ఫెడరల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఫెడ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచే ఆలోచనలో ఉంది. అదే జరిగితే ఇక్కడ వడ్డీరేట్లు తగ్గడం అనేది కష్టం.అనూహ్యంగా ద్రవ్యోల్బణం బాగా తగ్గితే ఇక్కడ వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. రానున్న కాలంలో రూపాయితో డాలరు మారకం విలువ రూ. 59-61 శ్రేణిలో కదలవచ్చని అంచనా. -
మార్కెట్లకు సుప్రీం దెబ్బ
బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ అక్రమాలేనంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో మెటల్, పవర్ రంగ షేర్లు దెబ్బతిన్నాయి. 1993 మొదలు 2011 వరకూ ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలకు వివిధ ప్రభుత్వాలు కేటాయించిన బొగ్గు క్షేత్రాలలో ఎలాంటి పారదర్శకతా లేదని సుప్రీం పేర్కొంది. దీంతో తొలుత సరికొత్త రికార్డులను నమోదుచేసిన స్టాక్ మార్కెట్లు చివర్లో బలహీనపడ్డాయి. ఒక దశలో 211 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ 26,630ను అధిగమించింది. ఇది సరికొత్త రికార్డుకాగా, నిఫ్టీ సైతం చరిత్రలో తొలిసారి 7,968ని తాకింది. అయితే చివరి గంటలో అమ్మకాలు ఊపందుకుని నష్టాలలోకి మళ్లాయి. సెన్సెక్స్ 26,401 పాయింట్ల వద ్ద, నిఫ్టీ 7,898 వద్ద కనిష్టానికి చేరాయి. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 26,437 వద్ద నిలిచింది. నిఫ్టీ మాత్రం 7 పాయింట్ల నష్టంతో 7,906 వద్ద స్థిరపడింది. మెటల్, పవర్ షేర్లు డీలా! మెటల్ షేర్లలో జిందాల్ స్టీల్ 14% , హిందాల్కో 10% తగ్గాయి. భూషణ్ స్టీల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సెసాస్టెరిలైట్, హిందుస్తాన్ జింక్, సెయిల్ 5-2% మధ్య నీరసించాయి. దీంతో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 4.5%నష్టపోయింది. పవర్ షేర్లు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అదానీ పవర్, రిలయన్స్ పవర్, టాటా పవర్, ఎన్హెచ్పీసీ 5-3% మధ్య క్షీణించాయి. కాగా రియల్టీ షేర్లు శోభా, యూనిటెక్, హెచ్డీఐఎల్, డీబీ, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్ సైతం 4-2% మధ్య తిరోగమించాయి. అయితే సెన్సెక్స్ దిగ్గజాలలో టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, హెచ్యూఎల్, ఐటీసీ 2.5-1.5% మధ్య లాభపడ్డాయి. కాగా, డెట్ రేటింగ్ను ఇక్రా డౌన్గ్రేడ్ చేయడంతో జె ట్ ఎయిర్వేస్ షేరు 5% పతనమైంది. -
సిమెంట్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాలుగేళ్ల క్రితం సిమెంట్కు మంచి డిమాండ్ ఉంటుందని భావించి మా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 నుండి 40 శాతానికి పెంచాం. అంచనాలకు మించి డిమాండ్ ఉంటుందని భావించాం. అయితే నాలుగేళ్ల తర్వాత పరిస్థితిలో మేం ఆశించిన పురోగతి లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలగా విడిపోవడంతో ఆశించిన కొత్త ప్రాజెక్టులు రాలేదు. నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. మరికొన్ని ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో సిమెంట్ పరిశ్రమ మొత్తం ఒక సంక్షోభ వాతావరణంలో చిక్కుకుంది. ప్రభుత్వ సహకారం, సానుకూల వాతావరణం నెలకొంటే పరిశ్రమ మళ్లీ అభివృద్ధి బాట పడుతుంది’’ అని సాగర్ సిమెంట్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్ . ఆనంద్ రెడ్డి చెప్పారు. ఇటీవల భవన నిర్మాణ సంఘాలకు, సిమెంట్ ఉత్పత్తి దారులకు మధ్య నెలకొన్న వివాదం సమసిపోయినా, సిమంట్ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపధ్యంలో సాక్షి ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సవాళ్లను వివరించారు. సిమెంట్ బస్తా ధర బాగా పెరిగిపోతోంది. మీ కామెంట్? ధరలను పెంచటం ద్వారా ఉత్పత్తి దారులు లాభాలను మూటగట్టుకోవడం లేదు. మేం కేవలం నష్టాలను తగ్గించుకుంటున్నాం. సిమెంట్ తయారీలో స్థిర వ్యయాలు, చలన వ్యయాలు అని రెండు రకాలు. స్థిర వ్యయాలను అదుపు చేయలేం. అవి ఏ సంస్థ అయినా తప్పక భరించాలి. ఇక చలన వ్యయాల్లో ఏవీ మా చేతుల్లో లేవు. ఉదాహరణకు విద్యుత్, బొగ్గు, డీజల్, రవాణా చార్జీలు...ఇవన్నీ గత ఏడాది కాలంగా బాగా పెరిగాయి. డీజల్ ధర నెలనెలకూ పెరుగుతూనే ఉంది. ఒక టన్ను సిమెంట్ ఉత్పత్తి చేయాలంటే తయారీదారు రూ. 3,655 వెచ్చించాల్సి వస్తోంది. దీనికి అదనంగా రవాణా, ఎక్సైజ్ డ్యూటీ, విలువ ఆధార పన్నులు రూ. 3,050లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. దీంతో టన్ను సిమెంట్ ఉత్పత్తి చేయాలంటే రూ. 6,705లు వ్యయం అవుతోంది. అంటే సగటున 50 కిలోల బస్తా వెల రూ. 335 అవుతోంది. ఇది కేవలం లాభనష్టాల్లేని బ్రేక్ ఈవెన్ ధర. పూర్తిగా యంత్ర ఆధారిత పరిశ్రమ కావడంతో సామర్థ్య వినియోగం అభిలషణీయ స్థాయిలో లేకపోతే తరుగుదల, వడ్డీ, అడ్మినిస్ట్రేటివ్, మార్కెటింగ్ వ్యయాలు పరిమిత ఉత్పత్తిపై మరింత భారం మోపుతున్నాయి. రవాణా, ఇంధన వ్యయాలు గత రెండేళ్లలోనే 60-70 శాతం పెరిగాయి. ఒక్కో బస్తాపై ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ రూ. 40, విలువ ఆధారిత పన్ను రూ. 45 ఆదాయం అందుతోంది. ఇది బస్తా వ్యయంలో 28 శాతానికి సమానం. భవిష్యత్తులో ధరలు తగ్గే అవకాశం లేదా? సిమెంట్ ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవూ. ఏడాది పొడవునా సీజన్ను బట్టి ధరల్లో హెచ్చు తగ్గులు ఈ పరిశ్రమలో సర్వ సాధారణం. ఇప్పుడు ధరలు ఎందుకు పెంచామంటే కేవలం నష్టాలను పూడ్చుకోవాటానికి మాత్రమే అని నేను చెప్పగలను. ఈ ధరలు సప్లయ్-డిమాండ్ ఆధారంగా నిర్ణయింపబడతాయి కాబట్టి భవిష్యత్తులో సప్లయ్ అధికమైతే ధరలు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. పరిశ్రమ ప్రభుత్వం నుండి ఏం కోరుతోంది? తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు మేం చేసే విన్నపం ఒక్కటే... పరిశ్రమలకు విద్యుత్ నిరంతరాయంగా అందించండి.విద్యుత్తో పాటు డీజల్ ధరలను, బొగ్గుధరలను అదుపులో ఉంచండి. ప్రభుత్వానికి పన్నుల రూపేణ అధిక మొత్తాన్ని అందచేస్తున్న పరిశ్రమల్లో సిమెంట్ పరిశ్రమ ఒకటి. ఒక్కో కంపెనీ కనీసం 4 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వం చేపట్టే బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి అవసమరమైన సిమెంట్ను తక్కువ ధరలకే అందిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సిమెంట్ యూనిట్ గిట్టుబాటుగా ఉందా? సిమెంట్ యూనిట్ మనగలగాలి అంటే ఉత్పత్తి సామర్ధ్యంలో కనీసం 75 శాతం స్థాయిని అందుకోవాలి. ఉత్తర భారతదేశంలో సిమెంట్ యూనిట్లు ఉత్పత్తి సామర్ధ్యంలో 80-90 శాతం స్థాయిని వినియోగిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో ఈ స్థాయి 50-60 శాతం మధ్యనే ఉంటోంది. ద క్షిణ భారత దేశంలో ఇతర రాష్ట్రాలకు సిమెంట్ను సరఫరా చేస్తోంది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లోని యూనిట్లే. సో... యూనిట్ వయబుల్ కావాలంటే బస్తా ధర రూ. 330లుపైబడి నిర్ణయించాలి. విలీనాలు, కొనుగోళ్లు? కొత్త యూనిట్ పెట్టాలంటే కనీసం మూడున్నరేళ్లు సమయం కావాలి. దీంతో చాలా మంది రన్నింగ్లో ఉన్న యూనిట్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ రంగంలో కన్సాలిడేషన్ జరుగుతోంది. మైహోం సిమెంట్ సంస్థ జయజ్యోతి సిమెంట్ను కొనుగోలు చేసిన విషయం చూశాం. అలాగే చెట్టినాడు సిమెంట్ అంజనీ సిమెంట్ను కొనుగోలు చేసింది. కొంత మంది తమ యూనిట్లను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. కాబట్టి రోబోయే రోజుల్లో కొన్ని సంస్థల మధ్య విలీనాలు, కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. కొన్ని బహుళ జాతి సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నాయి. ఆయితే వారంతా టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలోనే సిమెంట్ చౌక... ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ తయారీ ధర కన్నా చౌక ధరకే లభిస్తోంది. సిమెంట్ బస్తా విక్రయ ధర తెలంగాణలో రూ. 300 ఉండగా ఆంధ్రప్రదేశ్ (వైజాగ్)లో రూ. 325, తమిళనాడు (చెన్నై)లో రూ. 365, కర్నాటక(బెంగుళూరు)లో రూ 374, మహారాష్ట్ర (పుణె)లో రూ. 375, ఒరిస్సా (భువనేశ్వర్)లో రూ. 340, కేరళ (కొచ్చి)లో రూ. 394 ధర పలుకుతోంది. -
రామగుండం ఎన్టీపీఎస్లో విద్యుత్ సంక్షోభం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీఎస్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. రామగుండంలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 6వ యూనిట్లో 500 మెగావాట్లు, 3వ యూనిట్లో 200 మెగావాట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా తడిబొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దాంతో 2600 మెగావాట్లకుగానూ 1286 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. -
సిమెంటుకు తయారీ మంట!
భారంగా విద్యుత్, బొగ్గు, రవాణా చార్జీలు - తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెంపు - ధర పెంచకపోతే ప్లాంట్ల మూసివేతే - రైల్వే చార్జీలతో మరోసారి పెంచాల్సివస్తోంది - ‘సాక్షి’తో సిమెంటు కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ వ్యయం అంతకంతకూ పెరుగుతుండడంతో సిమెంటు కంపెనీలకు పాలుపోవడం లేదు. ముడి పదార్థాలు, విద్యుత్, బొగ్గు, రవాణా వ్యయాలు, బ్యాంకు వడ్డీలు ఏడాదికేడాది భారంగా పరిణమిస్తున్నాయి. దీంతో సిమెంటు తయారీ వ్యయం అదే స్థాయిలో దూసుకెళ్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు ప్లాంట్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ధర పెంచకపోతే మరిన్ని ప్లాంట్ల మూసివేత తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ధర పెంచక తప్పలేదని పేర్కొంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు రైల్వే సరుకు రవాణా చార్జీలు తాజాగా 6.5 శాతం పెరిగాయి. పరిశ్రమకు మరింత భారం పడ్డట్టేనని, దీని ప్రభావంతో మరోసారి ధర పెంచక తప్పదని కంపెనీలు అంటున్నాయి. దూసుకెళ్తున్న వ్యయం.. సిమెంటు తయారీకి రూ.155-165, ఎక్సైజ్ పన్ను రూ.41, వ్యాట్ రూ.46, రవాణా రూ.55-80 కలుపుకుంటే మొత్తం వ్యయం ఒక్కో బస్తాకు రూ.297-332 అవుతోంది. దీనికి హ్యాండ్లింగ్ చార్జీలు, డీలర్/ఏజెంట్ కమిషన్ అదనం. భారీ పెట్టుబడితో కూడుకున్న రంగం కాబట్టి బస్తా అమ్మకం ధర రూ.300 లోపు ఉంటే కంపెనీలకు నష్టమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించి వేశాయి. అయితే స్థిర వ్యయాలైన తరుగుదల, వడ్డీ, పరిపాలన తదితర వ్యయాలు మిగిలిన ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో సిమెంటు ధర పెరిగేందుకు ఒక కారణమవుతోంది. మూడేళ్లలో విద్యుత్ చార్జీలు 70% దాకా పెరిగాయి. ఇక నాణ్యమైన బొగ్గు కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇండోనేసియా నుంచి దిగుమతైన బొగ్గు టన్నుకు నాలుగేళ్ల క్రితం రూ.4 వేలుంటే, నేడు రూ.5 వేలకు చేరుకుంది. దేశీయ బొగ్గు కొరత కారణంగా టన్నుకు రూ.3,750 నుంచి రూ.5,500లకు చేరిం ది. డీజిల్ లీటరుకు రూ.44 నుంచి రూ.61కి చేరింది. దీంతో సిమెంటు ధర కూడా హెచ్చించాల్సివస్తోందని కంపెనీలు వాపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల కంటే తక్కువే.. సమైక్య రాష్ట్రంలో గతేడాది జూలై ప్రాంతంలో సిమెంటు ధర బస్తాకు (50 కిలోలు) రకాన్నిబట్టి రూ.320 దాకా వెళ్లింది. అది కాస్తా తర్వాతి నెలల్లో రూ.200-235కు వచ్చి చేరింది. సిమెంటుకు గిరాకీ లేకపోవడమే ధర క్షీణతకు కారణం. 2014 మే నుంచి ధరల్లో పెరుగుదల వచ్చింది. సీమాంధ్ర, తెలంగాణలో ఒక దశలో బస్తా ధర రూ.340 దాకా వెళ్లినప్పటికీ తిరిగి రూ.300-325 మధ్య ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉత్తరాదితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఒక్కో బస్తాకు రూ.380 వరకు ధర ఉందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమిళనాడులో రూ.370-380, కేరళలో రూ.370, కర్ణాటకలో రూ.350 వరకు ఉందని పేర్కొన్నారు. అటు మహారాష్ట్రలోనూ ధరలు పెరిగాయి. ఈ రాష్ట్రాల కంటే ఇక్కడే ధర తక్కువగా ఉందని ఆయన తెలిపారు. తయారీ వ్యయాలు ఎగుస్తున్నందునే ధరల్ని వాటికి అనుగుణంగా స్థిరీకరణ చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాజాగా పెరిగిన రైల్వే సరుకు చార్జీల ప్రభావంతో సిమెంటు ధర ఒక్కో బస్తాకు రూ.10 వరకు పెరగనుందని పేర్కొన్నారు. 2014 జనవరి-మార్చి త్రైమాసికంలో చాలా కంపెనీలు నష్టాలను చవిచూడడాన్నిబట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితి అద్ధం పడుతుందని ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. అనిశ్చితి కారణంగా.. గత మూడేళ్లుగా సమైక్య రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. ఈ కారణంగా సిమెంటుకు ఆయువు పట్టు అయిన నిర్మాణ రంగం కుదేలైంది. రాజధాని నగరమైన హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులే దని చెప్పారు. అటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలూ ఏవీ జరగలేదు. దీంతో సిమెంటుకు గిరాకీ లేకుండా పోయిందని ఓ కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు. -
చార్జీల కూత
స్లీపర్, ఏసీ చార్జీల పెంపు 14.2 శాతం వాత ప్రయాణికులపై రూ.50 కోట్లు భారం వాల్తేరు డివిజన్కు రూ.500 కోట్లుఅదనపు ఆదాయం విశాఖపట్నం : రైలు ప్రయాణికులపై చార్జీల భారం పడింది. రైల్వే బడ్జెట్ ప్రకటించకమునుపే బీజేపీ ప్రభుత్వం ఊహించని రీతిలో 14.2 శాతం చార్జీలను వడ్డించింది. రైల్వేలో వసతులు మెరుగుపరుస్తామంటూ అదనపు భారం వేశారు. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. చార్జీల పెంపు వల్ల వాల్తేర్ డివిజన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల అదనపు భారం పడనుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఇనుము, పెట్రోలియం, ఫెర్టిలైజర్స్, ఆహార ధాన్యాల ఋఎగుమతుల రవాణా వల్ల కూడా వాల్తేరు డివిజన్పై అధిక భారం పడనుంది. కొత్తగా ఎలాంటి సరకు రవాణా పెరగకపోయినా గత ఏడాదిలాగే రవాణా జరిగితే అదనంగా రూ.450 కోట్ల ఆదాయం వాల్తేరు డివిజన్కు సమకూరనుంది. ప్రయాణికుల చార్జీలు పెంపు, సరకు రవాణా పెంపు వల్ల వాల్తేరు డివిజన్కు రూ.500 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు రైల్వే వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే వాల్తేరు రైల్వే ఆదాయం రూ.6265.28 కోట్లకు చేరింది. తాజా పెంపుతో రూ. 6765 కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. సమీపంలో ఇంత భారీ ఆదాయాన్ని ఆర్జించే రైల్వే డివిజన్లు లేవు. విజయవాడ రైల్వే డివిజన్ ఏటా రూ.3279 కోట్లు, గుంతకల్ రూ. 1300 కోట్లు, గుంటూరు రూ. 452 కోట్లు, సంబల్పూర్ రూ. 630 కోట్లు, కుర్దా డివిజన్ రూ. 3630 కోట్లు మాత్రమే ఆర్జిస్తున్నాయి. విశాఖ నుంచి రోజూ దాదాపు 90 రైళ్లలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచే రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్, విజయవాడ, భువనేశ్వర్, హౌరా, చెన్నై ప్రాంతాలకు ఎక్కువ మంది విశాఖ నుంచి బయల్దేరుతుంటారు. సికింద్రాబాద్కు ఎన్ని రైళ్లు వేసినా అవన్నీ నిత్యం రద్దీగానే నడుస్తుంటాయి. తాజాగా పెరిగిన రవా ణా చార్జీలతో నిత్యావసర ధరలు చుక్కలనంటే ప్రమాదం ఉందని సామాన్యులు భయపడుతున్నారు. ఆహార ధాన్యాలన్నీ రైళ్లలోనే రవాణా అవుతుం టాయి. పెట్రోలియం ఉత్పత్తులకు కూడా ఈ చార్జీల మోత తోడైతే రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. సౌకర్యాలేవీ...! : ప్రస్తుతం పెంచిన చార్జీల్లో 4.2 శాతం మౌలిక వసతుల కల్పనకేనని రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం సౌకర్యాలేవీ కనిపించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. టాయిలెట్లు నిత్యం కంపుకొడుతూనే ఉంటున్నాయని, నీళ్లు కూడా రాని పరిస్థితి ఉందని చె బుతున్నారు. ప్రయాణికుల నుంచి 4.2 శాతం అదనపు చార్జీలను వసూలు చేయడం సరికాదని రైల్వేపై నిప్పులు చెరుగుతున్నారు. వసతులు, సదుపాయాలు, పరిశుభ్రతకు పెద్దపీట వేయకుండా చార్జీలు పెంచడాన్ని రైల్వే వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. ఉపసంహరించుకోవాలి బీజేపీ ప్రభుత్వం రైల్వే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి. గత ప్రభుత్వంలా కాకుండా తమ హయాంలో అందరికీ మేలు చేకూరుతుందంటూ అధికారం చేపట్టిన నెలరోజులకే ప్రయాణికులపై భారం మోపడం శోచనీయం. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. -సీహెచ్. మైఖేల్, న్యాయవాది, అనకాపల్లి. సామాన్యులకు కష్టమే.. ప్రయాణ,రవాణా చార్జీలను రైల్వే పెంచడంతో పరోక్షం గా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉం ది. ఇప్పటికే పెరిగిన బస్సు చార్జీలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇక నుంచి రైలు ప్రయాణం కూడా కష్టమవుతుంది. -ఎ. పరమేశ్వరావు, ఉద్యోగి అనకాపల్లి. చార్జీల పెంపు దారుణం అధికారం ఉంది కదాని ప్రయాణికులపై ఇలా భారం మోపడం సరికాదు. ఏసీ ప్రయాణికులపై కాకుండా సాధారణ ప్రయాణికులు వెళ్లే స్లీపర్ క్లాస్పై వడ్డించడం బాధాకరం. పెంచిన ధరలు తగ్గించేందుకు బీజేపీ, టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి పోరాటాలు చేయాలి. - గుడివాడ అమరనాథ్, వైఎస్సార్సీపీ నేత -
8 కీలక పరిశ్రమలు ఓకే
ఏప్రిల్లో వృద్ధి 4.2 శాతం విద్యుత్, ఎరువులు, సిమెంట్ బెటర్ న్యూఢిల్లీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన 8 కీలక పరిశ్రమల గ్రూప్ ఏప్రిల్లో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2014 మార్చిలో ఈ రేటు 2.5 శాతంకాగా, 2013 ఏప్రిల్ నెలలో 3.7 శాతం. విద్యుత్, ఎరువులు, సిమెంట్, బొగ్గు రంగాలు మంచి ఫలితాలను ఇవ్వడం వృద్ధి కొంత మెరుగ్గా ఉండడానికి కారణమయ్యింది. ఇంకా ఈ గ్రూప్లో క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, స్టీల్ ఉన్నాయి. సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. వివిధ రంగాల పనితీరును 2013 ఏప్రిల్తో పోల్చిచూస్తే... బొగ్గు: వృద్ధి రేటు 1.2% నుంచి 3.3%కి ఎగసింది. ఎరువులు: ఈ రంగం క్షీణత నుంచి బైటపడింది. ఈ రంగం మైనస్ (-) 2.4 శాతం నుంచి 11.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. సిమెంట్: వృద్ధి 5.2% నుంచి 6.7 శాతానికి ఎగసింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 3.5 శాతం నుంచి 11.2 శాతానికి ఎగసింది. క్రూడ్ ఆయిల్: వృద్ధి క్షీణతలోనే ఉన్నా (-1.2 శాతం) ఇది కొంత తగ్గి మైనస్ (-) 0.1 శాతంగా ఉంది. సహజ వాయువులు: క్షీణత (-) 17.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: 6.2% వృద్ధి రేటు క్షీణతలోకి జారిపోయింది. ఈ రేటు -2.2%గా నమోదయ్యింది. ఉక్కు: వృద్ధి రేటు 10.1% నుంచి 3.1%కి పడింది. ఐఐపీ నిరుత్సాహమే: ఇక్రా అంచనా కోర్ ఇన్ఫ్రా పరిశ్రమల పనితీరు బాగున్నప్పటికీ, ఏప్రిల్ 2014 ఐఐపీ వృద్ధి మాత్రం ఒక శాతం లోపే ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. ఈ గణాంకాలు ఈ నెల రెండవ వారం చివర్లో రానున్నాయి. ఐఐపీ గణాంకాలు వరుసగా రెండవనెల మార్చిలో క్షీణ దిశలో ఉన్నాయి. మార్చిలో ఈ రేటు -0.5 శాతంగా నమోదయ్యింది. -
ఎన్టీపీసీ భారీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) భారీ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపైనా దృష్టిపెట్టింది. బొగ్గు లింకేజీ ఉన్న ప్లాంట్లనే కొంటామని, అందుకు తగినన్ని నిధులు ఉన్నాయని సంస్థ సీఎండీ అరూప్రాయ్ చౌదరి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే... సోలార్ ప్లాంట్ల గురించి.... 12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే అండమాన్లోని పోర్ట్బ్లెయిర్లో మొదటిసారిగా 5 మెగావాట్ల సోలార్ ప్లాంటును ప్రారంభించాం. ఉత్తరప్రదేశ్లోని దాద్రీ వద్ద మరో 5 మెగావాట్ల ప్లాంటును ప్రారంభించాం. అదేవిధంగా రామగుండంతో పాటు ఒడిశ్సాలోని తాల్చేరు, ఉత్తరప్రదేశ్లోని ఉంచాహార్లో చెరో 10 మెగావాట్లు, మధ్యప్రదేశ్లోని రాజ్ఘర్ వద్ద 50 మెగావాట్లు.. మొదలైనవి చేపడుతున్నాం. మొత్తంగా 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపై.... దేశంలో వివిధ దశల్లో ఉన్న ప్లాంట్ల కొనుగోలుపై దృష్టి పెడుతున్నాం. ఇందులో నిర్మాణం పూర్తై, నిర్మాణ దశలో ఉన్న వాటితో పాటు పాత విద్యుత్ ప్లాంట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. సుమారు 7 ప్లాంట్లపై దృష్టి సారించాం. ఇవన్నీ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లే. అయితే, ఏయే ప్లాంట్లు అన్న విషయాన్నీ ఇంకా ఈ సమయంలో బహిరంగపరచలేం. ఒక్కటి మాత్రం చెప్పగలను... బొగ్గు లింకేజీ ఉన్న ప్లాంట్లను మాత్రమే కొనుగోలు చేస్తాం. ఇందుకు నిధుల కొరత సమస్య కాదు. గ్యాస్ సమస్యలపై... కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో గ్యాస్ సరఫరా తగ్గడం అందరికీ తెలిసిందే. మా మొత్తం సామర్థ్యం 42,500 మెగావాట్లలో గ్యాస్ ఆధారిత ప్లాంట్ల సామర్థ్యం 10%. గ్యాస్ కొరతతో వివిధ ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. కేవలం 8.47% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో నడుస్తున్నాయి. గ్యాస్ కొరతను తీర్చుకునేందుకు బిడ్డింగ్లో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తాం. సొంతంగా గ్యాస్ బ్లాకులు ఉంటే ఎంతో ఉపయోగం. గ్యాస్ బ్లాకులను దక్కించుకునేందుకు నూతన అన్వేషణ విధానం(నెల్ప్) బిడ్డింగ్లో పాల్గొనే అంశాన్నీ పరిశీలిస్తున్నాం. గ్యాస్ ధర పెరుగుదలతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది. అలాంటి సమయంలో గ్యాస్ ఆధారిత విద్యు త్ చార్జీలను వినియోగదారులు భరిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. సొంత బొగ్గు గనుల గురించి... ప్రస్తుతం మేం 50 మిలియన్ టన్నుల నుంచి 60 మిలియన్ టన్నుల మేరకు విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ బొగ్గుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటాం. సొంతంగా బొగ్గు గనులను అభివృద్ధి చేస్తున్నాం. జార్ఖండ్లో మాకు దక్కిన గనిలో బొగ్గు వెలికితీతకు అంతా సిద్ధంగా ఉంది. అయితే, స్థానిక సమస్యల కారణంగా బొగ్గును వెలికితీయలేకపోతున్నాం. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందితే అది సాధ్యమవుతుంది. దీనిపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల విస్తరణపై.... ఆంధ్రప్రదేశ్లో వివిధ విద్యుత్ ప్లాంట్ల విస్తరణ చేపట్టాలని నిర్ణయించాం. కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 660 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఇందుకు మాకు అవసరమైన భూమి, నీరు ఉన్నాయి. అయితే, బొగ్గు సరఫరా ప్రధాన సమస్య. బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి ముందుకు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా వెంటనే చేపడతాం. విశాఖపట్నం సమీపంలో పూడిమడక వద్ద 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్లాంటుకు బొగ్గు సరఫరా లేదు. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని ప్లాంటును నడిపేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన మూడు రాష్ట్రాలూ ఒప్పుకున్నాయి. భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్ జారీచేస్తాం. భూసేకరణ చేపట్టి ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. -
ఒక ఐడియా వంట ఖర్చు తగ్గించింది
బెజ్జూర్, న్యూస్లైన్ : వంటగ్యాస్ ధరలు విపరీంతగా పెరగడంతోపాటు వంటచెరుకు పెరుగున్న తరుణంలో సామాన్యుడు వంట చేసుకోవడానికి నెలకు కనీసం రూ.500 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏదైనా పరిష్కారం కనుగొనాలనే తలంపుతో మండలంలోని మర్థిడి గ్రామానికి చెందిన జుమిడే ఆనంద్ కేవలం రూ.100 ఖర్చుతో మట్టిపొయ్యిని తయారు చేసి పిడుకెడు బొగ్గుతో వంట పూర్తి చేయడానికి ప్రయోగం చేశాడు. అందుకుగాను తన వద్ద ఉన్న ఫెవిస్టిక్, ఇనుప డబ్బా, 3 వాట్స్తో తిరిగే మోటార్, ఎంసిల్, రంధ్రాలతో కూడిన రేకుతో ప్రయోగం చేశాడు. మట్టిపొయ్యికి ఒక వైపులా రేకు డబ్బాను అమర్చి డబ్బాకు రెండువైపుల రంధ్రాలు చేశాడు. ఒక వైపు మోటార్ను బిగించడంతోపాటు మరోవైపు పొయ్యి లోపలిభాగంలో గాలి వచ్చేలా ఏర్పాటు చేశాడు. పొయ్యిపై రంధ్రాలు చేసిన రేకు ఉంచాడు. సెల్బ్యాటరీ సహాయంతో మోటార్ తిరిగేలా కనెక్ష న్ ఇచ్చాడు. గాలి కోసం ఫ్యాన్ను మోటార్కు బిగించాడు. దీం తో బ్యాటరీ సాయంతో మోటార్ తిరుగుతుంది. అందులోని ఫ్యాన్ తిరగడంతో చిన్నపాటి గాలితో రంధ్రాల రేకుపై ఉన్న బొగ్గులు గ్యాస్ మాదిరిగా మండుతుంది. ఎలాంటి కాలుష్యం లేకుండా పొగచూరకుండా గ్యాస్ కన్నా రెండు నిమిషాలు ముందుగానే వంట పూర్తవుతుంది. దీని కి కావాల్సింది రోజూ పిడికెడు బొగ్గులు మాత్రమే. ఎలాంటి ఖర్చు లేకుండా వం ట పూర్తి చేయడానికి తయారు చేశాడు. -
కోల్గొట్టారు!
మంచిర్యాల సిటీ, న్యూస్లైన్: సింగరేణి సంస్థ దళారులకు అక్షయపాత్రగా మారింది. అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు దళారులతో కుమ్మక్కై సింగరేణి సామగ్రిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కార్మికులు చెమటోడ్చి కూడబెట్టిన ఆస్తులను చుక్క చెమట పడకుండా దళారులు దోచుకుంటున్నారు. సింగరేణి నుంచి ఏడాదికి రూ.100 కోట్ల కుపైగా బొగ్గు అక్రమంగా చేతులు మారుతోంది. బొగ్గుతోపాటు ఇనుము, రాగి, బెల్టు కూడా ఏడాది కి రూ.5 కోట్ల వరకు అక్రమంగా అమ్ముకొని దళారు లు సొమ్ము చేసుకుంటున్నారు. సంస్థ ఆస్తులు రక్షించేవారు ఉన్నతాధికారుల కనుసన్నల్లో నడుచుకుంటూ ఉండటంతో సింగరేణి సామగ్రి యథేచ్ఛగా తరలుతున్నాయి. ‘బొగ్గ’వుతున్న ఆస్తులు దేశంలోని వివిధ భారీ పరిశ్రమలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. టెండర్లు నిర్వహించి విక్రయాలు జరుపుతోంది. స్థానిక డీలర్లు టెండర్లు దక్కించుకుని పరిశ్రమలకు గూడ్స్ వ్యాగన్ల ద్వారా బొగ్గును సరఫరా చేస్తారు. ఒక గూడ్స్ రైలులో 59 వ్యాగన్లు ఉంటాయి. దీనిని ఒక ర్యాకు అంటారు. ఒక వ్యాగనులో 80 టన్నుల బొగ్గును నింపాలి. వ్యాగనుకు 15 టన్నుల బొగ్గును తక్కువగా నింపి వే బిల్లు మాత్రం 80 టన్నులు నింపినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం నింపితే ఒక ర్యాకులో 4,720 టన్నులు వెళ్లాలి. 15 టన్నులు తక్కువగా నింపితే ఒక ర్యాకులో 885 టన్నుల బొగ్గు తక్కువగా వెలుతుంది. ఈ విధంగా మిగిలించుకున్న బొగ్గును ఒక ర్యాకుకు సరిపడా తయారు చేసుకుని ఇతర పరిశ్రమలకు టన్నుకు రూ.3,500 చొప్పున రూ.1,65,20,000 అమ్ముకుంటారు. నెలలో ఐదు ర్యాకుల చొప్పున ఏడాదికి 60 ర్యాకుల బొగ్గును అమ్మితే రూ.100 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. కాసులుకురిపిస్తున్న ‘రాగి’ సింగరేణిలోని భారీ యంత్రాలకు కేబుళ్ల ద్వారా విద్యుత్తు సరఫరా అవుతోంది. ఈ కేబుళ్లు అధిక బరువు ఉండటంతోపాటు నాణ్యతగల రాగితో తయారవుతాయి. రాగికి బాగా డిమాండ్ ఉంటుంది. రెండు ఫీట్ల పొడవు కేబుల్లో కిలోపైగా రాగి ఉంటుంది. సెలవు రోజుల్లో, యంత్రాలు మరమ్మతు కోసం ఆగినపుడు, విరామ సమయంలో, గనుల ఆవరణలో ఉన్న కేబుల్ను దొంగలు ఎత్తుకెళ్లి కాల్చివేస్తారు. దీంతో కేబుల్లో ఉన్న రాగి బయటకు వస్తుంది. ఈ రాగిని దొంగలు కిలో రూ.250 చొప్పున దళారులకు అమ్ముతారు. దళారులు హైదరాబాద్లోని బాలానగర్లో కిలో రూ.500 అమ్ముకుంటారు. కరిగించని రాగిని మాత్రమే రశీదు లేకుండా బాలానగర్లో కొంటారు. దళారులు కనీసం నెలలో పదిహేను సార్లు అయినా హైదరాబాద్లో అమ్ముతారు. ఈ విధంగా నెలకు పది క్వింటాళ్ల రాగి అమ్ముతారు. పది క్వింటాళ్లకు కిలో రూ.500 చొప్పున అమ్మితే రూ.5 లక్షలు అవుతాయి. దొంగలకు ఇవ్వగా దళారులకు రూ.2.50 లక్షలు మిగులుతాయి. ఏడాదికి దళారులు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారు. వరంగా మారిన ‘బెల్టు’ భూగర్భ గనులతోపాటు ఓసీపీలలో బొగ్గును బంకర్లలోకి తరలించడానికి బెల్టును ఉపయోగిస్తారు. బెల్టు ఒక ఇంచు మందంతోపాటు రెండున్నర ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఈ బెల్టును దొంగిలించడానికి గోదావరిఖనికి చెందిన ముఠా ఒకటి ఉంది. ఈ ముఠా దొరికి కేసులు గనుక అయితే దళారులే వారిని విడిపించేంత వరకు ఖర్చులు భరిస్తారు. దొంగల వద్ద దళారులు ఒక ఫీటు బెల్టును రూ.250 కొంటారు. ఈ బెల్టును దళారులు తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులోని బియ్యం మిల్లుల యజమానులకు ఒక ఫీటుకు రూ.1000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బెల్టు సైజులుగా కత్తిరించి ట్రాన్సుపోర్టులో గోనె సంచుల ద్వారా పాలకొల్లుకు తరలిస్తారు. కొనుగోలు చేసిన వారు దళారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ట్రాన్సుపోర్టు వారికి రూ.1000 ఇస్తే పాలకొల్లుకు బెల్టు వెలుతుంది. దళారులు నెలకు రూ.10 లక్షలు, ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో వారు కూడా మామూలుగానే తీసుకుంటున్నారు. లక్షణంగా ఇనుము చోరీ బొగ్గు ఉత్పత్తికి ఉపయోగించే ఇనుప సామగ్రిని దొంగలకు కాసులు కురిపిస్తోంది. దొంగలు తస్కరించిన ఇనుమును బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెం ప్రాంతాల్లో కొందరు వ్యాపారస్తులు ఒక కిలోకు రూ.10 చొప్పున కొంటారు. కొనుగోలు చేసిన ఇనుమును హైదరాబాద్లో కిలోకు రూ.15 చొప్పున అమ్ముకుంటారు. నెలకు ఈ ప్రాంతాల నుంచి పది లారీల ఇనుము తరలుతోంది. ఏడాదికి రూ.18 లక్షల ఇనుప సామగ్రి దొంగలపాలవుతోంది. ఆస్తుల రక్షణలో అధికారులు విఫలం సింగరేణి ఆస్తులు కాపాడటానికి ఎస్అండ్పీసీ సిబ్బంది సుమారు 2వేల మంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది 800 మంది ఉన్నారు. ఎస్అండ్పీసీ సిబ్బందికి నెలకు సుమారు రూ.6 కోట్లు, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సుమారు రూ.2.50 కోట్లు సింగరేణి వేతనాల రూపంలో చెల్లిస్తోంది. అయినప్పటికీ చోరీలు ఆగడం లేదు. ఇప్పటికైన సింగరేణి రూ.కోట్ల ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది. -
గూడ్స్ రైలులో మంటలు
బొగ్గుతో వెళ్తుండగా ప్రమాదం యలమంచిలి స్టేషన్లో గుర్తించిన గార్డు మూడు గంటలు శ్రమించి అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది యలమంచిలి, న్యూస్లైన్: బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు రేగడంతో సిబ్బంది సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించారు. యలమంచిలి రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో గూడ్స్ రైలులో మొదటిబోగీ నుంచి మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుంచి కొండపల్లి బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు సిగ్నల్ లేకపోవడంతో యలమంచిలి రైల్వేస్టేషన్ లో నిలిపారు. ఆ సమయంలో బోగీనుంచి పొగలు వస్తున్నట్టు గార్డు ఏ.ఆడమ్ గుర్తించారు. వెంటనే స్టేషన్ సూపరింటెండెంట్కు తెలిపారు. ఆయన ద్వారా సమాచారం అందుకున్న యలమంచిలి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి రైలు బోగీలో మంటలను అదుపు చేశారు. సుమారు 3 గంటలపాటు మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది గునపాలతో బొగ్గును పైకి తీస్తూ పెద్దయెత్తున నీటిని వినియోగించారు. రైలు ప్రయాణంలో బొగ్గు రాపిడి వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని రైల్వేశాఖ సిబ్బంది తెలిపారు. అయితే ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదు. -
బతుకు బొగ్గు
అక్కడి ప్రజల బతుకులు దుమ్ము, ధూళితో పెనవేసుకుపోయాయి. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. ఏళ్ల తరబడి నుంచి రాకాసి దుమ్ము, ధూళీని మింగుతూనే ఉన్నారు. పాలుతాగే పసిగుడ్డు నుంచి మొదలుకొని కాటికి కాలుజాచిన ముసలి వరకు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. పంట పొలాలు పనికిరాకుండా పోతున్నాయి. మామిడి చెట్లు మసిబారుతున్నాయి. వాయు కాలుష్యంతో ఏటా కాపు పడిపోతోంది. చెట్ల ఆకులు పచ్చని రంగు కోల్పోయి నలుపుదనాన్ని సంతరించుకుంటున్నాయి. రాకాసి బొగ్గు దుమ్ము జల, వాయుకాలుష్యాన్ని వెదజల్లుతోంది. రోజు వందలాది టిప్పర్లు, లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది. దుమ్ము, ధూళీని భరించలేక ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. వీటన్నింటికీ కారణం ‘కిల్’ యార్డులు.. అవేనండీ కోల్యార్డులు. జన ఆవాసం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన కోల్యార్డులు ప్రజల మధ్యే విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. కాలుష్య నియంత్రణ మండలి ఏనాడూ పట్టించుకున్నది లేదు. ప్రజాభిప్రాయం సేకరించిందీ లేదు. కోల్యార్డులు మాత్రం ఏర్పాటవుతూనే ఉన్నాయి. బొగ్గు దుమ్ముతో తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వే కాలనీ, స్టేషన్ కాలనీ, వేణునగర్, బోయపల్లి బోర్డు మార్గాన రోజూ రాకపోకలు సాగించే కాసిపేట, ద్వారకాపూర్, చంద్రపల్లి గ్రామాల ప్రజలు పడుతున్న వేదనపై ‘న్యూస్లైన్’ ప్రత్యేక కథనం. - న్యూస్లైన్, బెల్లంపల్లి/తాండూర్ వ్యాధుల బారిన ప్రజలు.. దుమ్ము ప్రభావంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. విషపూరితమైన బొగ్గు దుమ్మును పీల్చి ప్రజలు ప్రాణాంతకమైన వ్యాధులకు గురవుతున్నారు. శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనవుతున్నారు. చర్మవ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు వదలడం లేదు. ప్రాణాలను పణంగా పెట్టి జీవించాల్సి వస్తోంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా అనారోగ్యం పాలవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కోల్యార్డులు.. ప్రభుత్వ నిబంధనలకు విరుద ్ధంగా కోల్యార్డులు ఏర్పాటయ్యాయి. సుమారు 20 ఎకరాల్లో కోల్యార్డులు విస్తరించాయి. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో ఇవి ఏర్పాటయ్యాయి. అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చేయరాదనే నిబంధనలు ఉన్నా అవేమి పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు ఈ విషయాలను ‘మామూలు’గానే తీసుకుంటున్నారు. ద్వారకాపూర్, బోయపల్లి, కాసిపేట గ్రామాల ప్రజలకు సర్వే నం.612, 37లలో దశాబ్ద కాలం క్రితమే ప్రభుత్వం నిరుపేదలకు భూ పంపిణీ చేసింది. ప్రస్తుతం ఆ సర్వే నంబర్ల భూముల్లోనే కోల్యార్డులు ఏర్పాటయ్యాయి. కొంత మంది యజమానులు అసైన్డ్ భూములను కొనుగోలు చేసి కోల్యార్డుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని ప్రభుత్వం ఓ పక్క చెబుతున్నా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన కోల్యార్డులను ఎత్తివేయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. నిస్సారంగా మామిడి తోటలు.. కోల్యార్డులను ఆనుకుని ఉన్న మామిడి తోటలు నిస్సారంగా త యారయ్యాయి. మామిడి చెట్లు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. ఆ కుల రంగు మారి, విపరీతమైన దుమ్ము, ధూళి పేరుకుపోతోంది. చి గురు రాక పూత పడిపోతోంది. ఆ ప్రభావం మామిడి కాపుపై పడుతోంది. మామిడి పంటలను ఆధారంగా కుటుంబాలను పోషించుకుంటున్న రైతులు కోల్యార్డుల మూలంగా నష్టాలపాలై దిక్కులేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పంటలు కోల్పోతున్న రైతులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం, కోల్యార్డుల నిర్వాహకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. టిప్పర్ల మాటున దుమ్ము రాకాసి.. కోల్యార్డుల మీదుగా వెళ్లే ప్రధాన రహదారులు దుమ్ము, ధూళికి నిలయంగా మారాయి. కోల్యార్డుల పక్క నుంచి చంద్రపల్లి, ద్వారకాపూర్, కాసిపేట గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడి దుమ్ము పట్టి అధ్వానంగా తయారైంది. బొగ్గు టిప్పర్లు, లారీలు ఆ మార్గాన రోజూ వందలాదిగా రాకపోకలు సాగిస్తుండటంతో దుమ్ము పైకి లేస్తోంది. కాలినడకన వెళ్లే వారు, సమీపంలోని ప్రజలు ఆ ధాటి కి విలవిల్లాడుతున్నారు. ప్రధాన రహదారిపై వాహనచోదకులు ఎదురుగా వాహనాలను గుర్తించక ప్రమాదాల బారిన పడుతున్నారు. దుమ్ము, ధూళిలోనే రైల్వేస్టేషన్.. బోయపల్లి బోర్డు, రైల్వేస్టేషన్ సమీపంలో దశాబ్ద కాలం క్రితం ఓ కోల్యార్డు ఏర్పాటు చేశారు. దాంతో విపరీతమైన దుమ్ము, ధూళి వచ్చి ప్రజలు భరించలేకపోయారు. ఎప్పుడు ఎత్తివేస్తారా అని ఎదురుచూశారు. ఎన్నోమార్లు ఆందోళనలు చేశారు. ఆ ఒక్క కోల్యార్డు తర్వాత వరుసగా ఐదు ఏర్పాటయ్యాయి. పక్కపక్కనే వీటిని ప్రారంభించడంతో ఇంకేముంది భరించలేని దుమ్ము, ధూళి అక్కడి వారిని వేధిస్తోంది. రేచిని రైల్వేస్టేషన్కు రోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రాష్ట్రీయ ప్రధాన రహదారికి 100 మీటర్ల దూరంలో రైల్వేస్టేషన్ ఉంది. రైల్వేస్టేషన్కు వెళ్లే ప్రధాన రహదారికి ఇరుపక్కల ఎత్తై బొగ్గు కుప్పలు ఉన్నాయి. ఆ కుప్పలను దాటుకొని వెళ్తేనే రైల్వేస్టేషన్కు చేరుకోగలరు. నేరుగా వెళ్లేందుకు వీలు లేక పలువురు బొగ్గు లోడ్ను తీసుకెళ్లే రైల్వే వ్యాగన్ల కింద నుంచి దూరి పట్టాలు దాటి ప్లాట్ఫాంపైకి చేరుకుంటున్నారు. అన్నీ ఇబ్బందులు ఒక ఎత్తై.. ప్రధాన రహదారి నుంచి రైల్వేస్టేషన్కు చేరుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గానికి ఇరువైపుల ఉన్న బొగ్గు కుప్పల నుంచి విపరీతమైన దుమ్ము, ధూళి వస్తుంటుంది. మహిళలు చీరకొంగును, పురుషులు దస్తీని ముక్కుకు అడ్డంగా పెట్టుకున్నా రైల్వేస్టేషన్కు చేరుకోలేని పరిస్థితి. కొంత మంది ప్రయాణికులు ఆ బాధలు తట్టుకోలేక రైళ్ల కోసం 12 కిలోమీటర్ల దూరంలోని బెల్లంపల్లికి రైల్వేస్టేషన్కు తరలుతున్నారు. బీళ్లుగా పంట పొలాలు.. కోల్యార్డుల ఏర్పాటుతో పంట పొలాలు నిస్సారంగా తయారయ్యాయి. విపరీతమైన దుమ్ము పొలాలపై పడుతుండటంతో సేద్యానికి పనికిరాకుండా పోతున్నాయి. కోల్యార్డుల పక్కన ఉన్న పంట పొలాలు 100 ఎకరాల వరకు ఖాళీగా మారాయి. ఇదివరలో వీటిలో ఖరీఫ్ సీజన్లో ఏటా వరి, పత్తి సాగు చేసేవారు. కొద్ది మంది రైతులు పంటల సాగు చేస్తున్నా దుమ్ముతో భూసారం దెబ్బతిని దిగుబడులు రాకుండాపోతున్నాయి. ఫలితంగా రైతులు సాగుపై ఆసక్తి చూపడంలేదు. కోల్యార్డుల పుణ్యమా అని ఎటుచూసినా భూములు బీడుపోయి కనిపిస్తున్నాయి. కొద్దోగొప్పో సాగువుతున్న పంటలపైనా దుమ్ము ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. రైల్వే క్వార్టర్లను నింపుతున్న దుమ్ము రైల్వే క్వార్టర్లకు చేరువలో కోల్యార్డులు ఏర్పాటు చేయడంతో దుమ్ము ఎగసిపడుతోంది. ఎంత సేపు ఊడ్చినా దుమ్ము ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రేచిని రైల్వేస్టేషన్కు అనుబంధంగా ఉద్యోగులు, సిబ్బంది కోసం 35 క్వార్టర్లను నిర్మించారు. దశాబ్ద కాలం వరకు ఆ క్వార్టర్లు సిబ్బందితో కళకళలాడాయి. కోల్యార్డులు ఎప్పుడు ఏర్పాటయ్యాయో అప్పటి నుంచి క్వార్టర్లలో నివాసం ఉంటున్న సిబ్బందికి యాతన మొదలైంది. బొగ్గు దుమ్ము, ధూళిని భరించలేక అనేక మంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం పది క్వార్టర్లలోనే నివాసం ఉంటున్నారు. దీంతో రైల్వే క్వార్టర్లు ఖాళీగా మారి జనసందడి లేకుండాపోయింది. ప్రస్తుతం నివాసం ఉన్న సిబ్బంది దుమ్ము బాధను తట్టుకోలేక ఇళ్ల ఎదుట తలుపులు, కిటికీలకు అడ్డంగా టార్పాలిన్ కవర్లు కప్పుకొని జీవిస్తున్నారు. అయినా వారిని వీడడం లేదు. బాధిత గ్రామాలు కోల్యార్డులకు అనుబంధంగా రైల్వేస్టేషన్ కాలనీ, స్టేషన్ కాలనీ, బోయపల్లిబోర్డు, వేణునగర్ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 230 వరకు ఇళ్లు ఉండగా 1100లకు పైబడి జనాభా నివసిస్తోంది. బొగ్గు దుమ్ము, ధూళి మధ్యనే జీవనం సాగిస్తున్నారు. నిత్యం ధట్టంగా దుమ్ము వ్యాపిస్తుండటంతో ఇళ్లలోని నీరు కలుషితమవుతోంది. గత్యంతరం లేక ప్రజలు ఆ నీటినే తాగి అనారోగ్యం పాలవుతున్నారు. వీరితోపాటు రాష్ట్రీయ ప్రధాన రహదారిపై వెళ్లే ప్రయాణికులు, సమీప గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్రమైన వాయు, శబ్ద కాలుష్యం బారిన పడుతున్నారు. నీళ్లు కలుషితమైతన్నయ్.. నీళ్లతోనే మస్తు రోగాలత్తయని సర్కారు ఒక దిక్కు ప్రచారం జేత్తంది. గట్లాంటిది మా బాధ మాత్రం పట్టించుకుంటలేదు. కోల్యార్డుల నుంచి దుమ్ము, ధూళి ఇళ్లలచ్చి జేరుతంది. గట్లజేయబట్టి మంచినీళ్లు సుత కలుషితమైతన్నయ్. నీళ్లుదాగి ఆరోగ్యాన్ని కరాబ్ చేసుకుంటన్నం. - బేల్మతి, స్టేషన్కాలనీ ఇండ్లల్ల ఉండేటట్టు లేదు.. బొగ్గు దుమ్ము, ధూళితో వేగలేకపోతన్నం. ఇండ్లల్ల ఉండుడు కట్టమనిపిత్తంది. ఇంతకుముదుగాల ఎందరికో చెప్పుకున్నం మా బాధ. కోల్యార్డులను తీసేయాలని చెప్పిన చేస్తం, చూస్తం అన్నలు గని ఎవ్వలు పట్టించుకుంటలేరు. ఎక్కడికైనా పోతనే మంచిగుంటదేమో. - సునాని తులసమ్మ, స్టేషన్కాలనీ రోగాలత్తన్నయ్.. కోల్యార్డులల్ల అచ్చే దుమ్ము, ధూళితో రోగాలత్తన్నయ్. పొల్లగాళ్లకు చర్మవ్యాధులు సోకుతాన్నయ్. పడుసోళ్లు, ముసులోళ్లకు దగ్గు, దమ్ము అత్తంది. ఆస్పత్రికి పోతే మంచిగాలి పీల్చాలని చెప్తండ్లు. మేమెక్కడికి అని పోకట. కోల్యార్డులు లేకుండా జేసి మా పాణాలు గాపాడాలే. - అవారి సత్తమ్మ, స్టేషన్కాలనీ పొలాలు పండుతలేవు దుమ్ము, ధూళి జేబట్టి పంట పొలాలు సుత పండుతలేవు. రెండు, మూడేళ్ల నుంచి వరి, పత్తి పండిస్తలేం. దుమ్ము పొలాలల్ల ఎగబారిపోతంది. పత్తిచేళ్లన్నీ దుమ్ముతో నల్లబడిపోతన్నయ్. గిట్ల దుమ్ము అత్తే ఏ పంటలు పండుతయ్. పంటలు లేక ఇబ్బంది పడుతున్నం. - దుంపల తిరుపతమ్మ, వేణునగర్ -
ఎన్సీసీ-సెంబ్కార్ప్ డీల్కు బొగ్గే అడ్డంకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్సీసీ పవర్ ప్రాజెక్ట్స్లో సింగపూర్కి చెందిన సెంబ్కార్ప్ వాటా కొనుగోలుకు బొగ్గు సరఫరా ఒప్పందం ప్రధాన అడ్డంకిగా తయారయ్యింది. ఈ థర్మల్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సరఫరా చేయడానికి ప్రభుత్వం ఎన్సీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ వాటాను సెంబ్కార్ప్ కొంటే బొగ్గు సరఫరాకు సంబంధించి న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉండటంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆలస్యం జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు చెప్పారు. దీనిపై శుక్రవారం ఇరు కంపెనీల ప్రతినిధులు సమావేశం అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన గాయత్రీ గ్రూపునకు 45 శాతం వాటా ఉండటంతో బొగ్గు సరఫరా అనేది ఒప్పందానికి పెద్ద అడ్డంకి కాబోదని ఎన్సీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ న్యాయపరమైన సమస్యను సులభంగా పరిష్కరించుకోగలమన్న ధీమా ఎన్సీసీలో కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 1,320 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్సీసీ, గాయత్రీ గ్రూపులు సంయుక్తంగా ఎన్సీసీ పవర్ పేరుతో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో 55 శాతం వాటా ఉన్న ఎన్సీసీ ఇప్పటి వరకు రూ.460 కోట్లు వ్యయం చేయగా, ఇంతే మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాటాను కొనుగోలు చేయడానికి సెంబ్కార్ప్ ముందుకొచ్చినట్లు సమాచారం. 2015కి అందుబాటులోకి వచ్చే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన పెట్టుబడులను సెంబ్కార్ప్ సమకూరుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో ఈ ఒప్పందానికి గురించి తుది నిర్ణయం తీసుకుంటారని, జనవరి రెండో వారంలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.