గొల్లప్రోలు (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం పెందుర్తి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పెద్ద ట్రాలీ లారీ బోల్తాపడింది. ట్రాలీ రహదారికి అడ్డంగా పడడంతో కిలోమేటర్లమేర వాహనాలు ఆగిపోయాయి. పోలీసులకు సమాచారం అందించినా ఉదయం ఏడుగంటల వరకూ వారు రాకపోవడంతో వాహనాలు ముందుకు కదలలేకపోయాయి. క్రేన్ తెప్పిస్తే తప్ప ట్రాలీని రోడ్డుపై నుంచి తొలగించడం సాధ్యం కాదు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.