
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం 48 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తీవ్ర వాయుగుండం మూడు రోజుల పాటు ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అల్పపీడనం ప్రభావం కోస్తాంధ్రపై ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కార్యాలయం (సీఎంఓ) అధికారులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment