
సాక్షి, అమరావతి: హోంగార్డులకు బీమా సౌకర్యం కల్పించేందుకు యాక్సిస్ బ్యాంక్ ముందుకు రావడం చాలా సంతోషకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 15వేల మంది హోంగార్డులు, 72వేల మంది పోలీసులకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రమాదంలో మరణించిన హోంగార్డులకు రూ.40 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. పూర్తిగా అంగ వైకల్యం కలిగితే రూ.30 లక్షలు బీమా వర్తిస్తుందని చెప్పారు. పోలీసుల ఆరోగ్య భద్రతలో హోంగార్డులను కూడా భాగస్వాములను చేసేందుకు ఆలోచన చేస్తామని డీజీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment