
పశ్చిమగోదావరి వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కొత్తపల్లి
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్తపల్లి సుబ్బారాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం పార్టీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన ఆళ్లనానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడిగా నియమించారు.