కార్పోరేషన్ అధికారులపై మండిపడ్డ నారాయణ | Minister P. Narayana takes on Nellore municipal corporation officials | Sakshi
Sakshi News home page

కార్పోరేషన్ అధికారులపై మండిపడ్డ నారాయణ

Aug 3 2014 9:44 AM | Updated on Mar 23 2019 8:59 PM

కార్పోరేషన్ అధికారులపై మండిపడ్డ నారాయణ - Sakshi

కార్పోరేషన్ అధికారులపై మండిపడ్డ నారాయణ

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలటీల ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని మున్సిపల్, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు.

నెల్లూరు: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలటీల ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని మున్సిపల్, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం అందించే ఆర్దిక సహాయంతో ఆ పరిస్థితిని అధిగమిస్తామని చెప్పారు. ఆదివారం నెల్లూరు నగరంలో నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

నగరంలో పారిశుద్ధ్యం, రోడ్డులు అపరిశుభ్రంగా ఉండటంతో ఆయన కార్పోరేషన్ అధికారులుపై మండిపడ్డారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. నగరంలో సరఫరా అవుతున్న తాగునీటిని ఈ సందర్భంగా పరిశీలించారు. నగరంలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఆయన అధికారులను సూచించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement