కనపర్తి : టోల్గేట్ ఏర్పాటు నిరసిస్తూ నెల్లూరు జిల్లాలోని కనపర్తి పాడు వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గురువారం చేసిన రాస్తారోకో వల్ల చెన్నై - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్గేట్ ఏర్పాటు చేయకుండా, రద్దుచేస్తున్నట్లు వెంటనే ఆదేశాలు జారీచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు.