విజయనగరం: విజయనగరంలోని ఎమ్మార్ లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. గాయని అంజనా సౌమ్య తన గాత్రంతో ఆహుతుల్ని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జెడ్పీ చైర్మన్ జి.రాజకుమారి, ఎన్ఆర్ఐ డి.ఎస్.జానకి రాం హాజరయ్యారు. గాయని అంజనా సౌమ్యను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.