
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఏసీపీ నాగేశ్వరరావు బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కమిషన్ గతంలోనే ఆంధ్రప్రదేశ్ డీజీపీని తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే డీజీపీ బదులు సిట్ అధికారి నాగేశ్వరరావు కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు ఈ కేసును ఇప్పటికే ఎన్ఐఏకు బదిలీ చేశామని కమిషన్కు తెలిపారు.
అంతేకాక ఈ కేసులో నిందుతుడైన శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్నాడని చెప్పారు. ఈ నెల 11 శ్రీనివాస రావును మరోసారి కోర్టు ముందు హాజరుపర్చుతామని నాగేశ్వర రావు.. కమిషన్కు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషన్ ఈ కేసుతో సంబంధమున్న మిగతా పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించింది. అంతేకాక ఈ విషయమై విశాఖ కమిషనర్కు నోటీసులు కూడా జారీ చేసింది. అనంతరం ఈ కేసులో నిందుతుడైన శ్రీనివాస్కు, అతని కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్.. రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment