
మరో 24 గంటలపాటు భారీ వర్షాలు
దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది.
దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. దాంతో మరో 24 గంటలపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఆ అల్పపీడనం దారి మళ్లి వచ్చే 48 గంటల్లో వాయవ్యదిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని, అలాగే రుతుపవనాలు, అల్పపీడనం వల్ల పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.