
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల:
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
నిన్న(ఆదివారం) స్వామివారిని 89,237 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.62 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఆధికారులు తెలిపారు.