విశాఖ : పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. హౌరా-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలులో పెద్ద సంఖ్యలో పిల్లలను తరలిస్తుండగా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సుమారు 50 మంది పిల్లలను కోల్కతా నుంచి హుబ్లీకి తీసుకెళ్తుండగా విశాఖలో ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. కాగా పిల్లలను తరలిస్తున్న వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లల అక్రమ రవాణా వెనుక గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మైనర్ల అక్రమ రవాణా గుట్టురట్టు
Published Tue, Jul 19 2016 4:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
Advertisement
Advertisement