పౌల్ట్రీకి సగం ధరకే విద్యుత్ | poultries will be given power at 50 percent of price | Sakshi
Sakshi News home page

పౌల్ట్రీకి సగం ధరకే విద్యుత్

Published Thu, Nov 28 2013 2:05 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

పౌల్ట్రీకి సగం ధరకే విద్యుత్ - Sakshi

పౌల్ట్రీకి సగం ధరకే విద్యుత్

‘పౌల్ట్రీ ఎక్స్‌పో 2013’ ప్రారంభ సభలో సీఎం ప్రకటన
 సాక్షి,హైదరాబాద్: విద్యుత్ చార్జీలు తగ్గించాలనే పౌల్ట్రీ పరిశ్రమ వర్గాల చిరకాల డిమాండ్‌కు అనుగుణంగా ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఇక్కడి హైటెక్స్‌లో మూడురోజుల పాటు జరగనున్న ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2013’ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు రూ.5.60తో విద్యుత్ సరఫరా అవుతోందని ఈ ధరను సగానికి తగ్గించి రూ.2.80 కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.
 
  ఒక్క వ్యవసాయంపైనే రైతు ఆధారపడే పరిస్థితులు ప్రస్తుతం లేవని, అనుబంధ రంగాలైన పాడి, చేపలు, కోళ్ల పెంపకం లాంటివి చేపట్టినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కాసు వెంకట కృష్ణారెడ్డి, కేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనుప్ కుమార్ ఠాకూర్, సహ కార్యదర్శి సంజయ్ బోస్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డి.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement